అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ‘ఆర్డీఎఫ్’ విద్యార్థులు
Published Tue, Aug 16 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
పర్వతగిరి : మండలంలోని కల్లెడ ఆర్డీఎఫ్ వినితా అచ్యుతాపాయ్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎన్.అరవింద్, బి.ప్రవీణ్, జి.రాంబాబు, కె.రాములు అండర్ –19 అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ యాకయ్య తెలిపారు.
ఆగస్టు 7,8,9 తేదీల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జాతీయస్థాయి క్రికెట్ టోర్నమెం ట్లో ప్రతిభ కనబర్చినందుకుగానూ విద్యార్థులకు ఈ అవకాశం దక్కిందన్నారు. అం తర్జాతీయ క్రికెట్ టోర్నీకి నేపాల్ ఆతిథ్యం ఇవ్వనుందన్నారు. విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్ జనార్ధన్, అధ్యాపకSబృందం అభినందించారు.
Advertisement
Advertisement