
9 నుంచి మాంసం, చేపల విక్రయాలు నిషేధం
కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ప్రజారోగ్యం దృష్ట్యా ఈనెల 9నుంచి 25వ తేదీ వరకు నగరంలో మాంసాహారం, చేపల అమ్మకాలు, జంతువథను నిషేధిస్తున్నట్లు కమిషనర్ జి.వీరపాండియన్ తెలిపారు.
మాంసాహార విక్రయదారులు ఈ విషయాన్ని గ్రహించి సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించినట్లైతే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.