తిరుమల: తిరుమలలో కొలువు తీరిన శ్రీవెంకటేశ్వరస్వామిని ప్రముఖ సినీ నటుడు ఎం మోహన్బాబు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) సోమవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శనంలో వారు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వారు హుండీలో మొక్కులను సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అలాగే తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
శ్రీవారిని దర్శించుకున్న మోహన్బాబు
Published Mon, Aug 8 2016 8:07 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
Advertisement
Advertisement