అనంతపురం అర్బన్ : ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ఈ నెల 30 (సోమవారం) కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఉదయం 9.30 గంటలకు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎస్.రోశన్న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళిత, గిరిజన సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారు తమ ఫిర్యాదులను అందజేయాలని వెల్లడించారు.