ముక్కంటి దర్శనం వేళలు మార్పు | Srikalahastisvaralayam changed view hours | Sakshi
Sakshi News home page

ముక్కంటి దర్శనం వేళలు మార్పు

Published Mon, Dec 12 2016 3:36 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

ముక్కంటి దర్శనం వేళలు మార్పు

ముక్కంటి దర్శనం వేళలు మార్పు

శ్రీకాళహస్తి: ధనుర్మాసం సందర్భంగా ఈనెల 16 నుంచి జనవరి 15 వరకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనం వేళలు మారుస్తున్నట్లు ఆలయాధికారులు ఆదివారం తెలిపారు. మాములుగా తెల్లవారుజామున 5.30 నుంచి ఆలయంలో దర్శనం ధనుర్మాసంలో 5 గంటల నుంచే ఉంటుంది. వేకువున 3.30 గంటలకు నిర్వహించే జేగంటను 3 గంటలకు నిర్వహిస్తారు. 4.30Sకు జరిగే మంగళవాయిద్యాల కార్యక్రమం 4 గంటలకే ఉంటుంది. 5 గంటలకు జరిగే సుప్రభాతం 4.30 గంటలకు ఉంటుంది.

ఉదయం 5.30 గంటలకు నిర్వహించే మొదటి అభిషేకం 5 గంటలకే నిర్వహించి స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పిస్తారు. 6.30 గంటలకు జరిగే రెండో అభిషేకం 6 గంటలకే ఉంటుంది. 7.30 గంటలకు జరిగే పరివార దేవతలకు పూజలు 7 గంటలకే నిర్వహిస్తారు. 7.30 గంటలకు గొబ్బి ఉత్సవం ఉంటుంది. 10.30 గంటలకు జరిగే మూడో అభిషేకం 10 గంటలకే పూర్తి చేస్తారు. సాయంత్రం 5.30 గంటలకు నిర్వహించే ప్రదోష అభిషేకం మాత్రం యథావిధిగానే నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement