వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చుదాం | lets agriculture mould inot profits | Sakshi
Sakshi News home page

వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చుదాం

Published Sun, Jun 4 2017 11:18 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చుదాం - Sakshi

వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చుదాం

 జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ
 
గూడూరు: సాంకేతిక పరిజా​‍్ఞనాన్ని ఉపయోగించుకొని వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చుకుందామని జిల్లా కలెక్టర్‌  సత్యనారాయణ రైతులకు పిలుపునిచ్చారు.  నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో  భాగంగా ఆదివారం  స్థానిక ఎలిమెంటరీ  పాఠశాల ఆవరణలో ‘వ్యవసాయం –అనుబంధ రంగాలు అనే అంశంపై సదస్సునిర్వహించారు.  నియోజకవర్గ ప్రత్యేకాధికారి మల్లికార్జున అధ్యక్షతన జరిగిన  ఈ కార్యక్రమంలో కలెక్టర్‌  మాట్లాడుతూ... ప్రస్తుతం వ్యవసాయరంగం కష్టతరంగా మారిందన్నారు.  అధిక పెట్టుబడుల జోలికి వెళ్లకుండా తక్కువ పెట్టుబడితో  పంటలు సాగు చేయాలన్నారు.  ఉద్యాన వన పంటలు , కూరగాయల సాగుపై ద​ృష్టిసారించాలని సూచించారు.  డ్రిప్‌ , స్పింక్లర్ల సేద​‍్యం అలవాటు చేసుకోవాలని కోరారు.  అనంతరం వ్యవసాయ, దాని అనుంబంధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్‌ పరిశీలించారు.  కార్యక్రమంలో కర్నూలు ఏడీఎ రమణారెడ్డి, డ్రిప్‌ ఇరిగేషన్‌  ఏడీ ఫయాజ్‌ , మండల నోడల్‌ అధికారి సత్యనారాయణ,  ఎంపీపీ ఈశ్వరమ్మ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కె.రామాంజినేయులు, కోడుమూరు, గూడూరు, సి.బెళగల్‌ , కర్నూలు మండలాల  తహసీల్దార్లు,  ఎంపీడీఓలు, ఏఓలు పాల్గొన్నారు,  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement