Published
Sun, Aug 28 2016 11:19 PM
| Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులరద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. కొండపైకి వాహనాలు అనుమతించకపోవడంతో భక్తులు కాలినడకన వెళ్లారు. సుమారు 35వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.