SC Corporation
-
కులగణన, ఎస్సీల వర్గీకరణపై నివేదికలను ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ
-
ఆ నిధులు ఇవ్వాలా.. వద్దా?
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పెండింగ్ చెల్లింపులపై రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సహకార సంస్థ తర్జనభర్జన పడుతోంది. దళితబంధు పథకం రెండో విడతలో భాగంగా ఎంపికైన పలువురు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం చేయలేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగడం... తీరా అరకొర ‡గా అర్హులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చే నాటికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ తొలగిపోయినా.. ఆ యా లబ్ధిదారులకు పూర్తి స్థాయి సాయం పంపిణీపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడం, గత ప్రభుత్వ ప్రాధాన్యత ల కంటే మెరుగైన విధంగా కొత్త పథకాల రూ పకల్పనకు సన్నద్ధమవుతుండడంతో ఈ పరిస్థి తి ఏర్పడింది. దీంతో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ వద్ద నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ని అర్హులకు ఇవ్వాలా? వద్దా? అనే అయో మయం అధికారులను కలవరపెడుతోంది. అన్నీ పక్కన పెట్టినా గ్రేటర్కు మాత్రం మినహాయింపు తెలంగాణ దళితబంధు పథకం రెండో విడత కింద అప్పటి ప్రభుత్వం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి వెయ్యి చొప్పున యూనిట్లు మంజూరు చేసింది. ఈమేరకు క్షేత్రస్థాయి నుంచి శాసనసభ్యులు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్కు ప్రతి పాదనలను పంపారు. అప్పట్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో వా టన్నింటినీ పక్కన పెట్టారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మురుగు వ్యర్థాల సేకరణ(సిల్ట్ కార్టింగ్ వెహికల్స్) వాహనాలకు డిమాండ్ ఉండడంతో 2023–24 వార్షిక సంవత్సరంలో 162 యూనిట్లను మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన లబ్దిదారులకు అందించారు. ఈ వాహనాలను జీహెచ్ఎంసీలో వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించి జలమండలి(హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా ఇవ్వాల్సింది 230 యూనిట్లకు మాత్రమే..: అదేవిధంగా హైదరాబాద్ పరిధిలో ఇతర కేటగిరీలకు సంబంధించి మరో 230 యూనిట్లకు మంజూరు తెలిపిన ప్రభు త్వం అర్హుల ఖాతాల్లో తొలివిడతలో భాగంగా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు నిధిని జమ చేసింది. మిగతా నిధులను జమచేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఆ నిధులు ఎస్సీ కార్పొరేషన్ వద్దే ఉండిపోయాయి. ప్రస్తుతం కోడ్ పూర్తి కాగా... నిధులను మాత్రం అధికారులు లబ్దిదారుల ఖాతాకు విడుదల చేయడం లేదు. ఈమేరకు అనుమతి కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ అధికా రులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ సమర్పించినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. మరోవైపు కొంత మేర ఆర్థిక సాయం పొందిన లబి్ధదారులు మిగతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తిస్థాయిలో సాయం అందితే నిర్దేశించుకున్న యూనిట్లు తెరవాలని ఆశపడుతున్నారు. -
ఎస్సీ వర్గీకరణ అంశంలో కాంగ్రెస్ మొదటి ముద్దాయి: కిషన్ రెడ్డి
హైదరాబాద్: దశాబ్దాల నాటి సమస్యలపై ప్రధాని మోదీ దృష్టి సారించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఏ పార్టీ చిత్తశుద్దితో పనిచేయలేదని మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీయే మొదటి ముద్దాయి అని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతునిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమస్యను ప్రధాని మోదీ అర్ధం చేసుకున్నారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను కాంగ్రెస్ కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణను చేపడతామని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదీ చదవండి: మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే.. -
మోదీ మాస్టర్ మైండ్.. తెలంగాణలో బీజేపీ ప్లాన్ సక్సెస్!
తెలంగాణ శాసనసభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగానే ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో మాదిగ సామాజికవర్గాన్ని ఉద్దేశించి విశ్వరూప సభలో చేసిన ప్రసంగం, ఆ వర్గం నేత మంద కృష్ణను పొగిడిన తీరు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కొన్ని రోజుల క్రితం ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ కాస్త నిస్సారంగా జరిగితే , పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభ మాంచి జోష్గా జరిగింది. తొలి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నప్పటికీ, ఆయన చాలా డల్గా మాట్లాడటం, మోదీ సైతం మొక్కుబడిగా పవన్ పేరు ప్రస్తావించడం జరిగింది. అదే శనివారం జరిగిన భారీ సభలో మంద కృష్ణను ఉద్దేశించి ఆయన పలుమార్లు మాట్లాడిన విషయాలు, అన్నిటికి మించి తాను కూడా కృష్ణ నాయకత్వంలో పనిచేస్తానని, వర్గీకరణ పోరాటానికి అండగా ఉంటానని, సమస్య పరిష్కారానికి కమిటీని నియమిస్తామని చెప్పిన తీరు మాదిగ సామాజికవర్గాన్ని ఆనందంలో ముంచెత్తిందని చెప్పాలి. వినడానికి కొంచెం అతిగా ఉన్నా, ఆయన స్పీచ్తో సభికులంతా హర్షద్వానాలతో మోత మోగించారు. మోదీ, మంద కృష్ణ మద్య జరిగిన ఉద్వేగ భరిత సన్నివేశాలు కూడా అందరిని ఆకట్టుకున్నాయి. కృష్ణ ప్రధానిని కౌగించుకుని, కంట తడిపెట్టడం, దానికి ఆయన ఓదార్చడం తదితర సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగాయి. అలాగే కృష్ణ కూడా తన ప్రసంగంలో మోదీని ఆకాశానికి ఎత్తుతూ ఉపన్యాసం చేశారు. మరో విశేషం ఏమిటంటే ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఆహ్వానించకపోవడం. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఇది ఒక కీలక ఘట్టమే అనిపిస్తుంది. ప్రత్యేకించి తెలంగాణలో మాదిగ వర్గం అత్యధికంగా ఉంటారు. మంద కృష్ణ మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో పలుమార్లు భారీ సభలు జరిగాయి. దాదాపు అన్ని పార్టీలు వర్గీకరణకు మద్దతు ఇచ్చినా కేంద్రంలో ఉషా మెహ్రా కమిటీ సిఫారస్ చేయకపోవడంతో అది ఆగిపోయింది. సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం పెండింగ్లో ఉంది. మాల సామాజికవర్గం వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో రాజకీయ పార్టీలు కూడా గందరగోళంలో పడ్డాయి. అయితే, బీజేపీ తొలి నుంచి ఈ డిమాండ్కు మద్దతు ఇస్తోంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఇందుకోసం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడమే కాకుండా, అధిష్టానంతో దీనిపై సంప్రదింపులు కూడా చేశారు. అయినా అది ఒక కొలిక్కి రాలేదు. విశేషం ఏమిటంటే మోదీ అధికారంలోకి వచ్చి కూడా తొమ్మిదిన్నరేళ్లు అయింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఆయన ప్రభుత్వం కూడా మరి ఎందుకు ఇన్నాళ్లు పరిష్కరించలేదన్న ప్రశ్న వస్తుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే మాదిగ వర్గాన్ని ఆకట్టుకోవడానికి వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేసినట్లు అర్ధం అవుతుంది. ఈ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగంలో దళిత ప్రముఖ నేతలు అంబేద్కర్, జగ్జీవన్ రామ్ వంటి వారికి కాంగ్రెస్ నుంచి అవమానాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అంతేకాక రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ను ఎంపిక చేసినా, తదుపరి గిరిజన నేత మర్మును ఎంపిక చేసినా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని ఆయన విమర్శించారు. రామ్ విలాస్ పాశ్వాన్ , బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంజీలకు బీహార్ సీఎం నితీష్ కుమార్ నుంచి అవమానాలు వచ్చాయని ఆయన అన్నారు. ప్రఖ్యాత దళిత కవి గుర్రం జాషువా రాసిన గబ్బిలం కవిత్వంలోని కాశీ అంశాన్ని ప్రస్తావించి, తాను అదే కాశీ నుంచి ఎంపీ అయ్యాయని ఆయన సెంటిమెంట్ ప్రయోగించారు. గుర్రం జాషువా ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందినవారు. తెలంగాణలో మాదిగ వర్గానికి చెందిన మాజీ మంత్రి టి.ఎన్. సదాలక్ష్మి, టివి నారాయణల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇదంతా తెలంగాణలోని దళితులు, ముఖ్యంగా మాదిగలను తిప్పుకోవడానికి మోదీ చేసిన ప్రయత్నమే అన్న సంగతి తెలుసుకోవడం కష్టం కాదు. ఈ విషయంలో కొంతమేర మోదీ సఫలీకృతం అయినట్లు అనుకోవచ్చు. ఎందుకంటే గత సభ కంటే భారీ ఎత్తున జనం రావడం, తమ డిమాండ్ కు అనుకూలంగా ప్రధాని ఉండటం, తమ నేత మంద కృష్ణను పదేపదే ఆయన ప్రస్తావించడంతో కేరింతలు కొట్టిన తీరు సహజంగానే బీజేపీకి కొంత ఊపు ఇస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్లను విమర్శించడం ఆయన మానలేదు. బీఆర్ఎస్ గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీని విస్మరించిందని, మూడు ఎకరాల భూమి చొప్పున ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, దళిత బంధులో వివక్ష చూపుతున్నారని మోదీ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మాదిరే కాంగ్రెస్ కూడా దళితులకు అన్యాయం చేసే పార్టీగా ఆయన అభివర్ణించారు. ఈసారి ఇరిగేషన్ స్కామ్ అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణ చేశారు. లిక్కర్ స్కామ్ గురించి కూడా ప్రస్తావించి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సహకరిస్తోందని, ఆప్ స్కామ్లో బీఆర్ఎస్ భాగస్వామి అయిందని ఆయన అంటూ, తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్ , కాంగ్రెస్లు డ్రామా ఆడుతున్నాయని ఆయన అన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం దళిత వర్గాలకు, రైతులకు చేపట్టిన వివిధ స్కీముల గురించి కూడా మోదీ వివరించారు. ఈ సంగతులు చెబుతున్నప్పుడు పెద్దగా స్పందన లేదు కానీ, వర్గీకరణ అంశాన్ని మోదీ ప్రస్తావించినప్పుడల్లా పెద్ద ఎత్తున హర్షద్వానాలు వచ్చాయి. మోదీ మొత్తం ఆ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే యత్నం చేశారు. వర్గీకరణ అంశం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉందని చెబుతూనే, కమిటీ ద్వారా పరిష్కారం చేసే యత్నం జరుగుతుందని, మాదిగల ఉద్యమంలో తాను కూడా ఉంటానని చెప్పడం విశేషం. ఇక, సమస్యను పరిష్కరించవలసిన ప్రధాని తాను కూడా పోరాడతానని అనడం వినడానికి కొంత ఆశ్చర్యంగానే ఉన్నా, ఎన్నికల నేపథ్యంలో వారిని ఆకట్టుకోవడానికి ఈ డైలాగు వాడినట్లు అనిపిస్తుంది. ఈ నెలాఖరులో ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు మూడురోజులు మోదీ సభలు తెలంగాణలో పెట్టబోతున్నారు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనుకున్న సమయంలో మోదీ వచ్చి దానిని పైకి లేపడానికి చేస్తున్న కృషి ఎంతవరకు సఫలం అవుతుందన్నది చూడాలి. మాదిగ వర్గం ఓట్లను ఆకర్షించడం వరకు కొంత సఫలం అయినట్లే లెక్క. కాకపోతే పూర్తి స్థాయి విజయానికి ఇది సరిపోతుందా అన్నది డౌటు!. :కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్గా నరోత్తమ్ నియామకం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా జహీరాబాద్కు చెందిన ఏర్పుల నరోత్తమ్ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్వర్వులను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఏర్పుల నరోత్తమ్కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు చైర్మన్గా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్కు ఏర్పుల నరోత్తమ్ ధన్యవాదాలు తెలిపారు. నరోత్తమ్ రాజకీయ ప్రస్థానమిదీ.. ఏర్పుల నరోత్తమ్ జహీరాబాద్లోని పస్తాపూర్లో 1965, ఏప్రిల్ 19వ తేదీన చంద్రమ్మ, నర్సయ్య దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1987 సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ఉద్యోగం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కాలువల డిజైన్లలో ఆయన కీలకపాత్ర పోషించారు. అనంతరం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ప్రమోషన్ పొందారు. సింగూరు ప్రాజెక్టు గేట్ల ఇంచార్జిగా వ్యవహరించారు. వికారాబాద్లో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇంచార్జిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో 2008లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల బాట పట్టారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మార్జినల్ ఓట్లతో నరోత్తమ్ ఓటమి చవిచూశారు. 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023, జులై 6వ తేదీన బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏర్పుల నరోత్తమ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఎస్సీ కార్పొరేషన్ పథకాల కోసం దరఖాస్తు చేసుకోండి: మంత్రి మేరుగ
సాక్షి, అమరావతి: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేయనున్న అమృత్ జలధార, యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకాలలో లబ్ది కోసం అర్హులైన ఎస్సీలు దరఖాస్తులు చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఒక ప్రకటనలో కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ జలధార పథకం కింద ఎస్సీ రైతుల భూములకు నీటి వసతిని కల్పించేందుకు బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా ఇప్పటికే రుణాలు మంజూరైన రైతులకు బోరు బావులు, స్పింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవడానికి రూ.50 వేలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రైతులు రెండున్నర ఎకరాల భూమి, రూ.3 లక్షలకు లోపు వార్షిక ఆదాయం కలిగిన రైతులు అమృత్ జలధార పథకంలో లబ్ది పొందేందుకు అర్హులని తెలిపారు. అలాగే యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకంలో భాగంగా ట్రాక్టర్లు, ట్రాలీలు, కమర్షియల్ వాహనాలు, వేర్ హౌసెస్ తదితర స్వయం ఉపాధి పథకాలకు ఇప్పటికే బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా రుణాలు మంజూరైన ఎస్సీ యువతకు రూ.60 వేలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. అమృత్ జలధార పథకం కోసమైతే పట్టాదారు పాసు పుస్తకాలు, రవాణాకు సంబంధించిన యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకం కోసమైతే వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా ఆదాయ, కుల, విద్యా ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డ్, ఆధార్, బ్యాంక్ పాసుపుస్తకాల నకళ్లతో దరఖాస్తులు చేసుకోవాలని నాగార్జున వివరించారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆయా జిల్లాలకు చెందిన ఎస్సీ కార్పొరేషన్ ఇ.డి.లకు తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఈ పథకాల మంజూరు లో పరిమితి లేదని అర్హులైన వారందరికీ వీటిని మంజూరు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. చదవండి: ‘ఎన్టీఆర్ హయాంలో రామోజీతో ఇలాంటి ప్రచారమే!’.. ప్రసన్నకుమార్రెడ్డి ఫైర్ -
Telangana: దళితబంధు @ 600కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలు వేగం పుంజుకుంది. నిధుల విడుదలలో జాప్యంతో గత కొంత కాలంగా నెమ్మదించిన ఈ పథకానికి ప్రభుత్వం తాజాగా రూ.600 కోట్లు విడుదల చేసింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన ఎస్సీ కార్పొరేషన్.. ఈ పథకం కింద ఇప్పటివరకు ఎంపికైన లబ్ధిదారులందరికీ ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఇప్పటివరకు 38,476 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3,847.6 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. హుజూరాబాద్తో షురూ దళితబంధు పథకం ఇప్పటివరకు నాలుగు కేటగిరీల్లో అమలైంది. తొలుత కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో మొత్తం 18,211 కుటుంబాలను గుర్తించిన యంత్రాంగం.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అర్హులందరి ఖాతాల్లో నిధులను జమ చేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలో ఉన్న 75 దళిత కుటుంబాలను ఎంపిక చేసి వారి బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు. ఆ తర్వాత చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్ మండలాలను ఎంపిక చేసిన ప్రభుత్వం ఆయా మండలాల్లోని దళిత కుటుంబాలన్నింటికీ సాయం అందించాలని నిర్ణయించి ఆ మేరకు అర్హులను ఎంపిక చేశారు. అనంతరం దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే క్రమంలో నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వంద యూనిట్లు మంజూరు చేశారు. ఆ మేరకు స్థానిక ఎమ్మెల్యేలు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను ఎస్సీ కార్పొరేషన్కు సమర్పించగా.. ప్రస్తుతం అందరి ఖాతాల్లో అధికారులు నిధులను జమ చేశారు. యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ ఇప్పటివరకు పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసిన ప్రభుత్వం.. ఇక యూనిట్ల ప్రారంభంపై దృష్టి పెట్టాలని ఎస్సీ కార్పొరేషన్ను ఆదేశించింది. జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా లబ్ధిదారులతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి.. వారికి ఆసక్తి ఉన్న యూనిట్ల ఏర్పాటు, వాటి నిర్వహణపై ఎస్సీ కార్పొరేషన్ శిక్షణ ఇవ్వనుంది. యూనిట్లు గ్రౌండింగ్ అయ్యే విధంగా నియోజకవర్గ స్థాయిలో అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి, నూరుశాతం పురోగతి వచ్చేలా చర్యలు చేపడుతోంది. కొత్తగా నియోజకవర్గానికి 500 యూనిట్లు.. 2022–23 వార్షిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 1,500 యూనిట్ల చొప్పున ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. అయితే తొలి విడత కింద ప్రతి సెగ్మెంట్కు 500 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఎమ్మెల్యేలకు సూచించింది. -
‘డీలర్ డీల్’ పై ఏపీ సర్కార్ సీరియస్..
సాక్షి, అమరావతి: ఎస్సీ యువత ఉపాధి నిమిత్తం వాహనాలు ఇవ్వకపోగా, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని డీలర్లకు దారి మళ్లించిన బాగోతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ‘‘షికారు వెనుక డీలర్ల డీల్–ఎస్సీ కార్పొరేషన్ నిధులు పరాయి పాలు’’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. డీలర్ల డీల్ విషయమై చట్టపరమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు ఏం జరిగాయి? డీలర్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి? తదితర కోణాల్లో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఎండీ చినరాముడు, జనరల్ మేనేజర్ సునీల్ రాజ్కుమార్ల నుంచి వాటికి సంబంధించిన రికార్డులు, ఆధారాలను ఉన్నతస్థాయి అధికారులు గురువారం పరిశీలించారు. చదవండి: టీడీపీ సర్కార్ నిర్వాకాలు: షి‘కారు’ వెనుక డీలర్లతో డీల్! విజిలెన్స్ దర్యాప్తులో అనేక నిజాలు గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ యువత పేరుతో టీడీపీ నేతల బినామీలకు, వారు సిఫారసులు చేసిన వారికి కేటాయించి అసలు లక్ష్యాన్ని దారి మళ్లించిన వ్యవహారంపై ఇప్పటికే విజిలెన్స్ దర్యాప్తులో అనేక నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీనికితోడు కోట్లాది రూపాయలు అడ్వాన్సులుగా తీసుకుని ఒప్పందం ప్రకారం వాహనాలు ఇవ్వకుండా, డబ్బులు తిరిగి చెల్లించకుండా ముఖం చాటేసిన డీలర్ల డీల్ వ్యవహారం తోడైంది. నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్డీసీ), నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్కెఎఫ్డీసీ) పథకాల కింద 2017–18 నుంచి 2018–19 వరకు సబ్సిడీపై వాహనాల కోసం గత ప్రభుత్వం రూ.365.67 కోట్లను డీలర్లకు అడ్వాన్సులుగా చెల్లించింది. ఆ మొత్తంలో వాహనాలు ఇవ్వకుండా సుమారు రూ.67.68 కోట్లు డీలర్ల వద్దే ఉండిపోయాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. అడ్వాన్స్ను చెల్లించని డీలర్లు ఇక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున సంబంధిత డీలర్లతో ఒకటి, రెండుసార్లు సమావేశం నిర్వహించి వాహనాలు ఇవ్వలేకపోతే, అడ్వాన్స్ డబ్బులైనా ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని కోరినా ఫలితం లేకపోయింది. ఇన్నోవాలు, ఇటియోస్లు ఇచ్చేందుకు అడ్వాన్సులు తీసుకున్న రాధా మాధవ్ ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ (విజయవాడ) కంపెనీ రూ.23.05 కోట్లకు పైగా, కినెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్(పూణే), ఈగల్ అగ్రీ ఎక్విప్మెంట్ (కావలి) పేరుతో అడ్వాన్సులు తీసుకున్న ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్ రూ.41.67 కోట్లకు పైగా, ఎంట్రాన్ ఆటోమొబైల్స్ ప్రైవేటు లిమిటెడ్ (పశ్చిమ గోదావరి జిల్లా) పేరుతో గమ్మిడి మోహిని రూ.2.93 కోట్ల మొత్తాన్ని వసూలుచేసేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. వాహనాలు ఇవ్వకుండా ప్రజాధనం లూటీచేసిన వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని తదుపరి చర్యలకు సమాయత్తమైంది. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన పరిశీలన చేసి చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధంచేస్తోంది. -
టీడీపీ సర్కార్ నిర్వాకాలు: షి‘కారు’ వెనుక డీలర్లతో డీల్!
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఎస్సీ యువతకు ఉపాధి పేరుతో కేటాయించిన వాహనాలు, యంత్రాలను పక్కదారి పట్టించిన వ్యవహారంలో తవ్వేకొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. నిరుద్యోగ ఎస్సీలకు దక్కాల్సిన కార్లను టీడీపీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలు కాజేసినట్లు ఇటీవల విజిలెన్స్ నిగ్గుతేల్చిన సంగతి తెలిసిందే. టీడీపీ పెద్దల సిఫారసు ఉన్నవారికే వాహనాలు ఇచ్చేలా ముందస్తు ఒప్పందాలు జరిగాయి. ఎస్సీ కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ వారికి లబ్ధి చేకూర్చారు. ఇదిలా ఉండగా వాహనాలు సరఫరా చేసే డీలర్లతో టీడీపీ పెద్దలు కుదుర్చుకున్న డీల్ తాజాగా బహిర్గతమైంది. నిబంధనలకు విరుద్ధంగా ఇండెంట్ పెట్టిన వాహనాలన్నింటికీ డీలర్లకు ముందుగానే అడ్వాన్సులు చెల్లించారు. అయితే డీలర్లు ఆ మేరకు వాహనాలను సరఫరా చేయలేదు. ఏళ్ల తరబడి వాహనాలు ఇవ్వకుండా, ప్రభుత్వానికి నగదు తిరిగి చెల్లించకుండా డీలర్ల వద్దే డబ్బులు ఉండటాన్ని గమనిస్తే బినామీల బాగోతం, అక్రమ వ్యవహారాలు తేటతెల్లమవుతున్నాయి. సబ్సిడీ రుణాలంటూ గొప్పలు.. ఎస్సీ యువతకు ఉపాధి కోసం వాహనాలు / యంత్రాలు సమకూర్చి సబ్సిడీ రుణాలు ఇచ్చినట్లు గత సర్కారు గొప్పలు చెప్పుకుంది. నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్ఎఫ్డీసీ), నేషనల్ సఫాయి కర్మచారీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్కేఎఫ్డీసీ) ద్వారా వివిధ పథకాల కింద 2017–18 నుంచి 2018–19 వరకు సబ్సిడీపై వాహనాల కోసం రూ.వందల కోట్ల నిధులు కేటాయించారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలకే లబ్ధి చేకూర్చేలా గత సర్కారు పెద్దలు డీలర్లతో గుట్టు చాటుగా వ్యవహారాన్ని నడిపించారు. ఐదు పథకాలు.. పథకం ప్రకారం! వాహనాలు అందకుండానే గత సర్కారు డీలర్లకు ముందే చెల్లింపులు జరపడం అక్రమాలను బలపరుస్తోంది. ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ ద్వారా ఐదు పథకాల కింద లబ్ధిదారులకు ఇన్నోవాలు, ఇతియోస్, ట్రాక్టర్లు, ఈ ఆటోలు, మెకనైజ్డ్ డ్రెయిన్ క్లీనింగ్ మెషిన్లు(ఎండీసీఎం) ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇందుకోసం టీడీపీ సర్కారు డీలర్లకు రూ.365,67,29,910 అడ్వాన్సులుగా చెల్లించింది. ఆ మొత్తంలో రూ.298,00,01,285 విలువైన యూనిట్లను డీలర్లు సరఫరా చేశారు. మరో 5,467 యూనిట్లు (వాహనాలు, యంత్రాలు) ఇవ్వకపోవడంతో డీలర్ల వద్దే రూ.67,67,28,625 మేర డబ్బులు ఉండిపోవడం గమనార్హం. ఇందులో రూ.23.05 కోట్లకుపైగా ఇవ్వాల్సిన రాధా మాధవ్ ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ (విజయవాడ) ఇటీవల బోర్డు తిప్పేసింది. మరో మూడు కంపెనీల పేరుతో తప్పుడు చిరునామా ఇచ్చారు. వాహనాలు ఇవ్వకుండా ముఖం చాటేసిన సదరు డీలర్ ఏకంగా రూ.41.67 కోట్లకు పైగా ఎగ్గొట్టేందుకు దారులు వెతుకుతున్నాడు. మరో కంపెనీ పేరుతో అడ్వాన్సులు తీసుకున్న ఓ మహిళ నుంచి రూ.2.93 కోట్లు వసూలు చేసేందుకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఎన్ని నోటీసులు పంపినా స్పందన లేదు. డీలర్ల నుంచి రాబట్టేందుకు సన్నద్ధం టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పొందిన డీలర్లు ఆ మేరకు వాహనాలు ఇవ్వకపోవడం, అడ్వాన్సులు తిరిగి వెనక్కు చెల్లించకపోవటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎస్సీ కార్పొరేషన్కు చెందిన దాదాపు రూ.67.67 కోట్లు నాలుగేళ్లుగా డీలర్ల వద్దే ఉండటంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. కొద్ది రోజుల క్రితం ఆయా డీలర్లతో సమావేశం నిర్వహించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఒప్పందం ప్రకారం వాహనాలు ఇవ్వాలని లేదంటే డబ్బులైనా తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు. అయితే అప్పటి ధరల ప్రకారం వాహనాలు ఇవ్వలేమని, పెరిగిన ధరల ప్రకారం తీసుకునేందుకు అంగీకరిస్తే పరిశీలిస్తామని రాధా మాధవ్ ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్(విజయవాడ) ప్రతినిధులు పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు మూడు కంపెనీల పేరుతో ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అడ్వాన్సులు తీసుకుని చేతులెత్తేయడంతో అతడితో తమకు సంబంధం లేదని ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మహిళ కూడా తప్పించుకుని తిరుగుతోంది. దీంతో మరోసారి ఆ డీలర్లను పిలిచి మాట్లాడాలని, అప్పటికీ దారికి రాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. -
గుడ్న్యూస్: ఆ నాలుగు జిల్లాలకు దళితబంధు నిధుల విడుదల
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం అమలు కోసం ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో ఈ పథకం అమలుకు మొత్తం రూ.250 కోట్లను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాలో మంగళవారం జమ చేసింది. సూర్యాపేట జిల్లా తుం గతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరికి రూ.50 కోట్లు, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకానికి రూ.100 కోట్లు, నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండకు రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గానికి చెందిన నిజాంసాగర్కు రూ.50 కోట్ల చొప్పున కలెక్టర్ల ఖాతాలో జమ అయినట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. (చదవండి: తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు) -
‘దళితబంధు’ను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటా
అమీర్పేట(హైదరాబాద్): దళితులపాలిట వరంగా మారనున్న దళితబంధు పథకాన్ని విపక్షాలు అడ్డుకుంటే యాదగిరిగుట్టలో ఆత్మహత్య చేసుకుంటానని మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. దళితబంధుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఒకరోజు నిరసనదీక్ష చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మోత్కుపల్లికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. నర్సింహులు మాట్లాడుతూ అగ్రవర్ణాలకు దీటుగా దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సాహసోపేత నిర్ణయం తీసుకుని దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను పెట్టి అమలు చేస్తున్నారని, ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారనే అపార నమ్మకం తనకుందని తెలిపారు. రేవంత్రెడ్డివి బ్లాక్మెయిల్ రాజకీయాలు ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ‘రేవంత్రెడ్డిది ఐరన్ లెగ్, టీటీడీపీని పత్తాలేకుండా చేయించి కాంగ్రెస్ పార్టీలో దూకిన వ్యక్తికి టీపీసీసీ కట్టబెట్టడం సిగ్గుచేట’న్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు అర్థం లేదని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను కప్పిపుచ్చుకోవటానికే యాత్రను చేపట్టారని విమర్శించారు. దళితుల సంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్కు దళితులందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. -
దళితుల భూములపై బీజేపీ నేత కన్ను..
సాగులో ఉన్న దళితులకు భూ హక్కు పత్రాల మంజూరులో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఇదే అదనుగా తీసుకుని బీజేపీ నేత ఆ భూములపై కన్నేశాడు. దళితులకు ఆ భూములు దక్కకుండా పన్నాగం చేస్తున్నాడు. భూములు ఆక్రమణకు గురయ్యాయంటూ పూజారి చేత పిటిషన్ వేయించి భూమి హక్కు పత్రాలు రాకుండా అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నాడు. సాక్షి,కదిరి: తలుపుల మండలం వేపమానిపేట పంచాయతీ పరిధిలోని కొత్తపూలవాండ్లపల్లి, గంజివారిపల్లి గ్రామాలకు చెందిన 45 మంది దళితులు కొన్నేళ్లుగా అక్కడి ఓబులేశ్వర స్వామి మాన్యం భూములు సాగు చేసుకుంటున్నారు. సాగు చేసుకుంటున్న దళితులకే భూములు దక్కాలని గతంలో కదిరి ప్రాంతానికి చెందిన కొందరు వామపక్ష పార్టీల నాయకులు అప్పట్లో డిమాండ్ చేశారు. ఈ మేరకు సాగుదారులు కూడా అధికారులకు అర్జీల రూపంలో విన్నవించుకున్నారు. దేవదాయ భూమి కావడంతో అప్పట్లో ఉన్న జిల్లా ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చి ఎకరం రూ.15 వేలు చొప్పున సాగుదారులకు విక్రయించాలని నిర్ణయించారు. గతంలోనే 80 శాతం సొమ్ము చెల్లింపు.. ఓబులేశ్వర స్వామి మాన్యం భూములు సర్వే నంబర్ 901లోని మొత్తం 88.45 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులోని 22.45 ఎకరాల భూమిని ఆ ఆలయ పూజారులకు ధూప, దీప నైవేద్యాల కోసం ప్రభుత్వం అప్పగించింది. మిగిలిన 66 ఎకరాల భూమిలో ఒక్క సెంటు భూమి కూడా లేని ఐదుగురు దళిత మహిళలకు 1.85 ఎకరాల చొప్పున, ఎకరం లోపు భూమి ఉన్న 20 మంది దళిత రైతులకు 1.80 ఎకరాలు చొప్పున, ఎకరం పైన–రెండెకరాల లోపు ఉన్న మరో 20 మంది దళితులకు ఎకరం చొప్పున లాటరీ పద్ధతిలో మొత్తం కేటాయించారు. ఇందుకు గాను 1999 ఏప్రిల్ 19న దళితుల తరఫున ఎస్సీ కార్పొరేషన్ 80 శాతం అంటే రూ7.92 లక్షలను దేవదాయ శాఖకు డీడీ రూపంలో చెల్లించింది. మిగిలిన 20 శాతం అంటే రూ1.98 లక్షలు ఆ దళితుల పేరు మీద హక్కు పత్రాలు ఇచ్చిన వెంటనే చెల్లిస్తామని అప్పట్లో ఎస్సీ కార్పొరేషన్ స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ భూములను దళితులే సాగు చేసుకుంటున్నారు. కానీ వాటిని దళితుల పేరు మీద మార్చడంలో అధికారులు విఫలమయ్యారు. కోర్టును సైతం తప్పుదోవ పట్టించే యత్నం.. బీజేపీకి చెందిన ఓ నాయకుడు ఓబులేశ్వరస్వామి ఆలయ పూజారి ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. దేవాలయ భూములను కొందరు దళితులు కబ్జా చేశారని, వాటిని కాపాడాలని కోర్టును సైతం తప్పుదోవ పట్టించే విధంగా పిటిషన్లో పేర్కొన్నట్లు సాగుదారులు ఆరోపిస్తున్నారు. అందుకే తాము కూడా హైకోర్టును ఆశ్రయించి కోర్టుకు వాస్తవం తెలియజేసే విధంగా మరో పిటీషన్ దాఖలు చేశామని తెలిపారు. కొందరు అధికారులు సైతం తమను మోసం చేసేందుకు పూజారులతోనూ, బీజేపీ నాయకుడితోనూ కుమ్మక్కయారని ఆరోపించారు. దళితులకు న్యాయం చేస్తాం ఓబులేశ్వర స్వామి మాన్యం భూములు దళితులు సాగు చేసుకుంటున్న మాట వాస్తవం. వారికి భూ హక్కు పత్రాలు అందేలా చూ స్తాను. గత ప్రభుత్వం వారికి అన్యాయం చేసింది. వారికి న్యాయబద్ధంగా రావాల్సిన పంట నష్టపరిహారం కూడా అందేలా చూస్తాను. – కదిరి ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి చదవండి: Tokyo Paralympics:టేబుల్ టెన్నిస్ ఫైనల్స్కు భవీనాబెన్ -
డప్పుకొట్టి నిరసన...
శంకరపట్నం: నాలుగేళ్లుగా తిరుగుతున్నా ఎస్సీ కార్పొరేషన్ రుణం మంజూరు చేయడం లేదని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిషత్ కార్యాలయం ముందు సోమవారం కన్నాపూర్కు చెందిన అంధుడు దేవునూరి వీరయ్య డప్పుకొట్టి నిరసన తెలిపాడు. 2017 డిసెంబర్ 27న వికలాంగుల కోటా కింద రూ.2 లక్షలకు బ్యాంక్ కాన్సెంట్ లెటర్ ఇచ్చింది. 2017 డిసెంబర్ నుంచి శంకరపట్నం మండల పరిషత్ కార్యాలయం, కరీంనగర్ ఏడీ కార్పొరేషన్ రుణ మంజూరు పత్రం అందించడం లేదు. లెటర్ ఇవ్వాలని ఏడీని వేడుకుంటే కార్యాలయం నుంచి సిబ్బందితో బయటకు పంపించారని వీరయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు గంటసేపు కార్యాలయం ముందు మండుటెండలో నిల్చుని డప్పుకొట్టడంతో సమాచారం అందుకున్న ఎంపీవో సురేందర్ వీరయ్యతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో మంజూరు కోసం ఇచ్చిన పత్రం మండల పరిషత్లో ఉండదని, ఆన్లైన్లో నమోదు చేస్తేనే రుణ మంజూరు చేసే అధికారం ఉంటుందని సర్దిచెప్పారు. -
దళిత బంధు: నెలలో ప్రతిఫలం ఉండే వాటికే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న దళిత బంధు పథకం కింద ఎలాంటి యూనిట్లు ప్రారంభిస్తే సత్ఫలితాలు వస్తాయనే అంశంపై ఎస్సీ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల రెండో వారంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఆలోగా యూనిట్లను ఖరారు కోసం చర్యలు వేగవంతం చేసింది. ఎలాంటి యూనిట్ ప్రారంభించినా నెల రోజుల నుంచే రాబడి వచ్చే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో దాదాపు 47 రకాల యూనిట్లతో ప్రాథమిక జాబితాను రూపొందించింది. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా... మరిన్ని మార్పులు చేయాలని సూచించడంతో ఒకట్రెండు రోజుల్లో తుది జాబితాను ప్రభుత్వానికి సమర్పించనుంది. సత్వర ఆదాయం వచ్చే వాటికి ప్రాధాన్యత... దళిత బంధు కింద ఒక్కో లబ్ధిదారుకు రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని నేరుగా ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. దీంతో లబ్ధిదారులు ప్రారంభించే యూనిట్లకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. యూనిట్ విలువ రూ. 10 లక్షలకు సరిపడా ఉండాలి. అయితే క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రాధాన్యతా రంగాలు, ప్రజలకు ఎక్కువ ఉపయోగపడే యూనిట్లను ఉదహరిస్తూ ఎస్సీ కార్పొరేషన్ ఒక జాబితాను తయారు చేసింది. ఇందులో 47 రకాల యూనిట్లు ఉన్నాయి. వ్యవసాయ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, జనరల్ స్టోర్స్, హార్డ్వేర్ షాప్స్, వైద్యం, గ్రోసరీస్, భవన నిర్మాణం, ప్లాస్టిక్ యూనిట్లు, స్టీల్, సిమెంట్ స్టోర్స్, ఆహారోత్పత్తి యూనిట్లు, హోటల్, రవాణా రంగాలకు చెందిన యూనిట్లు ఇందులో ఉన్నాయి. సాధారణ యూనిట్లకు భిన్నంగా ఈ యూనిట్లను పూర్తి సౌకర్యాలతో నెలకొల్పేలా ఎస్సీ కార్పొరేషన్ పథకాలను రూపొందించింది. ఉదాహరణకు ఇటుక బట్టీ ఏర్పాటు చేస్తే అందుకు తగినట్లుగా రవాణా సౌకర్యం కింద ట్రాలీని కూడా ఈ యూనిట్తో జత చేశారు. మొత్తంగా ప్రభుత్వం సాయం చేసే రూ. 10 లక్షలతో యూనిట్ను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ తుది జాబితాకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఆయా వివరాలను వెబ్సైట్లో నమోదు చేసి లబ్ధిదారులు యూనిట్లను ఎంపిక చేసుకొని ప్రాజెక్టు రిపోర్ట్ సమర్పించేలా దరఖాస్తు ప్రక్రియ సాగుతుంది. -
‘ఈటల ప్రధాన అనుచరుడి’కి సీఎం కేసీఆర్ కీలక పదవి
-
‘ఈటల ప్రధాన అనుచరుడి’కి సీఎం కేసీఆర్ కీలక పదవి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) చైర్మన్గా బండా శ్రీనివాస్ను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్ విద్యార్థి నాయకుడిగా అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేసి ఆ పార్టీ విద్యార్థి విభాగం కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా కూడా పని చేశారు. హాకీ ప్లేయర్ అయిన శ్రీనివాస్ హుజూరాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడిగా, ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్గా, జిల్లా టెలికాం బోర్డు సభ్యుడిగా బండా శ్రీనివాస్ పనిచేశారు. హుజూరాబాద్ నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ సారథి, సీఎం కేసీఆర్ ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీలో 2001లోనే చేరారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్వరాష్ట్ర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ మండలాధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పలు హోదాల్లో పనిచేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపుకు స్పందించి పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ప్రధాన అనుచరుడిగా శ్రీనివాస్ గుర్తింపు పొందారు. -
ఇదీ నిజామాబాద్లో అధి‘కార్ల’ దందా
జిల్లా ఎస్సీ కార్పొరేషన్కు గతంలో అద్దె కారు ఉండేది. అయితే, గతంలో పని చేసిన ఓ అధికారిణి అద్దె కారును పక్కన పెట్టి.. తన సొంత వాహనాన్ని ‘అద్దె’కు వినియోగించుకున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి తెల్ల నెంబరు ప్లేటు గల వాహనాన్ని కొన్ని నెలల పాటు నడిపించి నెలనెలా అద్దె డబ్బులను పర్సులో వేసుకున్నారు. సాక్షి, ఇందూరు(నిజామాబాద్): జిల్లాలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అద్దె వాహనాల పేరుతో వేల రూపాయలు వెనుకేసుకుంటున్నారు. సొంత వాహనాలనే వినియోగిస్తూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. చాలా ప్రభుత్వ శాఖల్లో పని చేసే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓనర్ కమ్ డ్రైవర్ పథకానికి అధికారులే తూట్లు పొడుస్తున్నారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి దొరక్కుండా పోతోంది. ప్రభుత్వ శాఖ ల్లో అధి‘కార్ల’ దందా కొనసాగుతున్నా అడిగే వారు లేరు. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. సర్కారు కార్యాలయాల్లో సంబంధిత శాఖకు సొంత కార్లు లేకపోతే అధికారుల పర్యటనలకు అద్దెకు తీసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అద్దె వాహనం తీసుకోవాలంటే చాలా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఓనర్ కమ్ డ్రైవర్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో సీనియారిటీ కలిగిన వారికి అవకాశం కల్పించాలి. పసుపు రంగు (ట్యాక్సీ) నెంబరు ప్లేట్ కలిగి ఉండడంతో పాటు వాహనం పూర్తి కండిషన్తో ఉండాలి. అగ్రిమెంట్ సమయంలో ఆయా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. నెలకు 2,500 కిలో మీటర్లు తిరిగితే ఇంధనం (పెట్రోల్/డీజిల్), కారు అద్దె, డ్రైవర్ బత్తా అన్నీ కలిపి గతంలో రూ.24 వేలు ఇచ్చే వారు. అయితే, ప్రభుత్వం దీనిని రూ.33 వేలకు పెంచింది. దీంతో అధికారుల కన్ను ‘అద్దె’పై పడింది. తెల్ల నెంబరు ప్లేటు ఉన్న తమ సొంత వాహనాలను అద్దెకు పెట్టి ‘ఆన్ గోవ్ట్ డ్యూటీ’ అని రాయించుకుని మరీ యథేచ్ఛగా తిప్పుతున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు కలిపి సుమారు 40 మంది అధికారులు తమ సొంత వాహనాలను వినియోగిస్తూ నెలకు రూ.13 లక్షల వరకూ ‘అద్దె’ వసూలు చేస్తున్నారు! తిరగకున్నా.. సొంత వాహనం లేదా బినామీ పేర్లతో బంధువుల వాహనాలను ప్రభుత్వ శాఖల్లో అద్దెకు వినియోగిస్తున్న అధికారులు.. ఇతర వాహనాల విషయంలో మాత్రం నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతున్నారు. నిరుద్యోగులు తమ వాహనాన్ని అద్దెకు పెడితే నిబంధనల పేరుతో మెలికలు పెడుతూ సతాయిస్తున్నారు. బిల్లులు ఆలస్యంగా ఇస్తున్నారు. అయితే, వేతనానికి కారు అద్దె తోడవుతుందనే ఆశతో అధికారులు సొంత వాహనాలు, బంధువుల పేరిట కలిగినవి ఉపయోగిస్తున్నారు. నెలకు 2,500 కిలో మీటర్లు తిరగకున్నా, తిరిగినట్లు రీడింగ్ చూపి నెలనెలా అద్దెను కాజేస్తున్నారు. ⇔ పై చిత్రంలో కనిపిస్తున్న స్విఫ్ట్ కారు జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో అద్దెకు నడుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అద్దె వాహనం జిల్లా/రాష్ట్ర పరిధిలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అలాగే, తెల్ల నెంబరు ప్లేటు కాకుండా పసుపు రంగు (ట్యాక్సీ) ప్లేటు ఉండాలి. కానీ ఈ నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన తెల్ల నెంబరు ప్లేటుతో ఏడు నెలలుగా ఆ శాఖ అధికారులు ఈ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఢిల్లీ నెంబరు ప్లేటు ఉండడంతో అద్దె బిల్లులు చేయడానికి వీలు కావడం లేదు. అయితే, పాత కారు పేరిట బిల్లులు కూడా లేపేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘కామారెడ్డి’లో కూడా.. అధికారులు తమ సొంత వాహనాలను వినియోగిస్తున్నారని తెలుసుకున్న కామారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు నిబంధనలు కఠినతరం చేశారు. సొంత వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించవద్దని గత కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఓనర్ కమ్ డ్రైవర్ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, అందుకు ప్రభుత్వ శాఖల్లో ట్యాక్సీ ప్లేటు గల వాహనాలను వినియోగించాలని సూచించారు. కానీ చాలా మంది అధికారులు సొంత వాహనాలే వినియోగిస్తున్నారు. -
దళిత యువతకు మినీ డెయిరీలు!
సాక్షి, హైదరాబాద్: దళిత నిరుద్యోగ యువతకు మినీ డెయిరీల ద్వారా ఉపాధి కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ మహానగరంలో పాల ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉండడం.. డిమాండ్కు తగిన విధంగా పాల దిగుబడి లేకపోవడంతో పాడిపరిశ్రమకు మంచి భవిష్యత్ ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్ అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి పశుసంవర్థక శాఖ అధికారులతో సమాలోచనలు చేసిన ఎస్సీ కార్పొరేషన్.. ఔత్సాహికులతో మినీ డెయిరీలు ఏర్పాటు చేయించాలని భావిస్తోంది. వాస్తవానికి గత ఏడాదే ఈ అంశంపై దృష్టిసారించిన ఎస్సీ కార్పొరేషన్, కరోనా నేపథ్యంలో ఆ ప్రయత్నాలను వాయిదా వే సింది. తాజాగా పరిస్థితులు సద్దుమణుగుతుండ డంతో మళ్లీ మినీ డెయిరీల ఏర్పాటుపై దృష్టి సారించింది. 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వం ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పొందుపరిచే అవకాశం ఉందని చెబుతున్నారు. గరిష్టంగా రూ.4 లక్షలతో.. హైదరాబాద్కు సమీపంలో ఉన్న రెండు, మూడు జిల్లాల్లో ఈ ప్రాజెక్టును తొలుత ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ఎస్సీ కార్పొరేషన్ యోచిస్తోంది. జిల్లాకు సగటున 100 యూనిట్లు మంజూరు చేయా లని భావిస్తోంది. ఒక్కో యూనిట్ను రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మధ్య బ్యాంకు అనుసంధానంతో రుణం ఇచ్చి ఇందులో 60 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ప్రతి డెయిరీ యూనిట్కు 3 గేదెలు పంపిణీ చేస్తారు. అదేవిధంగా గేదెలకు షెల్టర్ కోసం ప్రత్యేక షెడ్ ఏర్పాటు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాజెక్టు యూనిట్ కాస్ట్లో కొంత మొత్తాన్ని కేటాయిస్తారు. దీంతోపాటు ఆరునెలలకు సరిపడా పశుగ్రాసం కోసం అవసరమైన నిధులకు కూడా ప్రత్యేక మొత్తాన్ని నిర్దేశిస్తారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటున్న అధికారులు.. యూనిట్ విలువ కనీసం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉండేలా అంచనాలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నారు. త్వరలోనే సబ్సిడీ పాడిగేదెల పంపిణీ పాడిపరిశ్రమ రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు త్వరలోనే సబ్సిడీపై పాడిగేదెలను అందించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలి పారు. గురువారం మంత్రి కార్యాలయంలో విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. మంత్రి మాట్లాడుతూ సబ్సిడీ పాడిగేదెల కోసం 3,834 మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించారని, గేదెల పంపిణీకి సంబం ధించి విజయ డెయిరీ సంస్థ నోడల్ ఏజెన్సీగా ఉం టుందని వెల్లడించారు. కాగా, గతంలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన పాడిగేదెల్లో 2,691 గేదెలు చనిపోయాయని, వాటికి సంబంధించి పరిహారం కింద కొత్తగా పాడి గేదెలను కొనుగోలు చేసి వెంటనే పంపిణీ ప్రక్రియ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక నుంచి లీటర్ పాలకు ప్రభుత్వం రూ.3, ఆయా డెయిరీ సంస్థలు రూ.1 చొప్పున కలిపి రైతులకు ప్రోత్సాహకం కింద చెల్లిస్తామ న్నారు. ఇందులో భాగంగా కరీంనగర్, మదర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీలకు పాలుపోసే రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సాహకం బకాయిలలో రూ.8 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. విజయ ఐస్క్రీంల విక్రయాలకు సైకిల్ రిక్షాలు.. విజయ ఐస్క్రీంల విక్రయాల కోసం ప్రత్యేక పుష్ కార్ట్ (సైకిల్ రిక్షా)లను వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. ముందుగా 250 పుష్కార్ట్ల ద్వారా ఐస్ క్రీంల విక్రయాలు ప్రారంభించాలన్నారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, శిల్పారామం, గోల్కొండ కోట, దుర్గంచెరువు వంటి ప్రాంతాల్లో విక్రయాలు చేప ట్టాలన్నారు. విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాల కోసం జీహెచ్ఎంసీ పరిధిలో అనువైన ప్రాంతాలను గుర్తించి నూతన ఔట్లెట్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి మార్చిలో వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అదనపు డైరెక్టర్ రాంచందర్ పాల్గొన్నారు. -
మహిళల చేతికి ‘స్టీరింగ్’..!
సాక్షి, సంగారెడ్డి: ‘మహిళలు విమానాలు నడుపుతున్నారు.. అంతరిక్షంలోకి రాకెట్లతో వెళ్తున్నారు.. కుటుంబాలను నడిపే బాధ్యతనూ సమర్థంగా నిర్వహిస్తున్నారు.. కార్లను నడపటం వారికి కష్టమేమీ కాదు.. అందుకే ఇంటి స్టీరింగ్తో పాటు ఉపాధి పొందడానికి మొదటిసారిగా ప్రభుత్వం ‘కారు’ స్టీరింగ్ కూడా మీ చేతుల్లో పెడుతోంది..’అని ఆర్థికమంత్రి హరీశ్రావు అన్నారు. వీటిని విజయవంతంగా నడిపించుకొని ఉపాధి పొందుతారనే విశ్వాసముందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో సోమవారం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 18 మంది మహిళలకు ‘షీ క్యాబ్స్’కార్లను అందజేశారు. సమాజ అభివృద్ధికి దోహదం.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇది సమాజ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని హరీశ్ చెప్పారు. ‘తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎస్సీలకు రూ.2,737 కోట్లతో 1.63 లక్షల మంది ఎస్సీ లబ్ధిదారులకు మేలు చేసేలా పథకాలు అమలుపరిచాం. గత ప్రభుత్వాల హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉండేది. మహిళలకు షీ క్యాబ్స్ పేరుతో అద్దెకు నడిపి ఉపాధి పొందడానికి కార్లను అందజేసే కార్యక్రమం రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నాం. ఈ జిల్లా నుంచి ప్రారంభిస్తున్న ఈ పథకానికి 25 మంది దరఖాస్తు చేసుకోగా 18 మందిని ఎంపిక చేసి వారికి డ్రైవింగ్లో శిక్షణ ఇప్పించి లైసెన్సులు సైతం ఇచ్చాం. క్యాబ్ డ్రైవర్స్ ఆత్మరక్షణకు పెప్పర్ స్ప్రే, సెల్ఫోన్, జియో లొకేషన్ సౌకర్యం కల్పించాం. ఈ పథకం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇటు ఈ పథకం సక్సెస్ అయ్యేందుకు కార్లను అందజేసిన మహిళలను మూడు నెలల పాటు వారం వారం పర్యవేక్షిస్తూ నెలకోసారి అధికారులు నివేదికను అందజేయాలి. జిల్లాలో అత్యధికంగా పరిశ్రమలున్నాయి. వాటిలో పనిచేసే మేనేజర్లు, పర్సనల్ మేనేజర్లు, ఇతర అధికారులకు కార్లు అద్దెకు అవసరం అవుతాయి. కార్లు పొందిన మహిళలకు ఆసక్తి ఉంటే పరిశ్రమల యజమానులతో మాట్లాడి టై అప్ చేయిస్తాం.. దీంతో ప్రతినెలా పని లభించడమే కాకుండా నెలనెలా అద్దె వస్తుంది. ఇటు ‘ఊబర్’సంస్థతో కూడా టై అప్ చేసుకోవచ్చు..’అని మంత్రి అన్నారు. అనంతరం మహిళా లబ్ధిదారులు నడిపిన షీ క్యాబ్స్లో హరీశ్ ప్రయాణించి వారికి సూచనలు అందజేశారు. అనంతరం వారితో సెల్ఫీలు దిగి సంతోషాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎం.హనుమంతరావు, జెడ్పీ చైర్పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్రావు, భూపాల్రెడ్డి, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. మిగతావారికి వారంలో రైతుబంధు.. ఇక యాసంగిలో రూ.7,500 కోట్లు రైతుబంధు కింద రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నామని మంత్రి హరీశ్ తెలిపారు. మునిపల్లి మండలం కంకోల్లో రైతువేదికను ప్రారంభించిన ఆయన.. ఇప్పటివరకు రూ.5,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని చెప్పారు. మిగతావారికి వారంలోగా డబ్బులు జమ అవుతాయన్నారు. కల్లాల నిర్మాణానికి రూ.600 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. కుటుంబానికి ఆసరా అవుతా.. సంగారెడ్డి కేంద్రంలోని తారా డిగ్రీ కళాశాలలో చదువుతున్నాను. కుటుంబానికి చేయూతనివ్వాలని ఏదో ఒక వ్యాపారం చేయాలనుకున్నాను. పెట్టుబడి పెట్టేంత ఆర్థిక స్థోమత లేకపోయింది. ప్రభుత్వ ‘షీ క్యాబ్’పథకం గురించి తెలిసి దరఖాస్తు చేశాను. ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎంపిక చేసి, డ్రైవింగ్లో శిక్షణ ఇచ్చి లైసెన్స్ కూడా ఇప్పించారు. ఇప్పుడు కారు కూడా వచ్చింది. కుటుంబానికి ఎంతో కొంత ఆసరా అవుతాననే భరోసా కలిగింది. – బి.ప్రవళిక, చేర్యాల్, కంది మండలం ఆత్మస్థైర్యం కలిగింది.. మావారు క్యాటరింగ్ చేస్తారు. ఆ సంపాదనతో కుటుంబ పోషణ కష్టంగా ఉంది. గృహిణిగా ఉన్న నేను కూడా ఏదో ఓ పనిచేసి అండగా నిలవలానుకున్నా. ఎస్సీ కార్పొరేషన్ ప్రకటనతో షీ క్యాబ్కు దరఖాస్తు చేసుకోవడంతో లబ్ధిదారుగా ఎంపిక చేశారు. నెలరోజుల పాటు ఇచ్చిన శిక్షణలో పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని పనులు చేయగలరనే ఆత్మస్థైర్యం కలిగింది. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.10 వేలు మిగిలినా కుటుంబానికి భారం తప్పుతుంది. – పాతర తేజస్వి, సంగారెడ్డి టౌన్ అమ్మను పోషించుకునేందుకు.. 11 ఏళ్లు ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు. నేను అమ్మ ఇద్దరమే ఉంటున్నాం. ఆమెనే నా ఆలనా పాలనా చూసేది. కూలిపనికి వెళ్లి కష్టపడి నన్ను చదివించింది. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడే పత్రికలో షీ క్యాబ్ స్కీం ప్రకటన చూశా. లబ్ధిదారుగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. సబ్సీడీపై కారు అందించారు. అన్నీ తానై నన్ను పోషించిన అమ్మకు అన్ని విధాలా అండగా ఉండాలనేదే లక్ష్యం. – గొర్లకాడి వసంత, జుల్కల్, కంది మండలం -
అంబేద్కర విగ్రహా ఆవిష్కరణపై మంత్రుల సమీక్ష
సాక్షి, తాడేపల్లి: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్, విశ్వరూప్, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనులను ప్రారంభించాలని మంత్రులు ఆదేశించారు. అదే విధంగా విగ్రహం ఏర్పాటు కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలాన్ని మొదటగా స్వాధీనం చేసుకోవాలని మంత్రి సురేష్ అధికారులకు ఆదేశించారు. -
‘వారితో చర్చించి పనితీరు మెరుగుపరుచుకుంటాం’
సాక్షి, విజయవాడ: మంగళవారం విజయవాడలో రెండో రోజు ‘మనపాలన- మీ సూచన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా ఎమ్మెల్యేలు వసంత్ కృష్ణప్రసాద్, మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్నినాని మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. సంక్షేమ పథకాలన్ని ప్రజలకి సక్రమంగా అందుతున్నాయి. చక్కటి పాలన అందిస్తున్నారని ప్రజలంతా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై మేథోమధనం చేస్తున్నాం. రైతు భరోసా, రైతులకు 9 గంటల విద్యుత్, జనతా బజార్ల ఏర్పాటు, ధరల స్థిరీకరణ నిధి, కొనుగోలు కేంద్రాలు తదితర అంశాలపై చర్చించి సీఎం జగన్ మోహన్ రెడ్డి నివేదిక అందిస్తాం. కృష్ణా జిల్లా రైతు సంఘాల ప్రతినిధులు, లబ్థిదారులతో చర్చించి ప్రభుత్వ పనితీరును మెరుగుపరుచుకుంటాం అని తెలిపారు. (చంద్రబాబుపై హైకోర్టులో పిల్..) మరోవైపు కరోనా కష్టాల్లోనూ సంక్షేమ పథకాలని కొనసాగిస్తున్న ప్రభుత్వం ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం కింద ఎస్సి కార్పొరేషన్ ద్వారా ఆరు మంది నిరుద్యోగులకు వాహనాలు అందజేశారు. లబ్ధిదారులకు మంత్రి పేర్ని నాని పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీలత పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్నినాని పిలుపునిచ్చారు. బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని స్వశక్తితో అభివృద్ధి చెందాలని నాని ఈ సందర్బంగా లబ్ధిదారులను కోరారు. (శ్రీకాకుళం జిల్లాలో బస్సు బోల్తా.. ) -
‘సామాజిక అంశానికి పెద్ద పీట వేసిన వ్యక్తి సీఎం జగన్’
సాక్షి, అమరావతి : . రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్న ఎస్సీల ఆకాంక్షలకు అనుగుణంగా పనిస్తామని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు తెలిపారు. తాడేపల్లిలోని ఏపీ షెడ్యూల్ క్యాస్ట్ సంక్షేమ సహాయకార ఆర్థిక సంస్థ రాష్ట్ర కార్యాలయంలో గురువారం షెడ్యూల్ క్యాస్ట్ సొసైటీ అధికారులతో మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల చైర్మన్లు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల చైర్మన్లు పి.అమ్మాజీ, కె.కనకారావు, వి.మధుసూధనరావుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఈడీలు, ఈవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనకారావు మాట్లాడుతూ.. జిల్లా స్థాయి అధికారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించామని, ఈ సమావేశంలో పాలనపరమైన అంశాలపై అధికారులతో చర్చించామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమపై ఉంచిన బాధ్యతలను నేరవేరుస్తామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని పేర్కొన్నారు. 13 జిల్లాలోని సమస్యలపై అవగాహన పెంచుకునేందుకు ఈ సమావేశము ఏర్పాటు చేశామని మాల కార్పొరేషన్ చైర్మన్ పెడపాటి అమ్మాజీ అన్నారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న సమస్యలపై చర్చించామని, అన్ని జిల్లాల్లో అవగాహన క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజల వద్దకే పాలన అనేలా నీతి ,నిజాయితీ, నిబద్దతతో పనిచేస్తామని తెలిపారు. రెల్లి కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించిన సీఎం జగన్కు మధుసూధనరావు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మంచి ఫలితాల అందేలా పనిచేస్తామని, సామాజిక న్యాయం అమలుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. సామాజిక అంశానికి పెద్ద పీట వేసిన నాయకుడు సీఎం జగన్ అని, గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయాలను ముఖ్యమంత్రి తీసుకున్నారని ప్రశంసించారు. -
రెల్లి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ల నియామకం
సాక్షి, అమరావతి: రెల్లి, ఎస్సీల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాల కార్పొరేషన్ చైర్మన్గా పెడపాటి అమ్మాజీ, మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా కొమ్మూరి కనకరావు, రెల్లి కార్పొరేషన్ చైర్మన్గా వదయ్ మధుసూధన్రావులు నియమితులయ్యారు. -
రుణాల పంపిణీకి ఉమ్మడి ప్రణాళిక
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు తదితర కార్పొరేషన్ల ద్వారా రుణాల పంపిణీ విషయంలో ఉమ్మడి ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అన్ని వర్గాల పేదలకు సబ్సిడీ రుణ సాయాన్ని ఒకేసారి అందించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రుణాల పంపిణీ విషయంలో కార్పొరేషన్లు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తుచేసింది. ఆన్లైన్ బెనిఫిషరీ మానిటరింగ్ సిస్టం ద్వారా అన్ని కార్పొరేషన్లు ఒకేసారి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 4న జీవో విడుదల చేసింది. డిసెంబరు నాటికి రుణాలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, అందుకు తేదీలను కూడా ఖరారు చేసింది. రుణాల పంపిణీ కోసం సెప్టెంబరు నెలాఖరు వరకు దరఖాస్తులను స్వీకరించాలని, ఆ తరువాత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇలాంటి ఉత్తర్వులు ప్రభుత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి. గతంలో రుణాల మంజూరు విషయంలో కార్పొరేషన్లు మార్చిలో నిర్ణయం తీసుకోవడం, మార్చి అయిపోయిన తరువాత ఆర్థిక సంవత్సరం మారిందంటూ పట్టించుకోకుండా వదిలేయడం వంటివి జరిగేవి. అధికారుల ద్వారానే ఎంపిక రుణాలు పొందే లబ్ధిదారులను బ్యాంకు అధికారులు, ఎంపీడీవో, కార్పొరేషన్ల ప్రతినిధులు ఎంపిక చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో జన్మభూమి కమిటీల సభ్యులు సంతకాలు చేస్తేనే రుణాలు తీసుకునేందుకు పేదలు అర్హత సాధించేవారు. ఆ పరిస్థితిని ప్రభుత్వం మార్చేసింది. అర్హుల జాబితాను నేరుగా కార్పొరేషన్ ఈడీకి పంపిస్తే, వారు కలెక్టర్ అనుమతి తీసుకుని నిధుల కోసం కమిషనర్కు పంపిస్తారు. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబరులో గ్రౌండింగ్ అయిన యూనిట్లకు జనవరిలో యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీ) ఇవ్వాలి. ఫిబ్రవరిలో యూనిట్ను కార్పొరేషన్ ఈడీ సందర్శించి పరిశీలించాల్సి ఉంటుంది. మార్చిలో నిర్దేశిత ఏజెన్సీ ద్వారా యూనిట్ పనితీరును మరోసారి పరిశీలించాలి. రుణాల పంపిణీకి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఇతర కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు ఒకేసారి రుణాలు ఇవ్వాలని నిర్ణయించడం మంచి నిర్ణయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
బడుగులకు బాసట
రాష్ట్ర ప్రభుత్వం బడుగులకు బాసటగా నిలిచింది. వారి బతుకుల్లో వెలుగులు నింపడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంది. సంక్షేమ ఫలాలు అందరికీ చేరేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ను విభజించింది.ఎస్సీలో మెజారిటీ సామాజిక వర్గాలైన మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల ఏర్పాటు చేయనుంది. దీనిపై ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఎస్సీ కార్పొరేషన్ ఇకపై మూడు కార్పొరేషన్లు కానుంది. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ప్రజాసంకల్పయాత్రలో వై ఎస్ జగన్మోహన్రెడ్డి తమ ప్రభుత్వం అధి కారంలోకి వస్తే మాల, మాదిగలతో పాటు రెల్లి కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం ఎస్సీ కార్పొరేషన్ను మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో లక్షలాది మందికి ప్రయోజనం.. జిల్లాలో షెడ్యూల్డ్ కులాల్లో 46 ఉపకులాలు న్నాయి. అందులో మాదిగ, మాల, రెల్లి, పైడి, ఆది ఆంధ్ర వారు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు) సుమారుగా 3,29,486 మంది వరకు ఉన్నారు. ఇందులో 1,62,873 పురుషులు, 1,66,613 మహిళలు న్నారు. వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది. నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు.. 25 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎమ్మార్పీస్ పోరాటం చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నిబంధనలకు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేశారటూ ఎస్సీ మాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం రాష్ట్రంలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ చేసి అమలు చేశారు. అయితే ఆ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో మళ్లీ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పథకాలు అన్ని వర్గాలకు అమలు చేస్తున్నారు. అయినా ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనని ఎమ్మార్పీఎస్లో ఓ వర్గం నేటికీ పోరాటం చేస్తూనే ఉంది. దీంతో ఎస్సీల్లో ఉన్న మాల, మాదిగల మధ్య అంతరం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో మాల, మాదిగల మధ్య సఖ్యత పెంపొందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ను మూడుగా విభజిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్ల ద్వారా ఎస్సీలకు సంక్షేమ ఫలాలను అందించేందుకు చర్యలు చేపడుతోంది. కార్పొరేషన్ విభజనపై హర్షం.. ఎస్సీల ఆర్థికాభివృద్ధికోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1974లో ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్ను ఆయా ఉపకులాలను విభజించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు విస్మరించాయి. ప్రజా సంకల్పయాత్రలో జగన్మోహన్రెడ్డికి ఎస్సీ కార్పొరేషన్ విభజించాలని తామంతా విన్నవించాం. ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారు. రాష్ట్రంలో 59 ఉపకులాలకు నేరుగా ఆర్థిక ఫలాలు అందే విధంగా ఎస్సీ కార్పొరేషన్ను విభజించడం గొప్పవిషయం. మాట తప్పకుండా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ కార్పొరేషన్ మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న దళితులమంతా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. – బోని శివరామకృష్ణ. దళితనేత సీఎం జగనన్నకు రుణపడి ఉంటాం గతంలో ఎన్నో ప్రభుత్వాలు మాటివ్వడమే గాని హామీ నెరవేర్చిన పాపాన పోలేదు. కేవలం రాజకీయ లబ్ధికోసం మమ్మల్ని వాడుకున్నారే తప్పా ఎవరూ న్యాయం చేయలేదు. ప్రజాసంకల్పయాత్రలో విన్నవించుకున్నాం. జగనన్న ఇచ్చిన హామీ మేరకు మూడు కార్పొరేషన్లు గా విభజించి సాధ్యం కాదన్నది సుసాధ్యం చేశారు. దళితుల సంక్షేమం కోసం పాటుపడే ఏపీ సీఎం జగనన్నకి తామంతా రుణపడి ఉంటాం. – వీజే అజయ్కుమార్, దళితనేత విభజనతో సంక్షేమఫలాలు కార్పొరేషన్ విభజనతో సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతా యి. జిల్లాలో దళితులం ఎక్కువగా ఉన్నా మాకు ఏ ప్రభుత్వం న్యా యం చేయలేదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే న్యాయం జరిగింది. మళ్లీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే మా అభివృద్ధి జరుగుతుంది. కార్పొరేషన్ విభజనతో ఎక్కువ మందికి ప్రభుత్వ పథకాలు అందుతాయి. – పాకా సత్యనారాయణ -
మింగారు.. దొరికారు...
ఖమ్మం క్రైం : సంచలనం సృష్టించిన ఎస్సీ కార్పొరేషన్ అవకతవకల కేసులో నిందితుడు వేముల సునీల్ను పోలీసులు ఎట్టకేలకు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. రూ.60 లక్షల మేరకు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్లు తమ దర్యాప్తులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన టూటౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏసీపీ వెంకట్రావు వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 26న వి.కృష్ణవేణి, మరో 12 మంది తమకు అందాల్సిన ఎస్సీ కార్పొరేషన్ రుణాలను వేముల సునీల్ అనే వ్యక్తి తమకు తెలియకుండా తీసుకుని వాడుకున్నాడని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ స్పందించి అప్పటి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రభాకర్ను పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభాకర్రావు కార్పొరేషన్లో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నుంచి సునీల్ అనే వ్యక్తి నగదును తన అకౌంట్కు బదిలీ చేయించుకుని రూ.60లక్షల నిధులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ మురళీధర్, ఏసీపీ వెంకట్రావు, సీసీఎస్ సీఐ వసంత్కుమార్, టూటౌన్ సీఐ నరేందర్లు బృందంగా ఏర్పడి ఈ కేసు మిస్టరీని ఛేదించారు. 2015–16 ఏడాదికి గాను ఖమ్మం మున్సిపల్ కార్యాలయం నుంచి 264 దరఖాస్తులు ఎస్సీ కార్పొరేషన్కు పంపారు. అందులో 165 దరఖాస్తులు మాత్రమే మంజూరయ్యాయి. అదేవిధంగా 158 మందికి సంబంధించిన మరో లిస్టు ఎస్సీ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వెళ్లగా అప్పటి కలెక్టర్ దానిని నిలిపివేశారు. 158 మంది లిస్టులో ఉన్న దరఖాస్తుదారుడు వేముల సునీల్ హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ తీసుకొచ్చాడు. దీంతో 2015–16, 2016–17కు సంబంధించి మొత్తం 200 యూనిట్లకు మంజూరును ఇచ్చారు. మంజూరైన లిస్టును వేముల సునీల్ తెలివిగా సేకరించి అందులో 43మందికి ఫోన్ చేసి తానే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అని పరిచయం చేసుకున్నాడు. తనకు మెప్మా, ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించి రుణాలు ఇచ్చే బ్యాంకర్లు తెలుసునని.. మీకు వారికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించి ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చేలా చేస్తానని చెప్పారు. అందులో భాగంగా 21మంది లబ్ధిదారుల నుంచి రూ.5,38,500లను తీసుకున్నాడు. అదేవిధంగా షాపు నిర్వాహకుడు భానుప్రసాద్కు డబ్బు ఆశ చూపించి నకిలీ కొటేషన్ లెటర్స్ను తీసుకుని రూ.2,92,55,000లకు సంబంధించిన కొటేషన్ను బ్యాంకర్లకు ఇచ్చాడు. దీనిలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ వారు రూ.1,64,35,000లను సబ్సిడీ కింద లబ్ధిదారుల అకౌంట్లో వేశారు. అదేవిధంగా సునీల్ ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించిన నిధులను రూ.1,28,15,000లను దుర్వినియోగం చేస్తూ బ్యాంకుల్లో 43మంది లబ్ధిదారులకు సెక్యూరిటీ డిపాజిట్ చేసి 43 డీడీలను బ్యాంకుల నుంచి తీసుకుని ఇతనికి సహాయం చేస్తున్న భానుప్రసాద్ ద్వారా నకిలీ సంస్థల ఖాతాలో జమ చేశాడు. ఈ డబ్బులో తనకు 6శాతం ఇవ్వాలని భానుప్రసాద్ పేర్కొన్నాడు. అందుకు గాను సునీల్ రూ.17.40లక్షలతోపాటు రూ.4లక్షల కారుతో సహా భాను ప్రసాద్కు ఇచ్చాడు. ఏకంగా భానుప్రసాద్ ఇంట్లోనే ఈ నకిలీ కొటేషన్స్ను తయారు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం తన కుమారులైన వేముల నితిన్, వేముల అఖిల్ బ్యాంకు ఖాతాలకు రూ.15లక్షలు, రూ.21.78లక్షలను బదలాయించాడు. హైదరాబాద్కు చెందిన గోవింద్కుమార్ అగర్వాల్ వద్ద రూ.18లక్షలకు పార్చునర్ కారును కొనుగోలు చేసి మిగితా డబ్బును తన సొంతానికి వాడుకున్నాడు. అదేవిధంగా వీరికి ఎస్సీ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్పై పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సురేష్ అనే వ్యక్తికి కూడా కొంత మేరకు డబ్బు ఇచ్చాడు. పోలీసుల విచారణలో దీనికి సంబంధించి తీగలాగగా డొంక కదిలింది. 324 యూనిట్లకు సంబంధించి రూ.6 కోట్లపై కూడా పోలీసుల విచారణ.. ఈ కేసులో భాగంగా ఇంకా 324 యూనిట్లలో రూ.6 కోట్లకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్, మున్సిపల్, మెప్మా, బ్యాంకు అధికారుల ప్రమేయాన్ని విచారిస్తున్నామని, త్వరలోనే ఈ తీగనంతా కదిలిస్తామని ఏసీపీ తెలిపారు. వేముల సునీల్పై గతంలో కూడా కేసులు ఉన్నాయని, దర్జాగా కనిపించేందుకు పార్చునర్ కారును వాడటంతో పాటు మూడు ఎయిర్ గన్స్ను కూడా తనవద్ద ఉంచుకుని తిరుగుతుండేవాడని, ఎవరైనా లబ్ధిదారుడు వచ్చి తమ రుణం ఏమైందని అడిగితే తుపాకులను చూపించి భయభ్రాంతులకు గురి చేసేవాడని ఏసీపీ తెలిపారు. అందులో భాగంగా అతని వద్ద పార్చునర్ కారు, మూడు ఎయిర్గన్స్, భానుప్రసాద్ షాపు వద్ద నుంచి నకిలీ బ్యాంక్ కొటేషన్లు, ఇతర నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసునున్నారు. సునీల్తో పాటు భాను ప్రసాద్ను, సునీల్ కుమారుడైన నితిన్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన సుురేష్ను అరెస్ట్ చేశామని, ఈ కేసులో మరికొంతమందిని కూడా విచారించి చర్య తీసుకోవడం జరుగతుందని ఏసీపీ వెంకట్రావు, తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో టూటౌన్ సీఐ నరేందర్ పాల్గొన్నారు. -
ఎరుకల స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తా
హైదరాబాద్: కోయలు, గోండులు, చెంచులు, ఎరుకల, పెంట కులస్తుల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికనిస్తానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో పందుల పెంపకానికి ఎరుకల కులస్తులకు ఉపయోగపడే విధంగా ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మంగళవారం బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం(టీపీవైఎస్) ఆధ్వర్యంలో 35మంది ఎరుకల కులస్తులకు ఏకలవ్య అవార్డులను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరుకల కులస్తుల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ, కమిషన్లో 27,033 కేసులు పెండింగ్లో ఉండగా వాటిలో 26వేల కేసులను పరిష్కరించామన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి కుమార్, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు, నాయకులు వి.రమణ, రమేశ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘రుణా’యస్వాహా!
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించాల్సిన రుణాలు పక్కదారి పడుతున్నాయి. స్వయం ఉపాధి కల్పన కోసం అర్హులైన ఎస్సీలకు దక్కాల్సిన రుణాలను కొందరు అడ్డదారిలో చేజిక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో కొందరు బ్యాంకు అధికారులు, మరికొందరు సంబంధిత ఉద్యోగుల సహకారం ఉందనే వ్యవహారం పత్రికల ద్వారా వెలుగుచూడడంతో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతిని విచారణ అధికారిగా నియమించడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతోంది. 2015–16లో ఎస్సీ కార్పొరేషన్లో దరఖాస్తుదారులకు స్వయం ఉపాధి పేరుతో మంజూరైన రుణాల్లో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగనున్నది. అనేకచోట్ల యూనిట్లు స్థాపించకుండానే, పలువురు లబ్ధిదారులకు తెలియకుండానే వారి పేరుతో బ్యాంకు చెక్కులు జారీ కావడం, అవి దళారుల అకౌంట్లో జమ కావడం వంటి అంశాలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఎస్సీ కార్పొరేషన్ మంజూరు చేసిన స్వయం ఉపాధి పథకం యూనిట్లలో బ్యాంకులు లబ్ధిదారులకు యూనిట్ నెలకొల్పేందుకు అందజేసిన ప్రకారం సదరు యూనిట్కు సంబంధించిన వ్యాపార వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు చెక్కు జారీ చేస్తుంది. అయితే ఇందులో అనేకచోట్ల ఉత్తుత్తి కొటేషన్ చెక్కులు జారీ అయినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చడం.. అసలు యూనిట్లు నెలకొల్పకుండానే కాజేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఉదా.. టెంట్హౌస్ కావాలని కోరిన లబ్ధిదారుడికి ఎస్సీ కార్పొరేషన్ ఆ రుణానికి లబ్ధిదారుడిని ఎంపిక చేసి మంజూరు చేస్తే.. దీనికి సంబంధించిన రుణం బ్యాంకుల ద్వారా అందజేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి 10 శాతం నిధులను లబ్ధిదారుడు బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ నిధులు తమ ఖాతాలో జమ చేశాక.. కార్పొరేషన్ మంజూరు చేసిన యూనిట్ ప్రకారం మిగిలిన 90 శాతం నిధులను బ్యాంకు సదరు లబ్ధిదారుడు కోరుకున్న వ్యాపారానికి సంబంధించి జారీ చేసిన కొటేషన్దారుడికి చెక్కు జారీ చేస్తారు. అయితే సదరు కొటేషన్దారుడికి చెక్కులు జారీ అయితే అయ్యాయి కానీ.. నెలలు గడిచినా యూనిట్లు నెలకొల్పకపోవడం.. అవి నెలకొల్పారా.. లేదా.. అనే అంశంపై సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. నిలువెత్తు నిర్లక్ష్యం.. లబ్ధిదారులకు రుణాలు మంజూరై నెలలు గడుస్తున్నా.. సదరు అధికారులు ఈ వ్యవహారంపై కన్నెత్తి చూడకపోవడం.. ఒక్కచోట అయినా యూనిట్ లేదని గుర్తించకపోవడం నిలువెత్తు నిర్లక్ష్యానికి అద్దం పడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. యూనిట్ల స్థాపన లేకుండానే లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయడం, లబ్ధి పొందకుండానే తమకు నోటీసులు జారీ కావడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేయడంతో రుణాల మాయాజాలం వెలుగు చూసింది. దీనిపై ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ప్రభుత్వ రుణాల్లో దళారీగా వ్యవహరించి.. లబ్ధిదారుల సొమ్ము కాజేశారనే కారణంతో వేముల సునీల్, మరికొందరి పాత్రపై విచారణ చేయాల్సిందిగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ కార్పొరేషన్లో రుణాల పేరుతో జరిగిన మాయాజాలం ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే ఆందోళన ఇటు దళారుల్లో.. అటు కార్పొరేషన్ ఉద్యోగుల్లోనూ నెలకొంది. గతంలో జరిగిన ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరు, యూనిట్ల ఏర్పాటు అంశాలపై సైతం అధికారులు దృష్టి సారించి.. ఇప్పటివరకు మంజూరైన వివిధ రకాల యూనిట్లు, అవి మంజూరు చేసిన స్థానాల్లో ఉన్నాయా? లేదా? వాటికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరు? ఈ యూనిట్లు చేతులు మారాయా? యూనిట్లు లేకుండానే రుణం మంజూరైందా? అది ఏయే సంవత్సరాల్లో జరిగిందనే విషయంపై లోతైన విచారణ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇదే విషయంపై నిఘా వర్గాలు సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరులో దళారుల పాత్ర, అధికారుల ప్రమేయం, పలు బ్యాంకుల పాత్రపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏడాదిలో ఎస్సీ కార్పొరేషన్ మంజూరు చేసిన రుణాల్లోనే ఇంత భారీస్థాయిలో అవినీతి జరిగితే.. మిగిలిన అంశాల్లో ఎంత జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు సుమారు 15వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం జిల్లాకు 1,500 యూనిట్ల లక్ష్యాన్ని నిర్ణయించగా.. అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసే చర్యలు చేపట్టారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 219 యూనిట్లకు లక్ష్యాన్ని నిర్దేశించి.. మిగిలిన మండలాలకు, మున్సిపాలిటీలలో 1,300 యూనిట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే నాడు ఖమ్మం మున్సిపాలిటీ అధికారులు మినహా ఎంపీడీఓలు, ఇతర మున్సిపాలిటీల అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాల మంజూరుకు నివేదికలు పంపించారు. దీంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఖమ్మం కార్పొరేషన్ దరఖాస్తుదారులను మినహాయించి మిగిలిన మండల, మున్సిపాలిటీలకు సబ్సిడీ నిధులను మంజూరు చేశారు. దీంతో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కొందరు లబ్ధిదారుల తరఫున దళారీ కోర్టును ఆశ్రయించారు. తమకు రుణాలు ఇప్పించాలని, అధికారుల నిర్లక్ష్యంతో చేతికొచ్చిన రుణాలను కోల్పోతున్నామని లబ్ధిదారుల తరఫున కోర్టులో వాదనలు వినిపించడంతో 201 మందికి రుణాలు మంజూరు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 201 మందిలో 180 మంది మాత్రమే బ్యాంకు అకౌంట్లు అధికారులకు సమర్పించడంతో వారికి మాత్రమే రుణాలు మంజూరు చేసింది. వీరికి రూ.7.99కోట్లు మంజూరు చేయగా.. వాటిలో రూ.4.75కోట్లు ప్రభుత్వం అందించే సబ్సిడీ కాగా.. రూ.3.72కోట్లు బ్యాంకర్ల నుంచి రుణంగా అందుతుంది. అయితే రుణాల మంజూరు సమయంలో కొందరు లబ్ధిదారులు దళారీని ఆశ్రయించగా.. అతడు రుణం మంజూరయ్యేందుకు సహకరించాడు. లబ్ధిదారులు చేయాల్సిన వ్యాపారానికి సంబంధించి కొటేషన్లు ఒకే వ్యక్తి పేరుతో జారీ అయినా.. ఆయన ఏ వ్యాపారం చేస్తారనే అంశంపై రుణం మంజూరు చేసిన అధికారులు కానీ.. బ్యాంకులు కానీ పట్టించుకోకపోవడంతో అన్ని వ్యాపారాలకు సంబంధించి ఒకే వ్యక్తి కొటేషన్లు జారీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులకు సంబంధించిన పత్రాలను దళారులు సృష్టించి యూనిట్ల రుణాలు పొందారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారుల యూనిట్కు సంబంధించిన యూసీలు పంపించాలని బ్యాంకులు నోటీసులు ఇవ్వడంతో తమకు రుణాలే రాలేదని, యూనిట్లు ఎక్కడ పెట్టాలంటూ లబ్ధిదారులు ఎస్సీ కార్పొరేషన్ అధికారులను ఆశ్రయించారు. అయితే దీనిపై సమగ్ర విచారణ జరిగితేగానీ నిజాలు నిగ్గు తేలనున్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సస్పెన్షన్ ఖమ్మం మయూరిసెంటర్: ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వై.ప్రభాకర్ను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ ఎండీ లచ్చీరాం భూక్యా ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్లో 2015–16 సబ్సిడీ రుణాలకు ఎంపికైన లబ్ధిదారులకు అందజేయాల్సిన రుణాల అక్రమాల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ కర్ణన్ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ప్రభాకర్ స్థానంలో ఎవరిని నియమించేది త్వరలో తేలనున్నది. -
ఎస్సీ పాడిరైతుల కోసం ‘మినీ డెయిరీలు’
సాక్షి, హైదరాబాద్: దళిత పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఔత్సాహిక పాడి రైతులకు ‘మినీ డెయిరీ’ల ఏర్పాటుకు ఆర్థిక సహకారం ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. రూ.4లక్షల వ్యయంతో ఒక్కో యూనిట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 3 జిల్లాల్లో ప్రయోగ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సాగుకు యోగ్యమైన భూమి ఉన్న చిన్న రైతులకు ఈ యూనిట్లు మంజూరు చేస్తారు. యూనిట్ విలువలో 60% రాయితీ రూపంలో ఎస్సీ కార్పొరేషన్ ఇవ్వనుండగా.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణానికి అనుసంధానం చేస్తారు. బ్యాంకు ద్వారా రుణం ఇప్పించే బాధ్యత కూడా ఎస్సీ కార్పొరేషనే పర్యవేక్షిస్తుంది. మినీ డెయిరీ యూనిట్లను సూర్యాపేట జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దాదాపు 830 మంది రైతులకు వివిధ దశల్లో రుణాలిచ్చి యూనిట్లు ఏర్పాటు చేయగా సత్పలితాలు వచ్చాయి. ఒక్కో రైతు ప్రతినెల కనిష్టంగా రూ.10వేలు సంపాదిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో మినీ డెయిరీ కార్యక్రమాన్ని మరో 5 జిల్లాలకు విస్తరింపజేయాలని తాజాగా ఎస్సీ కార్పొరేషన్ నిర్ణయించింది. కొత్తగా జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ గ్రామీణం, మహబుబాబాద్ జిల్లాల్లో అర్హులైన ఎస్సీ చిన్నకారు రైతులను గుర్తించి దశల వారీగా పథకాన్ని అమలు చేస్తారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ మినీ డెయిరీల కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కేవలం యూనిట్ల మంజూరు, గ్రౌండింగ్తోనే కాకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. వారి ఆర్థిక స్థితిని అంచనా వేస్తుంది. ఆర్థికంగా నిలబడే వరకు సలహాలు సూచనలు చేస్తుంది. మినీ డెయిరీల నుంచి వచ్చే పాల సేకరణ బాధ్యతలను స్థానిక నిరుద్యోగ ఎస్సీ యువతకు అప్పగించనుంది. వీరికి ఆర్థిక సహకారం అందించనుంది. గ్రామంలో నిరుద్యోగ యువతతో బృందం ఏర్పడితే వారికి పాల ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటుకు సైతం రాయితీ రుణాలు ఇచ్చేలా ఆ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనలను త్వరలో ప్రభుత్వానికి పంపించనున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు సాక్షితో తెలిపారు. -
ఈ–ఆటోలపై చినబాబు ట్యాక్స్ రూ.83 కోట్లు
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి : ఏదైనా వస్తువు కొనాలంటే మార్కెట్ ధర పరిశీలించి, బేరం ఆడి కొనుగోలు చేస్తాం. ప్రభుత్వం తరపున కొనుగోలు చేయాలంటే టెండర్లు పిలిచి, తక్కువ ధరకే ఆ వస్తువును అందించే సంస్థకే టెండర్ ఖరారు చేసి, కొనుగోలు చేయడం పరిపాటి. కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆరాటంతో మార్కెట్ ధర కంటే రెండింతలు అధికధరకు వస్తువు సరఫరా చేస్తామంటున్న సంస్థకే టెండర్ కట్టబెట్టడం విస్మయం కలిగిస్తోంది. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్లో చోటుచేసుకున్న ఈ బాగోతం వెనుక చినబాబు హస్తం ఉన్నట్లు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో చెత్తను సేకరించడానికి బ్యాటరీతో నడిచే ఈ–ఆటోలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జాతీయ సఫాయి కర్మచారీ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సౌజన్యంతో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తొలివిడతగా 7,500 ఈ–ఆటోలను కొనుగోలు చేసి, షెడ్యూల్ క్యాస్ట్(ఎస్సీ) నిరుద్యోగ యువతకు అప్పగించాలని నిర్ణయించారు. పశ్చిమ గోదావరి, చిత్తూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఈ–ఆటోల కొనుగోలు కోసం టెండర్లు పిలిచారు. జూలై 29వ తేదీన కైనెటిక్ గ్రీన్ ఇండియా సంస్థ ప్రతినిధులు సచివాలయంలో చినబాబును కలిశారు. ఈ–ఆటోల సరఫరా టెండర్ను ఆ సంస్థకే అప్పగించేలా డీల్ కుదిరినట్లు ఆరోపణలున్నాయి. ఓపెన్ టెండర్ కావడంతో మొత్తం 24 ప్రైవేటు సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. అందులో 16 సంస్థలు అర్హత సాధించినట్లు అధికారులు నిర్ధారించారు. టెండర్ను తెరిచే సమయంలో చినబాబు తెరపైకి వచ్చారు. తాము సూచించిన కంపెనీకే టెండర్ దక్కేలా చూడాలని ఆదేశించారు. ఆప్పట్లో చినబాబు ఆశీస్సులు ఉన్న కంపెనీ ఇతర కంపెనీల కంటే ఎక్కువ ధర కోట్ చేసింది. దాంతో ఆ కంపెనీకి టెండర్ దక్కే అవకాశాలు లేవని అధికారులు ఏకంగా ఆ టెండర్నే రద్దుచేశారు. మరోసారి సెప్టెంబర్లో టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లపైనా వివాదం తలెత్తడంతో మళ్లీ నవంబర్లో టెండర్లు పిలిచారు. డిసెంబర్ 4న టెండర్లను తెరిచారు. ఇటీవల సచివాలయంలో మంత్రి లోకేశ్ను కలిసిన కైనెటిక్ గ్రీన్ ఇండియా ప్రతినిధులు టెండర్ నిబంధనల్లో మార్పులు అస్మదీయ సంస్థకే టెండర్ దక్కేలా టెండర్ నిబంధనల్లోనూ చినబాబు మార్పులు చేయించారు. ముందుగా పిలిచిన టెండర్లో ఈఎండీ(ఎర్నేస్ట్ మనీ డిపాజిట్) నాన్ రిఫండబుల్ రూ.25 వేలు కాగా, తాజాగా పిలిచిన టెండర్లో ఈఎండీ రూ.1.5 కోట్లుగా చూపించడం గమనార్హం. దాంతోపాటు ఈ–ఆటోలను సరఫరా చేసే సంస్థ ఇప్పటికే 2,500 ఆటోలను ఏదైనా సంస్థకు సరఫరా చేసినట్లు అధికారిక ధ్రువీకరణ కావాలని నిబంధన విధించారు. అయినప్పటికీ టెండర్లలో ఏడు కంపెనీలు పాల్గొన్నాయి. ఎస్ఎస్వీ టెక్నాలజీ, గోయెంకా మోటార్స్, విక్టరీ ఎలక్ట్రికల్, రిప్ టెక్నాలజీ, కైనెటిక్ గ్రీన్ ఇండియా, భారత్ ఇంజనీరింగ్ వర్క్స్ తదితర కంపెనీలు పాల్గొన్నాయి. చివరకు చినబాబుతో డీల్ కుదుర్చుకున్న కైనటిక్ గ్రీన్ ఇండియా సంస్థకే టెండర్ను ఖరారు చేశారు. అర్హత లేని కంపెనీకే టెండర్ టెండర్ నిబంధనల ప్రకారం హోమోలోగేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. కానీ, ఆ సర్టిఫికేట్ లేని కైనెటిక్ గ్రీన్ ఇండియాకు టెండర్ ఖరారు చేయడం గమనార్హం. మిగిలిన సంస్థల కంటే ఎక్కువ ధర కోట్ చేసిన కంపెనీకి టెండర్ కట్టబెట్టడం విశేషం. కైనెటిక్ గ్రీన్ ఇండియా ఒక్కో ఆటోను రూ.2.44 లక్షలకు సరఫరా చేయనున్నట్లు టెండర్లలో చూపించారు. మిగిలిన సంస్థలు రూ.2.20 లక్షల లోపు ధరకే సరఫరా చేస్తామంటూ బిడ్ దాఖలు చేశాయి. ఈ–ఆటో ప్రస్తుతం రూ.1.48 లక్షల ధర పలుకుతోంది. కానీ, చినబాబు సూచించిన సంస్థ మాత్రం ఒక్కో ఆటోను రూ.2.44 లక్షలకు ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అంటే ఒక్కో ఆటోకు అదనంగా రూ.లక్ష చెల్లించాల్సి వస్తోంది. తొలివిడతగా ఆహ్వానించిన టెండర్లలో పాల్గొన్న కంపెనీలు చిత్తూరు జిల్లాలో ఒక్కో ఆటోను రూ.1.08 లక్షలకు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.16 లక్షలకు సరఫరా చేస్తామంటూ ముందుకొచ్చాయి. కానీ, ఆ టెండర్లను రద్దు చేయించారు. అధిక ధర కోట్ చేసిన కైనెటిక్ గ్రీన్ ఇండియాకే టెండర్ కట్టబెట్టడం వెనుక లోగుట్టు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కేవలం రూ.1.08 విలువైన ఆటోను అస్మదీయ సంస్థ నుంచి రూ.2.44 లక్షలకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధ పడింది. అంటే ఖజానాపై రూ.83 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. ఈ సొమ్ముంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎస్సీ యువతపై అదనపు భారం పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ పథకంలో భాగంగా అర్హులైన దళిత యువతకు ఈ–ఆటోలను సరఫరా చేయనున్నారు. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించాల్సి ఉంటుంది. ఆటోలకు ప్రభుత్వ సబ్సిడీ పోను బ్యాంకు రుణం అందిస్తారు. బ్యాంకు రుణాన్ని లబ్ధిదారుడు నెలవారీగా చెల్లించుకోవాలి. చినబాబు కమీషన్ల కక్కుర్తి వల్ల లబ్ధిదారులు ఒక్కొక్కరు రూ.లక్ష వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈ–ఆటోల టెండర్లలో అవినీతి ‘‘ఈ–ఆటోల సరఫరా టెండర్లలో అవినీతి చోటుచేసుకుంది. కొందరి స్వార్థం కోసం మన రాష్ట్రానికి చెందిన చిన్న తరహా పరిశ్రమలకు అన్యాయం చేశారు. మరో రాష్ట్రానికి చెందిన కంపెనీకి ఈ–ఆటోల సరఫరా టెండర్ను అప్పగించడం దారుణం. టెండర్లలో అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సృందించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తాం’’ – కె.పి.రావు, ఎలక్ట్రికల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ నేత, విజయవాడ -
దరఖాస్తుల వెల్లువ
ఆదిలాబాద్రూరల్: వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు అంతంత మాత్రంగానే జారీ కావడంతో స్వయం ఉపాధిపై యువత మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా వివిధ కార్పొరేషన్ల రాయితీ రుణాల కోసం భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్ రాయితీ రుణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొదటగా ఈ నెల 7 వరకు ముగిసిన గడువును రెండవసారి 10వ తేదీకి పెంచారు. అనంతరం నవంబర్ 2 వరకు ప్రభుత్వం గడువును పొడిగించింది. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలోని 18 మండలాలకు కేటాయించిన రుణ యూనిట్లకు వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. సమాజంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఎస్సీలకు రాయితీ రుణాలను అందించడానికి ప్రతి ఏటా ప్రభుత్వం రుణ ప్రణాళిక విడుదల చేస్తోంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక విడుదల చేసి వాటికి కావాల్సిన బడ్జెట్ను కూడా తయారు చేసింది. జిల్లాలోని ఆయా మండలాల నుంచి అర్హత గల ఎస్సీ లబ్ధిదారుల నుంచి ఆగస్టులో దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. జీవనోపాధికే ప్రాధాన్యం.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా చేయూత అందించడానికి రాయితీ యూనిట్లను ప్రభుత్వం అందిస్తోంది. యూనిట్ల విలువలను బట్టీ రాయితీ కల్పిస్తోంది. రూ.50వేలు విలువైన యూనిట్కు వంద శాతం రాయితీ, రూ.లక్ష విలువైన యూనిట్కు 80 శాతం, రూ.2లక్షలకు 70 శాతం, రూ.3లక్షలకు 60 శాతం, రూ.5 లక్షలకు 50 శాతం రాయితీని అందిస్తోంది. కిరాణం, మొబైల్ దుకాణాలు, కూరగాయల వ్యాపారం, వీడియో, ఫొటోగ్రఫీ, చెప్పుల దుకాణం, ఫ్యాన్సీ, గాజుల వ్యాపారం, కొబ్బరి బోండాలు, చికెన్, మటన్ దుకాణం, సప్లయ్ సామగ్రి, పాన్షాప్, ఆటో మొబైల్, మెడికల్ షాపు, హోటల్, పాల వ్యాపారం, ఆవులు, గేదెలు, గొర్రెలు, కోళ్లు, చేపల పెంపకం, పండ్ల వ్యాపారం, మెకానిక్ తదితర యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ రుణాలు ఇస్తోంది. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు, తదితర వాటికి కూడా రాయితీలను అందిస్తారు యూనిట్ల మార్పునకు అవకాశం ముందుగా దరఖాస్తు చేసిన దానిలో నమోదు చేసిన యూనిట్ మార్చుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఎన్నికల దృష్ట్యా ఎంపీడీవోల దగ్గర లాగిన్లో మార్చుకోవడానికి అవకాశం ఉండదు. దరఖాస్తు దారులు సమీపంలోని మీ సేవ కేంద్రాల ద్వారా మార్చుకోవచ్చు. ఈ అవకాశం కూడా వచ్చే నెల 2వ తేదీ ఉంది. యూనిట్లు.. బడ్జెట్ జిల్లాలోని 18 మండలాలకు స్వయం ఉపాధి రుణాల అందించేందుకు 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆయా మండలాలకు 631 యూనిట్లను కేటాయించారు. వీటికి రూ.19 కోట్ల 40లక్షల 44వేలు అంచనా వేశారు. వీటిలో రూ.50వేలలోపు 276 యూనిట్లు కాగా వీటికి 3.80లక్షలు ఖర్చు చేయనున్నారు. రూ.లక్షలోపు 117 యూనిట్లు ఉండగా 11.70 లక్షలు, రూ.2లక్షల 86 యూనిట్లు ఉండగా దీనికి రూ.17.20 లక్షలు ఖర్చు చేయనున్నారు. రూ.7లక్షల యూనిట్లు 34 ఉండగా రూ.23.80 లక్షలు కేటాయించారు. రూ.12లక్షల యూనిట్లు 13 ఉండగా రూ.15.60 లక్షలు ఖర్చు చేయనున్నారు. రూ.25లక్షల యూనిట్లు 9 ఉండగా రూ.22.50 లక్షలు, రూ.50లక్షల యూనిట్లు 5 ఉండగా రూ. 25లక్షలు అందజేయనున్నారు. ఓనర్ కం డ్రైవర్ 28 యూనిట్లు ఉండగా రూ.22.40 లక్షలు ఖర్చు చేయనున్నారు. టూ విల్లర్ 18 యూనిట్లు ఉండగా రూ.18 లక్షలు ఖర్చు చేయనున్నారు. వ్యవసాయ అనుబంధ యూనిట్లు 38 ఉండగా వీరికి రూ.15.20 లక్షలు ఖర్చు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ ఇప్పటి వరకు వివిధ స్వయం ఉపాధి రుణాల కోసం 6,740 దరఖాస్తులు వచ్చిన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలి.. ఎస్సీ రాయితీ రుణాల కోసం అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తున్నాం. వారికి అనువుగా ఉన్న యూనిట్లను ఎంపిక చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది వరకే దరఖాస్తు చేసిన వారు తమ యూనిట్లను, ఇతర వాటిని మార్పులు, చేర్పులు చేసుకోవడానికి అవకాశాన్ని ప్రభుత్వం అనుమతినిచ్చింది. – శంకర్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, ఆదిలాబాద్ -
కార్లకు ఫుల్..బైక్లకు డల్
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి పథకాలకు నిరుద్యోగ యువత నుంచి మిశ్రమ స్పందన ఎదురైంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2018–19 వార్షిక సంవత్సరంలో మోటార్ ఎంపవర్మెంట్ కింద 4 వేల యూనిట్లు పంపిణీ చేయాలని యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం క్యాబ్లతోపాటు ఈ కామర్స్ కంపెనీలకు సంబంధించిన సర్వీసులకు బాగా డిమాండ్ ఉంది. దీంతో క్యాబ్ కేటగిరీలో 2 వేల కార్లు, బైక్ కేటగిరీలో 2 వేల ద్విచక్ర వాహనాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది. క్యాబ్ కేటగిరీకి ఎంపికైన లబ్ధిదారుకు గరిష్టంగా రూ.5 లక్షల వరకు రాయితీ ఇస్తారు. బైక్ కేటగిరీలో యూనిట్ విలువపై 80 శాతం వరకు రాయితీ ఇస్తారు. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ ఆగస్టు తొలివారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. సెప్టెంబర్ 20తో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. భారీ ఎత్తున రాయితీ ఆశిస్తున్న నిరుద్యోగ యువత క్యాబ్ కేటగిరీ వైపే మొగ్గు చూపగా.. బైక్ కేటగిరీ వైపు కనీసం ఆసక్తి చూపలేదు. క్యాబ్ కేటగిరీలో 6,360 మంది దరఖాస్తు చేసుకోగా.. బైక్ కేటగిరీలో 982 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. క్యాబ్ కేటగిరీ పథకాన్ని గతంలోనూ అమలు చేయడంతో క్షేత్రస్థాయిలో కొంత అవగాహన ఉంది. దీంతో ఈ కేటగిరీలో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు బైక్ కేటగిరీని కొత్తగా తెచ్చారు. అయితే దీనిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో దరఖాస్తుల సంఖ్య తగ్గి ఉండొచ్చని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఎదురుచూపులేనా !
బూర్గంపాడు: షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కల్పనకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం ఇవ్వాల్సిన రుణాలు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. ప్రతి ఏటా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రచారం చేయటం, ఆ తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేయటం, అంతటితోనే సరిపెట్టడం పరిపాటిగా మారింది. గత రెండేళ్లుగా ఎస్సీ నిరుద్యోగులు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. రుణాలకు ఎంపికైనప్పటికీ.. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు.. వారికి రుణాలు మంజూరు చేయకుండానే ఈ ఏడాది కొత్తగా మళ్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాలో 2017 – 18 సంవత్సరానికి గాను 2, 283 మంది లబ్ధిదారులను ఎస్సీ కార్పొరేషన్ ఎంపిక చేసింది. ఈ ప్రక్రియ పూర్తయి ఏడాది గడిచింది. కాగా, ఇప్పటివరకు టేకులపల్లి, చుంచుపల్లి మండలాలకు చెందిన 180 మందికి మాత్రమే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరయ్యాయి. మిగతా మండలాల్లోని 2103 మంది లబ్ధిదారులకు ఇప్పటి వరకు రుణాలు మంజూరు కాలేదు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకునే లబ్ధిదారులు యూనిట్ పెట్టుకునేందుకు 80 శాతం ఎస్సీ కార్పొరేషన్ రాయితీగా అందిస్తుంది. మిగతా 20 శాతం బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్యాంకర్లు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు తీసుకున్న వారు సక్రమంగా చెల్లించటం లేదని, 20 శాతం బ్యాంకు రుణం ఇవ్వాలంటే లబ్ధిదారుని నుంచి డిపాజిట్ చేయాలని చెపుతున్నారు. అలా చెల్లించిన వారికే బ్యాంకు రుణం ఇచ్చేలా అంగీకారపత్రం అందిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు తమ వాటా 20 శాతం ఎంపిక సమయంలో చెల్లించి బ్యాంకుల నుంచి కాన్సెంట్ తెచ్చుకున్నారు. ఇందుకోసం ప్రైవేటు అప్పులు తీసుకుని బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఏడాది దాటినా రుణాలు మంజూరు కాకపోవటంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2016 – 17 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఎంపికైన లబ్ధిదారుల్లో కొందరిని 2017 – 18 లబ్ధిదారుల్లో చేర్చారు. వారు రెండేళ్లుగా ప్రభుత్వ రాయితీ కోసం పడిగాపులు పడుతున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు బయట తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పది రోజుల్లో రుణాలు మంజూరు కాకపోతే మళ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవరూ పట్టించుకోరని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రుణాలు వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నారు. తీవ్రజాప్యం జరుగుతోంది ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. లబ్ధిదారులను ఎంపిక చేసి ఏడాది గడిచినా రుణం మాత్రం మంజూరు కావడం లేదు. లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా పట్టించుకునే వారు లేరు. ఎప్పుడు అడిగినా వస్తాయి అంటారే తప్ప ఇచ్చేది మాత్రం లేదు. – పేరాల శ్రీనివాసరావు, మాజీ ఉపసర్పంచ్, సారపాక బడ్జెట్ విడుదలవుతుంది జిల్లాలో 2, 283 మంది లబ్ధిదారులకు గాను 180 మందికి రుణం మంజూరు అయింది. మిగతా వారికి కూడా బడ్జెట్ విడుదలైంది. రుణాలకు సంబంధించి చెక్ అలాట్ అయింది. తొందరలోనే లబ్ధిదారులకు రుణాలను అందిస్తాం. – ఎం. పులిరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ -
‘నై’పుణ్యాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధిలో ఎస్సీ కార్పొరేషన్ వెనుకబడింది. నిరుద్యోగ యువతకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రాయితీ రుణకల్పనతో పాటు విద్యార్హతలకు తగిన నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోటాలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ యువత కోసం భారీమొత్తంలో నిధులు కేటాయిస్తోంది. ఈక్రమంలో గత ఐదేళ్లలో పెద్ద మొత్తంలో నిధులిచ్చినప్పటికీ, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఉదాసీనంగా వ్యవహరించింది. దీంతో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 2,463 మందికి మాత్రమే వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. అంతకుముందు ఐదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం నైపుణ్యాభివృద్ధి శిక్షణ తీసుకున్న వారి సంఖ్య మూడోవంతు కూడా లేకపోవడం గమనార్హం. వ్యయం ఎక్కువ... లబ్ధి తక్కువ... ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు తగ్గిపోతున్నాయి. ప్రైవేటు రంగంలో అవకాశాలున్న కేటగిరీలను ఎంపిక చేసుకుని గతంలో శిక్షణలు ఇవ్వడంతోపాటు ఉపాధి అవకాశాలు సైతం కల్పించేవారు. ప్రస్తుతం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఉపాధి కల్పించడం కత్తిమీద సాములా మారింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షణతో పాటు కచ్చితంగా ఉపాధి క ల్పించాల్సి ఉంది. దీంతో లక్ష్యసాధన ఆశాజనకంగా లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఐదేళ్ల కాలంలో రూ.7.06 కోట్లు ఖర్చు చేసి ఏకంగా 6,992 మందికి శిక్షణతో కూడిన ఉపాధిని కల్పించారు. రాష్ట్రఏర్పాటు తర్వాత ఇప్పటివరకు రూ.10.40 కోట్లు ఖర్చు చేసి కేవలం 2,463 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చినట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఉద్యోగాలు దక్కించుకున్న వారి సంఖ్య తక్కువే. నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడంలో వెనుకబాటు నమోదవుతుండటంతో ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ కార్యక్రమాల్లో వేగం పెంచుతోంది. ఇటీవల సేవల రంగంలో ఆరోగ్య సహాయకులు, ఎయిర్హోస్టెస్ కేటగిరీలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఉపాధి అవకాశాలు అతి తక్కువ మందికే దక్కాయి. మరికొన్ని కేటగిరీల్లో శిక్షణకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తోంది. -
దళితుల భూపంపిణీకి ఎన్నికల జోష్
సాక్షి, హైదరాబాద్: దళితుల భూపంపిణీ పథకంపై ఎన్నికల ప్రభావం పడింది. రెండేళ్లుగా ఈ పథకానికి కేటాయింపులు తగ్గుతున్న క్రమంలో ఈసారి అతి తక్కువ లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్ వార్షిక ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో కేవలం 159 మంది లబ్ధిదారులకు భూపంపిణీ చేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇందుకుగాను రూ.4.06 కోట్లు అవసరమని ప్రణాళికలో పేర్కొంటూ ప్రభుత్వానికి సమర్పించారు. కానీ, అనూహ్యంగా ఎన్నికల సీజన్ వచ్చిన దళితుల భూపంపిణీపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 1,900 మంది రైతులకు భూపంపిణీ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి రూ.407.32 కోట్లు కేటాయించింది. ఎస్సీ కార్పొరేషన్ వార్షిక ప్రణాళికను ఆమోదిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. భూమి ఎక్కడ ? గతంలో ఎన్నడూ లేనంత పెద్దమొత్తంలో ప్రభుత్వం దళితుల భూపంపిణీకి నిధులు కేటాయించినప్పటికీ, లక్ష్య సాధన సులువు కాదనిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరిగిన పరిణామాలతో రాష్ట్రవ్యాప్తంగా స్థిరాస్థి రంగం పుంజుకుంది. దీంతో భూముల ధరలు పెరిగిపోయాయి. ప్రాజెక్టులు, కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం సేకరిస్తున్న భూమికి ఎక్కువ ధరలు పెట్టి కొనుగోలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో దళితుల భూపంపిణీ పథకానికి ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూమి కొనుగోలు చేయడం ఎస్సీ కార్పొరేషన్కు కష్టంగా మారింది. అన్ని వసతులతోపాటు సాగుకు యోగ్యమైన భూమినే కొనుగోలు చేయాలనే నిబంధన ఉంది. ఎకరాకు రూ.7లక్షలు మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మొత్తంతో భూమి కొనుగోలు చేయడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. గత మూడేళ్లుగా నిర్దేశించిన లక్ష్యం తాలూకు సాధనే కష్టమైందని ఒక అధికారి ‘సాక్షి’తో అన్నారు. -
భూపంపిణీకి మంగళం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకం అటకెక్కుతోంది. ఈ పథకం అమలుకు సంబంధించి వార్షిక లక్ష్యాలు క్రమంగా తగ్గుతున్నాయి. 2018–19 వార్షిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 159 మంది లబ్ధిదారులకే భూ పంపిణీ చేసేలా ఎస్సీ కార్పొరేషన్ కార్యాచరణ రూపొందించడం గమనార్హం. భూపంపిణీ పథకం కింద 2017–18 వార్షిక సంవత్సరంలో రూ.165 కోట్లు కేటాయిస్తూ.. 1,529 మంది దళిత రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఎస్సీ కార్పొరేషన్ కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు 3,609 ఎకరాలు గుర్తించింది. ఈ భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి విక్రయించి దళితులకు ఇచ్చేలా ఏర్పాటు చేసింది. కానీ ప్రస్తుత వార్షిక సంవత్సరంలో లక్ష్యాలు దారుణంగా పతనమయ్యాయి. గతేడాదితో పోలిస్తే 2018–19 వార్షిక సంవత్సరంలో పదోవంతు మందికే భూపంపిణీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. మొత్తంగా 159 మంది లబ్ధి్ధదారులకు 406 ఎకరాల భూమిని పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. రూ.18.5 కోట్లు బడ్జెట్ కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. 22 జిల్లాలు నిల్.. : పట్టణీకరణ ప్రభావంతో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఈ పథకం మొదటి నుంచీ అమలు కాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కూడా భూపంపిణీ నుంచి మినహాయింపునిచ్చారు. తాజా వార్షిక సంవత్సరంలో 22 జిల్లాలో భూపంపిణీ పథకాన్ని అమలు చేయట్లేదు. భూపంపిణీ అమలు కాని జాబితాలో జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమురంభీం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, యాదాద్రి జిల్లాలున్నాయి. ఈసారి ఆదిలాబాద్ జిల్లాలో 107 మందికి భూపంపిణీకి లక్ష్యాన్ని నిర్దేశించారు. జోగుళాంబ గద్వాల, కామారెడ్డి జిల్లాలకు కలిపి 27 మంది, మహబూబ్నగర్ జిల్లాలో 14, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 మందికి, నాగర్కర్నూల్ జిల్లాలో ముగ్గురికి ఎస్సీ కార్పొరేషన్ భూపంపిణీ చేయనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రియల్ ఎస్టేట్ భూమ్ అంతటా విస్తరించింది. దీంతో భూపంపిణీకి భూముల సమస్య తలెత్తింది. -
రాయితీ ఇంకా రాకపాయె!
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి యూనిట్ల లబ్ధిదారుల ఆవేదన అరోణ్యరోదన అయింది. రాయితీ రుణాల కోసం రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వంలో చలనంలేదు. నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి యూనిట్ల వైపు ప్రోత్సహించేందుకు ఎస్సీ కార్పొరేషన్ విరివిగా రాయితీ రుణాలిచ్చేలా కార్యాచరణ రూపొందించింది. పెద్దసంఖ్యలో లబ్ధి కలిగించాలని భారీ ప్రణాళికలు రచించింది. వీటిని ప్రభుత్వం ఆమోదించడంతో లబ్ధిదారులను ఎంపిక చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 33,607 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. వీరికి రాయితీ రూపంలో రూ.454.01 కోట్లు అవసరమని ఎస్సీ కార్పొరేషన్ ప్రతిపాదనలు సమర్పించగా ప్రభుత్వం ఆమోదించింది. కానీ 27,261 మంది లబ్ధిదారులకు మాత్రమే రాయితీ యూనిట్లు మంజూరు చేసింది. ఈ మేరకు లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. కార్పొరేషన్ నిర్దేశించిన మేరకు రూ.351.26 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ, సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు కార్పొరేషన్పై ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు 2016–17 ఆర్థిక సంవత్సారానికి సంబంధించిన రాయితీ రుణాల పంపిణీ ఇంకా పెండింగ్లోనే ఉంది. దాదాపు 3610 మంది లబ్ధిదారులకు రూ.56 కోట్లు చెల్లించాల్సి ఉంది. వార్షిక ప్రణాళికకేదీ ఆమోదం... 2018–19 సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ రూ.వెయ్యి కోట్లతో వార్షిక ప్రణాళికను తయారు చేసి రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి సమర్పించింది. ఇంకా ఆమోదం లభించలేదు. 50 వేల మందికి లబ్ధి చేకూర్చేలా భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్ రాకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు అయోమయంలో పడ్డారు. ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తొలి త్రైమాసిక ముగిసింది. ఇప్పటికిప్పుడు లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టినా ప్రక్రియ పూర్తి కావడానికి కనిష్టంగా మూడు నెలలు పడుతుంది. బ్యాంకు నుంచి సమ్మతిపత్రాలు పొందడానికి,రుణాల మంజూరు పూర్తికావడానికి సమయం పడుతుంది. దీంతో రుణ ప్రణాళిక అమలు కష్టంగా మారే అవకాశముందని ఎస్సీ కార్పొరేషన్ యంత్రాంగం ఆందోళన చెందుతోంది. వార్షిక ప్రణాళికకు ఆమోదం లభించిన వెంటనే చర్యలు వేగవంతం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. -
నైపుణ్యానికే పట్టం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ నిరుద్యోగ యువతకు శుభవార్త. నైపుణ్యం ఉన్న యువతను స్వయం ఉపాధి వైపు మళ్లించే కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ శ్రీకారం చూడుతోంది. ఈ మేరకు ఆరు కేటగిరీల్లో 81 రకాల ఉపాధి యూనిట్లను గుర్తిస్తూ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. సిఫార్సులకు తావు లేకుండా దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరికీ చేయూత ఇవ్వనుంది. ఇందుకు దరఖాస్తుదారుల నైపుణ్యమే కీలకం కానుంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికకు మండల స్థాయి కమిటీకి 50 శాతం వాటా ఇస్తూ మిగతా 50 శాతాన్ని నేరుగా కార్పొరేషన్ అధికారులే ఎంపిక చేయనున్నారు. సాధారణంగా కార్పొరేషన్ రుణాలంటే దరఖాస్తుల అనంతరం వాటి పరిశీలన, బ్యాంకు నుంచి రుణ మంజూరు అంగీకార పత్రం, ఉమ్మడి లబ్ధిదారుల ఎంపికలో అర్హత సాధిస్తేనే రాయితీ దక్కుతుంది. ఈ సంప్రదాయాన్ని ఎస్సీ కార్పొరేషన్ సరికొత్తగా మార్పు చేయనుంది. క్షేత్ర స్థాయిలో ఉమ్మడి లబ్ధిదారుల ఎంపికకు ప్రాధాన్యతనిస్తూనే.. నైపుణ్యం ఉన్న యువతకు నేరుగా రాయితీలిచ్చేలా కార్యాచరణ రూపొందించింది. సగభాగం మహిళలకు.. ఎస్సీ కార్పొరేషన్ అమలు చేయనున్న స్వయం ఉపాధి పథకంలో ఆరు కేటగిరీలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందులో పారిశ్రామిక వ్యాపారం, వ్యవసాయ ఆధారిత యూనిట్లు, చిన్న నీటి పారుదల, పశుసంవర్ధకం/మత్స్య పరిశ్రమ, ఉద్యాన/పట్టు పరిశ్రమలు, వాహన రంగం కేటగిరీల్లో దాదాపు 81 రకాల ఉపాధి యూనిట్లను గుర్తించింది. అభ్యర్థుల విద్యార్హతను పరిగణనలోకి తీసుకుని తగిన యూనిట్లు ఏర్పాటు చేయనుంది. ఫార్మసీ చేసిన నిరుద్యోగి ఉంటే మెడికల్ షాప్, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తే డయాగ్నస్టిక్ సెంటర్, డ్రైవింగ్ వస్తే క్యాబ్ కొనుగోలుకు సహకారం.. ఇలా వినూత్న అంశాలను జోడించింది. యూనిట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చును బట్టి రూ.80 వేల నుంచి రూ.6 లక్షల వరకు రాయితీలివ్వనుంది. తాజా ప్రణాళికలో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ సగం యూనిట్లను వారికే కేటాయించనుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 17 వేల మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూర్చాలని భావిస్తోంది. ఈ మేరకు రూ.1,000 కోట్లతో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. నెలాఖరులోగా ప్రభుత్వం నుంచి ఆమోదం రానున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఆమోదం వచ్చిన వెంటనే క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తిస్తామని, అక్టోబర్కల్లా యూనిట్లు గ్రౌండింగ్ చేసేలా లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. -
‘అట్రాసిటీ’పై దేశవ్యాప్త ఉద్యమం : మందకృష్ణ
హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పరిరక్షణ సమితి చైర్మన్ మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఓయూ అతిథి గృహంలో జరిగిన మాదిగ విద్యార్థి సమాఖ్య (ఎంఎస్ఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతమున్న చట్టంలో ఎటువంటి మార్పులు చేసినా సహించేది లేదన్నారు. దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా వచ్చేనెల 17న ఢిల్లీలో సింహగర్జన సభను నిర్వహించనున్నట్లు మందకృష్ణ వెల్లడించారు. -
ఒకే స్థలం రెండు సంస్థలకు!
సాక్షి, మంథని : ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఓ పట్టాదారు వద్ద కొనుగోలు చేసిన భూమిని సదరు పట్టాదారు మరలా ఓ ప్రైవేటు సంస్థకు రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతం శుక్రవారం వెలుగుచూసింది. మంథని డివిజన్లో నెలకొన్న రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ శ్రీ దేవసేన మండలపరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పుట్ట మధు, జిల్లా ఇన్చార్జి డీఆర్వో పద్మయ్య, డివిజన్ పరిధిలోని ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మంథని మండలం నాగారం శివారులోని సర్వే నంబర్లు 95, 97లోని 17 ఎకరాల భూమిని 1997లో ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసింది. దానిని 17 మంది ఎస్సీలకు పంపిణీ చేసిందని గ్రామానికి చెందిన రైతు బెల్లంకొండ రవీందర్రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి కాస్తులో ఉన్న ఎస్సీలు తమ పేర్లను పహణీలో చేర్చాలని, పట్టా పాస్పుస్తకాలు ఇవ్వాలని అధికారుల చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే అదునుగా పట్టాదారు అదే భూమిని ఓ ప్రైవేటు సంస్థకు ఎకరాకు రూ.9 లక్షల చొప్పున 11 ఎకరాలను 2015–16లో అమ్మినట్లు తెలిపారు. సమస్యపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్ తహసీల్దార్ సుధాకర్ను వివరణ కోరారు. రెండోసారి అక్రమ పట్టా నిజమేనని చెప్పడంతో వెంటనే సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల్లో చూపని కారణమా లేక మరేదో చూడాలని, రిజిస్ట్రేషన్ అథారిటీ, రెవెన్యూ అథారిటీ వేరని, ప్రభుత్వం కొత్తగా రెవెన్యూకే రిజిస్ట్రేషన్ అథారిటీ అప్పగించినందున ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో తలెత్తకపోవచ్చని తెలిపారు. నాగారంలో జరిగిన సమస్యను తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అక్రమంగా రెండోసారి పట్టా చేసి వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు వేయాలని ఆదేశించారు. అ భూమిలో ఇప్పటికే పట్టాలు ఇచ్చి ఉంటే వారిలో అర్హులను గుర్తించి పాస్పుస్తకాలు జారీ చేయాలని సూచించారు. నెలాఖరులోగా అందరికీ పాస్పుస్తకాలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా రైతులందరికీ పట్టాపాస్పుస్తకాలు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపాçరు. రైతులకు పాస్పుస్తకాల పంపిణీ పక్రియ నిరంతరం జరుగుతుందని, ఎవరూ హైరానా పడాల్సిన అవరం లేదన్నారు. జిల్లాలో 1.26 లక్షల మంది రైతులను గుర్తించామని, 1.13 లక్షల పాస్పుస్తకాలు ప్రింట్ చేయించామన్నారు. ఇప్పటి వరకు 1.09 లక్షల మంందికి పంపిణీ చేశామని వివరించారు. వివిధ కారణాలతో 12 వేల పాస్ పుస్తకాలు పంపిణీ చేయలేదన్నారు. పంపి ణీ చేసిన పాస్పుస్తకాల్లో దొర్లిన తప్పుల సవరణ, కొత్త పాస్పుస్తకాల పంపిణీ పక్రియ ను నెలాఖరు వరకు పూర్తి చేస్తామన్నారు. ఇలాంటివి జిల్లాలో 3 వేలు ఉన్నాయని తెలి పారు. గతంలో ఉన్న వెబ్లాండ్తో అనేక సమస్యలు వచ్చాయని ధరణీ వెబ్సైట్ పకడ్బందీగా ఉందన్నారు. కొత్తగా చేర్చిన సమాచారం ఆన్లైన్లో నమో దు చేసి సెంట్రలైజ్డ్ ప్రింటింగ్ ద్వారా రైతులకు అందిస్తాన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పార్ట్–ఏ, బీ నమోదు చేశామని పార్ట్–ఏ కింద 94 శాతం పూర్తి చేసామని బీలో కేవలం 6 శాతమే అన్నారు. వివాదాలు, ఫిర్యాదుల ఉన్నవాటిని బీలో చేర్చామని, పరిశీలన, విచారణ అనంతరం అర్హులకు పట్టాలు ఇస్తామని తెలిపారు. నాగారంలో గ్రామం రెవెన్యూ, గ్రామపంచాయతీలో లేకుండా పోవడంతో ఇబ్బందులు ఎదురొంటున్నామని ప్రకాశ్రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రామగుండం కార్పొరేషన్కు 25 కిలోమీటర్ల దూరంలో గ్రామం ఉండడంతో నిబంధన అడ్డుగా ఉందని తెలిపారు. రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో కాస్తులో ఉన్న భూమి అటవీశాఖవారు తమదని అంటున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సాదాబైనామాలు చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయ ని డిసెంబర్ 31 వరకు మాత్రమే దరఖాస్తులు తీసుకున్నారని.. తర్వాత తీసుకోవాలని పలువురు కోరారు. అలాగే పీఓటీ కింద వేల సమస్యలు గుర్తించా మని, వీటన్నింటిపై వచ్చే సోమవారం జరిగే సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ రైతుల నుంచి వచ్చిన సమస్యలను క్షుణ్ణంగా పరిశీంచి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో తిరుగుతుంటే రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని అందుకే ప్రత్యక సమావేశం ఏర్పాటు చేయించా మన్నారు. అధికారులు మానవీయ కోణాన్ని చూడాలని, వారి పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మంథన, ముత్తారం ఎంపీపీలు ఏగోళపు కమల, అత్తె చంద్రమౌళి, కమాన్పూర్ జెడ్పీటీసీ, మంథని సర్పంచ్ పుట్ట శైలజ, ఆయా మండలాల తహసీల్దార్లు సమావేశంలో పాల్గొన్నారు. -
అలా వచ్చాయి.. ఇలా పోయాయి!
సాక్షి, హైదరాబాద్: ‘మనకు తెలియకుండా మన ఖాతాలో భారీ మొత్తంలో నగదు జమై.. తిరిగి క్షణాల్లో మరో ఖాతాకు బదిలీ అయితే ఎలా ఉంటుంది’.. నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి యూనిట్లపై రాయితీలిచ్చే ఎస్సీ కార్పొరేషన్లో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఏడాది మార్చి 31న రూ.1,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణ రూపంలో కార్పొరేషన్ ఖాతాలో జమ చేసింది. ఏమైందో ఏమోగానీ.. మరుసటి రోజే ఆ మొత్తం తిరిగి ప్రభుత్వ ఖాతాకు వెళ్లిపోయింది. రుణం కావాలని కార్పొరేషన్ దరఖాస్తు చేసుకోకుండానే రుణంరావడం, వెళ్లడంతో ఆ శాఖలో అయోమయం నెలకొంది. నిధులు క్యారీ ఫార్వర్డ్ 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,418.88 కోట్లకు ఎస్సీ కార్పొరేషన్ ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలను కార్పొరేషస్ ప్రారంభించింది. కానీ ఆర్థిక సంవత్సరం చివరి వరకూ నిధులు విడుదల కాకపోవడంతో పలు కార్యక్రమాలు పెండింగ్లో ఉండిపోయాయి. ఈక్రమంలో ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మార్చి 31న ఆ శాఖ ఖాతాలో రూ.1,500 కోట్లు రుణ రూపంలో రావడం.. మరుసటి రోజు తిరిగి సర్కారు ఖాతాకు వెళ్లిపోవడం జరిగింది. ఆ శాఖ ఖాతా స్టేట్మెంట్ను చూసిన కార్పొరేషన్ ఉన్నతాధికారులు.. రుణం రావడం, తిరిగి పోవడం చూసి అవాక్కయ్యారు. అయితే ఆ శాఖ బడ్జెట్లో రుణం జతకావడంతో 2018–19 ఆర్థిక సంవత్సరం గత నిధులు క్యారీఫార్వర్డ్ అయ్యాయి. దీంతో నిధులు లేక నిలిచిపోతాయనుకున్న పథకాలను అమలు చేసే అవకాశం లభించింది. ఈ సారీ రూ.1,500 కోట్లతో ప్రణాళిక 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,560.77 కోట్లతో వార్షిక ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి ఎస్సీ కార్పొరేషన్ నివేదించింది. కాగా, ఇటీవల కార్పొరేషన్కు రూ.250.57 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు బీఆర్ఓ (బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్) కూడా విడుదలైంది. కానీ వీటిని ఎలా ఖర్చు చేయాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో నిధులున్నా ఖర్చు చేయలేక కార్పొరేషన్ అయోమయంలో పడింది. -
ఎస్సీ,ఎస్టీ కేసు పేరుతో రూ.15లక్షలు వసూలు
సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ,ఎస్టీ చట్టం పేరుతో అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సోమజిగూడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో రమేష్, సంజీవ కుమార్, కిరణ్ అనే ముగ్గురు కొద్ది కాలం క్రితం పనిలో చేరారు. అయితే వీరి పనితీరు నచ్చని యజమాని శ్రీనివాస్, పనిలో నుంచి తప్పిస్తానని హెచ్చరించాడు. దీంతో యజమానిపై కోపం పెంచుకున్న ముగ్గురు ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా యజమాని నుంచి ఒక చెక్, ప్రామిసరి నోటు తీసుకొన్నారు. కేసు పేరుతో దాదాపు పదిహేను లక్షల రూపాయలకు పైగా శ్రీనివాస్ నుంచి వసూలు చేశారు. అయితే వీరి వేధింపులను కొద్ది కాలం పాటు భరించిన యజమాని.. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఎల్బీ నగర్ పోలీసులు ముగ్గరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కొద్ది మొత్తంలో డబ్బు, ప్రామిసరి నోటు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎవరైన ఇలాంటి చీటింగ్, బెదిరింపులకు పాల్పడితే 9490617111 ద్వారా తమను సంప్రదించవచ్చని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. -
ఖేడ్ ఎస్ఐని సస్పెండ్ చేయాలి
నారాయణఖేడ్ : నాగల్గిద్దలో అంబేడ్కర్ గద్దె విషయంలో నారాయణఖేడ్ ఎస్ఐ నరేందర్ తన పరిధి కానప్పటికీ అగ్రవర్ణాలతో కుమ్మక్కై పోలీసు బలగాలు, లాఠీలతో వచ్చి దళితులను దూషించినందుకు ఆయనను సస్పెండ్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పలు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ అంబేడ్కర్ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జీవన్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు, ఖేడ్ నియోజకవర్గ అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు కాన్షీరాం, నాగల్గిద్ద మండలశాఖ అధ్యక్షుడు గణపతి, అంబేడ్కర్సేన అధ్యక్షుడు రాజ్కుమార్, నియోజకవర్గ మాలమహానాడు అధ్యక్షుడు భీంసేనలు మాట్లాడుతూ.. నాగల్గిద్దలో గద్దె విషయంలో అభ్యంతరం ఉంటే దళిత సంఘాల వారిని పిలిపించి మాట్లాడాల్సిందని అన్నారు. కూల్చివేయాలనుకుంటే నోటీసులు ఇవ్వాల్సిందన్నారు. అవేమీలేకుండా పోలీసు బలగాలతో వచ్చిన ఎస్ఐ నరేందర్ దళితులను దూషిస్తూ జేసీబీతో గద్దెను కూల్చివేయడమే కాకుండ, నాగల్గిద్ద దళిత సర్పంచ్ని అవమనపర్చాని ఆరోపించారు. ఆయా విషయాలపై డీజీపీ, ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర, జాతీయ కమిషన్లకు ఫిర్యాదు చేయడంతో పాటు, త్వరలోనే ఆత్మగౌరవసభ పెట్టి హక్కులను సాధించుకుంటామని అన్నారు. -
అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకుందాం
సాక్షి, మక్తల్ : కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకు కుట్ర పన్నిందని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.వై రత్నం, కేఎన్పీఎస్ రాష్ట్ర నాయకుడు డి.చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని ఎస్ఎస్ పంక్షన్హాల్లో కేఎన్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా మొదటి మహసభలో వారు అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. అంటరానితనం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలను చేయాలని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్ధాలు దాటుతున్నా ఇంకా ప్రజలు తమ హక్కులను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత పీడిత కులాల మహిళలను అవమానించే రీతిలో జోగిని, బస్వినీలుగా మార్చే సంస్కృతి నుంచి బయట పడాలని సూచించారు. తెలంగాణ వచ్చిన వెంటనే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాట మార్చారని, మైనార్టీలపై దాడులు చేస్తుంటే పట్టించుకోవడంలేదన్నారు. సమాజంలో సామాజిక సమానత్వం, స్వేచ్ఛ, సౌబ్రాతృత్వం విలువలను కాపాడాటానికి అందరు తమవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కెఎన్పీఎస్ రాష్ట్ర నాయకులు భూరం అభినవ్, రాములు, బండారి నర్సప్ప, రమేష్, లింగన్న, కృష్ణ, శ్రీదేవి, రాంచందర్, మద్దిలేటి, వామన్, మున్వర్అలీ, బండారి లక్ష్మణ్, వెంకటేస్ తదితరులు పాల్గొన్నారు. -
అట్రాసిటీ చట్టంపై ఆర్డినెన్స్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో ఎన్డీయే ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిచాల్సిన అవసరం లేదని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి థావర్చంద్ గెహ్లాట్ పేర్కొన్నారు. అట్రాసిటీ చట్టంపై సుప్రీం కోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం ద్వారా రివ్యూ పిటివేషన్ వేశామని, ఒకవేళ తీర్పు అనుకూలంగా రాకపోతే అట్రాసిటీ చట్టంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి యథాతధ స్థితిలో ఉంచుతామన్నారు. ఈ విషయంలో ఎస్సీ, ఎస్టీలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.. ఆ తర్వాత బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. యూపీఏ హయాంలో 4.4 శాతం ఉన్న జీడీపీ... ప్రస్తుతం నరేంద్రమోదీ పాలనలో 7.7 శాతానికి పెరిగినట్లు తెలిపారు. మోదీ నాలుగేళ్ల పాలనలో దేశంలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. 2020 వరకు దేశంలోని ప్రతీ నిరుపేదకు సొంత ఇళ్లు నిర్మించాలన్నదే ప్రధాని ధ్యేయమని అన్నారు. జన్ధన్ యోజనతో 32 కోట్ల కుటుంబాలకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు తెరవడం జరిగిందన్నారు. ఇటీవలే జరిగిన పలు సర్వేల్లో నరేంద్రమోదీపై 65 శాతం నుంచి 70 శాతం ప్రజలు అనుకూలంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో బీజేపీ అనుకూలమైన వాతావరణం ఉందని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. దేశంలోని 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, త్వరలో జరగనున్న రాజస్థాన్, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లకు ఓకే
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంలో చట్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లవచ్చని పేర్కొంది. పదోన్నతుల్లో రిజర్వేషన్లపై వేర్వేరు హైకోర్టు తీర్పులతో పాటు, 2015లో సుప్రీంకోర్టు జారీచేసిన ‘స్టేటస్ కో’ ఉత్తర్వుల వల్ల మొత్తం ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయిందని, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ముందుకెళ్లేందుకు అనుమతించాలని మంగళవారం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దానిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ అశోక్ భూషణ్ల వెకేషన్ బెంచ్ ఈ అంశంపై స్పష్టతనిస్తూ.. ‘చట్ట ప్రకారం పదోన్నతులు కల్పించకుండా కేంద్రాన్ని అడ్డుకోలేరు, ఈ అంశంలో కేంద్రం ముందుకెళ్లవచ్చు. అయితే తదుపరి ఉత్తర్వులకు ప్రస్తుత తీర్పు లోబడి ఉంటుంది’ అని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లను పొడిగిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్ని కొట్టేస్తూ ఢిల్లీ హైకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) మణిందర్ సింగ్ వాదిస్తూ.. ‘ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఢిల్లీ, బాంబే, పంజాబ్, హరియాణా హైకోర్టులు వేర్వేరు తీర్పులిచ్చాయి. ఆ తీర్పులపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అత్యున్నత ధర్మాసనం కూడా వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది’ అని చెప్పారు. రాజ్యాంగ ధర్మాసనం వెలిబుచ్చిన అభిప్రాయంతో పాటు సుప్రీంకోర్టులోని వేర్వేరు ధర్మసనాల తీర్పుల్ని ఆయన ప్రస్తావించారు. ‘ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లకు సంబంధించి ‘స్టేటస్ కో’ కొనసాగుతుందని ఒక ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే అంశంపై మే 17న జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ.. ప్రమోషన్ల అంశంలో ప్రభుత్వం తీసుకునే చర్యలకు పెండింగ్ పిటిషన్ అడ్డంకి కాకూడదని పేర్కొంది’ అని సుప్రీంకు సింగ్ తెలిపారు. అలాగే పదోన్నతుల్లో రిజర్వేషన్లకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు తీర్పుల్ని ఏఎస్జీ ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితులకు 2006 నాటి ఎం.నాగరాజ్ కేసులో సుప్రీం వెలువరించిన తీర్పును అమలుచేయవచ్చని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లకు క్రీమీలేయర్ వర్తించదని ఎం.నాగరాజ్ తీర్పులో సుప్రీం స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రమోషన్ల పక్రియను ఎలా కొనసాగిస్తున్నారని ఏఎస్జీని ధర్మాసనం ప్రశ్నించగా.. ‘పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. రాజ్యాంగం కల్పించిన అధికారం మేరకు ప్రమోషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది. మే 17న సుప్రీం ఇచ్చిన తీర్పు లాంటిదే కేంద్రం కోరుకుంటుంది’ అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 (4ఏ) కేంద్రానికి కట్టబెట్టిందని ఏఎస్జీ సింగ్ వాదించారు. ‘ఆ అధికరణం ప్రకారం కేంద్రానికి అధికారం ఉంది. దానికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ముందుకెళ్లవచ్చు’ అని జస్టిస్ గోయల్, జస్టిస్ అశోక్ భూషణ్ల ధర్మాసనం కేంద్రానికి సూచించింది. -
జేసీ.. నోరు అదుపులో పెట్టుకో
సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు సర్కారు దళిత చట్టాలను అపహాస్యం చేస్తోందని, దళితుల నోటికాడి కూడును చంద్రబాబు బొక్కుతున్నారని ఆయన దుయ్యబట్టారు. సోమవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ రుణాలను టీడీపీ నేతలకు ధారాదత్తం చేస్తోందని, ఎస్సీ కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారిందన్నారు. జూపూడి ప్రభాకర్ని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది దోచుకోవటానికి కాదని హితవు పలికారు. దళితుల సొమ్ము దోచుకోవడానికి సిగ్గు లేదా అంటూ జూపూడి ప్రభాకర్ని ప్రశ్నించారు. జేసీ దివాకర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, ఆదినారాయణ రెడ్డి దళితులతో పెట్టుకోవటం మంచిది కాదని హెచ్చరించారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే 100కోట్ల రూపాయల మేర ఎస్సీ కార్పొరేషన్ నిధులు గల్లంతయ్యాయని తెలిపారు. నిధుల గల్లంతుపై చంద్రబాబు వెంటనే సీబీఐ విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని అన్నారు. వైఎస్సార్సీపీ దళితుల తరపున ఉద్యమిస్తుందని ఆయన స్పష్టం చేశారు. -
‘ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెరుగుతాయి’
పాట్నా: దేశంలో మారుతున్న జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉందని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ చంపారన్ జిల్లాలో మంగళవారం థార గిరిజన తెగలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నితీష్ మాట్లాడుతూ.. 2021 నాటికి దేశంలో దళితులు, గిరిజనుల జనాభా పెరుగుతుందని, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. రిజర్వేషన్లు పెరిగితే దళిత, గిరిజనులకు మంచి అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో పర్యటను వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరు తమకు రిజర్వేషన్ల కేటా ఎందుకు పెంచట్లేదని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్ల పెంపు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదని, అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబందించిన అంశమని పేర్కొన్నారు. కాగా నితీష్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఆర్జేడీ స్పందించింది. రిజర్వేషన్ల పేరుతో దళితులను, గిరిజనులను మభ్యపెట్టి నితీష్ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆర్జేడీ నేత మృత్యుంజయ తివారి విమర్శించారు. నిజంగా గిరిజనులపై సానుభూతి ఉంటే రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వంపై ఎందకు ఒత్తిడి తీసుకురావట్లేదని మృత్యుంజయ ప్రశ్నించారు. -
అర్హులందరికీ సబ్సిడీ రుణాలు
అశ్వారావుపేటరూరల్: జిల్లాలో అర్హులైన వారందరికీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తుందని కార్పొరేషన్ ఈడీ ముత్యాల పులిరాజు అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2016–17 ఆర్థిక సంవత్సారంలో జిల్లాకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 771 యూనిట్లు లక్ష్యం కాగా.. రూ.9.4కోట్ల సబ్సిడీ ప్రభుత్వం కేటాయించిందన్నారు. అందులో 635 యూనిట్లను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. వీటిల్లో 619 యూనిట్లకు రూ.5.87కోట్ల సబ్సిడీని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. ఆరు మండలాల్లో రుణాల మేళా కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. ఈ నెల చివరి నాటికి అన్ని మండలాల్లో పూర్తి చేస్తామన్నారు. అదే విధంగా 2017–18 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 2,323 యూనిట్లు లక్ష్యం కాగా.. రూ.26.47కోట్లు బబ్సిడీని కేటాయించినట్లు తెలిపారు. దీనికి తోడు అదనంగా మరో మూడు యూనిట్లు మంజూరు చేశామన్నారు. దీనికి సంబంధించిన సబ్సిడీ రూ. 26.05కోట్లను ఈ నెలాఖరుకు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అలాగే 2018–19 ఆర్థిక సంవత్సారానికి సంబంధించిన రుణాల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 95 రకాల యూనిట్లు ఉండగా.. లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకురేందుకు మరిన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఆయా కుల సంఘాల అభిప్రాయాలను తీసుకున్నామన్నారు. ఈ 95 రకాల యూనిట్లలో అవసరంలేని వాటిని రద్దు చేస్తామన్నారు. సమావేశంలో ఎంపీడీఓ ఓంటేరు దేవరాజ్, ఇతర సిబ్బంది ఉన్నారు. -
ఉన్నత చదువు ఎక్కడైనా ఉచితం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఎక్కడ చదివినా వారి ఫీజులను సర్కారే భరించనుంది. ప్రస్తుతం ఉన్నత, సాంకేతిక విద్య అభ్యసించే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అందుబాటులో ఉంది. కానీ ఇది కేవలం రాష్ట్ర పరిధిలోని విద్యా సంస్థల వరకే పరిమితం. సెట్ (కామన్ ఎంట్రన్స్ టెస్ట్) రాసిన తర్వాత కన్వీనర్ కోటాలో వచ్చే సీట్లకు మాత్రమే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తోంది. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కొందరు ఇతర రాష్ట్రాల్లోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తున్నా.. ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల అందులో చేరలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలు పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజులను భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఈ పథకం 2017–18 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వచ్చినా.. కేటగిరీల వారీగా విద్యాసంస్థలు, వర్సిటీల పేర్లను పేర్కొంటూ ఎస్సీ అభివృద్ధి శాఖ రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. ఏటా 4 వేల మందికి లబ్ధి ఇతర రాష్ట్రాల్లో ఉన్నత చదువులపై తెలంగాణ విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ట్రిపుల్ఐటీ, ఐఐటీ సీట్లలో రాష్ట్ర విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మరోవైపు సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సైతం పలు పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ.. ప్రఖ్యాత వర్సిటీలు, విద్యా సంస్థల్లో సీట్లు సంపాదిస్తున్నారు. గతేడాది సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి ఏకంగా 260 మంది విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీ, అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ, ట్రిపుల్ఐటీ, నిట్ తదితర విద్యా సంస్థల్లో సీట్లు దక్కించుకున్నారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం పొరుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్న వారి సంఖ్య 20 వేల పైమాటే. వీరిలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు దాదాపు 4 వేల మంది ఉంటారని అంచనా. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 230 విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తిస్తుందని, దీనిపై విస్తృత ప్రచారం చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధిశాఖ సంచాలకుడు పి.కరుణాకర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
ఆచి తూచి అడుగేయాలి
దళిత వర్గాలను కులం పేరుతో కించపరిచినా, ఆ వర్గాల పట్ల వివక్ష చూపినా చర్యలు తీసుకోవడానికి ఆస్కారమిస్తున్న ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం వేధింపులకు ఆయుధంగా మారుతున్న ఉదంతాలు అనేకం ఉంటున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి, వాటిని నివారించేందుకు కీలక ఆదేశాలిచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై ఈ చట్టం కింద ఫిర్యాదులొస్తే తక్షణ అరెస్టుకు అవకాశం ఉండదు. ప్రభుత్వోద్యోగులపై ఫిర్యాదులొచ్చినప్పుడు వారి నియామక అధికారి నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలి. ప్రైవేటు ఉద్యోగుల విషయంలో అయితే సీనియర్ పోలీసు సూపరింటెండెంట్(ఎస్ఎస్పీ) అనుమతి తీసుకోవాలి. అంతే కాదు... ఎఫ్ఐఆర్ నమోదు చేసేముందు సంబంధిత కేసు ఈ చట్టం పరిధిలోకి వస్తుందా రాదా అని ప్రాథమిక విచారణ జరపాలి. అది సహేతుకమైనదని నిర్ధా రించుకోవాలి. కేసుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవనుకుంటే నింది తుడికి ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చునని కూడా సుప్రీంకోర్టు సూచించింది. దాదాపు మూడు దశాబ్దాలనాడు వచ్చిన ఈ చట్టం అమలు విషయంలో మొదటినుంచీ రెండు రకాల అభిప్రాయాలుంటున్నాయి. అది సమర్ధవంతంగా అమలు కావడం లేదని, కేసు నమోదులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నదని దళిత సంఘాలు ఆరోపిస్తుండగా...తమపై అన్యాయంగా కేసు పెట్టారని వాపోయేవారూ ఉంటు న్నారు. కేవలం ఈ చట్టం విషయంలోనే కాదు... దాదాపు అన్ని చట్టాల అమలు విషయంలోనూ ఇలాంటి పరస్పర విరుద్ధమైన వాదనలు వినబడటం రివాజే. మన దేశంలో శతాబ్దాలుగా అవిచ్ఛిన్నంగా సాగుతున్న కులవ్యవస్థ అసమానత లకూ, అఘాయిత్యాలకూ, అవమానాలకూ, వివక్షకూ తావిస్తోంది. దీన్ని సరిదిద్దేం దుకు కొందరూ, నామరూపాల్లేకుండా చేయాలని మరికొందరూ ప్రయత్నిస్తున్నా కులతత్వం పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. 1905లో బాబా సాహెబ్ అంబే డ్కర్ ఎదుర్కొన్నలాంటి స్థితిగతులే కాస్త హెచ్చుతగ్గులతో ఇప్పటికీ రాజ్యమేలుతు న్నాయి. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమంటే... ఆయన నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగంవల్ల, అది కల్పించిన హక్కుల వల్ల ఆ వర్గాల్లో విద్యాధికులు పెరిగారు. చైతన్యం హెచ్చింది. ప్రశ్నించే తత్వం విస్తరిస్తోంది. అంతమాత్రాన సమాజంలో వివక్ష అంతరించిందా? అవమానాలూ, అఘాయిత్యాలూ సమసిపోయాయా? దళి తులకూ, ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్ల సదుపాయం లభించి వచ్చే ఏడాదికి 70 ఏళ్లవుతుంది. ఇంతకాలమైనా దళిత వర్గాల్లోని అట్టడుగు కులాలకు అవి ఇంకా చేరనేలేదు. మరోపక్క 1958నాటి కిలవేన్మణి(తమిళనాడు) ఉదంతం మొదలుకొని నిన్నమొన్నటి ఉనా(గుజరాత్) ఘటన వరకూ దళితులపై ఆధిపత్య కులాల అఘాయిత్యాలు సాగుతూనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1996లో దళిత యువకులకు శిరోముండనం చేసిన ఉదంతం జరిగి 22 ఏళ్లవుతున్నా ఈనా టికీ ఆ కేసు నత్తనడకన నడుస్తోంది. పైగా బాధితులు దళితులు కాదు.. బీసీలన్న వాదనలు బయల్దేరుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యువ మేధావి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న ఉదంతంలో ఆరోపణలొచ్చిన ఎవ రిపైనా ఇంకా దర్యాప్తు పూర్తికాలేదు. కేసులు నమోదు కాలేదు. ఆయన తల్లి దళిత మహిళే అయినా రోహిత్ వేముల బీసీ కులంకిందికొస్తారని తర్కిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో వాకపల్లి ఆదివాసీ మహిళలపై గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారాలకు పాల్పడ్డారన్న ఉదంతం విచారణలోనూ ఏళ్ల తరబడి అనిశ్చితే అలముకొంది. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత ఈమధ్యే దానికి కదలిక వచ్చింది. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం1989లో వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసిన ఉదంతాలు లేనేలేవని ఎవరూ అనరు. ఏ చట్టాన్నయినా దుర్వినియోగం చేసేవారు ఎప్పుడూ ఉంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకొచ్చిన నిర్దిష్టమైన కేసు కూడా ఆ కోవలోనిదే కావొచ్చు. కానీ ఒక చట్టం దుర్వినియోగం అవుతున్నదా లేదా అనేది ఆ చట్టంకింద పడే శిక్షల శాతాన్నిబట్టి నిర్ణయించడం సబబుకాదు. కేసు వీగిపోవడానికి పోలీసు దర్యాప్తు సక్రమంగా లేకపోవడం మొదలుకొని సాక్షులు గట్టిగా నిలబడకపోవడం వరకూ సవాలక్ష కారణాలుంటాయి. ఆధిపత్యకులాల అజ్మాయిషీ బాగా నడిచేచోట తమకు జరిగిన అన్యాయంపై కేసులు పెట్టేందుకే దళితులు జంకుతారు. వారు ధైర్యం చేసి కేసులు పెట్టినా ఆ కేసుల్ని రిజిస్టర్ చేయడంలో పోలీసులు తాత్సారం చేస్తారు. భయపెట్టి, డబ్బు ఆశచూపి లోబర్చుకునే ప్రయత్నాలూ సాగుతాయి. ‘కేసు నిజ మైనదే అయినా తగిన సాక్ష్యాలు లేవ’ని, ‘తప్పుడు కేసుల’ని, ‘పొరబడి పెట్టిన కేసుల’ని పేరుబెట్టి బుట్టదాఖలా చేయడం చాలా ఉదంతాల్లో కనబడుతుంది. నిజా నికి ఈ చట్టంకింద పోలీసులు పెట్టే కేసుల్లో 50 శాతం న్యాయస్థానాల వరకూ పోనేపోవని ఆమధ్య ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అధ్యయనంలో తేలింది. 2015లో ఎన్డీఏ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం ఆచరణలో బాధితులకు సక్రమంగా వినియోగపడటం లేదని భావించి దానికి సవరణలు తీసు కొచ్చింది. అయినప్పటికీ నిరుడు కేంద్ర హోంశాఖ వార్షిక నివేదికను బట్టి చూస్తే చట్టం అమల్లో ఉన్నా దళితులు, ఆదివాసీలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చింది. చట్టం కారణంగా అమాయక పౌరులకు వేధింపులుండరాదని, కులవిద్వేషాలు ఏర్పడకూడదని సుప్రీంకోర్టు వెలిబుచ్చిన ఆత్రుత అర్ధం చేసుకోదగిందే. ఆ చట్టం కింద అందిన ఫిర్యాదులపై చిత్తశుద్ధితో సత్వర దర్యాప్తు చేపట్టేలా చర్యలు తీసు కున్నప్పుడే అది సాధ్యమవుతుంది. సుప్రీంకోర్టు ప్రస్తుతం ఇచ్చిన ఆదేశాలతో నిమిత్తం లేకుండానే చాలా సందర్భాల్లో కేసుల నమోదులో, నిందితుల అరెస్టులో అంతులేని జాప్యం చోటుచేసుకుంటున్నదని గణాంకాలు చెబుతున్నాయి. ఇకపై అది మరింత పెరిగే ప్రమాదం లేదా? అన్ని కోణాల్లోనూ తాజా తీర్పును పరిశీలించి అణగారిన వర్గాల హక్కులకు భంగం వాటిల్లకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం అవసరం. -
కాటేసిన లంచం
లంచం అడిగితే చెప్పుతో కొట్టండని రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చినా.. అధికారుల తీరులో మాత్రం మార్పు కానరావడం లేదు.ఇదే లంచం ఓ రైతు కుటుంబాన్నిబలి తీసుకుంది. కాసిపేట (బెల్లంపల్లి): రుణం మంజూరు కోసం లంచం ఇచ్చుకోలేక ఓ రైతు భార్యా ఇద్దరు పిల్లలకు విషం తాగించి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య మృతి చెందగా.. పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చొప్పరిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తిరుపతి తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు. వ్యవసాయంలో ఆశించిన మేరకు లాభాలు రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. దీంతో వ్యవసాయం వదిలి టెంట్హౌస్ కోసం ఎస్సీ కార్పొరేషన్లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ను కలసి తన దీనస్థితిని వివరించగా.. స్పందించిన ఆయన యూనిట్ మంజూరుకు సిఫారసు చేశారు. అయితే ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ ప్రణయ్ రుణం మంజూరుకు రూ.20 వేలు లంచం అడగడంతో ఇప్పటికే అప్పుల పాలైన తాను లంచం ఇచ్చుకునే స్థితిలో లేనని, ఇక రుణం రాదని తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో కుటుంబంతో సహా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 27న రాత్రి భార్య భూదేవి (31), కుమార్తె కీర్తన (14), కుమారుడు శిశాంత్ (12)లకు నిద్రమాత్రలు ఇచ్చి తానూ వేసుకున్నాడు. అందరూ తీవ్రమైన మత్తులోకి జారుకున్నారు. కానీ అదృష్టవశాత్తు వారికి ప్రాణాపాయం జరగలేదు. అప్పటి నుంచి ఆందోళనగా ఉన్న తిరుపతి.. బుధవారం రాత్రి భార్యాపిల్లలకు యాపిల్ జ్యూస్లో క్రిమిసంహారక మందు తాగించాడు. పిల్లలు అపస్మారక స్థితిలోకి చేరుకోగా, భార్య మృతి చెందింది. ముగ్గురూ చనిపోయినట్లు భావించిన తిరుపతి.. తన అన్నయ్య శంకర్కు ఫోన్ చేయగా.. అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం శంకర్ తిరిగి ఫోన్ చేయగా కొద్దిగా స్పృహలోకి వచ్చిన పిల్లలు ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మానాన్నలు చనిపోయినట్లు విలపిస్తూ చెప్పారు. దీంతో శంకర్ హుటాహుటిన వచ్చి పిల్లలను బెల్లంపల్లి ఆసుపత్రికి.. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లలిద్దరూ కోలుకుంటున్నారు. వాయిస్ రికార్డు.. సూసైడ్నోట్ తిరుపతి ఆత్మహత్య చేసుకునే సూసైడ్ నోట్, ఫోన్లో వాయిస్ రికార్డు చేశాడు. తాను ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.6.5 లక్షల వరకు అప్పులు అయ్యాయని, ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.5 లక్షల రుణం మంజూరైనా దానిని ఇప్పించేందుకు బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పనిచేసే ప్రణయ్ సార్ (జూనియర్ అసిస్టెంట్) రూ.20 వేలు లంచం అడుగుతున్నాడని పేర్కొన్నాడు. రుణం మంజూరు కాకపోవడం, అప్పులబాధ భరించలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వివరించాడు. గ్రామస్తుల రాస్తారోకో: లంచం అడిగి దంపతుల మృతికి కారకుడైన జూనియర్ అసిస్టెంట్ ప్రణయ్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు చొప్పరిపల్లి వద్ద రహదారిపై రాస్తారోకో చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయా లని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మందమర్రి సీఐ రాంచందర్రావు భరోసా ఇవ్వడంతోఆందోళన విరమించారు. నాన్ బెయిలబుల్ కేసు పెడతాం: ఏసీపీ అప్పుల విషయంలో ఒత్తిడి తెచ్చిన వారి వివరాలు సేకరించి వారిపై, లంచం అడిగిన ఉద్యోగిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తామని బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ తెలిపారు. మంజూరైన రూ.5 లక్షల రుణాన్ని కలెక్టర్తో మాట్లాడి తిరుపతి కుటుంబానికి అందించేలా చూస్తామన్నారు. పిల్లలు చదువుకునేందుకు సహకరిస్తామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. డబ్బులు అడగలేదు: ఎంపీడీఓ బెల్లంపల్లి రూరల్: తిరుపతిని ఎస్సీ కార్పొరేషన్ రుణం మంజూరు కోసం ఎవరూ డబ్బులు అడగలేదని బెల్లంపల్లి ఎంపీడీఓ వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతికి రూ.5 లక్షల రుణం మంజూరు చేసి గతనెల 11న ఆన్లైన్లో అఫ్రూవల్ ఇచ్చామని పేర్కొన్నారు. రుణం మంజూరయ్యాక ఆ డబ్బులు అప్పులు కట్టుకోకుండా యూనిట్ పెట్టుకోవాలని చెప్పామే తప్ప కార్యాలయంలో ఎవరూ డబ్బులు అడగలేదని ఆయన స్పష్టం చేశారు. రుణం మంజూరు చేశాం ఎస్సీ కార్పొరేషన్ రుణం కోసం దరఖాస్తు చేసుకోగా బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో తిరుపతి పేరు ఉంది. అతడి దరఖాస్తును పరిశీలించి కలెక్టర్ సిఫారసుతో రూ.5 లక్షల రుణం మంజూరు చేస్తూ ఆన్లైన్లో అప్రూవల్ ఇచ్చాం. రుణం మంజూరు అయిన విషయాన్ని రెండు రోజుల క్రితమే బెల్లంపల్లి ఎంపీడీఓ ద్వారా లబ్ధిదారుడికి తెలియజేశాం. రూ.5 లక్షల రుణంలో రూ.2 లక్షలు బ్యాంకు రుణం కాగా.. మిగతా రూ.3 లక్షలు సబ్సిడీని వర్తింప చేశాం. రుణం మంజూరు కోసం డబ్బులు ఎవరడిగారో నాకు తెలియదు. రుణం మంజూరు చేసినట్లు సమాచారం ఇచ్చాక కూడా తిరుపతి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందో అర్థంకావడం లేదు. – హరినాథ్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ -
టీడీపీ దళిత మహిళా నేతపై దాడి
మంగళగిరిరూరల్: తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆ పార్టీకి చెందిన దళిత మహిళా నాయకురాలికి అవమానం జరిగింది. నియోజకవర్గ ఇన్చార్జి ఎదుటే ఆ పార్టీ నాయకులు కొందరు ఆమెను కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు సదరు టీడీపీ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దర్శి వనరాణి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ అధినేత రాజకీయ ప్రస్థానం 40 ఏళ్లు అయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గంజి చిరంజీవి ఇంటి వద్ద ఆయనతో పాటు పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా విభాగం జిల్లా కార్యవర్గ సభ్యురాలు దర్శి వనరాణి సమస్యలను వివరిస్తుంటే ‘‘ఇది చౌదర్ల పార్టీ నువ్వు మాట్లాడడానికి వీల్లేదు.. కూర్చో’’ అంటూ పార్టీ నేత పోలవరపు హరిబాబు అడ్డుకున్నాడు. ‘‘పదవులు ఇస్తే మీ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. మీకు పదవులు ఇచ్చినందుకు మా కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు పోసుకోవాలి. కులం తక్కువవాళ్లను పక్కన పెట్టాలి.’’ అంటూ విద్వేషంగా మాట్లాడాడు. దీంతో ఆమె చిన్నబుచ్చుకుని బయటకు వస్తుంటే కులం పేరుతో మరోసారి దూషించి దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె భోరుమని విలపించింది. టీడీపీలో మొదటినుంచి పనిచేస్తున్న తమలాంటి వారిని కుల అహంకారంతో అందరి సమక్షంలోనే హరిబాబు దూషించి, దాడికి పాల్పడినా ఎవరూ మాట్లాడలేదని వాపోయారు. పైగా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గంజి చిరంజీవి తన వాహనంలో హరిబాబును తీసుకుని వెళ్లిపోయారన్నారు. తనను అవమానపరిచిన హరిబాబుని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి దళితుల గౌరవాన్ని కాపాడాలని ఆమె విలేకరుల సమావేశంలో కోరారు. అనంతరం ఈ సంఘటనపై మంగళగిరి పోలీస్స్టేషన్లో దళిత సంఘాల నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోలవరపు హరిబాబుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దళితతేజం కార్యక్రమాన్ని బహిష్కరిస్తూ తీర్మానం టీడీపీ అధిష్టానం ఆదేశాల ప్రకారం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న దళితతేజం కార్యక్రమాన్ని బహిష్కరిస్తూ టీడీపీ దళితనేతలు ఏకగ్రీవంగా తీర్మానించారు. మంగళగిరిలో నియోజకవర్గ దళిత నేతల అత్యవసర సమావేశం మంగళవారం నిర్వహించారు. దర్శి వనరాణి పట్ల హరిబాబు దాడిచేసి, కులంపేరుతో అసభ్యంగా మాట్లాడాడని, అతనిపై చర్యలు తీసుకునేవరకు దళితతేజం–తెలుగుదేశం కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామన్నారు. సమావేశంలో దళిత నాయకులు జ్యోతిబసు, వెలగపాటి విలియం, మరియదాసు, కుక్కమళ్ళ సాంబశివరావు, కొమ్మా లవకుమార్, కంచర్ల ప్రకాశరావు, రావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ నిరుద్యోగ యువతకు... ఇక సులువుగా కొలువు!
ప్రత్యేక జాబ్ యాప్కు శ్రీకారం చుట్టిన ఎస్సీ కార్పొరేషన్ ∙ ఇంటర్, డిగ్రీ మధ్యలో ఆపేసిన వారిని దృష్టిలో పెట్టుకొని తయారీ అందులో వివరాలు నమోదు చేసుకుంటే శిక్షణ, ఉపాధి బాధ్యత కార్పొరేషన్దే ∙ త్వరలో అందుబాటులోకి తేనున్న ఎస్సీ అభివృద్ధి శాఖ సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)కు చెందిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గ్రాడ్యుయేషన్, అంతకు మించిన కోర్సులు చదివిన ఎస్సీ యువతకు సులువుగా ఉద్యోగాలు దొరుకుతున్నప్పటికీ వివిధ కారణాలతో ఇంటర్మీడియెట్, డిగ్రీ కోర్సులను మధ్యలో మానేసిన యువతీ యువకులు ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక జాబ్ యాప్ను తీసుకురానుంది. అర్ధంతరంగా చదువు ఆపేసిన యువతకు ఈ యాప్ ద్వారా తప్పనిసరి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టనుంది. ప్రస్తుతం ఈ యాప్ రూపకల్పనపై అధికారులు సాంకేతిక నిపుణులతో పలుమార్లు చర్చలు జరిపారు. అతి త్వరలోనే ఈ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. నైపుణ్యాభివృద్ధి తర్వాతే ఉద్యోగం... ప్రస్తుతం ప్రైవేటు కంపెనీల్లో విద్యార్హతతోపాటు నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎస్సీ కార్పొరేషన్...నిరుద్యోగ ఎస్సీ యువతకు శిక్షణతో కూడిన ఉపాధి కల్పించడంపై దృష్టి సారించింది. కార్పొరేషన్ అందుబాటులోకి తెచ్చే యాప్లో ముందుగా అభ్యర్థి వివరాలు నమోదు చేసుకోవాలి. విద్యార్హతతోపాటు ఆసక్తి, అనుభవాన్ని సైతం తెలియజేయాలి. అలా ఆసక్తి, అర్హతల ఆధారంగా అభ్యర్థుల వివరాలను కార్పొరేషన్ విశ్లేషిస్తుం ది. ఆ తర్వాత వారిని కేటగిరీలవారీగా విభ జించి తగిన రంగంలో శిక్షణ ఇస్తుంది. నిర్ణీత గడువులో శిక్షణ పూర్తిచేసుకొని మెరుగైన ప్రతి భ కనబర్చిన వారికి సంబంధిత కంపెనీల్లో ఉద్యోగాలు సైతం కల్పిస్తుంది. అవసరమైతే మరికొంత కాలం శిక్షణ తరగతులు కూడా నిర్వహించి బ్యాచ్లోని వారందరికీ పూర్తిస్థాయిలో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయనుంది. ఉద్యోగ కల్పనకు ఎస్సీ కార్పొరేషన్ యంత్రాంగం ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అపోలో హాస్పిటల్స్, కెల్ట్రాన్, సెంట్రో, నాక్ తదితర ప్రఖ్యాత సంస్థల్లో వివిధ కేటగిరీల్లో ఇప్పటివరకు వెయ్యి మందికిపైగా ఉపాధి కల్పించింది. ఎస్సీ యువతకు ఉపాధిని విస్తృతం చేసే క్రమంలో ఈ యాప్ను తయారు చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లచ్చిరామ్ భూక్యా ‘సాక్షి’కి తెలిపారు. -
2,073 ఎకరాలు.. ‘పంపిణీ’కి సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: దళితుల భూ పంపిణీపై ఎస్సీ కార్పొరేషన్ వడివడిగా కదులుతోంది. ఇప్పటివరకు భూముల కొనుగోలుపై దృష్టి సారించిన అధికారులు.. తాజాగా వాటిని పంపిణీ చేసే పనిలోపడ్డారు. 2017–18 వార్షిక సంవత్సరంలో 10,254 ఎకరాలు పంపిణీ చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఎస్సీ కార్పొరేషన్.. ఇప్పటివరకు 2,073 ఎకరాలకు సంబంధించి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది. ఇందుకు రూ.96.74 కోట్లు ఖర్చు చేసింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటు రికార్డుల్లో మార్పులు పూర్తి చేసి.. సదరు భూమిని పొజిషన్లోకి తీసుకుంది. దీంతో ఈ భూమిని పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. మరో 3 వేల ఎకరాలు ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ వద్ద మరో 3 వేల ఎకరాలకు సంబంధించి ప్రతిపాదనలున్నాయి. ఈ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేస్తున్నారు. భూముల తీరును పూర్తిగా పరిశీలించిన తర్వాతే వాటిని కొనుగోలు చేయనున్నారు. మరోవైపు లక్ష్యానికి తగ్గట్టుగా పలు జిల్లాల్లో భూ లభ్యత ఆశాజనకంగా లేదు. అనువైన భూములు ఉంటే ధరలు ఎక్కువగా ఉండటం.. తక్కువ ధరలుంటే సారం లేకపోవడంతో అధికారులు ఆయా భూముల జోలికి వెళ్లడం లేదు. దీంతో ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యంలో 50 శాతం మాత్రమే సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇక అందుబాటులో ఉన్న భూములను పూర్తి స్థాయి సౌకర్యాలతో పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ఈ నెలాఖరులోగా అందుబాటులో ఉన్న 2,073 ఎకరాలు పంపిణీ చేసి.. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 3 వేల ఎకరాలను పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. 11 జిల్లాల్లో నిల్! భూ పంపిణీ పథకానికి సంబంధించి మూడు జిల్లాలకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించలేదు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో కొనుగోలుకు అనువైన భూములు లేవు. హైదరాబాద్ జిల్లాలో సాగు భూములు లేకపోగా.. మేడ్చల్ జిల్లాలో ఎకరా ధర కోట్లల్లో ఉండటంతో ఆ జిల్లాల్లో ఈ పథకం సాధ్యం కాదని అధికారులు అంచనాకు వచ్చారు. భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలోనూ ఈసారి లక్ష్యాన్ని నిర్దేశించలేదు. ఇవికాక మరో ఎనిమిది జిల్లాల్లోనూ భూముల లభ్యత ఆశాజనకంగా లేదు. జగిత్యాల, జనగామ, మహబూబ్నగర్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ (అర్బన్) జిల్లాల్లో భూ పంపిణీ పథకం నిబంధనల ప్రకారం సాగు భూములు లభించడం లేదు. దీంతో అధికారులు ఆయా జిల్లాల్లో భూములు కొనుగోలు చేయకపోవడంతో అక్కడ పంపిణీ ప్రక్రియకు బ్రేక్ వేశారు. దీంతో ఈ ఏడాది 20 జిల్లాల్లో మాత్రమే భూ పంపిణీ జరిగే అవకాశం ఉంది. -
ఎస్సీ కార్పొరేషన్ ‘రుణమేళా’
సాక్షి, హైదరాబాద్: కార్పొరేషన్ ద్వారా ‘స్వయం ఉపాధి’రాయితీ రుణాలకు ఎంపికైన అర్హులకు ఒకేసారి లబ్ధిని పంపిణీ చేయాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఇందుకోసం డిసెంబర్ నుంచి మండల స్థాయిలో ‘పంపిణీ మేళా’లు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించి ఆ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 2016–17 వార్షిక సంవత్సరంలో రాయితీ రుణాలకు ఎంపికైన 17,277 మందికి రూ.203.89 కోట్లను ఈ పంపిణీ మేళాల ద్వారా నేరుగా అందజేయనుంది. వాస్తవానికి స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసిన తర్వాత బ్యాంకర్ తనిఖీ చేసి రాయితీ నిధులు విడుదల చేస్తారు. అయితే యూనిట్లు ఏర్పాటయ్యాక రాయితీ ఇవ్వకుంటే ఎలా అనే సందేహంతో లబ్ధిదారులు యూనిట్ల ఏర్పాటుకు సాహసం చేయడం లేదనే భావన ఉంది. దీన్ని అధిగమించేందుకుగాను పంపిణీ మేళాలకు కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. తాజా కార్యక్రమం ద్వారా రాయితీ చెక్కును ముందే లబ్ధిదారునికి ఇవ్వనున్నారు. యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాత చెక్కును బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకుంటే సరిపోతుంది. చెక్కుల పంపిణీతో యూనిట్ల ఏర్పాటు వేగవంతమవుతుందని కార్పొరేషన్ వైస్చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లచ్చిరాం భూక్యా అన్నారు. డిసెంబర్ నెలంతా.. 2016–17లో స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ఎంపికైన లబ్ధిదారులకు డిసెంబర్ మొదటివారం నుంచి చెక్కులు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో భాగంగా మండలాల వారీగా పంపిణీ మేళా నిర్వహణ తేదీలు ఖరారు చేసుకోవాలి. మండల పరిషత్ అభివృద్ధి అధికారితో పాటు బ్యాంకు మేనేజర్, స్థానిక ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేసుకోవాలి. చెక్కుల పంపిణీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 17,277 మంది లబ్ధిదారులు నిర్దేశిత స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించేలా గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిçపల్ కమిషనర్లకు బాధ్యతలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఎస్సీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా మేళాలో అవగాహన కల్పించనున్నారు. -
వారిని ఫోన్లో దూషించడం నేరమే!
న్యూఢిల్లీ: ఓ వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్లో ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో దూషించడం నేరమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి ఓ కేసులో దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేసేందుకు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ నజీర్ల బెంచ్ నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1)(ఎస్) ప్రకారం నిమ్నవర్గాల వారిని బహిరంగ ప్రదేశాల్లో కులం పేరుతో దూషించడం నేరం. ఇందుకు గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. యూపీకి చెందిన ఓ వ్యక్తి గతంలో నిమ్న వర్గానికి చెందిన ఓ మహిళను కులం పేరుతో దూషించాడు. అప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఊళ్లలో ఉన్నపుడు ఫోన్లో మాట్లాడుకున్నారు. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం ఫోన్ సంభాషణ ‘బహిరంగ ప్రదేశం’ నిర్వచనం కిందకు రాదనీ, కాబట్టి కేసును కొట్టేసి, విచారణను నిలిపివేయాలని నిందితుడు కోర్టును కోరారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి నిందితుడు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, సేకరించిన సాక్ష్యాల ఆధారంగా నిందితుడిపై విచారణ జరపాల్సిందేనని హైకోర్టు గత ఆగస్టు 17న స్పష్టం చేసింది. దీంతో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ ఫోన్ సంభాషణను బహిరంగ ప్రదేశంలో మాట్లాడినట్లుగా పరిగణించకూడదనీ, కేసును కొట్టేయాలని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరిస్తూ, ఫోన్లో మాట్లాడిన సమయంలో నిందితుడు బహిరంగ ప్రదేశంలో లేడని నిరూపించుకోవాలంది. -
పదిరోజుల్లో ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారుల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందే లబ్ధిదారుల ఎంపిక మరో పది రోజుల్లో పూర్తి కానుంది. 2017–18 వార్షిక సంవత్సరానికి సంబంధించి 62,978 మందికి రాయితీ రుణాలు ఇచ్చేలా ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రణాళిక రూపొందించింది. క్షేత్రస్థాయిలో దరఖాస్తులు స్వీకరించిన ఆ శాఖ... పది రోజుల్లోగా అర్హులను తేల్చా ల్సిందిగా జిల్లా ఎస్సీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు లబ్ధిదా రులకు 3 కేటగిరీల్లో రాయితీలు అందిం చనుంది. రూ.లక్ష లోపు స్వయం ఉపాధి యూనిట్ నెలకొల్పిన లబ్ధిదారులకు రూ. 80 వేల రాయితీ అందిస్తోంది. రూ. 2 లక్షల యూనిట్పై రూ. 1.40 లక్షల రాయితీ, రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల యూనిట్పై 60% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యానికి సంబంధిం చి రాయితీ కింద రూ. 1,358.89 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. పదివేల ఎకరాల కొనుగోలుకు సిద్ధం దళితులకు భూ పంపిణీపై ప్రత్యేక కార్యా చరణ సిద్ధం చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. సంక్షేమ భవన్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాల యంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2017–18 వార్షిక సంవత్సరా నికి పదివేల ఎకరాలు కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. -
‘మూడెకరాల’కు కొత్త కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: దళితులకు మూడెకరాల భూ పంపిణీపై ఎస్సీ కార్పొరేషన్ కొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. 2017–18 వార్షిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు వేగవంతం చేసింది. నెలరోజుల ప్రణాళిక రూపొందించిన కార్పొరేషన్.. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 8924.21 ఎకరాల భూమిని దళిత రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. గతేడాది పంపిణీ ప్రక్రియ సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ ఏడాది గడువుకు ముందే లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలివ్వాలని భావిస్తోంది. నెలరోజుల కార్యాచరణ జిల్లాల వారీగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు భూ పంపిణీ లక్ష్యాలు నిర్దేశించిన ఎస్సీ కార్పొరేషన్.. ఆ మేరకు భూమి సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేసింది. భూముల మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులను పక్షం రోజుల్లోగా పూర్తి చేయాలని పేర్కొంది. అలాగే భూముల రిజిస్టర్, డీమార్కేషన్ ప్రక్రియను మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని సూచించింది. దీంతో జిల్లా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. 30 రోజుల పనిదినాల్లో ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మరోవైపు పంపిణీకి గుర్తించిన భూముల్లో నీటి వసతి ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. పంట ఖర్చుల పంపిణీ.. లబ్ధిదారులకు ఏడాదిపాటు సాగు ఖర్చులివ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. పథకం మార్గదర్శకాల్లోనూ నిబంధనలు పొందుపరిచింది. తాజాగా 2014–15 వార్షిక సంవత్సరానికి రైతులకు ఇవ్వాల్సిన సాగు ఖర్చుల పంపిణీకి ఎస్సీ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. 2014–15లో రాష్ట్రవ్యాప్తంగా 11,786 ఎకరాలు పంపిణీ చేయగా.. 6053.10 ఎకరాల్లో పంటలు వేస్తున్నారు. రైతులకు ఒకట్రెండు రోజుల్లో ఆర్థిక సాయం అందించాలని, మిగిలిన భూమికి నవంబర్ నెలాఖరులోగా నిధులివ్వాలని అధికారులు నిర్ణయించారు. -
సాక్షి విలేకరిపై టీడీపీ నేత హత్యాయత్నం
కదిరి అర్బన్: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గుడిసె దేవానంద్ ఆదివారం అనంతపురం జిల్లా కదిరిలో ‘సాక్షి’ విలేకరి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం చేశాడు. టీడీపీ నేత దేవా నంద్ పట్టణానికి చెందిన నిజాం వద్ద రూ.3.50 లక్షలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించగా ఆయనకు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టు దీనిపై అడ్వ కేట్ కమిషన్ను నియమించింది. ఈ విషయం ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 14న ‘ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్కు అరెస్ట్ వారెంట్’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో కోపోద్రిక్తుడైన దేవానంద్ వార్త రాసిన శ్రీనివాసరెడ్డిని హత్య చేయాలని పథకం పన్నాడు. వలీసాబ్రోడ్లో ఉదయమే టీ తాగేందుకు ఈ విలేకరి వస్తాడని రౌడీలను వెంట బెట్టుకొని 9 గంటల వరకు కాపు కాశాడు. అక్కడికి రాకపోయే సరికి మటన్ షాప్ వద్ద వేచి ఉన్నాడు. 9.30 గంటల ప్రాంతంలో శ్రీనివాస్రెడ్డి అక్కడికి వెళ్లగానే స్వయంగా దేవానందే మటన్ కత్తి తీసుకుని ‘ఒరేయ్.. నీకు ఎంత ధైర్యంరా.. నామీదే వార్త రాస్తావా?.. నిన్ను ఇక్కడే చంపితే ఎవర్రా నీకు దిక్కు..’ అంటూ దూసుకెళ్లాడు. అక్కడే ఉన్న స్థానికులు అడ్డుకున్నారు. వారి సాయంతో శ్రీనివాసరెడ్డి పట్టణ పోలీస్స్టేషన్ చేరుకుని దేవానంద్పై ఫిర్యాదు చేశాడు. అతని వల్ల తనకు ప్రాణహాని ఉందని అందులో పేర్కొన్నారు. వెంటనే పోలీసులు దేవానంద్పై కేసు నమోదు చేశారు. అయితే విలేకరి తనను కులం పేరుతో దూషించాడంటూ దేవానంద్ ఇచ్చిన ఫిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఎటువంటి విచారణ చేయకుండానే విలేకరిపై కేసు నమోదు చేశారు. పైగా నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంటున్న దేవానంద్ స్టేషన్కు వచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం విశేషం. జర్నలిస్ట్ల రాస్తారోకో సాక్షి విలేకరి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నా నికి నిరసనగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కదిరిలో ఆదివారం జర్నలిస్ట్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 205 జాతీయ రహదారిపై 2 గంటల పాటు రాస్తారోకో చేశారు. దాడికి పాల్పడిన దేవానంద్ను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ వాయిదా
అనంతపురం ఎడ్యుకేషన్: అనివార్య కారణాల వల్ల ఈనెల 14న నిర్వహించాల్సిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ వాయిదా వేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రోశన్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని దళితులు, గిరిజనులు, దళిత సంఘాలు, గిరిజన సంఘాల నాయకులుయ ఈ విషయాన్ని గమనించాలని కోరారు. -
విధుల్లో చేరిన ఫెసిలిటేటర్ల
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో అవగాహన కలిగించేందుకు జిల్లా వ్యాప్తంగా 396 మంది ఫెసిలిటేటర్లను నియమించగా, వారంతా మంగళవారం విధుల్లో చేరినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామూనాయక్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జూలై 30న ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రభుత్వ పథకాలపై ఇప్పటికే శిక్షణ అందించామన్నారు. -
ఆదరణపై అంకుశం
►దీనులకు అండగా నిలవనంటున్న ఎస్సీ కార్పొరేషన్ ►నీరుగారుతోన్న డిస్ట్రిక్ట్ ఇనీషియేటివ్ పథం ►ఆర్థికంగా చితికిపోతున్నా స్పందించనంటున్న అధికారులు ప్రతి శాఖలో అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ప్రజలు ఏమైపోతున్నా పట్టించుకొనే తీరిక వారికి దొరకడంలేదని అంతా బహిరంగంగా విమర్శిస్తున్నారు. తాజాగా ఎస్సీ కార్పొరేషన్ ఈ లిస్టులో చేరింది. హెచ్ఐవీ బాధితులు, చిన్న పిల్లలు ఉన్న వితంతువులు, వికలాంగులు చిరు వ్యాపారాలు నిర్వహించుకొని తమ కాళ్లపై తాము నిలబడేలా నిర్దేశించిన డిస్ట్రిక్ట్ ఇనీషియేటివ్ పథకాన్ని పట్టాలెక్కించకుండా చోద్యం చూస్తున్నారు. – ఒంగోలు సెంట్రల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో దీనులకు చేయూత దొరకడంలేదు. 2014–15లో డిస్ట్రిక్ట్ ఇనీషియేటివ్ పథకం కింద ఒక్కరూ లబ్ధిపొందలేదు. 2015–16లో మాత్రం 120 మందికి రుణాలను అందించారు. 2016–17 సంవత్సరం వచ్చే సరికి ఒక్కరికి కూడా రుణం అందించలేదంటే ఆ శాఖ పనితీరు ఎలా ఉందో అవగతమవుతోంది. వాస్తవానికి ఈ పథకం వల్ల హెచ్ఐవీతో బాధపడుతున్న వారు, భర్తకు దూరమై పిల్లలతో ఒంటరిగా ఉంటున్న మహిళలు, దివ్యాంగులు జీవనోపాధి పొందే అవకాశం ఉంటుంది. కానీ నెలలు గడుస్తున్నా రుణాలు మంజూరు చేయడంలేదు. మరణిస్తున్నా అంతే.. ఇప్పటి వరకు దాదాపు 500 మంది హెచ్ఐవీ బాధితులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ దురదృష్ట వశాత్తు వీరిలో ఇప్పటికే 20 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇలా ప్రభుత్వ సాయం అందకుండానే బాధితులు మృతి చెందుతున్నా మిగిలినవారికైనా సాయం అందించడంలో అధికారులు స్పందించకపోవడం విచారకరం. ఆదేశాలు బేఖాతర్ అర్హులు ఆన్లైన్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని నిబంధన విధించారు. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోకపోయినా రుణాలను జిల్లా నిధుల నుంచే చెల్లించాలి కాబట్టి.. ఉన్నతాధిధికారుల అనుమతితో రుణాలు మంజూరు చేయవచ్చని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర అధికారులు ఆదేశాలిచ్చినా సిబ్బంది పట్టించుకోవడంలేదు. క్షేత్ర స్థాయి పర్యటనల పేరుతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈ విషయంపై శ్రద్ధ పెట్టి పరిష్కరించాల్సిన ఎస్సీ కార్పొరేషన్ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోంది. గుట్టు.. రట్టు చేస్తారా? హెచ్ఐవీ/ ఎయిడ్స్ బాధితులకు ఒంగోలు రిమ్స్, మార్కాపురం ప్రాంతీయ వైద్యశాల, చీరాల ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స కేంద్రాలున్నాయి. దీంతో ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో మందులు తీసుకుంటారు. అయితే ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది ఒంగోలు రిమ్స్ నుంచి బాధితుల సమాచారం తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జాప్యం చోటు చేసుకుంటోంది. పైగా ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది అనాలోచిత నిర్ణయాల వలన హెచ్ఐవీ రుణ లబ్ధిదారుల జాబితాను మండల అభివృద్ధి అధికారులకు పంపుతున్నారు. దీంతో తమ వ్యాధి గురించి చుట్టుపక్కల వారికి తెలిసిపోతోందంటూ బాధితులు ఆందోళనకు గురి అవుతున్నారు. చర్యలు తీసుకుంటాం: ప్రస్తుత సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ ఇనీషియేటివ్ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 400 మంది ఆన్లైన్లో.. మరో 100 మంది ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. – ఎ.జయరామ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ -
ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలి
మల్లు రవి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఎస్సీ కార్పొరేషన్ వరుసగా మూడేళ్లుగా రుణాలు ఇవ్వడంలేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పా రు. గురువారం ఆయన మాట్లాడుతూ 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఎలాంటి రుణాలు ఇవ్వలేదని, ఎస్సీ నిరుద్యోగులను ఆదుకోవడానికి తీసుకున్న చర్యలేమీ లేవని అన్నారు. బడ్జెట్లో పెట్టినా, నిధులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంవల్ల బ్యాంకులు రుణాలను ఇవ్వడం లేదని, నిరుద్యోగ యువతపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్కు ప్రభుత్వం తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో, సీఎం ఇచ్చిన హామీలేమిటో ప్రజలకు వెల్లడించాలని కోరారు. -
'ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలి'
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ కార్పొరేషన్ వరుసగా మూడేళ్లుగా రుణాలు ఇవ్వడంలేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. గురువారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎస్సీ కార్పొరేషన్ ఎలాంటి రుణాలు ఇవ్వలేదని, ఎస్సీ నిరుద్యోగులను ఆదుకోవడానికి తీసుకున్న చర్యలేమీ లేవని అన్నారు. బడ్జెట్లో పెట్టినా, నిధులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడం వల్ల బ్యాంకులు రుణాలను ఇవ్వడం లేదని, నిరుద్యోగ యువతపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని మల్లు రవి విమర్శించారు. ఎస్సీ కార్పొరేషన్కు ప్రభుత్వం తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మోదీతో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో, సీఎం ఇచ్చిన హామీలేమిటో ప్రజలకు వెల్లడించాలని కోరారు. నియోజకవర్గాల పెంపు వంటి రాజకీయ ప్రయోజనాలపై ఉన్న శ్రద్ధ... ప్రజలకు ఉపయోగపడే రాష్ట్ర విభజన హామీలపై సీఎం కేసీఆర్కు ఎందుకు లేదని మల్లు రవి ప్రశ్నించారు. -
ఫెసిలిటేటర్ల నియామకానికి ఇంటర్వ్యూలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఎస్సీ కార్పోరేషన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఫెసిలిటేటర్ల నియామకం కోసం బుధవారం ఇంటర్వ్యూలను నిర్వహించారు. స్థానిక పెన్నార్ భవన్లోని ఎస్సీ కార్పోరేషన్ కార్యాలయంలో మొదటిరోజు అనంతపురం, ధర్మవరం రెవిన్యూ డివిజన్ల పరిధిలోని అభ్యర్థులకు ఇంటర్య్వూలను నిర్వహించారు. ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రామూనాయక్ పర్యవేక్షణలో ఎస్కేయూకు చెందిన ప్రోఫెసర్లు ఆనందరాయుడు, శ్రీధర్, సుధాకర్లు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. అనంతరం వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. రెండు డివిజన్లకు చెందిన 72 మంది అభ్యర్థులు ఈ ఎంపికకు హాజరయ్యారు. గురువారం కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గం రెవిన్యూ డివిజన్లకు చెందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు ఈడీ రామూనాయక్ తెలిపారు. -
ప్రత్యేక గ్రీవెన్స్కు మంగళం
– ‘మీ కోసం’తో పాటే ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ – మూడు నెలలుగా ఇదే తంతు అనంతపురం అర్బన్ : ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారానికి నెలలో ఒక రోజు ప్రత్యేక గ్రీవెన్స్ తప్పని సరిగా నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియకు అధికారులు మంగళం పాడారు. మీ కోసం కార్యక్రమంతో పాటుగా నిర్వహించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. మూడు నెలలుగా ఇదే తంతు సాగుతోంది. తాజాగా ఈ నెల 12న కూడా అదే తరహాలో మీ కోసంతో కలిపి నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలు తమ సమస్యలు చెప్పుకుని పరిష్కారం పొందేందుకు నెలలో రెండో గురువారం ఆ వర్గాల కోసం ప్రత్యేక గ్రీవెన్ నిర్వహించే విధానాన్ని గత కలెక్టర్ కోన శశిధర్ అమలులోకి తెచ్చారు. కొద్ది నెలలు సక్రమంగానే సాగింది. అయితే అటు తరువాత ప్రత్యేక గ్రీవెన్స్ ప్రక్రియను నీరుగార్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మీ కోసం, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించలేదు. అటు తరువాత ప్రతి సోమవారం మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక గ్రీవెన్స్ను మరిచారు.. అయితే ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ను మాత్రం నెలలో రెండో గురువారం నిర్వహించడం లేదు. నెలలో ఏదో ఒక సోమవారం మీ కోసం కార్యక్రమంతో కలిసి ప్రత్యేక గ్రీవెన్స్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఆ రోజున ఇటు సామాన్య ప్రజలు, అటు ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు హాజరవుతూ తమ సమస్యలను విన్నివించుకుంటున్నారు. రద్దీ ఎక్కువై ఎస్సీ, ఎస్టీలు ప్రత్యేకంగా తమ సమస్యలను అధికారులకు చెప్పుకునేందుకు సమయం ఉండడం లేదు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తే రద్దీ తక్కువగా ఉంటుంది. ఆ వర్గాల ప్రజలు తమ సమస్యలను అధికారులకు సావధానంగా వివరించి పరిష్కారం పొందేందుకు వీలవుతుంది. ఇదే విషయంపై గతనెల 15న సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన మీ కోసంలో జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణికి దళిత సంఘాల నాయకులు పెద్దన్న తదితరులు విన్నవించారు. -
భూముల వేటలో సర్కారు!
- దళితులకు భూ పంపిణీ కోసం ఎస్సీ కార్పొరేషన్ పర్యటనలు - అనువైన భూముల లభ్యతపై క్షేత్ర పరిశీలన - ఈ ఏడాది 10,500 ఎకరాల పంపిణీకి ప్రణాళిక - రూ.447.35 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం - నిర్దేశిత మొత్తంలో భూమి లభిస్తే 3,500 కుటుంబాలకు లబ్ధి సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకంలో పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం భూముల వేటలో పడింది. ఈ పథకాన్ని వేగవంతం చేయాలన్న యోచనతో ఈ ఏడాది ఏకంగా 10,500 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని నిర్ణయించింది. గత మూడేళ్లలో కలిపి 10 వేల ఎకరాలు మాత్రమే పంపిణీ చేసిన నేపథ్యంలో ఈ సారి వేగం పెంచాలని ఎస్సీ కార్పొరేషన్ను ఆదేశించింది. దీంతో ఎస్పీ కార్పొరేషన్ అధికారులు అనువైన భూముల లభ్యతపై దృష్టి సారించారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకుంటే ప్రైవేటు వ్యక్తుల నుంచి వ్యవసాయ యోగ్యత ఉన్న భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేసేలా చర్యలు మొదలు పెట్టారు. కొనుగోలుకు రూ.447.35 కోట్లు ప్రభుత్వ పరిధిలో చాలా భూములున్నప్పటికీ ఎక్కువ భాగం సాగుకు అనువుగా లేవు. కొండలు, గుట్టలు, రాళ్ల భూమి ఉండడంతో.. ఆ భూములను పంపిణీ చేసినా ఫలితం ఉండదన్న యోచనతో ప్రైవేటు భూములు కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. గత మూడేళ్లలో పంపిణీ చేసిన భూమిలోనూ ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినదే సగానికి పైగా ఉంది. తాజాగా 2017–18లో రాష్ట్రవ్యాప్తంగా 10,500 ఎకరాల పంపిణీ కోసం ఎస్సీ కార్పొరేషన్ రూపొందించిన ప్రణాళికకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. భూముల కొనుగోలు కోసం రూ.447.35 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు.. జిల్లాల వారీగా భూలభ్యతపై దృష్టి సారించారు. భూములు కొనుగోలుకు సంబంధించి అవగాహన కల్పిస్తూ.. ఆసక్తిగల రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే 746.18 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారు. ఇలా ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తున్న భూమికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగం పూర్తిస్థాయి పరిశీలన చేపడుతోంది. ప్రస్తుతం వివిధ జిల్లాల పరిధిలో దాదాపు 6 వేల ఎకరాల విక్రయానికి సంబంధించి తహసీల్దార్ల వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిలో భూగర్భ జలాల పరిస్థితి, భూమి రకం, టైటిల్తో పాటు అన్ని అంశాలనూ పరిశీలించాక భూమిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ప్రణాళిక ప్రకారం 10,500 ఎకరాల భూమి లభిస్తే... ఒక్కో కుటుంబానికి మూడెకరాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 3,500 కుటుంబాలకు లబ్ధి కలుగనుంది. పంట సాగుకూ సహకారం.. భూ పంపిణీ పథకం కింద దళిత కుటుంబాలకు మూడెకరాల భూమితో పాటు ఏడాది పాటు సాగుకు ప్రభుత్వం సహకారం అందించనుంది. వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా విత్తనాల పంపిణీ, బోరు వేసేందుకు ఆర్థిక సాయం కూడా ఇవ్వనుంది. -
కందికుంట ప్రోత్సాహంతోనే నాపై కేసు
– ఇంట్లోనే కుటుంబ సమేతంగా ఆమరణ దీక్షకు దిగుతాం.. –ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దేవానంద్ కదిరి : కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ తనపై తప్పుడు కేసు పెట్టించారని, తనకు, కుటుంబానికి ఏదైనా జరిగితే ఆయనే కారణమని అదే పార్టీకి చెందిన ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గుడిసె దేవానంద్ ఆరోపించారు. గురువారం ఆయన కదిరిలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. నల్లచెరువు మండలం సంజీవపల్లిలో దళితులకు, కమ్మ సామాజిక వర్గీయులకు దారి విషయంలో మూడేళ్లుగా గొడవ జరుగుతోందన్నారు. తాను గతంలో ఇరువర్గాల కోరిక మేరకు పెద్ద మనిషిగా వెళ్లానన్నారు. అప్పుడు వాహనాల అద్దె కోసమని అక్కడున్న పెద్ద మనుషులు తన చేతికి రూ.50 వేలు ఇచ్చారని, ఆ డబ్బు ఆరోజే అద్దె వాహనాల నిర్వాహకులకు ఇచ్చేశానని తెలిపారు. ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట ప్రసాద్ వ్యవహార శైలి నచ్చక ఎమ్మెల్యే చాంద్బాషాకు దగ్గరయ్యానన్నారు. దీన్ని జీర్ణించుకోలేక కందికుంట తనపై కక్ష గట్టారని ఆరోపించారు. ఈ నెల ఎనిమిదిన ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం సందర్భంగా స్వామివారి అ„ìక్షింతలు తీసుకుందామని వేదిక మీదకు వెళ్తుంటే కందికుంట తన చొక్కా పట్టుకొని కులం పేరుతో దూషించి అవమాన పరిచారన్నారు. కదిరి డీఎస్పీ వెంకట రామాంజనేయులు ఎదుటే తనకు అవమానం జరిగిందన్నారు. డీఎస్పీ సైతం కందికుంటకు మద్దతుగానే మాట్లాడారన్నారు. దళితుడైనందుకే తనను కందికుంట అవమానిస్తున్నారని, ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లానని తెలిపారు. ఇదంతా మనసులో పెట్టుకొని రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. అందుకే తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని, తనకు, కుటుంబానికి ఏదైనా జరిగితే కందికుంటతో పాటు డీఎస్పీ రామాంజనేయులు బాధ్యులని స్పష్టం చేశారు. న్యాయం జరగకపోతే వచ్చే నెల 14న ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ఆమరణ దీక్ష చేపడతామని హెచ్చరించారు. -
30 ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్
అనంతపురం అర్బన్ : ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ఈ నెల 30 (సోమవారం) కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఉదయం 9.30 గంటలకు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎస్.రోశన్న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళిత, గిరిజన సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారు తమ ఫిర్యాదులను అందజేయాలని వెల్లడించారు. -
డీఆర్డీఏ పీడీని కలిసిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
అనంతపురం సప్తగిరి సర్కిల్ : డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లును ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామూనాయక్ ఆదివారం ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో ఉచిత శిక్షణ అందించేందుకు శిక్షకుల నియమించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. జిల్లాలో 10 వేల మందికి శిక్షణ అందించేందుకు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. డీఆర్డీఏ సిబ్బంది ద్వారా శిక్షణ ఇచ్చేందుకు వారిని సంప్రదించామని ఈడీ తెలిపారు. -
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి
ఈడేపల్లి : ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేష¯ŒS ఈడీ ఎ¯ŒSవీవీ సత్యనారాయణ అన్నారు. బుధవారం స్థానిక 27వ వార్డులోని ఎస్సీకాలనీలోని కమ్యూనిటీ హాలులో నిరుద్యోగ, యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్సీలకు విద్యార్హతతో బేధం లేకుండా అందరూ ఉపాధి పొందవచ్చన్నారు. రాష్ట్రంలో లక్ష మంది ఎస్సీలకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్న వెంటనే ఆ¯ŒSలై¯ŒSలో నమోదు చేస్తామన్నారు. దరఖాస్తులు చేసుకొన్న అభ్యర్థులకు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అమరావతిలలో మూడు నెలలపాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎగ్జిక్యూటీవ్ అధికారి లావణ్య, వార్డు టీడీపీ నాయకులు సనక నాగులు పాల్గొన్నారు. -
రేపు స్త్రీ శక్తి స్ఫూర్తి సమ్మేళనం
- ఎస్సీ కార్పొరేషన్ ఎండీ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ రాక కర్నూలు(అర్బన్): నగర శివారులోని వీజేఆర్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 15వతేదీ ఉదయం 9 గంటలకు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలతో ‘స్త్రీ శక్తి స్ఫూర్తి సమ్మేళనం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎస్ సత్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని పొదుపు మహిళలు(కనీస విద్యార్హత 10వ తరగతి, వయసు 40 సంవత్సరాలు లోబడి) తప్పక హాజరు కావాలన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓబీఎంఎంఎస్పై అవగాహన ... ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 2 గంటలకు ఇదే హాల్లో ఓబీఎంఎంఎస్పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు సత్యం చెప్పారు. సదస్సుకు ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లు, అన్ని కార్పొరేషన్లకు చెందిన కార్యనిర్వాహక సంచాలకులు, బ్యాంకు కంట్రోలర్స్, రీజినల్ మేనేజర్లు, బ్యాంకు మేనేజర్లు హాజరు కావాలన్నారు. -
పది వేల మందికి ఉపాధి
చిలకలపూడి (మచిలీపట్నం) : ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది 10వేల మంది ఎస్సీ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు లక్ష్యంగా నిర్ణయించటం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ తెలిపారు. ఆయన కార్యాలయంలో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ యువస్ఫూర్తి పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పదో తరగతి విద్యార్హత నుంచే ఉపాధి అవకాశం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఇద్దరు ఎస్సీ యువకులు, యువతులను సమన్వయకర్తలుగా నియమించామని, ఈ సమన్వయకర్తలు చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వారిచే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకుంటారన్నారు. ఒక్కొక్క ధరఖాస్తుకు రూ. 25లు చొప్పున సమన్వయకర్తలకు ప్రోత్సాహకంగా అందజేస్తామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్స్ విద్యార్థులకు ఉపాధి అవకాశాల కల్పనపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలలో తమ కార్యాలయ సిబ్బందిని నియమించామని, అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థులకు ఈ అవకాశంపై అవగాహన కల్పిస్తారన్నారు. ఆయా మండలాల ఎంపీడీవోలకు కూడా సమన్వయకర్తలను ప్రోత్సాహపరిచి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెబ్సైట్ ద్వారా దరఖాస్తును నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల 20వ తేదీలోగా ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈడీ కోరారు. -
12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
మోత్కూరు : జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కోరారు. శుక్రవారం మోత్కూరులోని జగ్జీవన్రామ్ చౌరస్తాలో తెలంగాణ మాదిగ జేఏసీ జెండాను పిడమర్తి రవి ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలన్నారు. వచ్చేనెల 13న హైదరాబాద్ నిజాం కళాశాలలో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మాదిగల శక్తి ప్రదర్శనను సత్తా చాటుతామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఎస్సీవర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైన వర్గీకరణ ఊసెత్తడంలేదని ఆరోపించారు. శీతాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగజేఏసీ రాష్ట్రచైర్మన్ గద్దల అంజిబాబు, నాయకులు చేడె మహేందర్, చేడె మధు, మిట్టగడుపుల లరమేష్, సైదులు, నవీన్, నరేష్, సురేష్, శోభన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలి
కొల్చారం: స్వయం ఉపాధి కింద ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీఓ వామనరావు సూచించారు. రూ.1.50 లక్షలలోపు ఆదాయం కలిగిన నిరుద్యోగులకు బ్యాంకులు రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన ఫారాలను ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. -
ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతాం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పెనమలూరు : మాదిగలకు న్యాయం జరిగే విధంగా ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చెప్పారు. పోరంకిలో ఆదివారం ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కృష్ణమాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మాదిగలు 23 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ త్వరలో వచ్చే అవకాశం ఉందని, దీనిని సాధించి తీరుతామన్నారు. వచ్చే నెల 20వ తేదీన ఎస్సీ వర్గీకరణ కోసం ధర్మయుద్ధ మహాసభను హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తామన్నారు. దీనికి మాదిగలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు తమ సహకారం ఇస్తానని హామీ ఇచ్చిన వారు నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎవరు కుట్రలు పన్నినా ఎస్సీ వర్గీకరణ సాధిస్తామన్నారు. ఇందుకు నిదర్శనంగా ఢిల్లీలో 21 రోజుల పాటు చేసిన దీక్షకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వచ్చి హామీ ఇచ్చారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ధర్మయుద్ధ మహాసభలో మాదిగలు తమ ఐక్యతను, సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి దొండపాటి సుధాకర్ మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి మానికొండ సుధాకర్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి నూకపోగు ఏసు మాదిగ, నేతలు బంకా గంగాధర్ మాదిగ, దేవరపల్లి సతీష్ మాదిగ, శీలం బుచ్చిబాబు మాదిగ పాల్గొన్నారు. -
ఆర్థిక చేయూతతో అభివృద్ధి
– ఎస్సీ కార్పొరేషన్ ఎండీ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ కర్నూలు(అర్బన్): ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూతతో ప్రతి ఒక్కరూ యూనిట్లు నెలకొల్పుకొని తమ జీవన ప్రమాణాలను మెరుగు పరచుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఎండీ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ అన్నారు. బుధవారం నగర శివారుల్లోని వీజేఆర్ కన్వెన్షన్ హాల్లో యువ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని దళితవర్గాలు సమష్టిగా ఉంటు సంఘాలుగా ఏర్పడి సమాజంలోని రుగ్మతలపై పోరాడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభివద్ధి కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూ అభివద్ధి, భూమి కొనుగోలు పథకాల ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. భూమి కొనుగోలు పథకానికి సంబంధించి బడ్జెట్ను పెంచాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఆయా పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు త్వరలోనే మండల స్థాయిలో అవగాహన సదస్సులను నిర్వహిస్తామని చెప్పారు. ఎస్సీ నిరుద్యోగ యువత తమకు ఇష్టమైన రంగంలో నైపుణ్యాలను పెంచుకొని ఆయా రంగాల్లో స్థిరపడాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వీర ఓబులు, ఈఓ సుశేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ లాలా లజపతిరావు, మెప్మా పీడీ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీలకు రూ.1100 కోట్ల రుణాలు
– రూ.2 వేల కోట్లతో సీసీ రోడ్ల అభివృద్ధి – పుష్కర నిర్వహణలో మనమే ఫస్ట్ – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కర్నూలు(అర్బన్):రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన ఎస్సీలకు రూ.1100 కోట్ల రుణాలను అందించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. గురువారం నగర శివారుల్లోని వీజేఆర్ కన్వెన్షన్ హాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్ అధ్యక్షతన ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్రావు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు వై. ఐజయ్య, ఎస్వీ మోహన్రెడ్డి, బుడ్డా రాజశేఖర్రెడ్డి, మాజీ మంత్రి మారెప్ప హాజరయ్యారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి కేఈ, ప్రజా ప్రతినిధులు, అధికారులు డా.బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్రామ్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్ కింద ఎస్సీలకు రూ.8 వేల కోట్లు, ఎస్టీలకు రూ.3 వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందిస్తుందన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ఐఏఎస్, ఐపీఎస్ తదితర సివిల్ సర్వీస్ పరీక్షలకు సంసిద్దం అయ్యేందుకు శిక్షణను ఇప్పిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ పరంగా కూడా ఎస్సీ వర్గాలను అభివద్ధి చేసేందుకు పలు రకాల యాంత్రిక పరికరాలపై సబ్సిడీని అందిస్తున్నామన్నారు. – ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ దళిత, గిరిజనులకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులు సహకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. – శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో దొరవారి భూములు దాదాపు 1600 ఎకరాలు ఉన్నాయని, వాటిని ప్రస్తుతం సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. – ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఈ వర్గాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. – జేసీ హరికిరణ్ మాట్లాడుతు జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేశామని ఇప్పటి వరకు వచ్చిన 900 ఫిర్యాదుల్లో 600 ఫిర్యాదులను పరిష్కరించామని, మిగిలినవి పరిష్కార దిశగా ఉన్నాయన్నారు. – కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, తెలుగుమహిళ నాయకురాలు అంకం విజయ, దళిత సంఘాలకు చెందిన నాయకులు బాలసుందరం, త్యాగరాజు, అశోకరత్నం, అనంతరత్నం మాదిగ, రాజ్కుమార్, కే వెంకటేష్, గడ్డం నాగముని, వేల్పుల జ్యోతి, డీవీఎంసీ సభ్యులు చిటికెల సలోమి, చిన్న లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి దళిత కూలీకి మూడెకరాల భూమి
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పర్వతగిరి : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రతి దళిత కూలీకి మూడెకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేస్తామని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శనివారం మండలంలోని వడ్లకొండ గ్రామంలోని తెలంగాణ ప్రభుత్వం దళితులకు పంపిణీ చేసిన 32 ఎకరాల వ్యవసాయ భూమిని పరిశీలించి వారి తో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు 10 వేల ఎకరాలుదళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూ పంపిణీ చేసినట్లు తెలిపారు. మరో 10 వేల ఎకరాలు భూ పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి దళిత వ్యవసాయ కూలీని గుర్తించి మూడెకరాల భూమిని పంపిణీ చేయటమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. 4,500 మందికి రూ.46 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విడుదల చేశామని పది పదిహేను రోజుల్లో సబ్సీడిని 25 వేల లబ్ధిదారులకు రూ.200 కోట్లు పంపిణీ చేస్తామని వివరించారు. 2016–17 సంవత్సరానికి రెండు నెలల్లో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. సీని యర్ అసిస్టెంట్ అశోక్, డీటీ పవన్కుమార్, ఆర్ఐ మధు, వీఆర్వో వెంకటయ్య, ఎంపీటీసీ పట్టాపురం తిరుమల ఏకాంతంగౌడ్, సర్పంచ్ రాయపురం శ్రీనివాస్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వల్లందాసు వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ వల్లందాసు రంగయ్య, రవీందర్, జుట్టుకొండ రమేష్, చిన్న, ఉప్పలయ్య, దేవేం దర్, కొంరయ్య తదితరులు ఉన్నారు. కాలర్ పట్టుకుంటేనే వర్గీకరణ సాధ్యం న్యూశాయంపేట : అంబేద్కర్ సిద్ధాంతాలు పాటిస్తామని చెప్పి మంద కృష్ణ అగ్రకులాల కాళ్లు మొక్కుతున్నారని మొక్కితే వర్గీకరణ జరగదని కేంద్రంలోని అధికార పార్టీ నాయకుల కాలర్ పట్టుకుంటేనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. హన్మకొండ సుబేదారిలోని జెడ్పీ గెస్ట్హౌస్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళ్లు పట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం రాలేదని పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించామన్నారు. ప్రజాఉద్యమం ద్వారానే వర్గీకరణ సాధ్యమన్నారు. వర్గీకరణ కోసం నవంబర్లో 8 సం ఘాలను ఐక్యంచేసి, సెప్టెంబర్లోజీపుయాత్ర, అక్టోబర్లో అలాయ్ బలాయ్ కార్యక్రమాలు నిర్వహించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ను ప్రవేశపెట్టే విధంగా ఒత్తిడి తీసుకవస్తామన్నారు. వరంగల్లో నూతనంగా ఏర్పడే నాలు గు జిల్లాలో కమిటీలు వేసేందుకు ఇన్చార్జిగా బొల్లికుంట వీరేందర్ను నియమిస్తున్నట్లు పే ర్కొన్నారు. బి.వీరేందర్, దుప్పటి కిశోర్, మైస ఉపేందర్, రాజేందర్, మధుకర్, కందుకూరి బాబు, రమేష్, రాజేందర్ పాల్గొన్నారు.