Published
Sat, Aug 13 2016 9:21 PM
| Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
ఘాట్లలో నాని పర్యటన
భవానీపురం :
నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) చెప్పారు. శనివారం పున్నమిఘాట్ను సందర్శించిన ఆయన భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విలేకరులతో మాట్లాడుతూ రానున్న మూడేళ్ల కాలంలో విజయవాడ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్ది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేస్తామని అన్నారు. నగరంలో త్వరలోనే 5 కోట్ల మొక్కలను నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. 15 కిలోమీటర్ల పొడవునా ఆధునీకరించిన స్నానఘాట్లను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు.