
జలదీక్షకు మద్దతుగా రిలే దీక్షాశిబిరాలు
► వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు
కొయ్యలగూడెం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న జలదీక్షకు మద్దతుగా నియోజవకర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షాశిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు తెలిపారు.
సీమాంధ్రని ఎడారిగా మార్చే విధంగా ఎగువ రాష్ట్రాలు చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల్ని అడ్డుకోలేక చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇప్పించుకోలేకపోయారని, ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై కూడా చేతకాని విధంగా ఉండిపోయారన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ చేపట్టే జలదీక్షకి అన్నివర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని బాలరాజు చెప్పారు.