అనంతపురం ఎడ్యుకేషన్ : ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ ఈ నెల 22న స్థానిక రెవెన్యూ భవనంలో నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రోశన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న జరగాల్సిన ఈ గ్రీవెన్స్ స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో వాయిదా వేసినట్లు గుర్తు చేశారు. 22వ తేదీన మీకోసంతో పాటు ప్రత్యేక గ్రీవెన్స్ ఉంటుందని, జిల్లాలోని దళిత, గిరిజన సంఘాల నాయకులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.