Published
Tue, Aug 23 2016 12:29 AM
| Last Updated on Fri, Nov 9 2018 4:51 PM
జయహో సింధు
బావాయిపాలెం (నిడమర్రు): రియో ఒలిపింక్స్లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామంలో విద్యార్థులు అక్షరాభివందనం చేశారు. జయహో సింధు ఇంగ్లిష్ అక్షరాకృతిలో ఒదిగి నీరాజనాలు పలికారు. పతకం సాధించి సోమవారం స్వదేశానికి విచ్చేసిన సందర్భంగా సింధు విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని సాధన స్కూల్ ప్రిన్సిపాల్ కంభంపాటి ప్రసాద్ తెలిపారు.