తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, నడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవెంకటేశ్వరస్వామిని 66,425 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు వెల్లడించారు.