visits
-
వారణాసిలో టాలీవుడ్ నటి అనసూయ ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక పూజలు (ఫోటోలు)
-
తెనాలికి వైఎస్ జగన్ రాక.. పోటెత్తిన అభిమాన సంద్రం
-
తల్లితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంయుక్త (ఫోటోలు)
-
ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు (ఫోటోలు)
-
రైతుబిడ్డని చూసేందుకు వెళ్లిన ప్రియాంక జైన్ (ఫొటోలు)
-
పార్లమెంట్ సందర్శనలో టాలీవుడ్ హీరోయిన్ రెజీనా (ఫొటోలు)
-
ఫ్రెండ్స్తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిహారిక కొణిదెల (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు విష్ణు, శివ బాలాజీ (ఫోటోలు)
-
ఫ్యామిలీతో కలిసి జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో మన్మధుడు హీరోయిన్ అన్షు (ఫోటోలు)
-
అజ్మీర్ షరీఫ్ దర్గాలో గౌతమ్ అదానీ దంపతులు (ఫోటోలు)
-
కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కార్తీ (ఫోటోలు)
-
11 ఏళ్లలో 86 విదేశీ పర్యటనలు.. ప్రధాని మోదీ ఎప్పుడు ఎక్కడికి వెళ్లారు?
భారదేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఈ దిశంగా ఎంతో కృషి చేస్తున్నారు. గడచిన దశాబ్ధ కాలంలో ప్రధాని మోదీ పలు దేశాలతో దౌత్యపరమైన సమావేశాలు నిర్వహించారు. ఈ నేపద్యంలో భారత్ ప్రపంచంలోని పలు దేశాల నడుమ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ప్రధాని మోదీ ఈరోజు(సోమవారం ఫిబ్రవరి 10, 2025) ఫ్రాన్స్లో మూడు రోజుల పర్యటనకు బయల్దేరివెళ్లారు. అనంతరం అక్కడ్నుంచి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు మోదీ. అమెరికాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు మోదీ. #WATCH | Delhi: Prime Minister Narendra Modi leaves for France to co-chair the AI Action Summit. From France, PM Modi will proceed on a two-day visit to the United States at the invitation of President Donald Trump. pic.twitter.com/oxElBtrIDY— ANI (@ANI) February 10, 2025 అయితే గడచిన 11 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ 86 విదేశీ పర్యటనలు జరపడం విశేషం. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల జాబితాభూటాన్ (జూన్ 15, 2014 నుండి జూన్ 16, 2014 వరకు)బ్రెజిల్( జూలై 13, 2014 - జూలై 17, 2014)నేపాల్ (ఆగస్టు 03, 2014 - ఆగస్టు 04, 2014)జపాన్ (ఆగస్టు 30, 2014 - సెప్టెంబర్ 03, 2014)అమెరికా(26, 2014 - సెప్టెంబర్ 30, 2014)మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీ (నవంబర్ 11, 2014 - నవంబర్ 19, 2014)నేపాల్ (నవంబర్ 25, 2014 - నవంబర్ 27, 2014)సీషెల్స్, మారిషస్, శ్రీలంక (మార్చి 10, 2015 - మార్చి 14, 2015)సింగపూర్ (మార్చి 29, 2015 - మార్చి 29, 2015)ఫ్రాన్స్, జర్మనీ, కెనడా (ఏప్రిల్ 10, 2015 - ఏప్రిల్ 18, 2015)చైనా, మంగోలియా, దక్షిణ కొరియా (మే 14, 2015 - మే 19, 2015)బంగ్లాదేశ్ (జూన్ 06, 2015 - జూన్ 07, 2015)రష్యా(జూలై 06, 2015 - జూలై 13, 2015)యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (ఆగస్టు 16, 2015 - ఆగస్టు 17, 2015)ఐర్లాండ్ , అమెరికా ( సెప్టెంబర్ 23, 2015 - సెప్టెంబర్ 29, 2015)యునైటెడ్ కింగ్డమ్, టర్కీ(నవంబర్ 12, 2015 - నవంబర్ 16, 2015)మలేషియా, సింగపూర్(నవంబర్ 21, 2015 - నవంబర్ 24, 2015)ఫ్రాన్స్(నవంబర్ 29, 2015 - నవంబర్ 30, 2015)రష్యా(డిసెంబర్ 23, 2015 - డిసెంబర్ 24, 2015)బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియా(మార్చి 30, 2016 - ఏప్రిల్ 03, 2016)ఇరాన్ (మే 22, 2016 - మే 23, 2016)ఆఫ్ఘనిస్తాన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో (జూన్ 04, 2016 - జూన్ 08, 2016)ఉజ్బెకిస్తాన్ (జూన్ 23, 2016 - జూన్ 24, 2016)మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియా, కెన్యా(జూలై 07, 2016 - జూలై 11, 2016)వియత్నాం, చైనా(సెప్టెంబర్ 02, 2016 - సెప్టెంబర్ 05, 2016)లావోస్(సెప్టెంబర్ 07, 2016 - సెప్టెంబర్ 08, 2016)జపాన్(నవంబర్ 11, 2016 - నవంబర్ 12, 2016)శ్రీలంక (మే 11, 2017 - మే 12, 2017)జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్(మే 29, 2017 - జూన్ 03, 2017)కజకిస్తాన్(జూన్ 08, 2017 - జూన్ 09, 2017)పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్(జూన్ 24, 2017 - జూన్ 27, 2017)ఇజ్రాయెల్, జర్మనీ(జూలై 04, 2017 - జూలై 08, 2017)చైనా, మయన్మార్(సెప్టెంబర్ 03, 2017 - సెప్టెంబర్ 07, 2017)ఫిలిప్పీన్స్(నవంబర్ 12, 2017 - నవంబర్ 14, 2017)దావోస్ (స్విట్జర్లాండ్)(జనవరి 22, 2018 - జనవరి 23, 2018)జోర్డాన్, పాలస్తీనా, యుఎఈ, ఒమన్(ఫిబ్రవరి 09, 2018 - ఫిబ్రవరి 12, 2018)స్వీడన్, యూకె, జర్మనీ(ఏప్రిల్ 16, 2018 - ఏప్రిల్ 20, 2018)చైనా (ఏప్రిల్ 26, 2018 - ఏప్రిల్ 28, 2018)నేపాల్(మే 11, 2018 - మే 12, 2018)రష్యా (మే 21, 2018 - మే 22, 2018)ఇండోనేషియా, మలేషియా, సింగపూర్(మే 29, 2018 - జూన్ 02, 2018)చైనా(జూన్ 09, 2018 - జూన్ 10, 2018)రువాండా, ఉగాండా, దక్షిణాఫ్రికా(జూలై 23, 2018 - జూలై 28, 2018)నేపాల్(ఆగస్టు 30, 2018 - ఆగస్టు 31, 2018)జపాన్(అక్టోబర్ 27, 2018 - అక్టోబర్ 30, 2018)సింగపూర్(నవంబర్ 13, 2018 - నవంబర్ 15, 2018)మాల్దీవులు(నవంబర్ 17, 2018 - నవంబర్ 17, 2018)అర్జెంటీనా(నవంబర్ 28, 2018 - డిసెంబర్ 03, 2018)దక్షిణ కొరియా(ఫిబ్రవరి 21, 2019 - ఫిబ్రవరి 22, 2019)మాల్దీవులు, శ్రీలంక (జూన్ 08, 2019 - జూన్ 09, 2019)కిర్గిజ్స్తాన్(జూన్ 13, 2019 - జూన్ 14, 2019)జపాన్ పర్యటన (జూన్ 27, 2019 - జూన్ 29, 2019)భూటాన్(ఆగస్టు 17, 2019 - ఆగస్టు 18, 2019)ఫ్రాన్స్, యూఎఈ, బహ్రెయిన్(ఆగస్టు 22, 2019 - ఆగస్టు 27, 2019)రష్యా (సెప్టెంబర్ 04, 2019 - సెప్టెంబర్ 05, 2019)అమెరికా(సెప్టెంబర్ 21, 2019 - సెప్టెంబర్ 28, 2019)సౌదీ అరేబియా(అక్టోబర్ 28, 2019 - అక్టోబర్ 29, 2019)థాయిలాండ్(నవంబర్ 02, 2019 - నవంబర్ 04, 2019)బ్రెజిల్(నవంబర్ 13, 2019 - నవంబర్ 15, 2019)బంగ్లాదేశ్(మార్చి 26, 2021 - మార్చి 27, 2021)అమెరికా(సెప్టెంబర్ 22, 2021 - సెప్టెంబర్ 25, 2021)ఇటలీ, స్కాట్లాండ్(అక్టోబర్ 29, 2021 - నవంబర్ 02, 2021)జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ (మే 02, 2022 - మే 05, 2022)నేపాల్ (మే 16, 2022 - మే 16, 2022)జపాన్ (మే 23, 2022 - మే 24, 2022)జర్మనీ, యూఏఈ(జూన్ 26, 2022 - జూన్ 28, 2022)ఉజ్బెకిస్తాన్( సెప్టెంబర్ 15, 2022 - సెప్టెంబర్ 16, 2022)జపాన్(సెప్టెంబర్ 27, 2022 - సెప్టెంబర్ 27, 2022)ఇండోనేషియా(నవంబర్ 14, 2022 - నవంబర్ 16, 2022)జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా(మే 19, 2023 - మే 25, 2023)అమెరికా, ఈజిప్టు(జూన్ 20, 2023 - జూన్ 25, 2023)ఫ్రాన్స్, యూఏఈ(జూలై 13, 2023 - జూలై 15, 2023)దక్షిణాఫ్రికా, గ్రీస్(ఆగస్టు 22, 2023 - ఆగస్టు 26, 2023)ఇండోనేషియా (సెప్టెంబర్ 06, 2023 - సెప్టెంబర్ 07, 2023)దుబాయ్ పర్యటన (నవంబర్ 30, 2023 - డిసెంబర్ 01, 2023)యూఏఈ, ఖతార్(ఫిబ్రవరి 13, 2024 - ఫిబ్రవరి 15, 2024)భూటాన్(మార్చి 22, 2024 - మార్చి 23, 2024)ఇటలీ(జూన్ 13, 2024 - జూన్ 14, 2024)రష్యా, ఆస్ట్రియా(జూలై 08, 2024 - జూలై 10, 2024)పోలాండ్, ఉక్రెయిన్(ఆగస్టు 21, 2024 - ఆగస్టు 23, 2024)బ్రూనై,సింగపూర్(సెప్టెంబర్ 03, 2024 - సెప్టెంబర్ 05, 2024)అమెరికా(సెప్టెంబర్ 21, 2024 - సెప్టెంబర్ 24, 2024)లావోస్(అక్టోబర్ 10, 2024 - అక్టోబర్ 11, 2024)రష్యా(అక్టోబర్ 22, 2024 - అక్టోబర్ 23, 2024)నైజీరియా, బ్రెజిల్, గయానా(నవంబర్ 16, 2024 - నవంబర్ 22, 2024)ప్రధాని మోదీ కువైట్ పర్యటన (డిసెంబర్ 21, 2024 - డిసెంబర్ 22, 2024)ఇది కూడా చదవండి: Mahakumbh: రాష్ట్రమంతటా ట్రాఫిక్ జామ్.. ఎక్కడ చూసినా భక్తజన సందోహం -
శ్రీలంకలోని శంకరి దేవి శక్తిపీఠం సందర్శించిన బిగ్బాస్ సోనియా (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (ఫోటోలు)
-
నిజమైన ప్రేమ అంటూ ఫొటోలు షేర్ చేసిన చహల్ భార్య.. ఫొటోలు వైరల్
-
తిరుమల శ్రీవారి సేవలో సింగర్ సునీత (ఫోటోలు)
-
కూతురితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సురేఖవాణి (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)
-
Sunandha Mala Setti: స్వర్ణగిరిని సందర్శించిన బుల్లితెర నటి (ఫోటోలు)
-
సరయూ నదీ తీరాన శ్రీరాముని సేవలో నటి సోనాలి బింద్రే (ఫోటోలు)
-
ఘనంగా ఉరుసు ఉత్సవాలు.. కడప పెద్ద దర్గాలో ఏఆర్ రెహమాన్ (ఫొటోలు)
-
ఆయన మా ఇంటికి వస్తారనుకోలేదు.. సంతోషంలో హీరోయిన్ (ఫోటోలు)
-
జై శ్రీరాం.. ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను: ఆకాశ్ దీప్ (ఫొటోలు)
-
పండుగ సీజన్లో ఫ్లిప్కార్ట్ జోరు: రెండు రోజుల్లో 33 కోట్లు..
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు ఫెస్టివల్ సేల్స్ ప్రారభించేసాయి. ఈ తరుణంలో స్వదేశీ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వీఐపీ, కస్టమర్ల కోసం 2024 సెప్టెంబర్ 26 నుంచి ముందస్తు యాక్సెస్తో 2024 బిగ్ బిలియన్ డేస్ 11వ ఎడిషన్ను సెప్టెంబర్ 27న ప్రారంభించింది.2024 బిగ్ బిలియన్ డేస్ ప్రారంభమైన (యాక్సెస్ ప్రారంభించిన రోజు, మొదటి రోజు) సెప్టెంబర్ 26, 27వ తేదీల్లో ఫ్లిప్కార్ట్ను ఏకంగా 33కోట్ల మంది సందర్శించారు. దీన్ని బట్టి చూస్తే భారతదేశంలో పండుగ ఉత్సాహం ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతోంది.పండుగ సీజన్లో ప్రారంభమైన బిగ్ బిలియన్ డేస్ రోజు.. ఎక్కువగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, లార్జ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ ప్రొడక్ట్స్ వంటి వాటిని ఎక్కువగా సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు వంటి అగ్ర మెట్రో నగర వాసులు మొదటి 24 గంటల్లో ఎక్కువగా ఫ్లిప్కార్ట్ను సందర్శించారు. మొత్తం మీద మొదటిరోజు బిగ్ బిలియన్ డేస్ ప్రారంభ యాక్సెస్, 1వ రోజులో అధిక డిమాండ్ను చూసింది.కస్టమర్లు ఫ్యాషన్, లైఫ్ స్టైల్ వంటి వాటికి సంబంధించిన సరికొత్త ఆఫర్లను గురించి కూడా ఎక్కుగా సెర్చ్ చేసారు. ట్రెండింగ్ ఉత్పత్తులను కూడా ఆసక్తి చూపినట్లు సమాచారం. జనరేషన్ జెడ్ ప్రేక్షకులు బ్యాగీ బాటమ్స్, జీన్స్, బ్లాక్ ప్రింట్ కుర్తాలు, డెమూర్ డ్రెస్లు, రెట్రో రన్నర్స్, యుటిలిటీ కార్గోస్, మల్టీ పాకెట్డ్ షర్ట్స్, కో-ఆర్డ్ సెట్, జపనీస్ స్టైల్ టీ-షర్టులు సెర్చ్ చేశారు.ఇదీ చదవండి: దేశంలోనే పెద్ద కరెన్సీ నోటు.. ఎందుకు రద్దు చేశారంటే?ప్రీ-ఫెస్టివ్ సీజన్తో పోల్చితే.. ఈ సీజన్లో కస్టమర్లు 70 శాతం ఎక్కువ సందర్శించినట్లు తెలిసింది. లైఫ్ స్టైల్, హోమ్ & కిచెన్ వంటివి రెండు రెట్లు, బ్యూటీ పర్సనల్ కేర్ వంటివి మూడురెట్లు వృద్ధిని సాధించింది. మొత్తం మీద లావాదేవీలు 2.8 రెట్లు పెరిగింది. బిగ్ బిలియన్ డేస్ ప్రారంభమైన మొదటి 12 గంటల్లో అత్యధికంగా ఎలక్ట్రానిక్స్ ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, టాబ్లెట్లు, డెస్క్టాప్ వంటివి అమ్ముడయ్యాయి. -
Narendra Modi: మనమే ప్రపంచ సారథులం
న్యూయార్క్: ‘‘అన్ని రంగాల్లోనూ ఇతరులను అనుసరించిన పాత రోజులను దాటుకుని గత పదేళ్లలో భారత్ ఎంతో ప్రగతి సాధించింది. ఇతర దేశాలకు మార్గదర్శకత్వం వహించే స్థాయికి చేరుకుంది. ప్రపంచ సారథిగా ఎదుగుతోంది. అవకాశాల ఇంకెంతమాత్రమూ కోసం ఎదురు చూడటం లేదు. అవకాశాలను సృష్టించుకుంటూ సాగుతోంది. అంతులేని అవకాశాలకు నెలవుగా మారింది. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో ఇతర దేశాలను ముందుండి నడిపిస్తోంది’’ అని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు. ఈ అద్భుత ప్రగతిలో విదేశాల్లోని భారతీయులది అత్యంత కీలక పాత్ర అంటూ కొనియాడారు. వారి త్యాగాలు వెలకట్టలేనివని అభిప్రాయపడ్డారు. అమెరికాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం న్యూయార్క్లో భారతీయ అమెరికన్లతో ప్రధాని భేటీ అయ్యారు. స్థానిక నాసౌ వెటరన్స్ కొలోజియం స్టేడియంలో జరిగిన ఈ సమావేశానికి ఎన్నారైలు పోటెత్తారు. న్యూయార్క్, పరిసర న్యూజెర్సీ నుంచేగాక మొత్తం 42 రాష్ట్రాలనుంచి 13,000 మందికి పైగా సభకు హాజరయ్యారు. సమావేశం ఆద్యంతం ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆయన వేదికపైకి చేరుకున్న తర్వాత కూడా నిమిషాల పాటు కరతాళ ధ్వనులు ఆగకుండా కొనసాగాయి. అనంతరం మోదీ మాట్లాడుతూ వారి అభిమానం తనను కదిలించివేసిందన్నారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మన భారతీయులు నాపై ఇలా చెప్పలేనంతటి ఆదరాభిమానాలు, ఆప్యాయత కురిపిస్తూనే ఉన్నారు. దీనికి శాశ్వతంగా రుణపడిపోయాను’’ అని చెప్పారు. భారత, అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఇండయన్ అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మోదీ ప్రసంగం గంటా పది నిమిషాల పాటు సాగింది. ప్రసంగం పొడవునా సభికులు పదేపదే చప్పట్లు కొడుతూ, నినాదాలు చేస్తూ సందడి చేశారు. అంతకుముందు వేదికపై ‘ద ఎకోస్ ఆఫ్ ఇండియా – అ జర్నీ త్రూ ఆర్ట్ అండ్ ట్రెడిషన్’ పేరిట 382 మంది జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కళాకారుల ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. గ్రామీ అవార్డు విజేత చంద్రికా టాండన్, గాయక సంచలనం రెక్స్ డిసౌజా, తెలుగు సినీ దర్శకుడు, గాయకుడు దేవీశ్రీ ప్రసాద్ తదితరులు వీటిలో పాల్గొన్నారు. భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నాం ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో నెగ్గి వరుసగా మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టడాన్ని మోదీ ప్రస్తావించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోందన్నారు. భారత ప్రగతి కోసం ఈసారి అత్యంత భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నట్టు చెప్పారు. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన తాను ఈ స్థాయికి ఎదుగుతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ‘‘విధి నన్ను రాజకీయాల్లోకి తీసుకొచి్చంది. అనుకోకుండా గుజరాత్కు సీఎం అయ్యాను. ఆ రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు సేవలందించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాను. తర్వాత దేశ ప్రజలు నన్ను ప్రధానిని చేసి మరింత పెద్ద బాధ్యత కట్టబెట్టారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘దేశ ప్రగతికి, సుపరిపాలనకు నా జీవితాన్ని అంకితం చేశాను. అధ్యక్షుడు జో బైడెన్ శనివారం నన్ను దగ్గరుండి ఆహా్వనించి మరీ తన ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆయన చూపిన గౌరవం నన్నెంతగానో కదిలించింది. అది 140 కోట్ల పై చిలుకు భారతీయులకు దక్కిన గౌరవం. అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు, వారి నిరంతర కృషికి దక్కిన గౌరవం’’ అన్నారు. దశాబ్దాల క్రితం తొలిసారి తాను అమెరికాకు వచ్చిన రోజులను మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రపంచ శాంతిలో కీలక పాత్ర అంతర్జాతీయంగా ఆధిపత్యం సాగించడం భారత అభిమతం కాదని మోదీ అన్నారు. అయితే ప్రపంచ ప్రగతిలో, శాంతి సాధనలో కీలక పాత్ర పోషించేందుకు మాత్రం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ‘అందరికీ సమ దూరం’ అన్నది పాత విధానం. ‘అందరితోనూ సమాన సాన్నిహిత్యం’ అన్నదే నవభారత నినాదం’ అని వివరించారు. ఇది యుద్ధాలకు సమయం కాదని పునరుద్ఘాటించారు. ‘‘భారత్ అంటే ఫైర్ కాదు. ప్రపంచానికి వెలుగునిచ్చే సూరీడు’’ అన్నారు. బోస్టన్, లాస్ ఏంజెలెస్ నగరాల్లో నూతనంగా కాన్సులేట్లను ప్రారంభించనున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. గతేడాది ప్రకటించిన సియాటెల్ కాన్సులేట్ ఇప్పటికే ప్రారంభమైందని గుర్తు చేశారు. అమెరికాకు ఫార్మా, విద్యా రంగాల్లో రాజధానిగా బోస్టన్కు పేరుంది. ఇక లాస్ ఏంజెలెస్ హాలీవుడ్కు పుట్టిల్లన్నది తెలిసిందే.పుష్ప... వికసిత భారత్! ‘‘వికసిత భారత్ అంటే ‘పుష్ప’. ప్రోగ్రెసివ్, అన్స్టాపబుల్, స్పిరిచ్యువల్, హ్యుమానిటీ, ప్రాస్పరస్’’ అంటూ మోదీ కొత్త నిర్వచనమిచ్చారు. దీనికి సభికుల నుంచి బ్రహా్మండమైన స్పందన వచి్చంది. అలాగే, ‘‘ఏఐ అంటే కూడా ఆస్పిరేషనల్ ఇండియా. ఏఐ అంటే అమెరికన్ ఇండియన్స్’’ అని కొత్త నిర్వచనాలిచ్చారు.అమెరికాను మించిన భారత 5జీ మార్కెట్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ అద్భుత ప్రగతి సాధిస్తూ దూసుకెళ్తోందని మోదీ అన్నారు. ఫలితంగా కేవలం రెండేళ్ల వ్యవధిలోనే భారత 5జీ మార్కెట్ అమెరికాను కూడా మించిపోయిందని వివరించారు. మేడిన్ ఇండియా 6జీ టెక్నాలజీపై కూడా భారత్లో పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ‘‘ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ బ్రాండ్లన్నీ దాదాపుగా భారత్లోనే తయారవుతున్నాయి. భారత సెమీ కండక్టర్ చిప్లను అమెరికా దిగుమతి చేసుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. ప్రపంచమంతా మేడిన్ ఇండియా చిప్ల మీదే ఆధారపడి నడవనుంది. ఇది మోదీ గ్యారెంటీ’’ అన్నారు. -
వరదబాధితులకు జగన్ పరామర్శ.. పిఠాపురంలో జననేతకు జన నీరాజనం (ఫొటోలు)
-
గుంటూరులో జగన్.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
-
రేపు వయనాడ్కు ప్రధాని మోదీ
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్లో ఈనెల 10న ప్రధాని మోదీ పర్యటించనున్నారని సీఎం పినరయి విజయన్ చెప్పారు. జిల్లాలో ఇటీవల భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి వందలాదిమంది చనిపోవడం తెల్సిందే. బాధిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటిస్తారని విజయన్ వివరించారు. ఈ దుర్ఘటనలో బాధితులకు పునరావాసం కల్పించే విషయంలో ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నారని సీఎం విజయన్ చెప్పారు. తమ వినతి మేరకు 9 మంది నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం శాఖ అంగీకరించిందన్నారు. ఈ కమిటీ విపత్తు తీవ్రతను అంచనా వేసి, నివేదిక ఇస్తుందన్నారు. ఈ దుర్ఘటనలో 131 మంది వరకు గల్లంతైనట్లు గుర్తించామన్నారు. వీరి కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు. కాగా, కొండచరియలు విరిగిపడిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్న వేళ ప్రధాని మోదీ వయనాడ్లో పర్యటనకు రానుండటం గమనార్హం. -
వినుకొండ: రషీద్కు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ.. అండగా ఉంటానని భరోసా (ఫొటోలు)
-
శ్రీవారిని దర్శించుకున్న సినీనటి ప్రియా ఆనంద్ (ఫొటోలు)
-
Priya Anand: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ ప్రియా ఆనంద్ (ఫొటోలు)
-
Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి (ఫొటోలు)
-
తిరుమలలో బిగ్బాస్ సందీప్ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరో ఆశిష్ (ఫొటోలు)
-
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)
-
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
-
Droupadi Murmu In Ayodhya: అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (ఫొటోలు)
-
Ravi Babu : తిరుమల శ్రీవారి సేవలో డైరెక్టర్ రవిబాబు కుటుంబం (ఫొటోలు)
-
పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జయప్రద (ఫొటోలు)
-
Brahmanandam Latest Photos: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హాస్యబ్రహ్మ (ఫోటోలు)
-
విశాఖలో అమెరికా నావికుల సందడి (ఫొటోలు)
-
తిరుమలలో ఓంకార్ సోదరుడు అశ్విన్, తమన్ సందడి (ఫోటోలు)
-
Navdeep Saini : శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్ (ఫొటోలు)
-
లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న రేవంత్
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి యాదగిరిగుట్టకు వచ్చిన ఆయన.. సోమవారం నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో సతీమణి గీతారెడ్డితో కలసి తొలిపూజలో పాల్గొన్నా రు. తొలుత తూర్పు త్రితల రాజగోపురం వద్ద సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దీపజ్యోతి వద్ద సీఎం జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీస్వామి, అమ్మవార్లకు పట్టువ్రస్తాలను సమర్పించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీఎం వెంట పూజల్లో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్, వేముల వీరేశం, మందుల సామెలు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం.. 12 గంటలకు భద్రాచలం వెళ్లారు. స్వర్ణ తాపడం పూర్తి చేయించండి యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం రేవంత్ను ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి స్వర్ణ తాపడం పనులు పూర్తి చేయించాలని ఆలయ ఈవో రామకృష్ణారావు కోరారు. కొంత బంగారంతో ధ్వజస్తంభం బంగారు తాపడం చేయించామని తెలిపారు. నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం యాదగిరిగుట్ట ఆలయంలో బ్రహ్మోత్సవాలు సోమ వారం పంచరాత్ర ఆగమం ప్రకారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున ఉదయం నిత్యారాధనల అనంతరం శ్రీవిష్వక్సేన ఆరాధనతో ఉత్సవాలను మొదలుపెట్టారు. స్వస్తి వచనం, రక్షాబంధన కార్యక్రమాలు, పారాయణలు నిర్వహించారు. ప్రొటోకాల్ వివాదం సీఎం పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. దేవస్థానం అధికారులు సీఎంకు ఆశీర్వచనం ఇచ్చే సమయంలో డిప్యూటీ సీఎంకు.. మంత్రులకు వేసిన పీటల కంటే చిన్నపీట వేయడం వివాదాస్పదమైంది. సీఎం పక్కన ఆయన సతీమణి గీతారెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ సమానమైన ఎత్తు పీటలపై కూర్చున్నారు. దేవాదాయ మంత్రి కొండా సురేఖను ఆశీర్వచనం ఇస్తున్న అర్చకుల వెనుక కూర్చోబెట్టారు. దీనిపై ఆలయ ఈవో రామకృష్ణారావు స్పందిస్తూ, సీఎంతో పాటు మంత్రులందరికీ పీటలు వేశామని, ఇందులో ప్రొటోకాల్ వివాదమేమీ లేదన్నారు. -
ఒకే వేదికపై పీఎం మోదీ, సీఎం నితీష్!
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బీహార్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ ఇక్కడకు రావడం ఇదే తొలిసారి. బీహార్లోని ఔరంగాబాద్, బెగుసరాయ్ జిల్లాల ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విమానాశ్రయానికి వెళ్లనున్నారు. దాదాపు 18 నెలల తర్వాత ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ కలిసి వేదికపై కనిపించనున్నారు. ప్రధాని మోదీతో పాటు సీఎం నితీశ్ కుమార్ ఔరంగాబాద్, బెగుసరాయ్లకు వెళ్లనున్నారు. గయ విమానాశ్రయం నుంచి నితీశ్ కుమార్ ముందుగా ప్రధాని మోదీతో కలిసి హెలికాప్టర్లో ఔరంగాబాద్కు బయలుదేరుతారు. ఔరంగాబాద్లో రూ. 21,400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ప్రధానమంత్రి బెగుసరాయ్లో ర్యాలీలో ప్రసంగించనున్నారు. గ్యాస్కు సంబంధించిన రూ.1.48 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ బెగుసరాయ్లో ప్రారంభించనున్నారు. ఈ ఇద్దరు ప్రముఖులు చివరిసారిగా 2022, జూలై 12న శాసనసభ శతాబ్ది ఉత్సవాల్లో ఒకే వేదికపై కనిపించారు. -
కోయంబత్తూరులోని ఆదియోగి శివ: వితికాశేరు భక్తి పారవశ్యం (ఫోటోలు)
-
మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తాం: కిషన్రెడ్డి
సాక్షి, ములుగు: మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారని, జాతీయ పండుగ విధానం అనేది ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా అమ్మవార్లను గురువారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం నిలువెత్తు బంగారాన్ని(బెల్లం) సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ముందుగా ములుగు జిల్లాలో పర్యటించిన కిషన్రెడ్డి గట్టమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్రీయ విశ్వ విద్యాలయానికి ఎంపిక చేసిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. మరోసారి బీజేపీ అధికారంలోకి రాగానే దేశ వ్యాప్తంగా గిరిజన రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు. ములుగులో గిరిజన వర్సిటీ తాత్కలిక క్యాంపస్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించేలా చూస్తామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: మేడారం.. అసలు ఘట్టం ఆవిష్కరణ -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమ, బ్రహ్మానందం, సునీత (ఫోటోలు)
-
Telangana: నెలాఖరులో రాష్ట్రానికి మోదీ?
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల సన్నద్ధంలో భాగంగా కమలదళం స్పీడ్ పెంచింది. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో 35 శాతం ఓటింగ్తో పది సీట్లను గెలుపొందాలంటూ జాతీయ నాయకత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా రాష్ట్ర పార్టీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లను 5 క్లస్టర్లుగా విభజించారు. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావుతో పాటు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్య దర్శులు నలుగురిని ఈ క్లస్టర్లకు ఇన్చార్జిలుగా నియమించారు. వచ్చే నెల 5 తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ ఐదు క్లస్టర్లలో బీజేపీ ఎన్నికల రథయాత్రలను నిర్వహించనున్నారు. రోజుకు రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున పదిరోజుల్లో ఆయా లోక్సభ క్లస్టర్లలోని అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేయాలని నిర్ణయించారు. క్లస్టర్ల పరిధిలోకి వచ్చే లోక్సభ సీట్లలోని ముఖ్యనేతలంతా ఈ రథయాత్రల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాలు కవర్ అయ్యేలా రథయాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా ఆయా క్లస్టర్ల వారీగా రథయాత్రల నిర్వహణ కమిటీలు, ఆయా బాధ్యతల నిర్వహణకు వివిధ బృందాల ఏర్పాటు వంటివి ఖరారు కానున్నట్టు తెలిసింది. రాష్ట్రానికి అగ్రనేతల వరుస టూర్లు ఫిబ్రవరి ఆఖర్లో లేదా మార్చి మొదటివారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చుననే అంచనాల నేపథ్యంలో పార్టీ అగ్రనాయకులు రాష్ట్ర పర్యట నకు రానున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ నెల 28న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కరీంనగర్ లోక్సభ క్లస్టర్ పరిధిలో నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. మహబూబ్నగర్ లోక్సభ క్లస్టర్ పరిధిలో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో కూడా పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఇక వివిధ అభివృద్ధికార్యక్రమాలతో పాటు పార్టీపరంగా నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొనేందుకు ఈ నెలాఖరులోగా ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చే అవకాశాలున్నాయని పార్టీనాయకులు చెబుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో మోదీ పాల్గొనవచ్చునని తెలుస్తోంది. అదేవిధంగా ఈ నెలాఖరులో లేదా వచ్చేనెల మొదటివారంలో జరిగే పార్టీ సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ పాల్గొంటారని తెలుస్తోంది. -
Raveena Tandon: కూతురితో కలిసి సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న కేజీఎఫ్ 2 నటి (ఫోటోలు)
-
ఫ్యామిలీతో తిరుమలలో సందడి చేసిన రేసుగుర్రం నటుడు (ఫొటోలు)
-
కుటుంబంతో తిరుమల సందర్శనలో హీరో సుధీర్ బాబు (ఫొటోలు)
-
Prabhu Deva: తిరుమల శ్రీవారిని దర్శించిన హీరో ప్రభుదేవా కుటుంబం (ఫోటోలు)
-
Ramachandra Raju-Jeest : తిరుమలలో కేజీఎఫ్ విలన్, బెంగాలీ స్టార్ నటుడు సందడి (ఫోటోలు)
-
Janhvi Kapoor: హీరోయిన్ మహేశ్వరితో కలిసి స్వామివారిని దర్శించుకున్న దేవర బ్యూటీ (ఫోటోలు)
-
Srikanth Family Visits Tirumala: ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించిన హీరో శ్రీకాంత్ (ఫోటోలు)
-
Mangli: తిరుమల స్వామివారిని దర్శించుకున్న సింగర్ మంగ్లీ (ఫోటోలు)
-
క్లీంకార పుట్టి 6 నెలలు.. ముంబైలో మహాలక్ష్మి గుడికి వెళ్లిన చరణ్ దంపతులు (ఫోటోలు)
-
Deepika Padukone: వెంకన్న సన్నిధిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ (ఫోటోలు)
-
Satya Sri: ఊటీలో చిల్ అవుతున్న జబర్దస్త్ బ్యూటీ (ఫోటోలు)
-
Abhiram Daggubati After Marriage Pics: పెళ్లయ్యాక తొలిసారి భార్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో అభిరామ్ (ఫోటోలు)
-
Minister RK Roja Photos: తాను చదువుకున్న కాలేజీకి చీఫ్గెస్ట్గా రోజా.. భావోద్వేగంతో కన్నీళ్లు (ఫొటోలు)
-
Rishabh Pant, Axar Patel: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిషబ్ పంత్, అక్షర్ పటేల్ (ఫొటోలు)
-
Gangavva: లంబాడి పల్లి నుంచి దుబాయ్ వెళ్లిన గంగవ్వ (ఫొటోలు)
-
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ‘మ్యాడ్’ చిత్ర బృందం (ఫొటోలు)
-
Lokesh Kanagaraj Visits Tirumala Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లియో డైరెక్టర్ (ఫోటోలు)
-
Mukesh Ambani Visits Badrinath Dham: బద్రీనాథ్ తీర్థయాత్రలో ముఖేష్ అంబానీ కుటుంబం (ఫొటోలు)
-
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకన్న సీఎం కేసీఆర్ సతీమణి (ఫొటోలు)
-
ఖమ్మంలో షాపింగ్ మాల్ ప్రారంభించిన రీతూ వర్మ (ఫొటోలు)
-
Anil Kapoor: తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ (ఫొటోలు)
-
Mehreen Pirzada: తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న మెహరీన్ (ఫోటోలు)
-
ఫతేనగర్ వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన మేయర్ విజయలక్ష్మీ
-
అమితాబచ్చన్కి రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ..
ముంబయి: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ని కలిశారు. ఈ మేరకు ఎయిర్పోర్టు నుంచి ముంబయిలోని జుహులో ఉన్న అమితాబ్ ఇంటికి వెళ్లారు. అనంతరం బిగ్బీకి దీదీ రాఖీ కట్టారు. ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరగనున్న 'ఇండియా' కూటమి భేటీకి హాజరయ్యేందుకు ముంబయికి చేరుకున్నారు. Today, Hon'ble CM Smt @MamataOfficial met Mr. @SrBachchan and Mrs. Jaya Bachchan along with their family at their residence in Mumbai. She wholeheartedly thanked them for their precious time and wished them luck in all their future endeavours. Few glimpses from the visit 👇 pic.twitter.com/MxgcoKi95B — All India Trinamool Congress (@AITCofficial) August 30, 2023 అమితాబ్ను కలిసి అనంతరం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ఆయన్ని విందుకు ఆహ్వానించినట్లు చెప్పారు. అమితాబ్ కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపిన దీదీ.. బెంగాల్లో జరగనున్న దుర్గా పూజ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఆహ్వానించినట్లు తెలిపారు. గతేడాది కోల్కతా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి అమితాబ్ హాజరైన వేళ.. సినీ రంగంలో అందించిన సేవలకు ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: రక్షాబంధన్ సాక్షిగా.. తమ్ముడి కోసం అక్క కిడ్నీ దానం.. -
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ దంపతులు (ఫొటోలు)
-
నేడు మణిపూర్కు ‘ఇండియా’
న్యూఢిల్లీ: మణిపూర్లో పర్యటించి, అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులపై సమస్యలకు తగు పరిష్కారం చూపుతూ కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంట్కు నివేదిక అందజేస్తామని ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి నేతలు ప్రకటించారు. కూటమిలోని 16 పారీ్టలకు చెందిన 20 మంది ఎంపీలు ఈ నెల 29, 30వ తేదీల్లో మణిపూర్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ నుంచి ఆధిర్ రంజన్ ఛౌధురి, గౌరవ్ గొగోయ్, టీఎంసీ నేత సుష్మితా దేవ్, జేఎంఎంకు చెందిన మహువా మాజి, డీఎంకే కనిమొళి, ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్, ఆర్ఎల్డీ జయంత్ చౌధరి, ఆర్జేడీ మనోజ్ ఝా, ఆర్ఎస్పీ ఎన్కే ప్రేమచంద్రన్, వీసీకే నేత తిరుమావళన్. వీరితో పాటు జేడీ(యు) చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్, జేడీ–యూకు చెందిన అనీల్ ప్రసాద్ హెగ్డే, సీపీఐ నుంచి సందేశ్ కుమార్, సీపీఎం నేత ఏఏ రహీం, ఎస్పీ నుంచి జావెద్ అలీఖాన్, ఐయూఎంఎల్ ఈటీ మహ్మద్ బషీర్, ఆప్ నేత సుశీల్ గుప్తా, శివసేన(యూటీ) అరి్వంద్ సావంత్, డీఎంకే నేత డి.రవి కుమార్, కాంగ్రెస్ నేతలు ఫులో దేవి నేతం, కె.సురేశ్ ఈ బృందంలో ఉన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో మణిపూర్ హింసపై దర్యాప్తు జరిపించాలని లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మణిపూర్లో అంతా మంచిగానే ఉన్నట్లు చూపాలని కేంద్రం అనుకుంటోందని ఆరోపించారు. మహిళల గౌరవంతో ఆటలా? బీజేపీ అధికార దాహంతోమహిళల గౌరవంతో, దేశ ఆత్మగౌరవంతో ఆటలాడుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఫేస్బుక్లో వీడియో షేర్ చేశారు. మణిపూర్లో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నా కేంద్రం నోరు విప్పడం లేదని మండిపడ్డారు. మహిళా రెజ్లర్లపై బ్రిజ్భూషణ్ సింగ్ లైంగిక వేధింపులను ప్రస్తావిస్తూ, మహిళలను గౌరవించని దేశం పురోగమించదన్నారు. -
రేపే అమెరికాకు ప్రధాని మోదీ
వాషింగ్టన్/హూస్టన్: ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన ఈ నెల 21 నుంచి 24వ తేదీ దాకా అమెరికాలో పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, జిల్ దంపతుల ఆహ్వానం మేరకు అగ్రరాజ్యంలో మోదీ పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మోదీ పర్యటన కోసం భారత–అమెరికన్లు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు సన్నద్ధమవుతున్నారు. మోదీకి స్వాగత సందేశాన్ని పంపించడానికి రాజధాని వాషింగ్టన్ డీసీ సహా అమెరికావ్యాప్తంగా 20 నగరాల్లో భారత–అమెరికన్లు తాజాగా ఐక్యతా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనల్లో వందలాది మంది ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్లో మోదీ హాజరయ్యే కార్యక్రమంలో పాల్గొనేందుకు టికెట్ల కోసం భారత–అమెరికన్లు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పుడు అమెరికా అంతటా మోదీ పర్యటనపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రక్షణ బంధాలకు పెద్దపీట రక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం భారత్–అమెరికా చేతులు కలుపుతున్నాయి. మోదీ అమెరికా పర్యటనలో ఇదే అంశంపై విస్తృతంగా చర్చలు జరుగనున్నాయి. రక్షణ రంగంలో సహకారంపై ఇరుదేశాలు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ రోడ్డు మ్యాప్ను సైతం ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇకపై కలిసి పనిచేయాలని భారత్–అమెరికా ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. 24, 25న మోదీ ఈజిప్టు పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 24, 25న ఈజిప్టులో పర్యటిస్తారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సిసీ ఆహా్వనం మేరకు ఆయన ఈ పర్యటన తలపెట్టారు. 1997 తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 11వ శతాబ్దం నాటి చారిత్రక అల్–హకీం మసీదును మోదీ సందర్శిస్తారు. దావూదీ బోహ్రా ముస్లిం సామాజికవర్గం సహాయంతో ఈ మసీదును ఇటీవలే పునరుద్ధరించారు. ఈజిప్టులో మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన భారత సైనికులకు హెలియోపోలిస్ వార్ సెమెట్రీలో మోదీ నివాళులరి్పస్తారు. ఈజిప్టు అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. ఈజిప్టులోని భారతీయులతో సమావేశమవుతారు. -
శ్రీవారి సన్నిధిలో పలువురు ప్రముఖులు..!
-
తిరుమల శ్రీవారినీ దర్శించుకున్న నటుడు నిఖిల్
-
శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు ఉపేంద్ర (ఫొటోలు)
-
Dil Raju Family Photos: భార్య, కొడుకుతో శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు (ఫొటోలు)
-
600 మెట్లపై హారతి కర్పూరం వెలిగించిన సామ్ ..ఫోటోలు వైరల్
-
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
మంగళగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం : మంత్రి రోజా
-
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్
-
రామప్ప ఆలయాన్ని సందర్శించిన రాష్ట్రపతి ముర్ము
-
దేశంలోనే ఏపీ ప్రభుత్వం అగ్రగామిగా ఉంది : సజ్జల
-
శ్రీశైలం మల్లన్న సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (ఫొటోలు)
-
Satyendar Jain: ఆప్ మంత్రికి మరో ఎదురు దెబ్బ..15 రోజుల పాటు..
మనీలాండరింగ్ కేసులో విచారణ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కి మరో ఎదురుదెబ్బ తగిలింది. కనీసం సందర్శకులు ఆయన్ను కలుసుకునేందుకు లేకుండా 15 రోజుల పాటు శిక్ష విధించింది. అలాగే అతనికి సెల్, టేబుల్, కుర్చి వంటి అన్ని సౌకర్యాలను తొలగించింది. ఈ మేరకు బీజేపీ నేతృత్వలోని ప్రభుత్వ ప్రతినిధి డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల నేపథ్యంలోనే సత్యేందర్పై ఈ చర్యలు తీసుకున్నారు. అలాగే అప్పటి జైలు అధికారి సందీప్ గోయోల్ కారణంగానే సత్యేందర్ జైల్లో రాజభోగాలు అనుభవించారంటూ విమర్శలుల రావడంతో గోయెల్పై కూడా కమిటీ శాఖాపరమైన చర్యలను తీసుకున్నట్లు పేర్కొంది. అదీకూడ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ బీజేపీని ఓడించిన వారాల తర్వాత జైన్పై ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. వాస్తవానికి అవినీతి ఆరోపణలు ఎదర్కొంటూ తిహార్ జైలులో ఉన్నసత్యేందర్ జైన్ జూన్ నుంచి జైలులోనే ఉన్నారు. ఆయన వరుస సీసీటీవీ వీడియో లీక్లతో వార్తల్లో హాట్టాపిక్గా నిలిచిన సంగతి తెలిసిందే. జైల్లో ఆయనకు విఐపీ ట్రీట్మెంట్, పసందైన విందు అంటూ బీజేపీ వరుస వీడియోలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జైలు అధికారులను సస్పెండ్ చేశారు కూడా. ఆఖరికి ఆయన బెయిల్ తిరస్కరణకు గురవ్వడం తోపాటు మత విశ్వాసాలకు తగ్గట్టుగా ఆహారం తీసుకునేలా అనుమతించమంటూ చేసుకన్న అభ్యర్థన సైతం కోర్టు తిరస్కరించింది. (చదవండి: నా కుమారుడిని రక్షించుకోలేకపోయా!: కేంద్ర మంత్రి భావోద్వేగం) -
మసీదు, మదర్సాను సందర్శించిన మోహన్ భగవత్
న్యూఢిల్లీ: దేశంలో మత సహనాన్ని పెంపొందించడానికి గత కొన్ని వారాలుగా ముస్లిం మేధావులతో మంతనాలు జరుపుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ గురు వారం ఒక మసీదు, మదర్సాను సందర్శించారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాస్ను కలుసుకొని ఏకాంతంగా గంటకు పైగా చర్చలు జరిపారు. సెంట్రల్ ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్లో ఒక మసీదుని సందర్శించారు. తర్వాత ఉత్తర ఢిల్లీలోని ఆజాద్పూర్లో మదర్సాకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. తమ ఆహ్వానం మేరకే భగవత్ మసీదు, మదర్సాకి వచ్చారని ఇలియాస్ వెల్లడించారు. -
ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది: సీజేఐ ఎన్వీ రమణ
సాక్షి, తిరుపతి: తిరుపతిలో సీజేఐ ఎన్వీ రమణ పర్యటించారు. ఈ సందర్బంగా గాంధీజీ ఆత్మకథ 'సత్యశోధన' పుస్తకాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరంగా ఉందని ఎన్వీ రమణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సత్యశోధన ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమని అన్నారు. ఈ సందర్భంగా మహాత్మ గాంధీ సేవలను కొనియాడారు. అహింస అనే ఆయుధంతో గాంధీజీ పోరాటం చేసారని.. నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో నేర్పించిన వ్యక్తం గాంధీజీ అని అన్నారు. రాస్ నిర్వాహకులు, పద్మశ్రీ గ్రహీత స్వర్గీయ గుత్తా మునిరత్నం విగ్రహాన్ని సీజేఐ ఆవిష్కరించారు. అంతకుముందు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చదవండి: ‘పాడా' పనులను త్వరగా పూర్తి చేసేలా సీఎం జగన్ ఆదేశాలు తిరుమల శ్రీవారిని దర్శించకున్న సీజేఐ తిరుమల శ్రీవారిని సీజేఐ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో సీజేఐకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని అందించారు. -
శ్రీవారి దర్శనం చేసుకున్న కల్యాణ్ రామ్ (ఫొటోలు)
-
ఇండో పసిఫిక్తో వాణిజ్య బంధం బలపడాలి
ప్యాంగ్టెక్ (దక్షిణ కొరియా): ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఆసియా పర్యటన ప్రారంభించారు. దక్షిణ కొరియా, జపాన్లలో వారం రోజులు పర్యటించనున్న ఆయన తొలుత దక్షిణ కొరియాకు వచ్చారు. కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ శామ్సంగ్ కంప్యూటర్ చిప్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కంపెనీ అమెరికాలోని టెక్సాస్లో 1500 కోట్ల అమెరికా డాలర్ల వ్యయంతో ఒక సెమి కండక్టర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అమెరికాలో వేధిస్తున్న కంప్యూటర్ చిప్ల కొరతను అధిగమించడం కోసమే బైడెన్ తన పర్యటనలో శామ్సంగ్ కంపెనీ సందర్శనకు పెద్దపీట వేశారు. ఈ చిన్ని చిప్ల్లోనే ప్రపంచ సాంకేతిక పురోగతి దాగి ఉందని బైడెన్ వ్యాఖ్యానించారు. సాంకేతికంగా చైనాపై ఆధారపడడం తగ్గించడం కోసమే ఆయన కొరియా, జపాన్లలో పర్యటించనున్నారు. దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కి బైడెన్ తన అభినందనలు తెలియజేశారు. వచ్చే కొన్ని దశాబ్దాల్లో ఇండో ఫసిఫిక్ ప్రాంతంలోనే ప్రపంచ భవిష్యత్ ఉందని బైడెన్ పేర్కొన్నారు. ఇండోç పసిఫిక్ ప్రాంతంతో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకొని ఇరు ప్రాంతాల ప్రజలు మరింత సన్నిహితంగా మెలిగేలా చర్యలు తీసుకోవాలని బైడెన్ అన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కంగనా రనౌత్ (ఫొటోలు)
-
శ్రీవారిని దర్శించుకున్న పాయల్ రాజ్పుత్.. ఫోటోలు వైరల్
-
యాదాద్రి ఆలయానికి సీఎం కేసీఆర్ దంపతులు
-
AP: 4న పోలవరానికి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి
సాక్షి, అమరావతి: కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మార్చి 4న పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. స్పిల్ వే, స్పిల్ చానల్, ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ డయా ఫ్రమ్ వాల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పరిశీలించనున్నారు. చదవండి: కొత్త జిల్లాల ప్రక్రియ వేగవంతం తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి.. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వచ్చే నెల 4న ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలీకాప్టర్లో పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న సాయిధరమ్ తేజ్..
Sai Dharam Tej And His Family: హీరో సాయిధరమ్ తేజ్ కుటుంబ సమేతంగా సోమవారం విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి ప్రసాదాలను, శేషవ్రస్తాలను బహూకరించారు. ఎప్పుడూ విజయవాడ వచ్చిన తప్పకుండా అమ్మవారిని దర్శించుకుంటానని సాయి ధరమ్ తేజ్ తెలిపాడు. చాలా ప్రశాంత వాతావరణంలో దర్శనం జరిగిందన్నాడు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకొని కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కు లు చెల్లించుకున్నట్లు సాయిధరమ్తేజ్ కుటుంబ సభ్యులు తెలిపారు. -
20న వైఎస్సార్, విశాఖ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ఎల్లుండి(ఆదివారం) వైఎస్సార్ జిల్లా, విశాఖపట్నం జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కడప చేరుకోనున్న సీఎం, అనంతరం పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. చదవండి: రాష్ట్రపతి పర్యటనలో మార్పులు ఆ తర్వాత కడప రింగ్ రోడ్ జయరాజ్ గార్డెన్స్లో డిప్యూటీ సీఎం ఎస్బి.అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. అదే రోజు సాయంత్రం 4.45 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి నేవల్ ఎయిర్స్టేషన్, ఐఎన్ఎస్ డేగా వద్ద భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
వైకుంఠ ఏకాదశి వేళ తిరుమలలో ఏపీ హైకోర్టు జడ్జిలు
-
సాయిబాబాకు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ప్రార్థనలు
Shilpa Shetty Raj Kundra Visits Shirdi Temple Offers Prayers: గతేడాది పలువురు తారలకు కొంచెం కలిసి రాలేదనే చెప్పాలి. అందులో ముఖ్యంగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, వ్యాపారవేత్త రాజ్కుంద్రా దంపతులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సమస్యలు కొంచెం సద్దుమణిగాయి. ఆ ఆరోపణల నుంచి ఉపశమనం పొందుతున్నారు. అందుకే ఇద్దరూ కలిసి ఆలయాలు సందర్శించడం, టూర్లకు వెళ్లడం, కొంత సమయం గడపడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే షిరిడీ పర్యటనలో ఉన్నారు శిల్పా, రాజ్ కుంద్రా. ఈసారి వీరితో పాటు శిల్పా శెట్టి సోదరుడు రాఖీ కూడా ఉన్నట్లు సమాచారం. వారు తీర్థయాత్రలో ఉన్నట్లు తన ఇన్స్టా గ్రామ్ వేదికగా తెలిపుతూ ఓ వీడియోను షేర్ చేసింది శిల్పా. ఇదీ చదవండి: నాకు చాలా బాధను కలిగించింది.. చీటింగ్ కేసుపై నోరు విప్పిన శిల్పా శెట్టి ఈ వీడియో క్లిప్కు 'సబ్ కా మాలిక్ ఏక్ (దేవుడు ఒక్కడే). శ్రద్ధ, పట్టుదల. ఓం సాయి రామ్' అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ వీడియోలో ఇద్దరూ చేతులు జోడించి సాయిబాబాకు ప్రార్థనలు చేస్తున్నారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా హిందూ సాంప్రదాయమైన వస్త్రాలను ధరించారు. అలాగే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ పెట్టుకున్నారు. అశ్లీల చిత్రాల కేసులో విడుదలైన తర్వాత రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా ఖాతాలన్ని తొలగించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే హిందీ బిగ్బాస్ సీజన్ 15లో తన సోదరి షమితా శెట్టి గెలవాలని కోరుకుంటున్నట్లు శిల్పా శెట్టి ఇటీవల తెలిపింది. ప్రస్తుతం శిల్పా ఇండియాస్ గాట్ టాలెంట్ అనే రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. ఈ షో జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) ఇదీ చదవండి: మొహాన్ని దాచుకున్న రాజ్ కుంద్రా.. నెటిజన్స్ ట్రోలింగ్ -
కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్పై చికిత్స
సాక్షి, కోలారు(కర్ణాటక): గత రెండు రెండురోజులుగా ఆనారోగ్యం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్ఎల్ జాలప్పను మాజీ సీఎం సిద్ధరామయ్య ఆదివారం పరామర్శించారు. జాలప్ప ఆరోగ్యం విషమంగా ఉందని, ప్రస్తుతానికి స్థిరంగానే ఉందని సిద్ధరామయ్య అన్నారు. మత మార్పిడి నిషేధ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. జేడీఎస్ ఎప్పటికి బీజేపీకి బి – టీం గానే ఉంటుందని అన్నారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల రిజర్వేషన్లు రద్దు చేయాలి -
వరద సాయం అందనివారు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేయండి: సీఎం జగన్
Live Updates వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. దీనిలో భాగంగా శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటన ముగిసిన అనంతరం సీఎం జగన్ తిరుగు పయనమయ్యారు. నెల్లూరు జిల్లా: వరద ప్రభావిత ప్రాంతాలు దామరపాలెం, జొన్నవాడ, పెనుబల్లి, భగత్ సింగ్ కాలనీల్లో పర్యటించిన సీఎం జగన్ ముంపు బాధితులకు అందిన సహాయక చర్యలపై అరాతీశారు. నష్టపోయిన ప్రతీ కుటుంబానికీ అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీఇచ్చారు. వరద సహాయక చర్యలపై ముంపువాసులు సంతృప్తి వ్యక్తం చేశారు. వేళాంగిణి అనే మహిళ ఆవేదన విన్న సీఎం జగన్ చలించిపోయారు. ఆమె కొడుక్కి ఉద్యోగం కల్పించి అదుకొంటానని మహిళకు సీఎం హామీఇచ్చారు. బీఎంఆర్ ట్రస్ట్ తరఫున వరద సహాయం కోసం రూ.కోటి చెక్కును బీదా మస్తాన్ రావు సీఎంకు అందజేశారు. ఢీసీఎంఎస్ నిధుల నుంచి రూ. 25 లక్షల వరద సహాయం చెక్కున్ ఛైర్మెన్ వీరి చలపతి సీఎం వైఎస్ జగన్కు అందచేశారు. నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వరద పరిస్థితిపై అధికారులతో పూర్తిగా మాట్లాడినట్లు తెలిపారు. వరద బాధితులకు ఇంటికి రూ. 2వేలతో పాటు రేషన్ కూడా అందినట్టు అందరూ చెబుతున్నారని తెలిపారు. రానివాళ్లు 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పెన్నానది నుంచి వరద నివారణ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరకట్ట బండ్ నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నామని ఆ పనులకు శంకుస్థాపన తానే చేస్తానని చెప్పారు. కొట్టుకుపోయిన సోమశిల డ్యామ్ అఫ్రాన్ నిర్మాణం కోసం రూ.120కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. వరద సహాయం అందని వారు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వరదల్లో బాధితులను ఆదుకోవడంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నగర కమినర్ దినేష్ పని తీరును ప్రశంసించారు. నెల్లూరు జిల్లా: భగత్సింగ్ నగర్ కాలనీలో కోతకు గురైన పెన్నా నదిని సీఎం జగన్ పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్ బాధితులకు భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా: పెనుబల్లిలో దెబ్బతిన్న రోడ్లు, పాఠశాల, పంట పొలాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. నెల్లూరు జిల్లా ► జొన్నవాడ వద్ద తెగిపోయిన పెన్నా నది పొర్లు కట్టని సీఎం జగన్ పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోతకు గురైన కరట్టను పరిశీలించిన సీఎం జగన్.. ► నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకున్న సీఎం.. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు రూరల్ మండలంలోని దేవరపాలెనికి వెళ్లి వరదలు కారణంగా దెబ్బతిన్న రహదారులు, పంటలు, కోతకు గురైన కరట్టను పరిశీలించారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్ను సీఎం పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వరద నష్టాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రజాప్రతినిధుల నుంచి వినతి ప్రతాలను సీఎం స్వీకరించారు. వరద బీభత్సంపై ప్రజా ప్రతినిధులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ►నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్కు సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. సహాయక చర్యలను సమీక్షించడంతో పాటు, నష్టపోయిన బాధితులతో నేరుగా మాట్లాడి భరోసా కల్పించనున్నారు. చిత్తూరు జిల్లాలో ముగిసిన సీఎం జగన్ పర్యటన ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం నుండి నెల్లూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. సీఎం వెంట జిల్లా ఇంచార్జి మంత్రి గౌతమ్ రెడ్డి ఉన్నారు. నదీ ప్రవాహానికి కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించిన సీఎం.. ►కృష్టానగర్లో 3 గంటల పాటు పర్యటించిన సీఎం వైఎస్ జగన్.. తిరుచానూరులో పర్యటించారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు-పాడీపేట వద్ద స్వర్ణముఖి నదిపై వరద ఉధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. ప్రాణాలకు తెగించి వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసు కానిస్టేబుల్ ప్రసాద్ సహా మరో ముగ్గురు పౌరులను సీఎం అభినందించి.. మెమొంటోలు అందజేశారు. చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాలతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో రహదారులు భవనాలు, వ్యవసాయం, ఉద్యానవన, గృహనిర్మాణం, విద్యుత్ శాఖలకు సంబంధించి వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం పరిశీలించారు. కృష్ణానగర్లో వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్ ►వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తున్నారు. తిరుపతిలోని కృష్ణానగర్ను సీఎం పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించి.. వరదలకు దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తిరుపతిలో కృష్ణా నగర్ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. వరద బాధితులను సీఎం జగన్ పరమర్శించారు. స్థానికులు తమ సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించడం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి గృహాలు మంజూరు చేయ్యాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తక్షణ సహాయం కింద రూ.189 కోట్లు మంజూరు చేశారు. కృష్ణా నగర్లో కిడ్నీ బాధిత మహిళకి వైద్యం అందిస్తామని సీఎం హామి ఇచ్చారు. ఆ కుటుంబం సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన సీఎం జగన్ పాఠశాల ఆవరణలో పరిస్థితి, రోడ్లు సరిగా ఉన్నాయా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వరద నష్టాలపై ఫోటో గ్యాలరీని సీఎం తిలకించారు. సాక్షి, తిరుపతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సీఎం నేడు పర్యటించనున్నారు. తిరుపతి, తిరుచానూరులో ముంపు ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. తిరుపతిలోని కృష్ణానగర్ను సందర్శించనున్నారు. వరద బాధితులతో సీఎం మాట్లాడనున్నారు. అనంతరం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి నెల్లూరు జిల్లా పర్యటనకు సీఎం వెళ్లనున్నారు. గురువారం ఆయన వరద ప్రభావిత ప్రాంతాలైన వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం పులపత్తూరు, ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె గ్రామాల్లో, చిత్తూరు జిల్లా వెదళ్లచెరువు ఎస్టీ కాలనీలో పర్యటించారు. ధ్వంసమైన ఇళ్లు, వంతెనలను పరిశీలించారు. తొలుత పులపత్తూరులో కాలినడకన గ్రామం మొత్తం కలియదిరుగుతూ స్వయంగా బాధితులతో మాట్లాడారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. బాధితులకు సురక్షిత ప్రదేశంలో ఐదు సెంట్ల స్థలం ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఇల్లు కూడా కట్టించి ఇస్తుందని హామీ ఇచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వరద బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు రాజకీయాలే చేస్తారని పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా టీడీపీ జెండాలే కనిపించాయని విమర్శించారు. తమ నాయకుడు.. సీఎం జగన్ చిత్తూరు పర్యటన నేపథ్యంలో తాము.. ఎక్కడా కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. టీడీపీ నేతలు.. ప్రచారం కోసం మాత్రమే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని ఎద్దేవా చేశారు. వరదలలో నష్టపోయిన బాధితులను తమ ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. -
ద్రాక్షారామంలో ఎమ్మెల్యే రోజా విశేష పూజలు
-
Hyderabad: సిక్కుల ర్యాలీ: పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సిక్కు మత గురువు గురునానక్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ర్యాలీ జరగనుంది. అశోక్ బజార్ గురుద్వార నుంచి మొదలై మళ్లీ అక్కడికే చేరుతుంది. ఈ నేపథ్యంలో సుల్తాన్ బజార్, చార్మినార్, గోషామహల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవి శివాజీ బ్రిడ్జి జంక్షన్, ఆప్జల్ గంజ్ జంక్షన్, రంగ్ మహల్ జంక్షన్, నయాపూల్,శాంతి ఫైర్ వర్క్స్ ప్రాంతాల్లో అమలులో ఉండనున్నాయి. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నా మార్గాలు ఎంచుకోవాలని అధికారులు కోరారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుధవారం నగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.40 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానం దిగుతారు. అక్కడ నుంచి గ్రీన్ ల్యాండ్స్లోని యోథ డయాగ్నస్టిక్స్కు వెళ్తారు. సాయంత్రం 5.50 గంటలకు అక్కడ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం.29 కు వెళ్లనున్నారు. ఆయా సమయాల్లో, ఆయా మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. -
వైద్యపరీక్షలు చేయించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల ఇంట్లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయన కుడికాలుకు గాయం అయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మళ్లీ వాపు రావటంతో వైద్యుల సలహా మేరకు ఆస్పత్రికి వెళ్లారు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యనిపుణులు డాక్టర్ అనిల్కుమార్, మణిపాల్ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో సీఎం జగన్కు సాధారణ వైద్యపరీక్షలు, స్కానింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన తాడేపల్లిలోని ఇంటికి చేరుకున్నారు. -
దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు ప్రసాదించాలి: ఎమ్మెల్యే రోజా
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపీ దర్శన సమయంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నరక చతుర్దశి పర్వదినాన దీపావళి వెలుగులా ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగు రావాలని కోరుకుంటున్నన్నారు. ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: AP: అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ -
రజనీకాంత్ కు సీఎం పరామర్శ ఆరోగ్యంపై ఆరా
-
యాదాద్రి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి భువనగిరి(నల్లగొండ): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తన పర్యటనలో భాగంగా మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా.. ఆలయ పున: నిర్మాణ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. పెద్ద గుట్ట టెంపుల్ సిటీ హెలిప్యాడ్పై సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది. సీఎం కేసీఆర్ వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు ఉన్నారు. ఆలయం పునఃప్రారంభం ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించారని, యాదాద్రిలోనే సీఎం స్వయంగా ప్రకటిస్తారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పునఃప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను, తేదీలను కూడా ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: కేసీఆర్ బాటలోనే పార్టీ యంత్రాంగం -
Indrakeeladri: దుర్గమ్మను దర్శించిన గవర్నర్ దంపతులు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆలయ పాలక మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. (చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ) దర్శనం అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ, దసరా మొదటి రోజున దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని, కరోనాను ప్రపంచం నుంచి దూరం చేయాలని అమ్మవారిని కోరుకున్నానని గవర్నర్ తెలిపారు. చదవండి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేయండి -
ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించకున్న హీరో గోపీచంద్
-
విశాఖలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన
సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. చిన్న వాల్తేర్లో కోవిడ్ టీకా కేంద్రాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తామన్నారు. మరో రెండు వ్యాక్సిన్లకు అనుమతి లభించిందని ఆమె తెలిపారు. -
నేడు నల్లగొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన
సాక్షి, నల్లగొండ: వైఎస్ షర్మిల నల్లగొండ జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. ఈ మేరకు లోటస్పాండ్లోని వైఎస్ షర్మిల కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోనున్నారు. ఉదయం 7:30 గంటలకు లోటస్పాండ్ నుంచి నల్లగొండ జిల్లా పర్యటనకు షర్మిల బయల్దేరనున్నారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, ఉపాధి దొరక్క ఇబ్బందులు పడి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నీలకంఠ సాయి, అతడి కుటుంబాన్ని 10:30 గంటలకు పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 12:45 గంటలకు హుజూర్నగర్ సర్కిల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పంచనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు కోదాడ సమీపంలోని దొండపాడులో కరోనాతో మృతి చెందిన వైఎస్ఆర్ అనుచరుడు, కుటుంబ సన్నిహితులు, మాజీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గున్నం నాగిరెడ్డి కుటుంబాన్ని ఆమె పరామర్శించనున్నారు. చదవండి: రిమ్స్లో దారుణం: కాలం చెల్లిన ఇంజక్షన్లతో చికిత్స.. -
బంగ్లాదేశ్తో కరచాలనం
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర నమోదు చిట్టా (ఎన్ఆర్సీ), జాతీయ ప్రజా నమోదు పట్టిక (ఎన్పీఆర్)లు మన దేశంలో ప్రధానంగా చర్చలోకి వచ్చినప్పటినుంచీ బంగ్లాదేశ్తో మన సంబంధాలు క్రమేపీ క్షీణిస్తున్నాయా అన్న సందేహం అందరికీ కలుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26, 27 తేదీల్లో ఆ దేశంలో పర్యటించారు. కరోనా మహమ్మారి విరుచుకుపడ్డాక మోదీ జరిపిన తొలి విదేశీ పర్యటన ఇదే కావటంతో ఆయన తమకిస్తున్న ప్రాధాన్యతేమిటో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గుర్తించేవుంటారు. ఆయన పర్యటన ముగిశాక విడుదలైన ఇరు దేశాల అధినేతల సంయుక్త ప్రకటన ‘ప్రజానుకూల సరిహద్దు’ విధానం మొదలు కొని అణుశక్తి వరకూ వివిధ అంశాలను స్పృశించింది. అయితే ఆ దేశం అత్యంత ప్రధాన మైనదిగా భావించే తీస్తా నదీ జలాల అంశం మాత్రం అందులో లేదు. ఈ విషయంలో హసీనా తన అసంతృప్తిని దాచుకోలేదు కూడా. అలాగే ఆమె పైకి చెప్పకపోయినా వారిద్దరి మధ్య చర్చల్లో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ల ప్రస్తావన వచ్చేవుంటుంది. ‘కీలెరిగి వాత... వీలెరిగి చేత’ అన్నారు. ఎప్పుడే పని చేయాలో మోదీకి బాగా తెలుసని ఈ పర్యటన నిరూపించింది. యాభైయ్యేళ్లనాటి ఆ దేశ ఆవిర్భావంలో మన దేశానిది కీలక పాత్ర. ఖలీదా జియా పాలనాకాలంలో, సైనిక పాలన సమయంలో ఆ దేశం భారత్ విషయంలో కొంత తేడాగా వున్నా హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం మొదటినుంచీ మన దేశంతో సన్నిహితంగా వుంటున్నది. కనుకనే ఈశాన్యంలో సమస్యలు సృష్టించే మిలిటెంట్లను పట్టి బంధించి మన దేశానికి అప్పగించటం, వారి స్థావరాలను ధ్వంసం చేయటం హసీనా సర్కారువల్లే జరిగాయి. కానీ గత ఏణ్ణర్ధంగా భారత్ అంటే ఆ దేశం గుర్రుగా వుంది. అస్సాంలో ఎన్ఆర్సీ ప్రక్రియ అమలు తర్వాత ఇది మొదలైంది. ఆ ప్రక్రియలో19 లక్షలమంది చట్టవిరుద్ధ పౌరులున్నారని తేలింది. వీరిలో ముస్లింల సంఖ్య గణనీయంగా వుంది. వీరంతా బంగ్లా పౌరులంటూ కేంద్రమంత్రులు మాట్లాడటం ఆ దేశానికి మింగుడు పడలేదు. అలాగని అది అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. సరి హద్దుల్లో పటిష్టమైన నిఘా వుంటుంది కనుక తమవైపు నుంచి ఎవరూ అక్రమంగా వచ్చే అవకాశం లేదని లీకులిచ్చారు. సీఏఏ, ఎన్ఆర్సీలు భారత్ ఆంతరంగిక వ్యవహారమని ఒక సందర్భంలో హసీనా అన్నారు. అలా అంటూనే సీఏఏ అనవసరమని అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్య కలకలం సృష్టించింది. ఇలాంటి సమయంలో ప్రధాని అక్కడకు పర్యటనకెళ్లటం దౌత్యపరంగా మంచిదే. ఎందుకంటే మన పట్ల అసంతృప్తిగా వుంటున్న ఇరుగు పొరుగు దేశాలకు చైనా చేరువవుతోంది. బంగ్లాదేశ్లోనూ ఆ పని మొదలుపెట్టింది. హసీనా 2019లో చైనా పర్యటించి ఆ దేశంతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కనుక ఎంత త్వరగా బంగ్లాను సన్నిహితం చేసుకుంటే అంత మంచిది. అందుకు బంగ్లాదేశ్ ఆవిర్భావ సర్ణోత్సవ సంవత్సరం కన్నా మించిన సందర్భం మోదీకి వేరే వుండదు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందేం దుకు సైతం ఈ పర్యటన ఉపయోగపడుతుందని ఆయన భావించివుండొచ్చు. దేశ విభజనకాలంతో మొదలుపెట్టి 1965, 1971 యుద్ధ సమయాల్లో, అటు తర్వాత 2002–06 సంవత్సరాలమధ్య ఖలీదా పాలించినప్పుడు బంగ్లా భూభాగంలో వున్న హిందువులు అమానుషమైన హింసను, వేధింపులనూ ఎదుర్కొనాల్సివచ్చింది. దాంతో ఆ సందర్భాల్లో లక్షలమంది పశ్చిమ బెంగాల్కు వలస వచ్చి తల దాచుకున్నారు. అలా వచ్చి స్థిరపడినవారిలో నామసూద్ర పేరుతో వుండే తెగకు చెందిన మతువాలు అధికం. వారంతా ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలు, జల్పాయ్గిరి, సిలిగురి, కూచ్బెహార్, వర్ధమాన్ జిల్లాల్లోని 30 స్థానాల్లో గణనీయంగా వున్నారు. అందువల్లే కావొచ్చు...ఆ దళిత కులానికి పితామహుడిగా చెప్పే హరిచంద్ ఠాకూర్ స్మృత్యర్థం బంగ్లాలో నిర్మించిన మందిరాన్ని మోదీ సందర్శించారు. ఇరుగుపొరుగు దేశాల్లో హింసను ఎదుర్కొంటున్న మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వటం లక్ష్యంగా తీసుకొచ్చిన సీఏఏలో పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్లతోపాటు మిత్ర దేశమైన తమనూ జత చేయటం బంగ్లాకు ఆగ్రహం కలిగించింది. ఇక తీస్తా నదీజలాల వివాదం చాలా పాతది. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2011 జనవరిలోనే అది దాదాపు పరిష్కారానికి చేరువైంది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పర్యటించినప్పుడు తొమ్మిది ఒప్పందాలు కుదిరాయి. భూభాగాల పరస్పర మార్పిడి చేసుకోవటం పూర్తయింది. తీస్తాతోపాటు ఫెనీ జలాలను పంచుకోవటంపైనా ముసాయిదా ఖరారైనా మమతా బెనర్జీ అభ్యంతరంతో అది ఒప్పందంగా మారలేదు. లక్షలాదిమందికి ప్రాణావ సరమైన తీస్తా నదీజలాల్లో తమకు న్యాయంగా రావాల్సిన వాటా ఇవ్వాలని మోదీతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో హసీనా కోరినట్టు తాజాగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. భారత్తో సన్నిహితమని చెప్పుకుంటున్నా హసీనా తీస్తాపై ఒప్పించలేకపోతున్నారని విపక్షాల నుంచి ఎప్పటినుంచో విమర్శలున్నాయి. ఈ విషయంలో ఆమె ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. కనుక సాధ్యమైనంత త్వరలో ఈ నదీ జాలలపై ఒప్పందానికి రావటం మన దేశానికి మేలు కలిగించే అంశం. కలిసి ముందడుగు వేసి, వ్యాపారం, వాణిజ్యం తదితర రంగాల్లో సమష్టిగా అభివృద్ధి సాధిద్దామని మోదీ బంగ్లాకు పిలుపునిచ్చారు. అది సాకారం కావాలని ఆశించాలి. -
గ్రామ సచివాలయాలతో సంక్షేమ ఫలాలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలంటూ దిక్కుమాలిన కమిటీలు వేశారని, ఇప్పుడు ఆ కమిటీలు లేకుండా గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలోని 38వ డివిజన్లో పర్యటించారు. (చదవండి: ‘ఎవరెన్ని డ్రామాలు చేసినా.. గెలుపు మాదే’) స్థానికులు నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్న పాటి సమస్యలను మంత్రి.. అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కోర్టులో కేసులు పరిష్కారం అయిన వెంటనే అర్హులైన పేదలందరికి ఇళ్ల పట్టాలు అందిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.(చదవండి: కాపీల రాయుడు.. చంద్రబాబునాయుడు) రామ మందిర నిర్మాణానికి రూ.5లక్షల విరాళం.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యక్తిగతంగా రూ.5,01,116 విరాళం అందజేశారు. సంబంధింత చెక్ను ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ముఖ్యులు భరత్కు ఆయన ఆదివారం అందజేసినట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
దుర్గమ్మను దర్శించిన బండారు దత్తాత్రేయ
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. దర్శనం అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటం గవర్నర్కు ఆలయ ఈవో అందజేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించాలని దుర్గమ్మను కోరుకున్నానని తెలిపారు. వివేకానంద స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఆయన సక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: ఏపీకి వ్యాక్సిన్ వచ్చేస్తోంది..) దత్తాత్రేయను కలిసిన డీజీపీ.. పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన బండారు దత్తాత్రేయను డీజీపీ గౌతమ్ సవాంగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. గేట్ వే హోటల్లో ఆయనకు పుష్ఫగుచ్ఛం అందించారు. అనంతరం డీజీపీని హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ సత్కరించారు.(చదవండి: అరుదైన బొగ్గు క్షేత్రం ఏపీఎండీసీ కైవసం) -
సీఎం జగన్ కడప పర్యటన షెడ్యూల్
సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 23, 24, 25 తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా 24వ తేదీ పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ప్రధానంగా పులివెందులలో ఆర్టీసీ బస్టాండు, డిపోల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు ఏపీ క్లార్ భవన నిర్మాణాలకు, ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. చదవండి: ‘వైఎస్సార్ కప్’ మెగా క్రికెట్ సంరంభం ఈనెల 23వ తేదీన.. ఈనెల 23వ తేదీ సాయంత్రం 3.00 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు. 4.15 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 4.25 గంటలకు కడప విమానాశ్రయం నుంచి ఇడుపులపాయలోని వైఎస్సార్ఎస్టేట్ హెలిప్యాడ్కు బయలుదేరుతారు. 4.45 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ హెలిప్యాడ్కు చేరుకుంటారు. 4.55 గంటలకు హెలిప్యాడ్ నుంచి వైఎస్సార్ ఎస్టేట్కు చేరుకుంటారు. అనంతరం అక్కడే రాత్రి బస చేస్తారు. 24వ తేదీ పర్యటన ఇలా... ఉదయం 9.10 గంటల నుంచి 9.40 గంటల వరకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 10.00 నుంచి 12.00 గంటల వరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 12.15 గంటలకు చర్చి నుంచి ఇడుపులపాయ గెస్ట్హౌస్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గెస్ట్హౌస్ నుంచి ఇడుపులపాయ హెలిప్యాడ్కు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. 2.00 గంటలకు పులివెందుల భాకరాపురం చేరుకుంటారు. 2.20 గంటలకు ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండు, బస్సుడిపో, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 3.05 గంటలకు ముద్దనూరు రోడ్డులోని ఏపీక్లార్కు చేరుకుంటారు. 3.10 నుంచి 3.40 గంటల వరకు ఇమ్రా ఏపీకి శంకుస్థాపన చేస్తారు. 4.00 నుంచి 4.30 గంటల వరకు అపాచీ లెదర్ డెవలప్మెంట్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. 4.45 గంటలకు వైఎస్సార్ జగనన్న హౌసింగ్ లే అవుట్ హెలిప్యాడ్ నుంచి ఇడుపులపాయ ఎస్టేట్కు బయలుదేరి వెళతారు. 5.05 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్కు చేరుకుంటారు. 5.20 గంటలకు హెలిప్యాడ్ నుంచి గెస్ట్హౌస్కు చేరుకుంటారు. 25వ తేదీ పర్యటన ఇలా... ఉదయం 9.05 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్ నుంచి పులివెందుల బాకరాపురం బయలుదేరుతారు. 9.25 గంటలకు పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్కు చేరుకుంటారు. 9.45 నుంచి 11.00 గంటల వరకు పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 11.05 గంటలకు సీఎస్ఐ చర్చి నుంచి భాకరాపురం హెలిప్యాడ్కు బయలుదేరి 11.15 గంటలకు చేరుకుంటారు. 11.20 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 11.45 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 11.55 గంటలకు కడప నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి బయలుదేరి వెళతారు. -
పోలవరం పనులపై పీపీఏ సీఈవో సంతృప్తి
సాక్షి, పోలవరం: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ను పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం పరిశీలించారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ పనులు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా పీపీఏ కమిటీ సీఈవో పనులను పరిశీలించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. స్పిల్ వే పైన ఉన్న కాంక్రీట్ నిర్మాణ పనులను చంద్రశేఖర అయ్యర్తో పాటు కమిటీ సభ్యులు డి.గణేష్ కుమార్, కే.లలిత కుమారి ఆయనతో పాటు పనులను పరిశీలించారు. నిర్మాణం వివరాలు నిర్మాణం జరుగుతున్న విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.(చదవండి: చంద్రబాబూ.. అవాస్తవాలు మానండి) ఇప్పటివరకు జరిగిన పనులను మ్యాపు ద్వారా ప్రాజెక్ట్ సిఈ సుధాకర్ బాబు, ఎస్సీ నాగిరెడ్డిలు వివరిస్తున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు వివరంగా సమాధానాలిచ్చారు. ప్రతి నిర్మాణానికి సంబంధించిన విషయాలను కూడా కూలంకుషంగా పరిశీలిస్తున్న కమిటీ బంధం సభ్యులు పని జరిగిన విధానాన్ని తమ సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకుంటున్నారు. అనంతరం స్పిల్వేలో ఏర్పాటు చేస్తున్న గేట్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు ఏర్పాటుచేసిన ఆర్మ్ గడ్డర్ల నాణ్యతను, బిగింపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నాలుగు రోజులపాటు పశ్చిమ, తూర్పు గోదావరి జలాల్లో పర్యటిస్తామన్నారు. పోలవరం లో పనులు ఏవిధంగా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు వచ్చామని ప్రాజెక్ట్ పనులు సంతృప్తికరంగా జరుగుతున్నట్లు తెలియజేశారు. స్పిల్ వే, కాంక్రిట్ , ఇతర పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కుడి, ఎడమ కాలువలు భూసేకరణ ఎలా ఉన్నది అనే అంశంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నామఅని, ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు 2230 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పనులు, బిల్లులు పరిశీలించాక మరిన్ని నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ వెల్లడించారు. -
దుర్గమ్మను దర్శించిన మోహన్ భగవత్..
సాక్షి, విజయవాడ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ విజయవాడ దుర్గమ్మను శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో, అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం తీర్ధ ప్రసాదాలను అందచేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనం పొందారు. భగవత్కు ఆలయ అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు దుర్గ గుడిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలోని విజ్ఞాన విహార్ పాఠశాలలో నేటి నుంచి మూడు రోజులు జరగనున్న ఆర్ఎస్ఎస్ రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని మోహన్ భగవత్ ప్రారంభిస్తారు. ఆయన మూడురోజులూ ఈ సమావేశాల్లో పాల్గొంటారు. మంగళగిరి రూరల్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నిరంతరం ప్రజల్లో ఉండాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉండాలని, క్షేత్రస్థాయి ఉద్యమాలు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, పార్టీ నేతల మధ్య ఐక్యత... విజయ సోపానాలని, కష్టపడి పని చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు తీరాలను చేరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇన్చార్జిగా నియమితులైన తర్వాత మాణిక్యం తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ కోర్కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదు, కేంద్రం ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులపై వరుస పోరాటాలు, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. మూడున్నర గంటలు సాగిన సమావేశంలో మాణిక్యం మాట్లాడుతూ మనమంతా టీమ్ వర్క్ చేస్తే రాబోయే ఎన్నికలలో విజయం సాధిస్తామని అన్నారు. ప్రతి నెలలో రెండుసార్లు తప్పకుండా కొర్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని, ఆ సమావేశాల్లో అన్ని విషయాలు చర్చించుకుందామని పార్టీ నేతలకు చెప్పారు. తనతో పార్టీ అంశాలు ఎప్పుడైనా మాట్లాడవచ్చని, అన్ని వేళలా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో నిత్యం ప్రజల్లో ఉంటూ క్షేత్ర స్థాయి ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, సోనియా వల్లనే తెలంగాణ సాధ్యమయిందని, ఆమె త్యాగాన్ని జనంలోకి తీసుకెళ్లాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియాకు బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.రేవంత్రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, సీతక్క, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్కుమార్, వంశీచంద్ రెడ్డి, చిన్నారెడ్డి, కోర్ కమిటీ సభ్యులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. రైతులపై కేసీఆర్ది కపట ప్రేమ ఇటీవల కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తెలివిగా ఆటలాడుతున్నారని, రైతులపై కపట ప్రేమ చూపెడుతున్నారని మాణిక్యం విమర్శించారు. అన్ని బిల్లుల విషయంలో అందరి కంటే ముందుగానే బీజేపీకి, మోదీకి మద్దతిచ్చిన కేసీఆర్ ఇప్పుడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేయాలని కోరారు. ఈ నెల 28న గవర్నర్కు వినతిపత్రాన్ని అందజేయాలని, అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్, మాజ్దూర్ బచావో దినంగా పాటించాలని, ఈ కార్యక్రమంలో మండల, రాష్ట్ర స్థాయి నేతలు పాలుపంచుకోవాలని కోరారు. అక్టోబర్ 2 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది రైతులు, వ్యవసాయ కార్మికుల సంతకాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, రాష్ట్ర వ్యాప్తం గా అన్ని జిల్లాల్లో సంతకాల సేకరణ పెద్ద ఎత్తున చేయాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మాట్లాడుతూ వ్యవసాయ బిల్లుల విషయంలో ఏఐసీసీ పిలుపు మేరకు క్షేత్రస్థాయి ఉద్యమాలు చేయాల్సి ఉందని చెప్పారు. ఈ బిల్లులు పూర్తిగా కార్పొరేట్ వ్యాపారుల కోసమే బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, రైతుల పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని చెప్పారు. శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా స్పీకప్ ఆన్ అగ్రికల్చర్ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేశామని చెప్పారు. ఇంకా వరుస కార్యక్రమాలు ఉన్నాయని, వాటిని విజయవంతం చేయాలని పార్టీ కేడర్కు పిలుపునిచ్చారు. సమావేశంలో పొన్నాల, సంపత్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేయాలని సూచించారు. ఠాగూర్కు ఘన స్వాగతం శనివారం సాయంత్రం 5 గంటలకు చెన్నై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మాణిక్యం ఠాగూర్కు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్తో పాటు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్కుమార్, వంశీచంద్ రెడ్డిలు విమానాశ్రయానికి వచ్చారు. గాంధీభవన్ వద్ద ఠాగూర్కు డప్పులు, భజంత్రీలు, బాణాసంచాతో పార్టీ కేడర్ స్వాగతం పలికింది. -
ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన
సాక్షి, కడప: ముంపు గ్రామాల బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం ఆయన వైఎస్సార్ జిల్లా గండికోట ముంపు గ్రామాల్లో పర్యటించారు. ఆందోళన నిర్వహిస్తున్న తాళ్ల పొద్దుటూరు గ్రామస్తులతో చర్చించారు. దీంతో ఇళ్లు ఖాళీ చేయడానికి గ్రామస్తులు ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం 900 కోట్లు పరిహారం చెల్లిందని తెలిపారు. గత ఏడాది కంటే ఎక్కువ టీఎంసీల నీరు నింపుకుంటే మేలు జరుగుతుందన్నారు. కలెక్టర్, జేసీల సమక్షంలో ముంపు వాసుల చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని సుధీర్రెడ్డి తెలిపారు. (చదవండి: అంతరాష్ట్ర బస్సులు: 14న కీలక భేటీ) -
ప్రజావైద్యాన్ని గాలికొదిలేశారు
ఆదిలాబాద్ రూరల్: ప్రజా వైద్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ను, అలాగే నిజామాబాద్ ప్రభుత్వాస్ప తిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో 100 వైద్య పోస్టులు ఖాళీగా ఉంటే.. ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. రిమ్స్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ మెషీన్ లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్థానికంగా ఉన్న మంత్రి చెరువులు, స్థలాల ఆక్రమణలపై దృష్టి తప్ప వైద్యసేవలపై పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఉత్సవ విగ్రహంగా ఈటల నిజామాబాద్ అర్బన్: మంత్రి ఈటల రాజేందర్ ఉత్సవ విగ్రహంగా మారిపోయారని భట్టి ఎద్దేవా చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఏం జరుగుతోందో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. ఇతర మంత్రులను సీఎం భజనబ్యాచ్ల మార్చారని భట్టి విమర్శించారు. -
జల దిగ్బంధంలో 60 గ్రామాలు..
సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం నియోజకవర్గంలో 60 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. మంగళవారం ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వేలేరుపాడులో పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే.. గర్భిణీల ఆరోగ్యం అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదువేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మూడు నెలలకు సరిపడ నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచామని ఎమ్మెల్యే బాలరాజు వెల్లడించారు. -
రెండో రోజు దుర్గమ్మ దర్శనం..
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్ టిక్కెట్లు బుక్ చేసుకుని భక్తులు దర్శనానికి వస్తున్నారు. క్యూలైన్లలో భక్తులు భౌతిక దూరం పాటించేలా ఆరు అడుగుల మార్కింగ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్టాట్ బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి దర్శనాలు ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకే అమ్మవారి దర్శనం కొనసాగుతుంది. (భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్) కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంద్రకీల్రాదీపై అధికారులు పకడ్బందీ జాగ్రత్త చర్యలు చేపట్టారు. దర్శనానికి గంటకు 250 మంది భక్తులను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. శానిటైజ్ చేసి చేతులు శుభ్రం చేసుకుని, మాస్క్ ధరిస్తేనే భక్తులకు అనుమతిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ లో టెంపరేచర్ ఎక్కువ వస్తే అనుమతులు ఇవ్వడం లేదు. శఠగోపురం, తీర్థ ప్రసాదంతో పాటు ఆశీర్వచనాలు రద్దు చేశారు. అంతరాలయ దర్శనం నిలిపివేశారు. ముఖ మండపం ద్వారానే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. మహా మండపం వద్ద మరో ఆన్ లైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. కరోనా దృష్ట్యా అన్ని అర్జిత సేవలకు అనుమతి ఇవ్వడం లేదు. ఘాట్ రోడ్డు మార్గం ద్వారా భక్తులకు అనుమతిలేదని, వృద్ధులు, చిన్నపిల్లలకు ఆలయ ప్రవేశం లేదని అధికారులు స్పష్టం చేశారు. (ఏపీ: నేడు, రేపు భారీవర్షాలు) -
వెలిగొండ వేగం పెరగాలి
ఐదేళ్ల టీడీపీ సర్కార్ హయాంలో 600 మీటర్ల మేర టన్నెల్–1 పనులు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే 1.4 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయన్నమాట. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి/ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను జూలై నాటికి పూర్తి చేసి, ఆగస్టులో ఆయకట్టుకు నీళ్లందించాలని జల వనరుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. అవసరమైతే పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న పాత కాంట్రాక్టు సంస్థలను తొలగించి, వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ‘ప్రాధాన్యత క్రమం’లో శరవేగంగా పూర్తి చేయడానికి రూపొందించిన ప్రణాళిక అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పనులకు అడ్డంకిగా మారిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి అధికారులకు మార్గనిర్దేశం చేసే క్రమంలో గురువారం ఆయన వెలిగొండ ప్రాజెక్టు నుంచి ‘ప్రాజెక్టుల బాట’కు శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఉదయం హెలికాఫ్టర్లో బయలుదేరి 10.55 గంటలకు వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టు (సొరంగం)–2 వద్ద పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనంతరం ట్రాలీలో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్–1లోకి ప్రవేశించి, టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్) ద్వారా సొరంగం తవ్వకం పనులను పరిశీలించారు. ఆ తర్వాత మంత్రులు అనిల్కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ప్రజాప్రతినిధులతో కలిసి వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ నమూనా చూపుతున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి ఐదేళ్లలో 600 మీటర్లు.. ఎనిమిది నెలల్లో 1.4 కి.మీల సొరంగం తవ్వకం ‘ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో 4.47 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయడానికి, 15.25 లక్షల మంది దాహార్తి తీర్చాలన్న లక్ష్యంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. 2009 వరకూ పనులు శరవేగంగా జరిగాయి. ఆ తర్వాత పనులు పడకేశాయి. ఈ పరిస్థితిలో ఈ ప్రాజెక్టు తొలి దశను జూలై నాటికి పూర్తి చేసి, ఆగస్టులో ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించాం. గడువులోగా పనులు చేయడానికి చర్యలు తీసుకోవాలి’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గత ఐదేళ్లుగా పనులు ఎందుకు ముందు సాగలేదని అధికారులను ప్రశ్నించారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో టన్నెల్–1 పనులు 15.2 కిలోమీటర్ల నుంచి 15.8 కిలోమీటర్ల వరకు అంటే 600 మీటర్ల మేర మాత్రమే చేయగలిగామని అధికారులు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలల్లో టన్నెల్–1 పనులను 15.8 కిలోమీటర్ల నుంచి 17.2 కిలోమీటర్ల వరకు అంటే 1.4 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశామని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. టన్నెల్–1ను ఎట్టిపరిస్థితుల్లో జూలై నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి స్పందిస్తూ.. నెలకు 200 మీటర్ల చొప్పున టన్నెల్ను తవ్వుతున్నామని, జూన్–జూలై నాటికి పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వెలింగొండ సొరంగ మార్గంలో లోకో ట్రైన్లో ప్రయాణిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో టన్నెల్–2 పనులు 410 మీటర్లే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కొల్లంవాగు మీదుగా వెలిగొండ టన్నెల్ ద్వారా నీటిని విడుదల చేయడానికి సాగుతున్న హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనుల గురించి సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. హెడ్ రెగ్యులేటర్ పనులను పాత కాంట్రాక్టర్ సక్రమంగా చేయక పోవడంతో వాటిని మరొక కాంట్రాక్టర్కు అప్పగించామని అధికారులు వివరించారు. శ్రీశైలం జలాశయంలోనీటి మట్టం 850 అడుగులకు తగ్గగానే హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించి జూలై నాటికి పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్–2 పనులపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో 10.75 కిలోమీటర్ల నుంచి 11.16 కిలోమీటర్ల (410 మీటర్లు) వరకు మాత్రమే చేశారని అధికారులు వివరించారు. టన్నెల్–2ను రెండు వైపుల నుంచి తవ్వడం ద్వారా శరవేగంగా పూర్తి చేయాలని సీఎం చేసిన సూచనలకు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు అంగీకరించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధుల కొరత రానివ్వం.. పనులు వేగంగా చేయండి వెలిగొండ ప్రాజెక్టు పనులకు అవసరమైన 2,884.13 ఎకరాల భూమిని మార్చి 31లోగా సేకరించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్లో 11 గ్రామాలు ముంపునకు గురవుతాయని.. ఆ గ్రామాల పరిధిలోని 4,617 కుటుంబాల ప్రజలకు పునరావాసం కల్పించాల్సి ఉందని అధికారులు వివరించారు. భూసేకరణ చట్టం–2013 ప్రకారం సహాయ, పునరావాస ప్యాకేజీ కింద పరిహారం అందించాలని నిర్వాసితులు కోరుతున్నారని నివేదించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ.. అందుకు అవసరమైన రూ.1,860 కోట్ల నిధులు విడుదల చేస్తామని చెప్పారు. గడువులోగా పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పాత కాంట్రాక్టు సంస్థలు పనులు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు.. అవసరమైతే ఆ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి వేరే కాంట్రాక్టు సంస్థలకు పనులు అప్పగించాలని సూచించారు. పుల్లలచెరువు మండలంలో టీ–5 బ్లాక్ వద్ద అదనంగా కాలువ తవ్వకం ద్వారా 11,500 ఎకరాలకు సాగు, తాగు నీరు అందించే పనులు చేపట్టడానికి అదనంగా రూ.70 కోట్లు అవుతాయని, వాటిని మంజూరు చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన విజ్ఞప్తిపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. వెలిగొండ ప్రాజెక్టు ఈస్ట్రన్ కెనాల్ ద్వారా రాళ్లపాడు రిజర్వాయర్కు నీటిని విడుదల చేయాలన్న ఎమ్మెల్యే మహీధర్రెడ్డి ప్రతిపాదనపై కూడా సానుకూలంగా స్పందించారు. ఆ పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యేలు సుధాకర్బాబు, వేణుగోపాల్, నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
రైతన్నదే ముఖ్య భూమిక
రాజేంద్రనగర్: ప్రపంచంలో వ్యవసాయరంగంతోపాటు అన్నదాతది ప్రథమ స్థానమని గవర్నర్, వ్యవసాయ వర్సిటీ చాన్స్లర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని వ్యవసాయ వర్సిటీలో ఆమె పర్యటించారు. తొలుత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో యంత్రాల ద్వారా వరినాట్ల విధానాన్ని, పాలీహౌస్ను, వర్సిటీ నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ను పరిశీలించారు. చిరుధాన్యాల ఉత్పత్తుల కేంద్రాన్ని, పర్యావరణహిత గణేశ్ విగ్రహాలు, హోలీరంగుల తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఏజీ బీఎస్సీ చివరి ఏడాది విద్యార్థులు ప్రయోగాత్మకంగా చేస్తున్న సాగుపై గవర్నర్ వివరాలడిగారు. ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పుస్తకాలు ఇచ్చే, తీసుకునే వి«ధానాన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. రైతుబిడ్డలుగా విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు రైతుబిడ్డలకీ తల్లిదండ్రులుగా మారాలన్నారు. విద్యార్థులు క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. ఐదేళ్లలో అనేక జాతీయ, అంతర్జాతీయ వర్సిటీలు, సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు, వివిధ విత్తనాల రూపకల్పన గురించి వర్సి టీ ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్రావు, ఇతర శాస్త్రవేత్తలు ఆమెకు వివరించారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్కుమార్, పాలకమండలి సభ్యులు, వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకృతి పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలి ప్రకృతిని కాపాడేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని, పర్యావరణ పరిరక్షణకు తెలంగాణలో హరితహారం కొనసాగుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్ ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1938లో ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు గొప్ప ఆలోచనతో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో 100 స్టాళ్లతో నుమాయి ష్ను ప్రారంభించగా ఎంతో ప్రఖ్యాతి పొందిందని తెలిపారు. సొసైటీ ప్రతినిధులు ఎంతో కష్టపడి పకడ్బందీగా భద్రతా చర్యలతో నుమాయిష్ను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. సరోజిని నాయుడు జన్మదినం రోజున ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, జాయింట్ కమిషనర్ విశ్వప్రసాద్, ఆర్డీఓ శ్రీనివాస్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వినయ్కపూర్లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను, సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యాసంస్థలలో విద్యను అభ్యసిస్తూ ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఎన్.సురేందర్, కార్యదర్శి డాక్టర్ ప్రభాశంకర్, సంయుక్త కార్యదర్శి హనుమంతరావు, కోశాధికారి వినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి అనిల్
సాక్షి, పోలవరం: ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఆదివారం పోలవరంలో పర్యటించారు. ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పోలవరం చేరుకున్న అనిల్కుమార్కు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్ట్ పనులను మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత ఆర్అండ్ ఆర్, పోలవరం ప్రాజెక్ట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్కుమార్ మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్ పనులు 2021కల్లా పూర్తవుతాయి. ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా, కోర్టు కేసులు వేసినా నవంబర్లో పనులు మొదలుపెడతామని చెప్పాం. మాట నిలబెట్టుకున్నాం. ఆర్అండ్బీ కు సంబంధించి 10వేల పిటిషన్లు వచ్చాయి. వాటిని ప్రత్యేక అధికారి ద్వారా పరిశీలిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు పనులు పూర్తి అవుతాయి. సాక్షాత్తూ కేంద్రం నుంచి వచ్చిన బృందమే అన్నీ సజావుగా సాగుతున్నాయని చెప్పింది అని తెలిపారు. -
త్వరలో కాళేశ్వరం పర్యవేక్షణకు సీఎం!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మిడ్మానేరు నుంచి దిగువ కొండ పోచమ్మ సాగర్ వరకు నీటిని తరలించే పనుల పర్యవేక్షణ నిమిత్తం సీఎం కేసీఆర్ త్వరలోనే సిరిసిల్ల జిల్లాలో పర్యటించే అవకాశముంది. పర్యటనలో భాగంగా ప్యాకేజీ–10 మోటార్లను ప్రారంభించడంతోపాటు మిడ్మానేరు ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ చేస్తారని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. దీనిపై గురువారం సీఎం నీటి పారుదల ఈఎన్సీలతో చర్చించినట్లుగా తెలిసింది. -
టాప్–5లో ఏయూ నిలవాలి
ఏయూ క్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశంలోని ఐదు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం–వేవ్స్ 2019కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అరి్పంచారు. అనంతరం పూర్వ విద్యార్థులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ ప్రతి విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సంఘాలు పటిష్టం కావాల్సిన అవసరం ఉందన్నారు. తాము చదువుకుని, తమ ప్రగతికి మూలస్థంభంగా నిలిచిన వర్సిటీకి సహకారం అందించడానికి పూర్వ విద్యార్థులు ముందుండాలని పిలుపునిచ్చారు. చదువుల దేవాలయంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నిలుస్తోందన్నారు. కలలు కనాలని, వాటిని సాధించే దిశగా పని చేయాలని సూచించారు. ఆచార్యుల భర్తీలో జాప్యం విచారకరం.. తమ మంత్రి వర్గంలో విద్యా శాఖ మంత్రిగా సేవలందిస్తున్న ఆదిమూలపు సురేష్ ఓ దళితుడని, తన ఏడో తరగతిలో ఆంగ్ల మాధ్యమంలోకి మారి ఐఆర్ఎస్ అధికారిగా ఎదిగారని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. అతనికి అంతటి తపన, పట్టుదల ఉండబట్టే రాణించారన్నారు. వీటిని చూసి అతనికి విద్యా శాఖ మంత్రిగా నియమించామన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 459 ఆచార్యుల పోస్టులు భర్తీ కావాల్సి ఉందని తన దృష్టికి వచ్చిందన్నారు. ఇంత కాలం నియామక ప్రక్రియలో జాప్యం చోటు చేసుకోవడం విచారకరమని సీఎం అన్నారు. వర్సిటీ ప్రతిపాదనలకు సహకారం : టెక్ మహీంద్రా సీఈవో గుర్నానీ విశిష్ట అతిథి టెక్ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నానీ మాట్లాడుతూ ఏయూ నుంచి వచ్చే ప్రతిపాదనలకు పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. ప్రతి వ్యక్తి నిత్యం నూతన జ్ఞానాన్ని పొందడం, ధనాన్ని సంపాదించడం, పొందిన దానికి తిరిగి ప్రతిఫలాన్ని సమాజానికి చెల్లించడం అనే లక్షణాలను కలిగి ఉండాలని సూచించారు. సాంకేతికత మనకంటే గొప్పది కాదని, సాంకేతికతను వినియోగించుకుంటూ లాభపడుతున్న మానవులే నిజమైన మేధావులని అభిప్రాయపడ్డారు. ఆరి్టఫీíÙయల్ ఇంటిలిజెన్స్ కంటే మన ఇంటిలిజెన్స్ ఎంతో గొప్పదన్నారు. భవిష్యత్తులో సాధించాల్సినవి చాలా ఉన్నాయని, దీనికి సమష్టిగా పనిచేయడం ఎంతో అవసరమని చెప్పారు. తాను ఏయూకు రాక ముందు ఒక వృద్ధ విశ్వవిద్యాలయానికి వెళుతున్నానని భావించానన్నారు. ఇక్కడ యువతలోని ఉత్సాహం, పూర్వ విద్యార్థుల సహకారం, వర్సిటీ వీసీ దార్శనికతతో కూడిన పనితనం తనను అబ్బురపరిచాయన్నారు. ఈ రోజు తనకు అత్యంత స్ఫూర్తిని నింపిన రోజుగా నిలుస్తుందని చెప్పారు. ఉన్నత అవకాశాలకు వారధి ఆంగ్ల భాష : జీఎంఆర్ పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్దం దిశగా అడుగులు వేస్తోందన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆవిర్భావం వికాసాలను వివరించారు. విద్యను ప్రోత్సహించే ముఖ్యమంత్రిని రాష్ట్రం కలిగి ఉండడం ప్రజల అదృష్టమన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన మంచి నిర్ణయమన్నారు. గ్రామీణ నేపథ్యంతో వచ్చి ఇంజినీరింగ్లో చేరిన తొలినాళ్లలో పడిన ఇబ్బందులను వివరించారు. ఉన్నత అవకాశాలకు ఆంగ్ల భాష ఒక వారధిగా నిలుస్తుందన్నారు. ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి మాట్లాడుతూ సమర్థతను విశ్వవిద్యాలయం ఒక అలవాటుగా మార్చుకుందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చొరవతో ఇంజినీరింగ్ కళాశాల సీట్లు రెట్టింపు చేయడం సాధ్యమైందన్నారు. నాక్ గ్రేడింగ్, రూసా పథకం అమలు, ఎంహెచ్ఆర్డీ ర్యాంకుల్లో ఏయూ ముందుంటోందన్నారు. ప్రతి కుటుంబం నుంచి విద్యావంతులు రావాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని, దీనిని సాకారం చేసే దిశగా పని చేస్తున్నామని చెప్పారు. ఆచార్యుల పదవీ విరమణ కారణంగా తాత్కాలిక ఉద్యోగులతో వర్సిటీ నిర్వహణ కొనసాగిస్తున్నామన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు నైపుణ్యాలతో కూడిన ఉపాధిని పొందేలా తీర్చిదిద్దుతామన్నారు. అంబేడ్కర్ చెప్పిన విధంగా ఆంగ్ల మాధ్యమం బోధనను రాష్ట్రంలో ప్రతి విద్యారి్థకి అందించే ప్రక్రియ ఆరంభం అవుతోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేద ప్రజలకు ఉన్నత విద్యను చేరువ చేశారన్నారు. అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమం అమలు చారిత్రాత్మకంగా నిలుస్తున్నాయన్నారు. జన హృదయ నేతగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిలుస్తారన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ ఆచార్య బీల సత్యనారాయణ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు వర్సిటీలో విద్యనభ్యసిస్తున్న యువతకు దిశానిర్దేశం చేయాలన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ డీజీపీ ఎన్.సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులు స్థిర లక్ష్యంతో సాగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు, మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ఎంపీలు ఎం.వి.వి.సత్యనారాయణ, గొట్టేటి మాధవి, కె.సత్యవతి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, చెట్టి పాల్గుణ, లవ్ అండ్ కేర్ సంస్థ నిర్వాహకులు పి.యేసుపాదం, రిజి్రస్టార్ ఆచార్య వి.కృష్ణమోహన్, కార్యదర్శి బి.మోహనవెంకటరామ్, సంయుక్త కార్యదర్శి కుమార్రాజ, పలువురు వీసీలు, మాజీ వీసీలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. రూ.50 కోట్ల సాయం.. విశ్వ విద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘానికి ప్రభుత్వ తరఫున రూ.50 కోట్ల సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. పూర్వ విద్యార్థుల సంఘం రూ.50 కోట్లు నిధులను కార్పస్ ఫండ్గా సమీకరించాలని, దీనికి సమానంగా రూ.50 కోట్లు ప్రభుత్వం నుంచి అందిస్తామని తెలిపారు. విద్యతోనే మెరుగైన జీవనం.. విద్య మెరుగైన జీవనాన్ని అందిస్తుందని తాను నమ్ముతానని, అందుకే విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు సీఎం చెప్పారు. రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలలను మూడు దశల్లో రూ.12 వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. తొమ్మిది ఆవశ్యక అంశాలను ప్రధానంగా తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభిస్తామన్నారు. ఉపాధిని అందించే విధంగా కోర్సుల రూపకల్పన జరగాలని, ప్రస్తుతం ఉన్న డిగ్రీ, ఇంజినీరింగ్ కోర్సులకు మరో ఏడాది పెంచి హానర్స్ డిగ్రీలు అందిస్తామన్నారు. ఒక ఏడాది కాలం విద్యార్థికి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించడానికి వినియోగిస్తామన్నారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం.. ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు విశాఖకు విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుక్రవారం ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కన్నబాబురాజు, తిప్పల నాగిరెడ్డి, అదీప్రాజ్, పార్టీ నగర, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, శరగడం చిన అప్పలనాయుడు, సమన్వయకర్తలు కేకే రాజు, అక్కరమాని విజయనిర్మల, ముఖ్య నాయకులు, అధికారులు.. సీఎంకు స్వాగతం పలికారు. సీఎం వెంట జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు, మంత్రులు బొత్స సత్యనారాయణ,ముత్తంశెట్టి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, సీఎం ప్రొగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం ఉన్నారు. తనను కలిసేందుకు, చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కర్నీ వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్చంద్, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్రావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్గాం«దీ, ముఖ్యనేతలు కుంబా రవిబాబు, కొయ్యప్రసాద్రెడ్డి, దాడి రత్నాకర్, వంశీరెడ్డి, రొంగల జగన్నాథం, చొక్కాకుల వెంకట్రావ్, సూర్యనారాయణరాజు, ఫరూఖీ, సనపల చంద్రమౌళి, బొడ్డేటి ప్రసాద్, రవిరెడ్డి, పక్కి దివాకర్, మంత్రి రాజశేఖర్, ప్రేమ్బాబు, బోని శివరామకృష్ణ, సుధాకర్, గుంటూరు నరసింహమూర్తి, మంత్రి రాజశేఖర్, సతీష్ వర్మ, శ్రీకాంత్రాజు, కిరణ్రాజు, శ్రీనివాస్రెడ్డి, కాంతారావు, సురేష్, భర్కత్ అలీ, తుల్లి చంద్రశేఖర్, రేయి వెంకటరమణ, శ్రీనివాస్ గౌడ్, షరీఫ్, శ్రీదేవి వర్మ, యువశ్రీ, పవన్, బాకి శ్యాంకుమార్రెడ్డి, ఎ.రాజుబాబు, సునీల్ పాల్గొన్నారు. సాదర వీడ్కోలు.. విమానాశ్రయం నుంచి నేరుగా ఏయూలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరై.. అక్కడ ప్రసంగించాక ముఖ్యమంత్రి మళ్లీ విమానాశ్రయానికి సాయంత్రం 7.30 గంటలకు చేరుకుని గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. వీడ్కోలు సమయంలోనూ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్కు విచ్చేశారు. -
నేడు గజ్వేల్లో కేసీఆర్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా ములుగులో ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నూతన భవన ప్రారంభోత్సవంతోపాటు, ములుగులోని శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీని ప్రారంభిస్తారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు, గజ్వేల్ టౌన్లో వంద పడకల మాతా–శిశు ఆసుపత్రికి శంకుస్థాపన, గజ్వేల్ టౌన్లోని మహతి ఆడిటోరియం ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 11కి సిద్దిపేట జిల్లాలోని ములుగులో ఫారెస్ట్ కాలేజీకి చేరుకుంటారు. ఈ కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం అక్కడే ఫారెస్ట్ అధికారులు, విద్యార్థులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి హార్టికల్చర్ యూనివర్సిటీకి చేరుకుని అక్కడ కొత్తగా నిర్మించిన గుడిలో పూజలు నిర్వహించి, విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత గజ్వేల్ పట్టణంలో సమీకృత మార్కెట్ను, సమీకృత కార్యాలయ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. అనంతరం గజ్వేల్ మున్సిపాలిటీ అండర్గ్రౌండ్ వ్యవస్థకు, వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన, మహతి ఆడిటోరియం ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. గజ్వేల్ టౌన్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి సాయంత్రం 4.30 గంటలకు సీఎం ప్రగతిభవన్కు చేరుకుంటారు. -
10న పెద్దపల్లికి గవర్నర్ రాక
సాక్షి, పెద్దపల్లి: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈనెల 10న జిల్లా పర్యటనకు రానున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు... ఈనెల10న రాత్రి గవర్నర్ ఎన్టీపీసీకి చేరుకుని అక్కడే బస చేస్తారు. మరుసటి (బుధవారం) ఉదయం స్వచ్ఛతలో జాతీయస్థాయి అవార్డు పొందేందుకు చేపట్టిన పనులతోపాటు పెద్దపల్లిలోని సబల నాప్కిన్ తయారీ కేంద్రాన్ని సందర్శించే అవకాశముంది. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ తెలంగాణ చైర్మన్ హోదాలో రాష్ట్రస్థాయి వార్షిక సమావేశంలో కలెక్టర్ శ్రీదేవసేన అందించిన సేవలకు అక్టోబర్ 24న అవార్డు అందుకున్నారు. అదే వేదికపై జిల్లాలో అమలవుతున్న స్వచ్ఛత, పరిశుభ్రత కార్యక్రమాలు, స్వచ్ఛతలో జాతీయస్థాయి అవార్డు ప్రధాని చేతులమీదుగా అందుకున్న విషయాన్ని కలెక్టర్ గవర్నర్కు వివరించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వయంఉపాధితో ఆర్థికంగా ఎదిగేందుకు మహిళలతో నిర్వహిస్తున్న సబల బ్రాండ్ శానిటరీ నాప్కిన్స్ యూనిట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సమయంలో పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చి జిల్లాలో అమలవుతున్న స్వచ్ఛత కార్యక్రమాలను పరిశీలిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఈమేరకు పర్యటన ఖరారు అయినట్లు తెలిసింది. -
కాలుష్యాన్ని పర్యవేక్షించనున్న కేబినెట్ కార్యదర్శి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని అంచనా వేసేందుకు ఆదివారం ప్రధాన మంత్రి ముఖ్య కార్యదర్శి సెక్రటరీ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. ఇందులో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఢిల్లీ, హరియాణా, పంజాబ్ ప్రభుత్వాలతో కలిసి రోజువారీ కాలుష్య పరిస్థితులను పర్యవేక్షించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా.. మండిపోతున్న వ్యర్థాలు, నిర్మాణ పనుల కార్యకలాపాలు, పారిశ్రామిక, వాహనాల కాలుష్యంపై సమీక్షించారు. కాగా, కాలుష్యం, పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. ఉదయం 9 నుంచి ఒంటి గంట మధ్యలో 37 విమానాలను జైపూర్, అమృత్సర్, లక్నో, ముంబైలకు మళ్లించారు. -
కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు
సాక్షి, మొయినాబాద్: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చిలుకూరు బాలాజీ దేవాలయంలో మొక్కు చెల్లించుకున్నారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం బాలాజీ దేవాలయానికి వచ్చిన ఆయన ఆలయ గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షణలు చేశారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతం కావడంతోపాటు చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన చిలుకూరులో 108 ప్రదక్షిణలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆయనతోపాటు 108 ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో సుందరేశ్వరస్వామికి అభిషేకం నిర్వహించారు. మంత్రి రాకతో ఆలయ ప్రాంగణంలో రాజకీయ నాయకుల సందడి నెలకొంది. కార్యక్రమంలో చిలుకూరు సర్పంచ్ గునుగుర్తి స్వరూర, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జీటీఆర్ మండల అధ్యక్షుడు దేవరంపల్లి మహేందర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొంపల్లి అనంతరెడ్డి, ఎంపీటీసీ రవీందర్, మాజీ ఎంపీటీసీ గుండు గోపాల్, మాజీ సర్పంచ్ పురాణం వీరభద్రస్వామి, మాజీ ఉపసర్పంచ్ ఆండ్రూ, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, ఏఎంసీ వైస్ చైర్మన్ దారెడ్డి వెంకట్రెడ్డి, చిన్నమంగళారం సర్పంచ్ సుకన్య, నాయకులు హరిశంకర్ గౌడ్, విష్ణుగౌడ్, రవియాదవ్, రాఘవేందర్ యాదవ్, గడ్డం అంజిరెడ్డి, చెన్నయ్య ఉన్నారు. -
2న కడప జిల్లాకు సీఎం జగన్మోహన్రెడ్డి రాక
సాక్షి, కడప: సెప్టెంబరు 2వ తేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్నారని, పర్యటన విజయవంతానికి పటిష్ఠవంతంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ హరి కిరణ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు సెప్టెంబరు 2వ తేది ఉదయం నుంచి మ«ధ్యాహ్నం వరకు ఇడుపులపాయ, పులివెందులలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందన్నారు. దీనికి సంబంధించి మినిట్ టు మినిట్ రావాల్సి ఉందన్నారు. సెప్టెంబరు 2వ తేది ఉదయం ప్రత్యేక విమానంలో సీఎం కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హెలికాఫ్టర్లో ఇడుపులపాయకు వెళతారన్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి పులివెందులకు చేరుకుంటారన్నారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి విహ్రావిష్కరణ చేసి అనంతరం పులివెందుల ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు చేరుకుంటారన్నారు. అక్కడ పాడాకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహిస్తారన్నారు. సమావేశానంతరం పులివెందుల నుంచి హెలికాఫ్టర్లో కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళతారని వివరించారు. ఈ సందర్బంగా కడప ఎయిర్పోర్టులో ప్రోటోకాల్ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్, ఎక్సైజ్ డీసీలను ఆదేశించారు. ఇడుపులపాయ, పులివెందులలో హెలిప్యాడ్ల వద్ద బారికేడ్ల నిర్మాణం, అవసరమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ, పోలీసులు అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద పారిశుద్ద్యం, సుందరీకరణ పనులను పూర్తి చేయాలన్నారు. పులివెందుల ఆర్అండ్బీ గెస్ట్హౌస్ను తనిఖీ చేసి ప్రోటోకాల్ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు. ఇడుపులపాయ, పులివెందులలో వైద్య బృందాలు అవసరమైన మందులతో సిద్దంగా ఉండాలన్నారు. విద్యుత్కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జేసీ గౌతమి, ట్రైనీ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, డీఆర్వో రఘునాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సరిహద్దు శిబిరాలకు ఆర్మీ చీఫ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు అనంతరం పాక్తో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, ఆ దేశ నాయకుల రెచ్చగొట్టే ప్రకటనల నేపథ్యంలో భారత్ అప్రమత్తమయింది. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం శ్రీనగర్కు చేరుకున్నారు. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి సైనిక పోస్టులను సందర్శించారు. బలగాల కార్యాచరణ సన్నద్ధత, ముఖ్యంగా ఎల్వోసీ వెంట వాస్తవ పరిస్థితులపై సైనిక కమాండర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాదామీబాగ్లోని ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో రాష్ట్రంలో అంతర్గత పరిస్థితులపైనా ఆయన సమీక్షించనున్నారు. కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం ఆర్మీ చీఫ్ రాష్ట్రంలో పర్యటించడం ఇదే ప్రథమం. ఇలా ఉండగా, కశ్మీర్ లోయతోపాటు శ్రీనగర్లో శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నిషేధాజ్ఞలు విధించారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మలయాళ మనోరమ న్యూస్ కాంక్లేవ్లో ఆయన మాట్లాడారు. -
పాలమూరు పరిశీలనకు సీఎం రాక
సాక్షి,మహబూబ్నగర్: ఎట్టకేలకు.. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన ఖరారైంది. ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథక పనులను పరుగులు పెట్టించడంతో పాటు ఇతర ఆన్గోయింగ్ ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి గురువారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఇన్నాళ్లూ కాళేశ్వరం ప్రాజెక్టుపై దృష్టిసారించిన సీఎం.. అది పూర్తవడంతో ఇప్పుడు తన దృష్టంతా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్లో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాజెక్టు రాష్ట్ర, జిల్లా అధికారులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించిన కేసీఆర్ పనుల పురోగతిని పరిశీలించేందుకు జిల్లాలో పర్యటించనున్నారు. సాగుకు నీరులేక కరువుతో అల్లాడిన పాలమూరును పచ్చబర్చాలనే లక్ష్యంతో నేడు ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో ప్రాజెక్టు బాట పడుతున్నారు. ఉదయం 9.40గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు సుమారు 8 గంటల పాటు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. సర్కిల్–1 పరిధిలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల వద్ద పనులను ఆయన పర్యవేక్షిస్తారు. ప్రాజెక్టు పరిధిలో ప్యాకేజీల వారీగా పనుల పురోగతి.. అడ్డంకులు.. సమస్యలను తెలుసుకునేందుకు ఆయన రోజంతా ఉమ్మడి జిల్లాలో గడపనున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జిల్లా పరిధిలోని పది లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఫైనాన్స్ కార్పొరేషన్ రుణంతో జీవం నిధులు లేక పడకేసిన ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు ఇటీవల పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రూ.10వేల కోట్ల రుణం జీవం పోసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాల్లో 12.30లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం 2015 జూన్లో ప్రతిష్టాత్మకంగా రూ.35,200 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో సీఎం కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ వద్ద కరివెనా రిజర్వాయర్కు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. తర్వాత కాంట్రాక్టర్లతో ఒప్పందం కోసం పది నెలల సమయం పట్టింది. చివరకు 2016 మే నుంచి పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో 2018 ఆఖరులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రాజెక్టు పనులు వేగంగా చేసేందుకు సరిపడా నిధులు లేకపోవడంతో పనుల్లో వేగం తగ్గింది. పనుల పురోగతికి సంబంధించిన నిధులు.. నిర్వాసితులకు పరిహారం పంపిణీలో జాప్యం కావడంతో పనులు ముందుకు సాగలేదు. తాజాగా పవర్ కార్పొరేషన్ మంజూరు చేసిన రూ.10వేల కోట్లతో పనులు త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ల పనులు 30 శాతం నుంచి 90శాతం వరకు పూర్తయ్యాయి.కాల్వల విషయానికొస్తే నార్లాపూర్ నుంచి ఏదుల వరకు 8.375 కిలో మీటర్ల కాల్వను 2,3 ప్యాకేజీలుగా విభజించి ఇప్పటి వరకు 50శాతం పనులు పూర్తి చేశారు. ఏదుల నుంచి వట్టెం వరకు 6.4 కిలో మీటర్ల కాల్వలను 6,7ప్యాకేజీలుగా విభజించి 81శాతం పనులు పూర్తి చేశారు. ఇక వట్టెం నుంచి కరివెన వరకు 12కిలో మీటర్ల కాల్వలను 12వ ప్యాకేజీగా విభజించి 72శాతం కాలువ పనులను పూర్తి చేశారు. రెండు హెలిక్యాప్టర్లు.. పది హెలీప్యాడ్లు సీఎం కేసీఆర్ పర్యటన అంతా రెండు హెలిక్యాప్టర్లలో జరగనుంది. ఓ హెలీక్యాప్టర్లో సీఎం కేసీఆర్.. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు మరో హెలీక్యాప్టర్లో సీఎం కార్యదర్శితో పాటు ఈఎన్సీ మురళీ, పాలమూరు– రంగారెడ్డి సీఈ రమేశ్, ఇతర ఉన్నతాధికారులు ఉంటారు. దీంతో అధికారులు సీఎం పర్యటించనున్న భూత్పూర్ మండలం బట్టుపల్లి (కరివెన), బిజినేపల్లి మండలం వట్టెం, గోపాల్పేట మండలం ఏదుల వద్ద రెండు చొప్పున హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. కాగా నార్లాపూర్ వద్ద రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో, టన్నెల్ పనుల వద్ద రెండు చొప్పున నాలుగు హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో జిల్లా ఎస్పీలు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులపైనా.. పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ఆన్గోయింగ్ ప్రాజెక్టుల పురోగతి పైనా సీఎం కేసీఆర్ ఆరా తీయనున్నారు. ఈ మేరకు వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుల వద్ద క్యాంప్ కార్యాలయంలో మధ్యాహ్నం 2గంటల నుంచి 5:30గంటల వరకు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటి వరకు విడుదలైన నిధులు.. అయిన ఖర్చు, బిల్లుల పెండింగ్ అంశాలను సమీక్షలో చర్చకొచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టుల అధికారులందరూ సమగ్ర నివేదికలు సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఇలా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 9 గంటలకు ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరుతారు. 9:10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. 9:40 గంటలకు మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం బట్టుపల్లి వద్ద కొనసాగుతున్న కరివెన రిజర్వాయర్కు చేరుకుంటారు. 10:15 గంటలకు కరివెన రిజర్వాయర్ నుంచి బయల్దేరుతారు. 10:40 గంటలకు నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వద్ద కొనసాగుతున్న వట్టెం రిజర్వాయర్కుచేరుకుంటారు. 11:00 గంటలకు వట్టెం నుంచి బయల్దేరుతారు. 11:20 నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లపూర్ రిజర్వాయర్కు చేరుకుంటారు. 11:50 నార్లపూర్ నుంచి బయల్దేరుతారు. 12:10గంటలకు వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుల రిజర్వాయర్కు చేరుకుంటారు. అక్కడే భోజనం చేస్తారు. అనంతరం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఆన్గోయింగ్ ప్రాజెక్టు పురోగతిపై జిల్లా మంత్రులు, సంబంధిత రాష్ట్ర, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయల్దేరుతారు -
రాష్ట్ర ప్రభుత్వానివి ఏకపక్ష విధానాలు
సాక్షి, కౌటాల/కాగజ్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష విధానాలు అవలంభిస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి విమర్శించారు. కౌటాల మండలంలోని తమ్మిడిహెట్టి వద్ద సోమవారం ఆయన ప్రాణహిత నదిని సందర్శించారు. పడవ ద్వారా నదిలో తిరిగి పూజలు చేశారు. నది వద్ద, కాగజ్నగర్లోని ప్రజా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. దాదాపు 50 శాతం కాలువల తవ్వకాలు పూర్తి కాగా కమీషన్లకు కక్కుర్తి పడి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును కాళేశ్వరం వద్దకు తరలించిందని ఆరోపించారు. రూ.38వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత ప్రాజెక్టును కాకుండా, రూ.83వేల కోట్లతో కాళేశ్వరాన్ని నిర్మించారని తెలిపారు. రూ.45వేల కోట్లు అధికంగా ఖర్చు చేసిందని వెల్లడించారు. తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని, నిర్మించకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. సీబీఐ విచారణ చేపట్టాలి.. తమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా సుందిళ్లకు వేళ్లే నీటిని ప్రస్తుతం కాళేశ్వరంలో ఎత్తిపోతలు చేపట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. వార్ధా నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కమీషన్లు రావనే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడగడం లేదని విమర్శించారు. ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ వెబ్సైట్లో పెట్టలేదని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు న్యాయం జరిగేలా తమ్మిడిహెట్టి నుంచి పోరాటాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, జల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రాజేంద్రకుమారి, నియోజకవర్గ ఇన్చార్జి హరీష్బాబు, ఎస్సీసెల్ అధ్యక్షుడు వసంత్రావు తదితరులు పాల్గొన్నారు. -
అయ్యప్ప సేవలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు
సాక్షి, చిత్తూరు: రాష్ట్ర పంచాయతిరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శబరిమల వెళ్లారు. అక్కడ ఆలయ ఆధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తర్వాత మంత్రి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి పులంగి సేవలో పాల్గొన్నారు. మంత్రితో పాటు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప , ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటే గౌడ్ , పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు రాక సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
అన్నీ అనుమానాలే?
టీడీపీ పాలనలో హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు సంబంధించి చేపట్టిన పనులపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తొలిరోజు మంగళవారం నిర్వహించిన పరిశీలనల్లో అన్నీ అనుమానాలే వ్యక్తం అయ్యాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. అందుకు విరుద్ధంగా పనులకు ఎలా అనుమతులు ఇచ్చారంటూ ఒక్కో పనిని సునిశితంగా పరిశీలిస్తూ నిపుణులు పర్యటన సాగించారు. సాక్షి, బి.కొత్తకోట / తిరుపతి: గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిపుణుల కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రాజెక్టు పనుల పరిశీలనకు రిటైర్డ్ సీఈ ఐఎస్ఎన్ రాజు, రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ అబ్దుల్ బషీర్, రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎల్.నారాయణ రెడ్డి, రిటైర్డ్ ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ సుబ్బరాయ శర్మ, ఏపీ జెన్కో డైరెక్టర్ జీ.ఆదిశేషులను ప్రభుత్వం నియమించింది. ఈ బృందం మంగళవారం గాలేరు–నగరిలో భాగమైన మల్లెమడుగు రిజర్వాయర్ పనులు, హంద్రీ–నీవాలో భాగమైన కుప్పం ఉపకాలువ పనులు పరిశీలించింది. ఎన్నో ప్రశ్నల ను లేవనెత్తింది. తొలుత మల్లెమడుగు రిజర్వాయర్ను పరిశీలించి రూ.120కోట్లతో ఇక్కడ పనులు ఎలా చేపట్టారని అధికారులపై అనుమానం వ్యక్తంచేశారు. గాలేరు–నగరి పూర్తి కాలేదు.. ప్రస్తుతానికి ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తే సరిపోతుంది కదా? ఇది తెలిసీ భారీ అంచనాతో పనులు చేపట్టడానికి కారణమేమిటని అనుమానం వ్యక్తంచేశారు. ప్రస్తుతం 17శాతం పూర్తయిన పనులు పరిశీలించాక ఒక టీఎంసీ సామర్థ్యానికే రిజర్వాయర్ను నిర్మించాలని సూచనలిచ్చారు. గాలేరు–నగరి పూర్తయి నీటి లభ్యత అందుబాటులోకి రాగానే రిజర్వాయర్ సామర్థ్యం పెంచుకోవచ్చ ని సూచనచేశారు. అక్కడి నుంచి కుప్పం ఉపకాలువ పరిశీలనకు వచ్చిన కమిటీ ఈ పనులపై అడుగడుగునా అనుమానాలు, అసంతృప్తిని వ్యక్తం చేసింది. రూ.413 కోట్ల పనులను రూ.430.27 కోట్లకు అప్పగించినా నిర్ణీత గడువులో పనిచేయకపోగా అదనంగా రూ.144.7 కోట్ల పెంపు వెనుక పెద్ద వ్యవహారమే నడిచిందని బలంగా అనుమానం వ్యక్తం చేశారని తెలిసింది. కుప్పం ఉపకాలువ 4వ కిలోమీటర్ నుంచి ప్రారంభమైన పరిశీలన చివరిదాకా సాగింది. 4వ కిలోమీటర్కు సమీపంలోని ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించాక 11వ కిలోమీటర్ వద్ద గ్యాస్ పైప్లైన్ దాటేందుకు తవ్విన సొరంగం, పైప్లైన్ పనులు చూశారు. 26వ కిలోమీటర్ వద్ద జరిగిన ఇన్వర్టర్ సైఫన్ పైప్లైన్ చూశాక కమిటీకి తీవ్రమైన అనుమానాలు తలెత్తినట్టు తెలిసింది. అసలు ఈ సైఫన్ విధానం పని చేపట్టాలని డీటైల్డ్ ప్రాజెక్టు నివేదికలో ఉందా అని ఆరా తీశారు. కాలువను తవ్వాల్సిన చోట సైఫన్ పద్ధతి అమలుచేసే విషయంలో తెర వెనుక ఏదో బలమైన వ్యవహరం నడిచిందని కమిటీ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఇక్కడ కాలువను నిర్మించకపోవడం వల్లే అదనంగా రూ.110 కోట్లు పెంచుకొన్నట్టు నిర్ధారించారని తెలిసింది. డీపీఆర్లోని పనులు చేపట్టడం నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడం ఒక ఎత్తయితే, దానికి భారీగా చెల్లింపులు చేయడం సాహసమేనని కమిటీ సభ్యులు చర్చించినట్టు తెలిసింది. దీనికి అనుమతులు ఇచ్చిందెవరని అధికారులను అడిగినట్టు తెలిసింది. కాలువ తవ్వకంలోనూ నిబంధనలు పాటించకుండా కాంట్రాక్టర్ల ఇష్టం మేరకు పనులు చేశారని తేల్చారు. అదే సమయంలో చేసిన పనుల్లో 20 కిలోమీటర్ల కాలువ తవ్వకం తగ్గినప్పుడు అంచనాలు తగ్గాలి కదా, అలా కాకుండా రూ.144 కోట్ల అదనపు చెల్లింపులు చేయడమేమిటని ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. 140 కిలోమీటర్ వద్ద సొరంగం, కాలువలోనే పెద్దదైన అక్విడెట్ పనులు పరిశీలించారు. కాలువ పరిశీలన సమయంలో జరిగిన పనులకు నిబంధనలు పాటించలేదని, ఇష్టారాజ్యంగా వ్యవహరించారని తేల్చారని సమాచారం. నేడు మదనపల్లెలో కమిటీ సభ్యులు రెండో రోజు బుధవారం మదనపల్లె సమీపంలోని 59వ ప్యాకేజీకి చెందిన సొరంగం పనులు, చిప్పిలి, గుంటివారిపల్లె సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పనులను పరిశీలించనున్నారు. -
చిత్తూరు జిల్లాకు తెలంగాణ సీఎం రాక
సాక్షి, చిత్తూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం జిల్లాకు రానున్నారు. ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి వస్తారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు స్వాగతం పలుకుతారు. అనంతరం కేసీఆర్ రోడ్డు మార్గాన కంచికి వెళతారు. మార్గంమధ్యలో నగరి ఎమ్మెల్యే రోజా నివాసంలో తేనీటి విందులో పాల్గొంటారు. అక్కడి నుంచి కంచి కామాక్షి దేవాలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. తిరుగు ప్రయాణంలో నగరి ఎమ్మెల్యే రోజా నివాసంలో భోజనం చేస్తారు. అక్కడి నుంచి రేణిగుంటకు చేరుకుని హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళతారు. -
పొగాకు రైతులను ఆదుకోండి
సాక్షి, ఒంగోలు : ఒంగోలు రెండో పొగాకు వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ బాబు శుక్రవారం సందర్శించారు. వేలం కేంద్రంలో వేలం తీరును పరిశీలించారు. అనంతరం రైతులతో, పొగాకు బోర్డు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రైతులు, పొగాకు రైతు నాయకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. బోర్డు చైర్మన్ను వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కొందరు రైతు నాయకులు చైర్మన్ను కలిసి పొగాకు రైతుల కష్టాలు గురించి విపులీకరించారు. ఈ సందర్భంగా వర్జీనియా పొగాకు గ్రోయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చుంచు శేషయ్య పొగాకు రైతులు గత కొన్నేళ్లుగా నష్టాలతోనే పొగాకు పండిస్తున్నారని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. 1992 నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)లు కార్పొరేట్ శక్తులను ఎదుర్కొనే శక్తిని దేశీ పెట్టుబడుల రంగానికి కలిగించాలని కోరారు. స్వచ్ఛందంగా పొగాకు పంటను విరమించుకునే రైతుకు బ్యారన్కు రూ.10 లక్షలు సాయం అందించాలని కూడా విజ్ఞప్తి చేశారు. వేలంలో వ్యాపారుల మధ్య పోటీని పెంపొందించాలని కోరారు. వ్యాపారులు విదేశీ ఆర్డర్లు ఖరారు కాలేదని ఆలస్యం చేస్తున్నారని, ఆర్డర్లు ఉన్న వ్యాపారులు పొగాకును కారు చౌకగా కొనుగోలు చేసి రైతులను నిలువునా మోసం చేయటమే కాక తీవ్రంగా రైతును నష్టాల బాటలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పొగాకు రైతులు పొగాకు రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ పాలసీని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా ప్రీమియంను రైతుల తరఫున చెల్లిస్తుందని, పొగాకు రైతుల బీమా ప్రీమియంను పొగాకు బోర్డు చేత కట్టించాలని కోరారు. తీవ్ర కరువు పరిస్థితులను జిల్లా రైతాంగం ఎదుర్కొందని, తద్వారా అత్యంత కష్టించి పొగాకును పండిస్తే అదికాస్తా లోగ్రేడ్ ఎక్కువగా వచ్చిందని ఆవేదన వెలిబుచ్చారు. వ్యాపారులు కమ్మక్కై, కూడబలుక్కొని ధరలను తగ్గించి పొగాకు కొనుగోలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తీరా లోగ్రేడ్ పొగాకుకు వచ్చే సరికి మరీ తగ్గించి కిలో రూ.70 లకు కొనుగోలు చేసి రైతులను నష్టాల పాలు చేస్తున్నారని వివరించారు. దీంతో ప్రతి పొగాకు రైతు ఒక్కో బ్యారన్కు రూ.1.50 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నష్టపోతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. లోగ్రేడ్కు కిలో రూ.100 అయితేనే ప్రయోజనం జిల్లాలో మొత్తం 24 వేల బ్యారన్లు ఉన్నాయని రైతులు చైర్మన్కు తెలిపారు. ఆధరైజ్డ్ పొగాకు క్వాంటిటీ అమ్మకం పూర్తయినా లో గ్రేడ్ పొగాకు రైతుకు కిలో పొగాకుకు రూ.100 అయితే కొంతమేర ప్రయోజనం ఉంటుందని వివరించారు. 2015లో ఇదే పరిస్థితి ఏర్పడితే అప్పటి కేంద్ర ప్రభుత్వం కిలో పొగాకుకు రూ.15, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 చొప్పున ప్రోత్సాహకం అందించి ఆదుకున్నాయన్న విషయాన్ని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అతివృష్టి, అనావృష్టి వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తద్వారా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు. బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకుంటే దానిపై వచ్చే వడ్డీ రాయితీని కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు రద్దు చేయటం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. తద్వారా రైతులు రూ.3 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని వివరించారు. వడ్డీ రాయితీని రద్దు చేయటం వలన రైతులు ఎక్కువ వడ్డీలకు బయట తీసుకుంటే ఇంకా నష్టాల బాట పడతారని దానిని కేంద్ర ప్రభుత్వం దృస్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని కోరారు. పొగాకు బ్యారన్ను ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తుందని దానిని ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసేలా విధివిధానాలను మార్చాలని కోరారు. సమస్యలు ఆలకించిన చైర్మన్ రఘునాథ బాబు మాట్లాడుతూ పొగాకు రైతుల సమస్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళతానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా కేంద్ర వాణిజ్య మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి పరిష్కరించేందుకు పూనుకుంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో పొగాకు బోర్డు ఆర్ఎం జి.ఉమామహేశ్వరరావు, రెండో వేలం కేంద్రం అధికారిణి వై.ఉమాదేవి, పొగాకు బోర్డు మాజీ వైస్ చైర్మన్ పమ్మి భద్రిరెడ్డి, బోర్డు సభ్యులు శివారెడ్డి, పొగాకు రైతులు చింపరయ్య, పోతుల నరశింహారావు, వడ్డెళ్ల ప్రసాదు, పెనుబోతు సునీల్, అబ్బూరి శేషగిరిరావు, గంగిరెడ్డి, రామాంజనేయులు, బోడపాటి శివరావు, బ్రహ్మయ్య, కొండపి భాస్కరరావు, వేలం కేంద్రాల అధ్యక్షులు, రైతు నాయకులు పాల్గొన్నారు. -
8న సీఎం పులివెందుల పర్యటన
సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8వ తేది పులివెందులలో పర్యటించనున్నారని కలెక్టర్ హరి కిరణ్ తెలిపారు. సోమవారం స్పందన కార్యక్రమ సందర్బంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పులివెందుల ఏరియా అభివృద్ది కోసం ప్రభుత్వం రూ.100 కోట్లతో వివిధ పనులు చేపట్టనుందన్నారు. పులివెం దుల అభివృద్దికి సంబంధించి అధికారులు నోట్స్ తయారు చేసి వెంటనే తమకు అందజేయాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా వివిధ శాఖలు శకటాలు, ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేసేందుకు ఈనెల 9వ తేది సాయంత్రం 5.00 గంటల్లోపు జిల్లా రెవెన్యూ అధికారికి ఉద్యోగుల జాబితాను ఇవ్వాలన్నారు. వివిద శాఖల్లో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల పూర్తి సమాచారాన్ని ఈనెల 6వ తేదిన సాయంత్రం 6.00 గంటల్లోపు పౌరసంబంధాలశాఖ ఏడీ కార్యాలయానికి పంపాలన్నారు. గ్రామ వలంటీర్ల ఎంపిక పూర్తి కావడంతో ఈనెల 6, 7, 8, 9 తేదీలలో ఎంపీడీఓల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజా సాధికార సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఉండే విధంగా స్పెషల్ ఆఫీసర్లు వలంటీర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ–ఆఫీసులో జిల్లా మూడవ స్థానం నుంచి నాల్గవ స్థానానికి దిగజారిందన్నారు. ఈ–ఆఫీ సు పాలన మెరుగు పరచాలని చెప్పారు. స్పందన కార్యక్రమానికి సంబంధించి బియాండ్ ఎస్ఎల్ఏ అర్జీల పరిష్కారం తగ్గిందని, విత్ ఇన్ ఎస్ఎల్ఏ కూడా తగ్గిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివారెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, స్పెషల్ కలెక్టర్ సతీష్ చంద్ర, ఐసీడీఎస్ పీడీ పద్మజ, కేఆర్ఆర్సీ డెప్యూటీ కలెక్టర్ మధుసూదన్రావు, ఎస్ఎస్ఏ పీఓ సుజన, ఇతర జిల్లా అదికారులు పాల్గొన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి కోవింద్
-
సుంకేశుల డ్యాంను పరిశీలించిన ఎమ్మెల్యే
-
వాన రాక ముందే పని కావాలె
సాక్షి, కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్లోనే రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. త్వరలోనే వర్షాలు పడే అవకాశమున్నందున ఆలోగానే పనులు పూర్తి చేయాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీ పనులను సీఎం కేసీఆర్ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెలీకాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రి.. సతీసమేతంగా కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి త్రివేణి సంగమానికి చేరుకుని జలాలకు పూజలు చేసి ప్రాజెక్టు పనులను అణువణువు పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్లను అభినందించి∙ పలు సూచనలు చేశారు. అన్నీ బిగించాలి.. కాళేశ్వర ఆలయం నుంచి కేసీఆర్ రోడ్డు మార్గంలో కన్నెపల్లిలోని మెగా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత కన్నెపల్లి పంపుహౌస్కు వెళ్లి అక్కడి స్టార్టర్స్ కంట్రోల్ రూంలో ఇంజినీర్లతో మాట్లాడారు. అక్కడ 11 మోటార్లకు గాను 8 మోటార్ల బిగింపు పూర్తయిందని, మరో రెండింటి పనులు జరుగుతున్నాయని ఇంజినీర్లు కేసీఆర్కు వివరించారు. ఈనెలాఖరు నాటికి మొత్తం బిగించాలన్న కేసీఆర్.. ఇరిగేషన్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో మాట్లాడారు. పనులన్నీ చాలా బాగున్నాయని, ఇంత త్వరగా పూర్తి చేయడంపై ఈఎస్సీ నల్ల వెంకటేశ్వర్లు బృందంతో పాటు కాంట్రాక్టర్లను అభినందించారు. పనులను ఇదే ఊపులో కొనసాగించి జూన్ 10లోపు అంతా సిద్దం చేయాలని సూచించారు. ఇక కన్నెపల్లి పంపుహౌస్లోని ఐదు మోటార్లకు ఈనెలాఖరులోగా.. లేదంటే జూన్ మొదటి వారంలో వెట్రన్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అక్కడి నుంచి పంపుహౌస్లోని ఫోర్బే, హెడ్ రెగ్యులేటరీలను ఆయన పరిశీలించారు. మళ్లీ త్వరలోనే వస్తానని చెప్పిన కేసీఆర్ అక్కడి నుంచి మేడిగడ్డ బ్యారేజీకి హెలీకాప్టర్లో వెళ్లారు. మేడిగడ్డ బ్యారేజీలో వ్యూపాయింట్ నుంచి మహారాష్ట్ర వైపు మీదుగా నిర్మిస్తున్న గైడ్ బండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం ఇంజినీర్లతో మాట్లాడుతూ.. గత ఏడాది ఆగస్టులో 340, 570, సెప్టెంబర్లో 460 టీఎంసీల వర్షపు నీరు తరలిపోయిందని గుర్తు చేశారు. అయితే, ఈసారి బ్యారేజీ వద్ద నీటి నిల్వలను బట్టి పంపులు నడిపి ఖరీఫ్ అవసరాలకు నీటిని తరలించవచ్చన్నారు. ఇందుకోసం మిగిలి ఉన్న పనులన్నీ జూన్ 10లోపు ముగించాలని ఆదేశించారు. కాగా.. జనవరిలో సీఎం వచ్చిన సమయంలో బ్యారేజీకి సంబంధించి 85 గేట్లకు గాను 12 మాత్రమే బిగించగా.. ఇప్పుడు 78గేట్ల బిగింపు పూర్తికావడంపై కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తిరిగి గోదావరి మార్గం గుండా ఎల్ఎన్టీ క్యాంపు కార్యాలయానికి వెళ్లి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆరు గంటలు... కేసీఆర్ ఉదయం 7.20 నుంచి మద్యాహ్నం 1.30 గంటల వరకు అంటే ఆరు గంటలకు పైగానే కాళేశ్వరాలయం, కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీల వద్ద గడిపారు. సీఎం హోదాలో అంతసేపు ఉండడంతో అధికారులు, పోలీసులు కాస్త కంగారుపడ్డారు. ఇక సుమారు 44–45డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నా సీఎం పనులను పర్యవేక్షించడం విశేషం. ఈ పర్యటనలో సీఎం వెంట ఈఎన్సీలు మురళీధర్రావు, కాళేశ్వరం బ్యారేజీ ఈఎస్సీ నల్ల వెంకటేశ్వర్లు, ప్రభుత్వ సీఎస్ ఎస్ కే.జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ, హోం సలహాదారు అనురాగ్శర్మ, సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్చంద్, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దాసరి మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, భూపాలపల్లి జయశంకర్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు వాసం వెంకటేశ్వర్లు కలెక్టర్ దేవసేన, ఎస్పీ ఆర్.భాస్కరన్, ఏఎస్పీలు రాజమహేంద్ర నాయక్, సాయిచైతన్య, శరత్, ఇరిగేషన్ బోర్డు చైర్మన్ ఈద శంకర్రెడ్డి, ఎస్ఈ సుధాకర్రెడ్డి, ఎల్ఎన్టీ ప్రతినిధి విపీ బాలగన్, పీఎం రాజు, ఈఈ రమణారెడ్డి, డీఈఈ సురేష్ తదితరులు ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రత రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పర్యటనను పురస్కరించుకుని ఎస్పీ ఆర్.భాస్కరన్ ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రా>ష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్, కాళేశ్వరాలయం వద్ద కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శని, ఆదివారాల్లో ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన సుమారు 1000మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. కాగా, సీఎం పర్యటన ఖరారైనప్పటి నుంచే ఎస్పీతో పాటు పోలీసు యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు. కాళేశ్వరం, కన్నెపల్లి, మేడిగడ్డ క్యాంపు, పనుల ప్రాంతాల్లో ఎస్పీ స్వయంగా పరిశీలిస్తూ సిబ్బందికి సూచనలు చేశారు. ఇక మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 19న ఆదివారం మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చన నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. దీంతో కాళేశ్వరం నుంచి మేడిగడ్డ వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర ఎటు చూసినా పోలీసులే కనిపించారు. ఈ మేరకు సీఎం పర్యటన ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం టూర్ సాగిందిలా... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పర్యటన వివరాలిలా ఉన్నాయి. ఉదయం 7.20గంటలకు కన్నెపల్లికి హెలీకాప్టర్ వచ్చారు. అక్కడి నుంచి కాళేశ్వరాలయం రాజగోపురం వద్దకు కేసీఆర్ – శోభ దంపతులు 7.27గంటలకు చేరుకున్నారు. అక్కడ వారికి అర్చకులు పూర్ణకుంభస్వాగతం పలికారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలోకి 7.30 గంటలకు వెళ్లిన వారు 8.30 గంటల వరకు ఆలయంలో పూజలు, అర్చకులతో గడిపారు. ఆ తర్వాత 8.40గంటలకు త్రివేణి సంగమ గోదావరి వద్దకు చేరుకుని పూజలు చేశారు. అక్కడి నుంచి 9గంటలకు కన్నెపల్లిలోని మెగా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అల్పాహారం పూర్తయ్యాక 9.52గంటలకు కన్నెపల్లి పంపుహౌస్కు బయలుదేరి 9.56గంటలకు చేరుకున్నారు. ఉదయం 10గంటలకు పంప్హౌస్, కంట్రోల్రూంల్లో పరిశీలించాక 10.55 గంటలకు పంపుహౌస్ మీదుగా ఏరియల్ సర్వే చేస్తూ మేడిగడ్డకు బయలుదేరారు. 11.10 గంటలకు మేడిగడ్డలో ల్యాండ్ అయిన కేసీఆర్ వంతెన పైనుంచి బ్యారేజీ పనులను పరిశీలించారు. ఇక 11.33గంటలకు మహారాష్ట్ర వైపు గైడ్బండ్స్ పరిశీలించాక అక్కడి కార్మికులతో మాట్లాడారు. 11.59గంటలకు బ్యారేజీ వద్ద నుంచి ఎల్ఎన్టీ కార్యాలయం వద్దకు చేరుకుని ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్ల బృందంతో సమీక్ష నిర్వహించాక 1.30 గంటలకు హెలీకాప్టర్లో పెద్దపల్లి జిల్లా రామగుండం బయలుదేరారు. మరో యాదాద్రిగా కాళేశ్వరం రాష్ట్రంలోనే అతి ప్రాచీనమైన దేవాలయాల్లో ఒక్కటైన శ్రీకాళేశ్వరముక్తీశ్వరాలయం, గ్రామ అభివృద్ధి్దకి రూ.100కోట్ల నిధులను వచ్చే బడ్జెట్లో కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్–శోభ దంపతులు మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరాలయానికి శనివారం వచ్చారు. ఆలయ అధికారులు, అధికారులు వేదమంత్రోచ్ఛరణల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో మహన్యాసక రుద్రాభిషేక పూజలతో పాటు శుభానందదేవి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అక్కడ అర్చకుడు లక్ష్మీనారాయణశర్మ కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్య రూపంలో చదివి వినిపించారు. దేవాదాయ కమిషనర్ అనిల్కుమార్, ఈఓ మారుతిలు సీఎం దంపతులకు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. అర్చకులు బెల్లం లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం అర్చకులతో సీఎం కాసేపు ముచ్చటించారు. కాళేశ్వరాలయం మరో యాదాద్రిగా మారబోతోందని తెలిపారు. నిత్యం లక్ష మంది భక్తులు ఆలయంలో దర్శించుకునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్చకులు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేకంగా క్వార్టర్లు నిర్మించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆలయంతో పాటు గ్రామాభివృద్ధికి రూ.100కోట్ల నిధులను బడ్జెట్లో ప్రవేశపెట్టాక ఆలయ పరిసరాల్లో 100 ఎకరాల భూమి సేకరిస్తామని చెప్పారు. అవసరమైతే ప్రైవేట్, ప్రభుత్వ, ఫారెస్టు భూములను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు సూచించారు. ఇక ఆలయంలో హైందవ సంప్రదాయం పెంపొందేలా అర్చకులు, అధికారలు పాటుపడాలన్నారు. ఈ మేరకు సుమారు గంటపాటు ఆలయంలో సీఎం దంపతులు గడిపారు. కాగా, సీఎం కేసీఆర్ 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టు భూమి పూజ చేసిన సమయంలో ఆలయ అభివృధ్ధికి రూ.25కోట్ల నిధులు ప్రకటించిన విషయం విదితమే. ఇప్పుడు రూ.100కోట్లు ఆలయానికి, గ్రామ అభివృద్ధికి ఇవ్వనున్నట్లు చెప్పడంతో స్థానికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రెండుగంటల పాటు రాకపోకలు బంద్ కాళేశ్వరం: సీఎం పర్యటన నేపథ్యంలో కాళేశ్వరంలో పోలీసులు రాకపోకలను బంద్ చేశారు. ఆదివారం ఉదయం 6.30గంటల నుంచి 8.30గంటల వరకు రహదారులపై బారికేడ్లు కట్టారు. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలను రెండు గంటల పాటు నిలిపివేశారు. కాళేశ్వరంలోని హమాలీ సంఘం వద్ద, మహారాష్ట్ర నుంచి వచ్చే వారిని అంతరాష్ట్ర వంతెన వద్ద నిలిపారు. ఇక గ్రామంలో హోటళ్లు, కిరాణ దుకాణాలు, ఇతర దుకాణాలు సైతం రెండు గంటల పాటు బంద్ చేశారు. -
టెక్నాలజీ బాగుంది
హైదరాబాద్: కేసుల ఛేదనలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పంజాగుట్ట పోలీసులు ముందుకు వెళ్తున్న తీరు భేషుగ్గా ఉందని మహారాష్ట్ర డీజీపీ దత్తాత్రేయ పదసాల్గీకర్ కితాబిచ్చారు. దేశంలోనే రెండవ ఉత్తమ పోలీస్స్టేషన్, రాష్ట్రంలో మోడల్ స్టేషన్ అయిన పంజాగుట్ట పోలీస్స్టేషన్ను ఆయన ఆదివారం సందర్శించారు. ఆయనకు రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి, కమిషనర్ అంజనీకుమార్లు పోలీస్స్టేషన్లో టెక్నికల్ గ్రౌండ్లెవల్లో విధులు ఎలా నిర్వహిస్తున్నారనే అంశాలను వివరించారు. అనంతరం హ్యాక్ఐ తదితర యాప్ల పని తీరు, ఫైల్స్ మేనేజ్మెంట్, రిసెప్షన్ పని తీరు, కమాండ్ కంట్రోల్ రూం, లైబ్రరీ, జిమ్, కోర్టు రూం, లాకప్, ఇన్స్పెక్టర్ రూమ్లలో విధివిధానాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విధానం, సీసీ కెమెరాల ఏర్పా టు, ట్యాబ్ ద్వారా పాతనేరస్థుల కదలికలు ఎలా గుర్తిస్తాం వంటి పలు విషయాలను దత్తాత్రేయకు అక్కడి సిబ్బంది వివరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ పదసాల్గీకర్ మాట్లాడుతూ.. దేశంలోనే పంజాగుట్ట పోలీస్స్టేషన్ను రెండవ ఉత్తమ స్టేషన్గా గుర్తించడం సరైనదే అని కితాబిచ్చారు. ఇక్కడ ఉన్న సిబ్బంది టెక్నాలజీ పనితీరుని ఎంతో చక్కగా వివరించారని కొనియాడారు. ఇదే విధానాన్ని కొనసాగిస్తూ మరింత ముందుకు వెళ్లాలని సూచించారు. నగరంలోనే ఎక్కువ టెక్నాలజీ: డీజీపీ రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. నేరాలు అదుపుచేసేందుకు భారత్లోనే అన్ని నగరాల్లోకన్నా హైదరాబాద్లోనే ఎక్కువగా టెక్నాలజీ వాడుతున్నామని చెప్పారు. మనంవాడుతున్న టెక్నాలజీని గ్రౌండ్లెవల్లో ఎలా వాడుతున్నాం? అవి ఎలా పనిచేస్తున్నాయి? అనేది ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా తెలుసుకునేందుకు మహారాష్ట్ర డీజీపీ స్టేషన్ను సందర్శించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, పంజాగుట్ట ఇన్స్పెక్టర్ మోహన్కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు. -
ప్రణబ్ ముఖర్జీ రాయని డైరీ
నాగపూర్ వెళ్లొచ్చినప్పట్నుంచీ నా మనసుకు హుషారుగా ఉంది. ఊహు.. వెళ్లొచ్చినప్ప ట్నుంచీ కాదు, వెళ్లబోయే ముందు నుంచీ! ‘ఆరెస్సెస్ పిలిస్తే మీరు వెళ్లడం ఏంటి ప్రణబ్జీ!’ అని.. మా పక్కింట్లో ఉండే బెంగాలీ.. మాణింగ్ వాక్లో అవాక్కయ్యాడు. సాధారణ పౌరుడే అవాక్కయ్యాడంటే దేశంలోని అసా ధారణ పౌరులు ఇంకెంత అవాక్కవుతారో కదా అని అప్పుడు నేను ఆలోచించలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చాక ఆలోచిస్తున్నాను. బెంగాల్లో ఉండేది అంతా బెంగాలీలే అయినప్పుడు బెంగాల్లోని ఏ పక్కింట్లోనైనా బెంగాలీనే కదా ఉంటాడు. అయితే ఈ పక్కింటి బెంగాలీ ఎప్పుడూ ‘నేను బెంగాలీని కాదు ప్రణబ్జీ, భారతీయుడిని’ అని నడుస్తూ, నడుస్తూ.. ఆయాసంగా అంటుంటాడు. అలాగని అతడి గురించి ‘మా పక్కింట్లో ఉండే భారతీయుడు’ అని చెబితే.. ‘ప్రణబ్జీ మీరు భారతీయుడు కాదా!’ అని రేపు మాణింగ్ నాతో పాటు నడిచే ఇంకో వాకర్ అవాక్కయ్యే ప్రమాదం ఉంది. బెంగాలీ బెంగాలీనని చెప్పుకోకున్నా భారతీయుడు కాకుండా పోడు. భారతీయుడు భారతీయుడినని చెప్పుకోకపోతే మాత్రం బెంగాలీగా కూడా మిగలడు. ఏం తోచక, మరికొంత సేపు ఆలోచిస్తూ కూర్చున్నాను. బహుశా పక్కింటి బెంగాలీ కూడా నాలాగే తన ఇంట్లో ఏం తోచక, నా గురించే ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు. నాగ పూర్లో నేనేమీ మాట్లాడలేదు కాబట్టి, నా గురించి ఆలోచించడానికి ఏమీ లేదని దేశ ప్రజలందరికీ తెలిశాక కూడా పక్కింటి బెంగాలీ నా గురించి ఏం ఆలోచిస్తూంటాడు?! ‘‘వెళ్లొద్దంటే విన్నారా.. నాన్నా..’’ అంది శర్మిష్ట దిగాలుగా వచ్చి. ‘‘ఇప్పుడేమైందమ్మా..’’ అన్నాను. ‘‘ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా అయి ఉంటే!’’ అంది. ‘‘నేనేమైనా బంగీ జంప్ చేసి వచ్చానా తల్లీ! ఊరికే స్టేజీమీద నాలుగు ముక్కలు మాట్లాడ్డానికే కదా వెళ్లాను’’ అన్నాను. ‘‘కానీ నాన్నా.. కాంగ్రెస్ మీద కోపంతో మీరు బంగీ జంప్ లాంటిదేదో చేయబోతున్నా రని మేమంతా భయంభయంగా టీవీల ముందు కూర్చున్నాం. పక్కింటి అంకుల్ కూడా మనింటికే వచ్చి కూర్చున్నారు. ఆయన మాకన్నా భయస్తులు. స్టేజీ మీద ఎవర్ని చూసినా ‘ఆయన మీ డాడీనే కదా’ అని అడుగు తున్నారు. ‘తలపై ఆ క్యాప్ పెట్టుకుంది మీ డాడీనే కదూ’, ‘చెయ్యి అలా అడ్డంగా పైకి లేపి ప్రణామం చేస్తున్నది మీ డాడీనే కదూ’ అని మా ప్రాణం తీశారు’’ అంది శర్మిష్ట. ‘‘పాపం.. వాళ్లు ముందే చెప్పారు కదమ్మా.. మీటింగ్ తర్వాత కూడా ప్రణబ్ ప్రణబ్లాగే ఉంటారనీ, ఆరెస్సెస్ ఆరెస్సెస్లానే ఉంటుందనీ’’ అన్నాను. ‘‘అయినా గానీ భయంగానే ఉంది నాన్నా’’ అంది శర్మిష్ట. ‘‘ఎందుకమ్మా..’’ అన్నాను. ‘‘నాగపూర్ నుంచి వచ్చినప్పటి నుంచీ మీలో కొత్త ఉత్సాహం ఏదో కనిపిస్తోంది నాన్నా’’ అంది!! మాధవ్ శింగరాజు -
మోదీ అరుణాచల్ పర్యటనపై చైనా గుస్స
-
ఖమ్మంలో పూజా హెగ్దే సందడి
-
చాపరాయిలో కలెక్టర్ పర్యటన
మారేడుమిల్లి : వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని చాపరాయి గ్రామంలో అనారోగ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు పక్కాగా చర్యలు చేపట్టామని, వైద్య బృందాలు అక్కడే ఉండి వైద్య సేవలు అందిస్తున్నాయని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. మంగళవారం కలెక్టర్ బొడ్డగండి, చాపరాయి పరిసరాల గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మరో ఏడుగురిని రంపచోడవరం ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. జీసీసీ నుంచి ఉచితంగా అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీని పరిశీలించారు. వీధుల్లోని తాగునీటి బోరుబావుల పనితీరును స్వయంగా పరిశీలించారు. వైద్యసేవలపై ఆరా తీశారు. గత ఆదివారం 32 మంది గిరిజనులను మెరుగైన వైద్య సేవల కోసం రంపచోడవరం తరలించామని, అందులో నలుగురు చిన్నారులను కాకినాడ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. గ్రామస్తులతో మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలో అనారోగ్యాలు సంభవిస్తున్నా ఆ సమాచారాన్ని అధికారులకు తెలపకుండా గోప్యంగా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. అక్కడ పనిచేసే ఆశా వర్కర్ను, వార్డు మెంబర్ నీలంరెడ్డిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తామని అన్నారు. రక్షిత జలాలు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పీవో దినేష్కుమార్, జోడేశ్వరరావు, ఏడీఎం ఆండాళ్, హెచ్వో పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.