విద్యార్థినులతో హెచ్ఎం
మరికల్ (ధన్వాడ) : నిజామాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలో మరికల్ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చూపారు. ఈనెల 16నుంచి 18వరకు నిజామాబాద్లో జరిగిన ఈ పోటీల్లో 9వ తరగతి చదువుతున్న రోషిణి, గాయత్రి మంచి ప్రతిభ కనబర్చి ప్రశంసా పత్రాలను సాధించారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాల హెచ్ఎం అపర్ణ, పీఈటీ సుగుణ వారిని అభినందించారు.