CHANGE
-
ట్రంప్ తొలి వారం రివ్యూ.. అమెరికాలో ఏం మారింది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టి వారం గడిచింది. ఈ వారంలో ఆయన తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు సంచలనం సృష్టించాయి. చైనా నుండి యూరప్ వరకు, ఉక్రెయిన్ నుండి ఇరాన్ వరకు, ట్రంప్ నిర్ణయాలను విన్నవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల విషయంలో అమెరికన్లు కూడా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేశారు. జనవరి 20న ట్రంప్ అధ్యక్షునిగా అధికార బాధ్యతలు చేపట్టారు. వెంటనే పలు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. గడచిన వారంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాతో పాటు ప్రపంచంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.చైనాతో దోస్తీ?ముందుగా చైనా విషయానికొస్తే ట్రంప్ తొలి పదవీకాలంలో, చైనా- అమెరికా మధ్య సత్సంబంధాలు లేవు. డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో తాను అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 60 శాతం వరకు భారీగా సుంకం విధిస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ట్రంప్ వారం గడిచినా ఈ విషయమై నోరు మెదపడం లేదు. పైగా ఒక ఇంటర్వ్యూలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో ఏదైనా వ్యాపార ఒప్పందం కుదుర్చుకోగలరా అని అడిగినప్పుడు ట్రంప్ అందుకు సిద్దమేనన్నట్లు సమాధానం చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధంపై మారిన వైఖరిట్రంప్ అధికారం చేపట్టాక ఉక్రెయిన్ యుద్ధంపై గతంలో చేసిన వాగ్దానం అమలులో వైఖరిని మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా.. రష్యాను వ్యతిరేకిస్తూ ఉక్రెయిన్ను పావుగా వాడుకుంది. మాజీ అధ్యక్షుడు బైడెన్ నిర్ణయం మేరకు ఇది జరిగింది. నిజానికి ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధం నుండి అమెరికాను దూరంగా ఉంచవచ్చు. కానీ ఇది అమెరికా భవిష్యత్తుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఉక్రెయిన్కు యూరోపియన్ యూనియన్ మద్దతు ఉంది. ఒకవేళ అమెరికా వెనక్కి తగ్గితే, భవిష్యత్లో రష్యాతో చేతులు కలిపే సందర్భం వస్తే ఎటువంటి హాని ఏర్పడదని ట్రంప్ భావిస్తున్నట్లుందని విశ్లేషకులు అంటున్నారు.జన్మతః పౌరసత్వ చట్టండొనాల్డ్ ట్రంప్ రెండవమారు అధ్యక్షుడైన వెంటనే జన్మతః పౌరసత్వ చట్టాన్ని రద్దు చేశారు. ట్రంప్ ఉత్తర్వులు ఫిబ్రవరి 20 నుండి అమెరికాలో అమల్లోకి వస్తాయి. ఇది విదేశాల నుండి వచ్చి అమెరికాలో స్థిరపడిన వారిని ప్రభావితం చేస్తుంది. అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాలకు చెందినవారు తమ పిల్లలు అమెరికన్ పౌరసత్వం పొందాలని కలలు కంటుంటారు. అయితే ట్రంప్ నిర్ణయం వారి కలలను కల్లలు చేసింది.ట్రంప్ నిర్ణయాలపై ఆగ్రహంట్రంప్ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవారిలో ఆయన సన్నిహితుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. ట్రంప్ ఇటీవల స్టార్గేట్ పేరుతో భారీ ఒప్పందాన్ని ప్రకటించారు. అయితే ఈ ఒప్పందంపై ఎలాన్ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నారు. స్టార్గేట్లో పాల్గొన్న మూడు కంపెనీలకు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టే సామర్థ్యం లేదని మస్క్ సోషల్ మీడియాలో రాశారు.గాజా శరణార్థుల పునరావాసంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా గాజా శరణార్థుల పునరావాసానికి సంబంధించి ఓ ప్రతిపాదన చేశారు. గాజాలో ఉండలేకపోతున్న పాలస్తీనా వాసులు అక్కడికి పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్లలో తాత్కాలిక పునరావాసం పొందాలని ట్రంప్ సూచించారు. గాజా ప్రాంతం నాశనమైందని, అక్కడి ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు అరబ్ దేశాలైన జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు సహకరించాలని ఆయన కోరారు.ఆర్థిక సాయం నిలిపివేతఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వివిధ దేశాలకు ఇస్తున్న ఆర్ధిక సహాయాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యుద్ధంలో చిక్కుకున్న ఉక్రేయిన్ కూడా ఆర్ధిక సాయం నిలిపివేశారు. అయితే ఇజ్రాయెల్, ఈజిప్ట్లకు సైనిక బలగాల పెంపు కోసం అందించే నిధులకు మినహాయింపులు ఇవ్వడం విశేషం.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి.. -
ఇరాన్ సంచలన నిర్ణయం? మారనున్న రాజధాని?
ఇరాన్ తన పొరుగు దేశమైన ఇజ్రాయెల్తోనూ, అగ్రరాజ్యం అమెరికాతోనూ ఉన్న వివాదం కారణంగా గత కొంతకాలంలో ప్రపంచం దృష్టిలో పడింది. ఇరాన్.. ఇజ్రాయెల్పై అప్రకటిత యుద్ధ ధోరణిలో ఉన్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతలోనే ఇరాన్ తన రాజధానిని టెహ్రాన్ నుండి వేరే ప్రదేశానికి మార్చాలనుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అది కూడా మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న తరుణంలో ఇరాన్ తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతోంది.ఈ చర్చల నేపధ్యంలో ఇరాన్(Iran) ప్రభుత్వ ప్రతినిధి ఫతేమెహ్ మొహజెరానీ ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల కారణంగా రాజధానిని మార్చాలనే నిర్ణయం తీసుకోలేదని మొహజెరానీ అన్నారు. అయితే ఇరాన్ నిర్ణయం వెనుక పలు కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలి కాలంలో టెహ్రాన్ను అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని అంటున్నారు. ఇండోనేషియాలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. జకార్తాను విడిచిపెట్టి, మెరుగైన నగరాన్ని నిర్మించే దిశగా ఇండోనేషియా ప్రయత్నాలు ప్రారంభించింది.టెహ్రాన్(Tehran) మహానగరం అటు జనాభా, ఇటు పర్యావరణం పరంగా అనేక సమస్యలను ఎదుర్కొటోంది. ఫలితంగా నగరంలోపై మరింత ఒత్తిడి పెరుగుతోందని మొహజెరానీ తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభా కారణంగా నీటితో పాటు విద్యుత్ కొరత పెరుగుతోంది. కాలుష్యం కూడా పెరిగిపోతోంది. దీనికితోడు భూకంపాలు సంభవించే ప్రాంతంలో టెహ్రాన్ ఉండటం వల్ల మరింత అసురక్షితంగా మారిందని మొహజెరానీ వివరించారు. అటువంటి పరిస్థితిలోనే ఇరాన్ ప్రభుత్వం రెండు కౌన్సిళ్లను ఏర్పాటు చేసింది. రాజధానిని టెహ్రాన్ నుండి మక్రాన్ ప్రాంతానికి మార్చడంపై ఈ కౌన్సిళ్లు విశ్లేషించాయి.ఇది కూడా చదవండి: UPSC Success Story: ఇటు ఉద్యోగం.. అటు చదువు.. శ్వేతా భారతి విజయగాథ -
కట్ ఆఫ్ డేట్ మార్చండి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గడచిన పదేళ్ల కాలంలో అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వారి సంఖ్య వేలల్లో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తేదీని కట్ ఆఫ్ డేట్గా మారిస్తే వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేÔశాలకు వెళ్లారు. ఇప్పటికీ వెళుతున్నారు. గల్ఫ్లో చనిపోయిన వారి మృతదేహాలు తీసుకురావడానికి కూడా వారి కుటుంబాలు అనేక కష్టాలు ఎదుర్కొన్నాయి. అప్పు చేసి గల్ఫ్ వెళ్లిన వ్యక్తి చనిపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబ పెద్దను కోల్పోయి కుటుంబభారం మోయలేక కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి కట్ ఆఫ్ డేట్ను మార్చాలని పలువురు కోరుతున్నారు. ఎడారి దేశాల్లో తెలం‘గానం’గల్ఫ్ దేశాల్లో ఉన్న వారంతా తెలంగాణ ఉద్యమానికి జైకొట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గల్ఫ్లో బతుకుదెరువుకు వెళ్లి రకరకాల కారణాలతో ఇబ్బందులు పడిన వారికి ప్రభుత్వం సాయం అందించాలనే డిమాండ్ ఉంది. అందుకోసం అనేక ఉద్యమాలు కూడా జరిగాయి. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేరళ పాలసీని అమలు చేస్తామని ప్రకటించినా, ఆచరణకు నోచుకోలేదు. గత ఏడాది డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందించేందుకు విధివిధానాలను ఇటీవల వెల్లడించింది. అయితే కట్ ఆఫ్ డేట్ తో చాలా కుటుంబాలకు నిరాశే ఎదురైంది. గడచిన పది నెలల కాలంలో తెలంగాణకు చెందిన వారు గల్ఫ్ దేశాల్లో దాదాపు 160 మంది చనిపోయినట్టు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.విధివిధానాలు ఇలా...ప్రభుత్వం ఈ నెల 7న జారీ చేసిన జీవో 216 ప్రకారం.. చనిపోయిన వ్యక్తి తాలూకు భార్య, పిల్ల లు లేదా తల్లిదండ్రులు మృతుడి డెత్ సర్టిఫికెట్, పాస్పోర్టు క్యాన్సల్ రిపోర్టు, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా వివరాలతో నేరుగా జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకో వాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో దరఖాస్తు, సరి్టఫికెట్లను పరిశీలించిన తర్వాత ఆర్థిక సాయం మంజూరవుతుంది. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఓమన్, కత్తర్, సౌదీ అరేబీయా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు వెళ్లి చనిపోయిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 2023 డిసెంబర్ 7 తర్వాత చనిపోయిన వారు మాత్రమే అర్హులని ఆ జీఓలో స్పష్టంగా పేర్కొన్నారు. -
హెల్త్ వర్సిటీ పేరు మార్పులో చంద్రబాబు అత్యుత్సాహం
సాక్షి, అమరావతి: పేదలకు మెరుగైన వైద్యసేవలు, విద్యార్థులకు వైద్య విద్యను అందించడంలో పూర్తి నిర్లక్ష్యం వహించిన చంద్రబాబు హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పునకు మాత్రం అత్యుత్సాహం చూపించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ తీసుకున్న నిర్ణయంపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడుసార్లు సీఎంగా చేసిన బాబు ఏనాడు ప్రభుత్వ వైద్య రంగాన్ని పట్టించుకోలేదు. పైగా ప్రైవేటు వైద్య కళాశాలలను, ప్రైవేటు ఆసుపత్రులను ప్రోత్సహించి వైద్య వృత్తిని వ్యాపారం చేశారు.కానీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ హయాంలో ఆరోగ్యశ్రీ, 108, 104 వ్యవస్థలను ప్రవేశపెట్టి వైద్యశాఖను బలోపేతం చేశారు. ఆయన తనయుడైన జగన్ గడిచిన ఐదేళ్లలో వైద్యరంగం రూపురేఖలు మార్చారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. అలాగే, నాడు–నేడుతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఆధునీకరించారు.ఈ నేపథ్యంలోనే.. వైద్య రంగాన్ని పేదలకు చేరువ చేసిన వైఎస్సార్ పేరును హెల్త్ యూనివర్శిటీకి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టింది. దీనికితోడు ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టి వైఎస్ జగన్ ఆదర్శంగా నిలిచారు. కానీ, రాజకీయ కక్ష సాధింపునకు కొనసాగింపుగా బాబు వైఎస్సార్ పేరును తొలగించి ఎన్టీఆర్ పేరు పెడుతూ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు తప్పుబడుతున్నారు. -
చంద్రుని ఆవలి వైపుకు చాంగే6
బీజింగ్: చంద్రుని ఆవలివైపు చైనా చాంగే6 ల్యాండర్ విజయవంతంగా దిగింది. అక్కడి మట్టిని సేకరించి తిరిగి భూమికి చేరుకోనుంది. చంద్రుని దక్షిణ ధృవ అయిట్కెన్(ఎస్పీఏ) బేసిన్ వద్ద బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.23 గంటలకు విజయవంతంగా అది దిగిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మిని్రస్టేషన్(సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. చాంగే6లో ఒక ఆర్బిటార్, ఒక రిటర్నర్, ఒక ల్యాండర్, ఒక అసెండర్ ఉన్నాయి. మే మూడో తేదీన చాంగే6ను చైనా ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించారు. అది తొలుత భూస్థిర కక్ష్యలో, తర్వాత చంద్ర కక్ష్యలో తిరిగింది. చాంగే6లో ఆర్బిటార్–రిటర్నర్, ల్యాండర్–అసెండర్ జతలు ఉన్నాయి. ఆర్బిటార్–రిటర్నర్ జత నుంచి ల్యాండర్–అసెండర్ జత మే 30వ తేదీన విడిపోయింది. ఆర్బిటార్–రిటర్నర్ జత చంద్రుని కక్ష్యలోనే తిరుగుతోంది. కీలకమైన ల్యాండింగ్ ల్యాండర్–అసెండర్ జత చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అవడమే ఈ మొత్తం మిషన్లో అత్యంత కీలకమైన దశ. దిగేటపుడు మార్గమధ్యంలో ఏమైనా అవాంతరాలు ఉంటే వాటిని గుర్తించేందుకు స్వయంచాలిత అవాంతరాల నిరోధక వ్యవస్థ, కాంతి కెమెరాను వినియోగించారు. వీటి సాయంతో సురక్షితమైన ల్యాండింగ్ ప్రదేశాన్ని ఎంచుకుని ల్యాండర్–అసెండర్ అక్కడే దిగిందని చైనా అధికారి జిన్హువా వార్తాసంస్థ పేర్కొంది. ఎస్పీఏ బేసిన్లోని అపోలో బేసిన్లో ఇది దిగింది. భూమి వైపు కంటే ఆవలి వైపు చంద్రుడి ఉపరితలం కాస్తంత గట్టిగా ఉందని సీఏఎస్సీ అంతరిక్ష నిపుణుడు హుయాంగ్ హావో చెప్పారు. అక్కడ దిగిన ల్యాండర్ 14 గంటల్లోపు రెండు రకాలుగా మట్టిని సేకరిస్తుంది. డ్రిల్లింగ్ చేసి కొంత, రోబోటిక్ చేయితో మరికొంత ఇలా మొత్తంగా 2 కేజీల మట్టిని సేకరిస్తుంది. ల్యాండర్ చంద్రునికి ఆవలివైపు ఉపరితలంపై ఉన్న నేపథ్యంలో భూమి నుంచి నేరుగా దానిని కమాండ్ ఇవ్వడం అసాధ్యం. అందుకే కమ్యూనికేషన్కు వారధిగా ఇప్పటికే చైనా క్వికియానో–2 రిలే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆ శాటిలైట్ ద్వారా చాంగే–6 ల్యాండర్కు ఆదేశాలు ఇవ్వొచ్చు.మళ్లీ భూమి మీదకు సేకరించిన మట్టిని ల్యాండర్ అసెండర్లోకి చేరుస్తుంది. అసెండర్ రాకెట్లా నింగిలోకి దూసుకెళ్లి ఆర్బిటార్–రిటర్నర్ జతతో అనుసంధానమవుతుంది. రిటర్నర్ మాడ్యూల్లోకి మట్టిని మార్చాక రిటర్నర్ అక్కడి నుంచి భూమి దిశగా బయల్దేరుతుంది. అంతా అనుకున్నది అనుకున్నట్లు సవ్యంగా జరిగితే జూన్ 25వ తేదీన రిటర్నర్ భూమి మీదకు చేరుకుంటుంది. చంద్రుని ఆవలివైపు మట్టిని తీసుకొచ్చిన దేశంగా చైనా చరిత్రలో నిలిచిపోనుంది. -
Rahul Gandhi: మార్పు గాలి వీస్తోంది
న్యూఢిల్లీ: దేశంలో మార్పు గాలి బలంగా వీస్తోందని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రజలు సంసిద్ధులై ఉన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు సోమవారం ఐదో విడత పోలింగ్ ప్రారంభమైన వేళ ‘ఎక్స్’లో ఆయన ..‘ఈరోజు ఐదో విడత పోలింగ్ జరుగుతోంది. బీజేపీని ఓడించి, దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రజలు కట్టుబడి ఉన్నట్లు మొదటి నాలుగు విడతల పోలింగ్లో స్పష్టమైంది. విద్వేష రాజకీయాలతో జనం విసిగిపోయారు. యువత ఉద్యోగాలు, రైతులు రుణ మాఫీ, కనీస మద్ధతు ధర, మహిళలు ఆర్థిక స్వేచ్ఛ, భద్రత, కార్మికులు రోజువారీ వేతనాలు వంటి అంశాలపైనే నేటి పోలింగ్ ఆధారపడి ఉంది. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇండియా కూటమికి మద్దతుగా నిలిచారు. దేశంలో మార్పు గాలి బలంగా వీస్తోంది’అని రాహుల్ పేర్కొన్నారు. అమేథీ, రాయబరేలతోపాటు దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఇలా ఉండగా, ఐదో దశలో పోలింగ్ జరుగుతున్న రాయ్బరేలీలో పార్టీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ సోమవారం పర్యటించారు. రాయ్బరేలీలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్లను ఆయన పరిశీలించారు. ప్రజలతో ఆయన సెల్ఫీలు దిగారు. అయితే, మీడియాతో మాట్లాడలేదు. -
కేరళలో యూపీ వ్యూహం.. గణపతి శరణులో బీజేపీ!
రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగా ఆ పార్టీ కేరళలో ఉత్తరప్రదేశ్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. యూపీలోని అలహాబాద్, మొఘల్సరాయ్ సహా పలు ప్రాంతాల పేర్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్చారు. ఇప్పుడు ఇదే కోవలో వయనాడ్ బీజేపీ అభ్యర్థి కె సురేంద్రన్ తాను ఎంపీగా ఎన్నికైతే సుల్తాన్ బత్తేరి పట్టణం పేరును గణపతి వట్టంగా మారుస్తానని ప్రకటించారు. కె సురేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ సుల్తాన్ బత్తేరి పట్టణంను పూర్వకాలంలో గణపతి వట్టంగా పిలిచేవారని తెలిపారు. అయితే టిప్పు సుల్తాన్ ఆ పేరును సుల్తాన్ బత్తేరి పట్టణంగా మార్చాడన్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే ఈ ప్రాంతం పేరును గణపతి వట్టంగా మారుస్తానన్నారు. వయనాడ్లో ఓట్లను కొల్లగొట్టేందుకు కొందరు టిప్పు సుల్తాన్ పేరును వాడుకుంటున్నారని సురేంద్రన్ ఆరోపించారు. టిప్పు సుల్తాన్ మతమార్పిడులకు పాల్పడ్డాడని, హిందూ, జైన దేవాలయాల కూల్చివేతకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఇదిలావుండగా వయనాడ్ నుంచి సురేంద్రన్ గెలిచే అవకాశమే లేదని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జాతీయ కార్యదర్శి పీకే కున్హాలికుట్టి వ్యాఖ్యానించారు. సుల్తాన్ బత్తేరి పట్టణం పేరు ఎన్నటికీ మారదని, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే సురేంద్రన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి సిద్ధిఖీ ఆరోపించారు. -
5 నెలల్లో 3 పార్టీలు.. 48 గంటల్లో బీజేపీకి రాంరాం.. కాంగ్రెస్ గూటికి ఛలో!
దేశంలో ఎన్నికలు సమీపించగానే అంతవరకూ ఎవరికీ కనిపించని నేతలు సైతం యాక్టివ్ అయిపోతారు. అధికారంలో ఉన్న పార్టీలోకి లేదా తమకు నచ్చిన పార్టీలోకి దూకేస్తారు. మధ్యప్రదేశ్లో లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇలాంటి ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. పలువురు నేతలు కాంగ్రెస్ను వీడి బీజేపీలోకి లేదా బీజేపీని వీడి కాంగ్రెస్లోకి చేరిపోతున్నారు. మొరెనా జిల్లాకు చెందిన ఒక నేత ఐదు నెలల్లోనే మూడుసార్లు పార్టీ మారారు. సిద్ధి జిల్లాకు చెందిన ఓ మహిళా నేత 48 గంటల్లోనే బీజేపీని వీడి, తిరిగి కాంగ్రెస్లోకి వచ్చేశారు. సిద్ధి మున్సిపాలిటీ అధ్యక్షురాలు కాజల్ వర్మ 48 గంటల్లోనే బీజేపీపై విరక్తి చెందారు. తిరిగి కాంగ్రెస్లో చేరారు. కాజల్ వర్మకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. అయితే తనను బెదిరించి బీజేపీ సభ్యత్వం ఇచ్చారని కాజల్ వర్మ ఆరోపించారు. ఇదేవిధంగా సుమావాలి అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అజబ్ సింగ్ కుష్వాహా బీజేపీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్తో కలిసి హెలికాప్టర్లో సబల్గఢ్కు చేరుకుని, బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. అజబ్ సింగ్ కుష్వాహా బీజేపీలో చేరడం కాంగ్రెస్కు తీరని నష్టంగా పరిణమించింది. మొరెనా షియోపూర్ లోక్సభ నియోజకవర్గంలో కుష్వాహా సామాజికవర్గం పెద్ద సంఖ్యలో ఉంది. అజబ్ సింగ్ కుష్వాహా గత ఐదు నెలల్లో మూడు రాజకీయ పార్టీలు మారారు. తాజాగా ఆయన బీజేపీ పంచన చేరారు. అజబ్ సింగ్ కుష్వాహా తన రాజకీయ యాత్రను బహుజన్ సమాజ్ పార్టీతో ప్రారంభించారు. ఆ తర్వాత బీఎస్పీపై విసిగిపోయి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో ఉండటం కుదరదంటూ ఇప్పుడు బీజేపీలో చేరారు. -
రంగు మారనున్న గరీబ్ రథ్.. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు!
అందరికీ ఏసీ కోచ్లలో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో రైల్వేశాఖ గరీబ్ రథ్ రైలును ప్రారంభించింది. ఇప్పుడు ఈ రైలులో పలు మార్పులు సంతరించుకుంటున్నాయి. బోగీల సంఖ్యను పెంచడంతోపాటు, రంగు కూడా మార్చనున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ గరీబ్ రథ్లో చోటుచేసుకోబోయే మార్పులను మీడియాకు తెలియజేశారు. బీహార్కు అనుసంధానమైన అన్ని గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లలో సీట్ల సంఖ్యను పెంచనున్నారు. ముజఫర్పూర్-ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడుస్తున్న రైలు నంబర్ 12211/12 గరీబ్రథ్ ఎక్స్ప్రెస్తో సహా బీహార్ మీదుగా వెళ్లే గరీబ్రథ్ గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లను లింక్ హాఫ్మన్ బుష్గా మార్చనున్నారు. ఈ మార్పుల తరువాత గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ 16 కోచ్లకు బదులుగా 20 కోచ్లతో నడుస్తుంది. దీంతో ఒక్కో గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లో 352 బెర్త్లు పెరగనున్నాయి. ఈ రైళ్లకు కొత్త త్రీ టైర్ ఎకానమీ కోచ్ను అనుసంధానం చేయనున్నారు. దీంతో గతంలో కంటే ఎక్కువ మంది ఒకేసారి ప్రయాణించే అవకాశం ఏర్పాడుతుంది. ఇప్పటివరకూ ఆకుపచ్చ రంగుతో విభిన్నంగా కనిపించిన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇకపై ఎరుపు రంగులో కనిపించనుంది. -
వీళ్లా.. అభ్యర్థులు!
సాక్షి, అమరావతి : ఎన్నికలు దగ్గరపడుతున్నకోద్దీ తెలుగుదేశం పార్టీ మరింతగా బలహీనపడిపోతోంది. 2019లో ప్రజలు కొట్టిన దెబ్బకు పార్టీ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులే దొరకలేదు. డబ్బున్నదనో, ఇతర కారణాలతోనే మొత్తంమీద అభ్యర్థులనైతే ఎంపిక చేశారు. వీరిలో అధిక శాతం పోటీకైతే సిద్ధమయ్యారు కానీ, క్షేత్రస్థాయిలో కనీస ప్రభావం చూపించలేకపోతున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. కొందరిని అయినా మార్చి ఇంకా ధన బలం ఉన్న వారిని పోటీకి పెట్టడానికి కసరత్తు చేస్తున్నారు. మరోపక్క సీఎం జగన్ చేపట్టిన సిద్ధం సభలు, బస్సు యాత్రతో రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కనీస పోటీ ఇచ్చేందుకైనా మరింత బలమైన అభ్యర్థులను నిలపాలని బాబు భావిస్తున్నారు. పనిచేయని పొత్తులు 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత టీడీపీ పరిస్థితి దయనీయంగా మారిపోవడంతో ఈ ఎన్నికల్లో ఇతర పారీ్టలతో పొత్తులు ఉంటే తప్ప ముందుకు వెళ్లే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు జనసేన, బీజేపీతో కలిశారు. అయినా పార్టీ బలం పెరగకపోగా మరింతగా క్షీణించడంతో సహనం కోల్పోయి ఎన్నికల ప్రచార సభల్లో అవాకులు చవాకులు పేలుతున్నారు. మరోవైపు చంద్రబాబు సభలు, రోడ్షోలకు జనం నుంచి స్పందన లేకపోవడంతో టీడీపీలో ఆందోళన పెరిగిపోతోంది. ఒకవైపు వైఎస్ జగన్ రోడ్షోలు, సభలకు జనం పోటెత్తుతుంటే తమ సభలకు జనం రాకపోవడంతో టీడీపీ నాయకులకు కళ్లెదుటే ఓటమి కనిపిస్తోంది. చంద్రబాబు నాలుగు నెలల క్రితమే ప్రకటించిన మేనిఫెస్టో, ఇప్పుడు తాజాగా ఇస్తున్న ఎన్నికల హామీలు ప్రజలను ఏమాత్రం నమ్మించలేకపోతున్నాయి. సత్యవేడు అభ్యర్థి మార్పు! చిత్తూరు జిల్లా సత్యవేడులో ఫిరాయింపు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని మార్చడం దాదాపు ఖాయమైనట్లు చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలానికి ప్రజల్లో ఆదరణ లేదని గ్రహించిన వైఎస్సార్సీపీ సీటు నిరాకరించింది. ఆయన్ని టీడీపీలో చేర్చుకుని చంద్రబాబు అదే సీటు కేటాయించారు. ఇప్పుడు తత్వం బోధపడటంతో ఆదిమూలాన్ని తప్పించి మరో వ్యక్తికి సీటు ఇవ్వాలని చూస్తున్నారు. అడ్డగోలు వాదనలు చేయడం ద్వారా ఎల్లో మీడియాలో గుర్తింపు పొందిన కొలికపూడి శ్రీనివాస్ని గొప్ప వ్యక్తిగా భావించి తిరువూరు సీటు ఇచ్చేశారు. కానీ అక్కడ ఆయన్ని తట్టుకోలేక సొంత పార్టీ నేతలే లబోదిబోమంటున్నారు. దీంతో శ్రీనివాస్ని వదిలించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. చింతలపూడిలో స్థానిక నేతలను కాదని ఎన్ఆర్ఐ సొంగా రోషన్ను ఎంపిక చేశారు. ఆయన కనీస పోటీ ఇచ్చే పరిస్థితి లేదని తెలియడంతో మరొక డబ్బున్న నేత కోసం కసరత్తు చేస్తున్నారు. గజపతినగరం, శ్రీకాకుళం, పాతపట్నం, మడకశిర స్థానాల్లోనూ అభ్యర్థులను మార్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తప్పుడు ప్రచారమూ పని చేయలేదు.. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మొన్నటివరకు తప్పుడు ప్రచారం ద్వారా హంగామా సృష్టించారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియా, మౌత్ క్యాంపెయినర్ల ద్వారా వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేయించి ప్రజలను తికమక పెట్టాలని చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. అయినా వాపునే బలుపు అనుకుని టీడీపీ గ్రాఫ్ పెరిగిపోయిందని చంద్రబాబు, టీడీపీ నేతలు కొద్దిరోజులుగా గాల్లో తేలిపోయారు. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చాక వైఎస్సార్సీపీ నిర్వహించిన నాలుగు ‘సిద్ధం’ సభలు టీడీపీ అబద్ధపు ప్రచారాన్ని పటాపంచలు చేశాయి. ఇప్పుడు వైఎస్ జగన్ చేపడుతున్న బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం ప్రజల్లో వైఎస్సార్సీపీకి ఉన్న ఆదరణను తేటతెల్లం చేస్తోంది. దీంతో టీడీపీ అంతర్మథనంలో మునిగిపోయింది. పొత్తులు కూడా వికటించినట్లు తేలడంతో ఇప్పుడు 10 శాతం అభ్యర్థులనైనా మార్చి ఉన్నంతలో పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే దిశగా చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉండి, అనపర్తి సీట్లపై అనిశ్చితి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సీటుపైనా అనిశ్చితి నెలకొంది. ఉండి సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు ప్రకటించినప్పటికీ, చంద్రబాబు ఒత్తిడితో వివాదాస్పద నేత రఘురామకృష్ణరాజును అక్కడ నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. రఘురామరాజుకు బీజేపీ నర్సాపురం ఎంపీగా అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన టీడీపీలో చేరి ఉండి నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. రఘురామరాజు నర్సాపురం ఎంపీ సీటు కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అది సాధ్యం కాకపోతే ఉండి సీటు కేటాయించక తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని మాడుగల అభ్యర్థిని మార్చాలని అక్కడి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఒత్తిడి తెస్తుండడంతో ఆ దిశగానూ కసరత్తు నడుస్తోంది. కడప ఎంపీ, జమ్మలమడుగు ఎమ్మెల్యే స్థానాల మార్పుపైనా చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నారు. అనపర్తి సీటు మళ్లీ తిరిగి టీడీపీకి కేటాయించే దిశగా బీజేపీ, టీడీపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. జనసేనకు కేటాయించిన నర్సాపురం స్థానాన్ని టీడీపీ తీసుకుంటుందనే చర్చ కూడా నడుస్తోంది. మొత్తంగా 20కిపైగా ఎమ్మెల్యే, ఒకట్రెండు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చడం ద్వారా బలమైన వైఎస్సార్సీపీకి కనీస పోటే ఇచ్చేలా వాతావరణాన్ని మార్చాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. -
మే 13న పోలింగ్.. ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష తేదీల్లో మార్పు
సాక్షి, విజయవాడ: మే 13న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. మే 13 నుంచి ప్రారంభం కావాల్సిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు మే 16కి వాయిదా పడ్డాయి. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 18 నుంచి 22 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 3 నుంచి జరగాల్సిన ఏపీ పీజీ సెట్ జూన్ 10కి వాయిదా వేశారు. జూన్ 10 నుంచి 14 ఏపీ పీజీసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 2 నుంచి 5 వరకు ఏపీ ఆర్ సెట్ జరగనుంది. -
టీఎస్కు బదులు ‘టీజీ’!
సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లో తెలంగాణ రాష్ట్ర కోడ్ను తెలిపే ‘టీఎస్’కు బదులుగా ‘టీజీ’ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభు త్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఉద్యమకాలంలో తెలంగాణను సంక్షిప్తరూపంలో ‘టీజీ’గా పరిగణించేవారని.. ఈ క్రమంలోనే కోడ్ను ‘టీజీ’గా మార్చేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైందని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం రాష్ట్ర మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. దీనితోపాటు మరో 20 ప్రధాన అంశాలను కేబినెట్ చర్చించనున్నట్టు తెలిసింది. గ్రూప్–1 పోస్టులు పెంపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరో 64 గ్రూప్–1 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేసే అంశంపై కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వారా 503 గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో.. ఈ అదనపు పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ జారీచేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వివిధ శాఖలు/విభాగాల్లో పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగుతున్న 1,049 మంది ప్రభుత్వ అధికారుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ‘బడ్జెట్’ తేదీల ఖరారు శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించే తేదీని కేబినెట్ ఖరారు చేయనుంది. సమావేశాల తొలిరోజున గవర్నర్ తమిళిసై చేయనున్న ప్రసంగాన్ని ఆమోదించనుంది. 8 నుంచి బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వంయోచి స్తోంది. 9న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జీఎస్టీ చట్ట సవరణ, పీఆర్ చట్ట సవరణ, సిటీ సివిల్ కోడ్ చట్ట సవరణ బిల్లులకు మంత్రివర్గం గ్రీన్సిగ్నల్ ఇవ్వనుంది. ధరణిపై అధ్యయన కమిటీ సమరి్పంచిన మధ్యంతర నివేదికపై కూడా సమీక్షించి తదుపరి కార్యాచరణను ఖరారు చేయనుంది. రాష్ట్ర గవర్నర్ గతంలో నిలిపివేసిన బిల్లులను తిరిగి పరిశీలన కోసం పంపాలన్న అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కులగణనపై చర్చ.. రాష్ట్రంలో చేపట్టనున్న కులగణనకు చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బడ్జెట్ కేటాయింపుల కోసం వివిధ శాఖల మంత్రులు చేసిన ప్రతిపాదనలను పరిశీలించనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగమైన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలను అమల్లోకి తెచ్చే అంశంపై చర్చించనున్నారు. ఈ రెండు పథకాలను ఎప్పుడు ప్రారంభించాలి, ఏ మేర ఆర్థిక భారం పడుతుందన్నది పరిశీలించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లపైనా చర్చించే అవకాశం ఉందని తెలిసింది. ఏ రాష్ట్రమో తెలిపే ‘కోడ్’ అది.. వాహనాల నంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)లలో వాహనం ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయిందో తెలియజేసేలా కోడ్ ఉంటుంది. తెలంగాణ ఏ ర్పాటై, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. వాహనాల నంబర్లో రాష్ట్ర కోడ్గా ‘టీఎస్’ అనే అక్షరాలను పొందుపర్చాలని నిర్ణయించింది. అప్పటి టీఆర్ఎస్ పార్టీ పేరును పోలినట్టుగా ‘టీఎస్’ అనే అక్షరాలను కోడ్గా ఖరారు చేశారంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు మండిపడ్డాయి. తాజాగా ‘టీఎస్’కు బదులు ‘టీజీ’ అనే స్టేట్ కోడ్ను వినియోగించాలని నిర్ణయానికి వచ్చింది. -
వైఎస్సార్సీపీ ఆరో జాబితా విడుదల
గుంటూరు, సాక్షి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నిస్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్సీపీ ప్రణాళిక సిద్దం చేసింది. ఈ క్రమంలో.. పలు అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మారుస్తోంది. తాజాగా పార్టీ అధిష్టానం శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను విడుదల చేసింది. మంత్రి మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జాబితాను ప్రకటించారు. ఆరో జాబితాలో నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గాల ఇన్ఛార్జిలను మార్చింది వైఎస్సార్సీపీ అధిష్టానం. ఇప్పటివరకు ఐదు జాబితాల వారీగా.. 61 మంది ఎమ్మెల్యే నియోజకవర్గాలకు, 14 పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జిలను మార్పులు జరిగాయి. తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు(3 ఎంపీ, 24 అసెంబ్లీ), మూడో జాబితాలో 21 స్థానాలకు(6 ఎంపీ, 15 అసెంబ్లీ), నాలుగో జాబితాలో 8 స్థానాలకు(1 ఎంపీ, 8 అసెంబ్లీ), ఐదో జాబితాలో 10 స్థానాలకు(4 ఎంపీ, 6 అసెంబ్లీ స్థానాలకు) సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్సీపీ. వైఎస్సార్ సీపీ 6వ జాబితా విడుదల... నాలుగు పార్లమెంట్ స్థానాలు, ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబందించి జాబితాను మంత్రి మేరుగ నాగార్జున,సజ్జల రామకృష్ణ రెడ్డి విడుదల చేశారు.#YSJaganAgain#Siddham pic.twitter.com/asgTtiOE18 — YSR Congress Party (@YSRCParty) February 2, 2024 వై నాట్ 175 నినాదంతో.. ప్రజలకు జరిగిన మంచిని, అందిన సంక్షేమాన్ని.. రాష్ట్రానికి జరిగిన అభివృద్ధిని చూపిస్తూ ఎన్నికలకు సిద్ధం అవుతోంది వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం. వైఎస్సార్సీపీ తొలి జాబితా ఇదే వైఎస్సార్సీపీ రెండో జాబితా ఇదే! ఉత్తరాంధ్రలో ఆ ఇద్దరికీ.. అనకాపల్లి, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్గా వైవీ సుబ్బారెడ్డిని, అలాగే.. అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ, అసెంబ్లీ నియోజకవర్గాలకు.. విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాలకు మజ్జి శ్రీనివాసరావును డిప్యూటీ రీజినల్ కో ఆర్డినేటర్గా నియమించింది వైఎస్సార్సీపీ. ‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ మూడో జాబితా ఇదే! వైఎస్సార్సీపీ నాలుగో జాబితా ఇదే! వైఎస్సార్సీపీ ఐదో జాబితా ఇదే! -
బాబార్ రోడ్డును అయోధ్య మార్గ్గా మార్చాలంటూ..
దేశ రాజధాని ఢిల్లీలోని హిందూ సేన కార్యకర్తలు బాబర్ రోడ్డు పేరును అయోధ్య రోడ్డుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు బాబర్ రోడ్డు అని ఉన్న సూచిక బోర్డుపై అయోధ్యమార్గ్ అనే పేరు అతికించారు. ఈ సందర్భంగా హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా మాట్లాడుతూ ‘బాబర్ రోడ్డు పేరును మార్చాలని హిందూ సేన చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ దేశం భారతదేశం.. ఇది శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు, వాల్మీకి, గురు రవిదాస్ తదితర మహానుభావులు నడయాడిన దేశం. అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మిస్తున్నారు. బాబర్ నిర్మించిన బాబ్రీ మసీదు ఇక లేనప్పుడు, ఢిల్లీలోని బాబర్ రోడ్డు పేరు వల్ల ఉపయోగం ఏమిటి?’ అని ప్రశ్నించారు. న్యూఢిల్లీలోని బెంగాలీ మార్కెట్లో ఉన్న బాబర్ రోడ్డు పేరు మార్చాలని కోరుతూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా ఎన్డీఎంసీ ఛైర్మన్కు ఒక లేఖరాశారు. బాబర్ ఒక చొరబాటుదారుడని, హిందువులపై దౌర్జన్యాలను సాగించాడని, అందుకే బాబర్ పేరుతో ఉన్న ఈ రహదారి పేరును అయోధ్య మార్గ్గా మార్చాలని ఆ లేఖలో కోరారు. -
వ్యవసాయ కార్పొరేషన్ల ఎండీల మార్పు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ఐఏఎస్లను ఎండీలుగా నియమిస్తామంటూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయ కార్పొరేషన్ల ఎండీల్లో గుబులు నెలకొంది. మరోవైపు కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వ్యవసాయ శాఖలో కొందరు అధికారులు మారతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సంక్రాంతికి ముందుగానే లేదా ఆ వెంటనే కార్పొరేషన్ల ఎండీలు, జనరల్ మేనేజర్లు మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తనకు గతంలో తెలిసిన, సమర్థులైన అధికారులను ఆయా పోస్టుల్లో నియమించవచ్చని చెబుతున్నారు. వ్యవసాయ శాఖలో మార్క్ఫెడ్, ఆయిల్ ఫెడ్, ఆగ్రోస్, సీడ్, హాకా, వేర్ హౌసింగ్ లాంటి కార్పొరేషన్లు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత కూడా వీటిల్లో కొన్నింటికి ఐఏఎస్లు ఎండీలుగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఐఏఎస్లు కానివారు ఎండీలుగా కొనసాగుతున్నారు. గత సర్కారుతో సంబంధాలపై ఆరా ప్రస్తుతం కార్పొరేషన్ల ఎండీలుగా ఉన్నవారి గురించిన సమాచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సేకరిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వంతో వారెలా ఉన్నారు? వృత్తిపరంగా వ్యవహరించారా? లేక అప్పటి అధికార పార్టీ నేతల్లా పనిచేశారా? అన్నది ఆరా తీస్తున్నట్లు సమాచారం. కొన్ని కార్పొరేషన్లలో ఎండీలు, చైర్మన్లు కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. కొందరు ఎండీ స్థాయి లేకున్నా పైరవీలతో ఆయా సీట్లలో కూర్చున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఆయా పోస్టుల్లో కొనసాగేందుకు కొందరు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. ఉండేదెవరు? ఊడేదెవరు?: మార్క్ఫెడ్కు సత్యనారాయణరెడ్డి ఎండీగా ఉన్నారు. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ఆయన ఈ బాధ్యతల్లోకి వచ్చారు. అంతకుముందు ఆయన గత ప్రభుత్వంలోని మంత్రి దయాకర్రావు వద్ద పీఎస్గా పనిచేశారు. ఇలా గతంలో పీఎస్లుగా పనిచేసిన వారి ని ఇప్పుడు తీసుకోబోమని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సత్యనారాయణరెడ్డి కొనసాగింపుపై చర్చ జరుగుతోంది. వేర్ హౌసింగ్ కార్పొరేషన్కు ఎండీగా ఉన్న జితేందర్రెడ్డి ఒక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధికి దగ్గరి బంధువు. కాబట్టి ఈయన కొనసాగింపుపైనా ప్రభుత్వం ఎలాంటి నిర్ణ యం తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఇక ఆయిల్ఫెడ్, ఆగ్రోస్, సీడ్, హాకా సంస్థలకు ఎండీలుగా సీనియర్ అధికారులు ఉన్నారు. వీరికి గతంలో బీఆర్ఎస్తో రాజకీయపరమైన సంబంధాలు లేవంటున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ కేశవులు అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణ సంస్థ (ఇష్టా)కు అధ్యక్షుడిగా ఉన్నారు. అంతర్జాతీయంగా రాష్ట్ర ఖ్యాతిని చాటుతున్నారు. కాబట్టి ఈయన మార్పు ఉండబోదన్న వాదన వినిపిస్తోంది. ఇక ఆయిల్ ఫెడ్, హాకాలకు ఎండీగా ఉన్న సురేందర్, ఆగ్రోస్ ఎండీ రాములు ఇద్దరూ సీఎం రేవంత్రెడ్డి జిల్లాకు చెందినవారు. కాబట్టి వారిని కూడా మార్చక పోవచ్చని చెబుతున్నారు. వారికి సీఎంతో ఉన్న అనుబంధం కూడా కలిసి వస్తుందని అంటున్నారు. రఘునందన్రావు కొనసాగుతారా? వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు కొనసాగుతారా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన సన్నిహితుడన్న ప్రచారముంది. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోనూ, అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతోనూ రఘునందన్రావుకు మంచి సంబంధాలే ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొనసాగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఒకవేళ మార్చినా మంచి పోస్టులోకే వెళ్తారని అంటున్నారు. -
మెరుగైన ఫలితాల కోసమే మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా ఏ నియోజక వర్గానికి ఎవరిని పార్టీ సమన్వయకర్త(ఇన్ఛార్జ్)గా నియమించాలో శాస్త్రీయంగా అధ్యయనం చేసిన అనంతరం మార్పులు చేర్పులకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సోమవారం 11 నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వివరాలను ప్రకటించారు. మంగళవారం నుంచి 11 నియోజవర్గాల్లో పార్టీ వ్యవహారాలన్నీ కొత్తగా నియమితులైన సమన్వయకర్తలే పర్యవేక్షిస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసమే ఈ మార్పులని, భవిష్యత్తులోనూ ఇలాంటి నిర్ణయాలు ఉండవచ్చని వారు స్పష్టం చేశారు. బొత్స మాట్లాడుతూ.. ఏ ఒక్కరినీ పార్టీ వదులుకోదని, అందరి సేవలను వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. గత నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం చేస్తూ వారికి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చారన్నారు. సామాజిక సాధికారతను చేతల్లో చూపించారన్నారు. అణగారిన వర్గాలకు మరింతగా మంచి చేయాలంటే పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. భవిష్యత్తులోనూ అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులను సమీక్షించుకుంటూ అవసరాన్ని బట్టి ఇన్ఛార్జ్ల మార్పు చేర్పులపై తగిన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. గంజి చిరంజీవిని పార్టీలో చేర్పించింది మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డేనని మంత్రి బొత్స గుర్తు చేశారు. మంగళగిరి నియోజకవర్గ పార్టీ సమన్వకర్తగా చిరంజీవిని సీఎం జగన్ నియమించారన్నారు. పార్టీలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి సముచిత స్థానం ఇస్తారని చెప్పారు. పార్టీ ఏ ఒక్కరినీ వదులుకోబోదని, ఎవరి సేవలు ఎక్కడ అవసరమో అక్కడ వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. ఈ మార్పుల వల్ల కొందరికి బాధ ఉండవచ్చని, అయితే అందరూ సీఎం జగన్ నిర్ణయాలను అర్థం చేసుకుని పార్టీకి సహకరిస్తారన్నారు. సజ్జల మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్ వైఎస్సార్సీపీని స్థాపించిన నాటి నుంచి పార్టీని ప్రజలకు జవాబుదారీగా ఉంచారు. సీఎం జగన్ దృష్టిలో శాసనసభ్యుడికి ఎంత విలువ ఉంటుందో కార్యకర్తకూ అంతే విలువ ఉంటుంది. పార్టీకి కార్యకర్తలే ప్రాణం. ప్రజలకు మరింతగా సేవ చేయాలంటే మళ్లీ అధికారంలోకి రావాలి. ప్రజలతో మమేకమై వారి మనసులు చూరగొని ఆశీస్సులు పొంది ఎవరు రాణిస్తారో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని సీఎం జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. ఈ క్రమంలోనే 11 నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమించారు. భారీ మెజార్టీతో గెలవాలన్న ఆలోచనతోనే మార్పులు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు ఉండవచ్చు.. ఉండకపోవచ్చు కూడా! పార్టీ ఒక వ్యక్తి కోసమో.. వ్యక్తుల కోసమో ఉండదు. ఎవరిౖకైనా ఇబ్బంది ఉంటే కూర్చోబెట్టి మాట్లాడతాం. ఎందుకు మార్పు చేశామనేది అంతర్గతంగా వారికి వివరిస్తాం’’ అని అన్నారు. ప్రతిపక్షాలు గాలి మాటలతో గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నాయని, పొత్తులపై ఒక దారీ తెన్నూ లేకుండా వ్యవహరిస్తున్నాయని అన్నారు. -
బల్క్ డ్రగ్ పార్కు స్థలం మార్పునకు కేంద్రం ఆమోదం
సాక్షి, అమరావతి: బల్క్ డ్రగ్ పార్కును కాకినాడ నుంచి అనకాపల్లి జిల్లా నక్కపల్లికి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పార్కును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో 2 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రూ.2,190 కోట్లతో ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇందు కోసం రూ.1,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూరుస్తోంది. అయితే, ప్రభుత్వ భూమి మాత్రమే ఉండాలని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీంతో కాకినాడ నుంచి నక్కపల్లి ప్రాంతానికి ఈ పార్కును మార్చారు. నక్కపల్లి వద్ద ఏపీఐఐసీ భూమి అందుబాటులో ఉండటం, అక్కడ ఇప్పటికే ఫార్మా రంగానికి చెందిన పలు పరిశ్రమలు ఉండటంతో రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలోనే టెండర్లను న్యాయ పరిశీలనకు (జ్యుడిíÙయల్ ప్రివ్యూకు) పంపుతామని ఏపీఐఐసీ వీసీ ఎండీ ప్రవీణ్కుమార్ తెలిపారు. న్యాయపరిశీలన అనంతరం ఆమోదం రాగానే టెండర్లు పిలుస్తామని చెప్పారు. చైనా నుంచి ఫార్మా దిగుమతులను అరికట్టాలన్న ఉద్దేశంతో దేశంలో మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ వంటి 16 రాష్ట్రాలతో పోటీ పడి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. పూర్తిగా పర్యావరణహితమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పార్కును అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫార్మా హబ్గా తయారవుతుందని, రూ.14,340 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా. ఇక్కడ 30,000 మందికి ప్రత్యక్షంగా, 40,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 200కు పైగా ఫార్మా యూనిట్లు ఉన్నాయి. బల్క్ డ్రగ్ పార్కు ద్వారా అదనంగా 100కు పైగా యూనిట్లు వస్తాయని బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. -
ఐటీ కంపెనీ విప్రోలో కీలక నాయకత్వ మార్పు.. రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడి
దిగ్గజ ఐటీ సంస్థ విప్రోలో వచ్చే నెలలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది. కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మన్ డిసెంబర్ 31న వైదొలుగుతున్నట్లు విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్లో శుక్రవారం ప్రకటించింది. ట్రాట్మన్ను దాదాపు మూడు సంవత్సరాల క్రితం యాక్సెంచర్ పీఎల్సీ నుంయి విప్రో హై-ప్రొఫైల్ హైరింగ్లో తీసుకువచ్చింది. విప్రో వెబ్సైట్లోని ఆమె ప్రొఫైల్ ప్రకారం, ట్రాట్మాన్ అభివృద్ధి భాగస్వాములతో విప్రో సంబంధాలకు నాయకత్వం వహించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ను అందించారు. విప్రో బ్రాండ్ అవగాహనను మెరుగుపరిచారు. గ్లోబల్, స్ట్రాటజిక్ పర్స్యూట్ టీమ్ ఏర్పాటుతో సహా సంస్థ అంతటా అమ్మకాల సామర్థ్యాలను అభివృద్ధి చేశారు. స్టెఫానీ ట్రాట్మాన్ సమర్పించిన డిసెంబరు 8 నాటి రాజీనామా లేఖ కాపీని కూడా ఫైలింగ్లో కంపెనీ పొందుపరిచింది. సంస్థలో కొనసాగిన మూడేళ్ల కాలంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసిన ట్రౌట్మన్.. విప్రో వెలుపల వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాల కోసమే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. -
మార్పునకే తెలంగాణ ఓటు
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ వాదన గెలిచింది? ఏ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది? ఓటరు దేన్ని విశ్వసించాడు? దేనికి ప్రభావితుడయ్యాడు? సర్వత్రా జరుగుతున్న చర్చ ఇది. రాజకీయ పార్టీల విశ్లేషణ కూడా ఇదే. ఈసారి ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యమిచ్చే ప్రయత్నం చేశాయి. సంక్షేమ పథకాల హామీల్లో ప్రధాన పార్టీలూ పోటీ పడ్డాయి. ఈ క్రమంలో సామాజిక సమీకరణలనూ తెరమీదకు తెచ్చాయి. ఇవి ఓట్లు రాలుస్తాయని భావించాయి. అయితే ఈసారి ప్రజాక్షేత్రంలో పార్టీల ప్రచారం, నినాదాలు ఒక స్థాయి వరకే పరిమితం కాలేదు. ఎన్నికల వేడి పెరిగే కొద్దీ కొత్త అంశాలను అ్రస్తాలుగా ఎంచుకున్నాయి. ఈవీఎంలు ఫలితాలు నిర్దేశించిన తర్వాత మాత్రం కొన్ని అంశాలే ఈసారి బలమైన ప్రభావం చూపాయనేది సుస్పష్టం. – సాక్షి, హైదరాబాద్ దూసుకెళ్లిన మార్పు రెండు దఫాలు పాలించిన బీఆర్ఎస్ అభివృద్ధి మంత్రంతో మూడోసారి అధికారమివ్వమని కోరింది. దీన్ని బలమైన నినాదంగా ఆ పార్టీ భావించింది. కాంగ్రెస్ మాత్రం ‘మార్పు కావాలి ... కాంగ్రెస్ రావాలి’అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళింది. ‘ఒక్క అవకాశం ఇవ్వమనే’అభ్యర్థన బీఆర్ఎస్ నినాదం కన్నా ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. సంప్రదాయ కాంగ్రెస్ నినాదాలకు విరుద్ధంగా అందరికీ అర్థమయ్యే భాషలో తీసుకెళ్ళిన మార్పు కావాలనే నినాదం బలంగా పనిచేసినట్టు కన్పిస్తోంది. అభివృద్ధి కన్పించిన జిల్లాల్లోనూ బీఆర్ఎస్ ఈసారి ప్రతికూలత చవి చూడటమే ఇందుకు కారణం. తిరుగులేదని భావించిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీలతో పాగా వేసింది. కాంగ్రెస్ ‘ఆరు హామీ’ల్లో కొద్దిపాటి కొత్తదాన్ని జొప్పించారు. మహిళలకు రూ. 2500, కౌలు రైతులు, రైతుకూలీలకు సహాయం కాంగ్రెస్ మేనిఫెస్టోలో కన్పించిన కొత్త అంశాలు. గ్రామీణ మహిళా ఓటర్లు కాంగ్రెస్కు పట్టంగట్టడం చూస్తుంటే ఈ నినాదాలు ఆకట్టుకున్నాయనేది స్పష్టం. ఈసారి యువ ఓటరు పోలింగ్కు పోటెత్తడం, కాంగ్రెస్కు ఆకర్షితులవ్వడం విశేషం. ఉద్యోగాలిస్తామన్న కాంగ్రెస్ హామీకి... జాబ్ క్యాలెండర్ను జోడించడం మరింత నమ్మకాన్ని చేకూర్చింది. అధికార పార్టీ అవినీతి నినాదాన్ని బలంగా విన్పించే ప్రయత్నం చేసినా, బీఆర్ఎస్ బలమైన స్థానాలే కాదు... కాంగ్రెస్ బలమైన స్థానాల్లోనూ దీని ప్రభావం కన్పించలేదు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న రాజకీయ నినాదం కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది. దీనివల్ల ప్రయోజనమూ పొందింది. కొన్ని వర్గాల ఓట్లు కాంగ్రెస్ పక్షానికి మళ్ళడం ఫలితాల్లో స్పష్టంగా కన్పిస్తోంది. నిష్ఫలమైన బీఆర్ఎస్ అస్త్రాలు బీఆర్ఎస్ తన పదేళ్ల పాలనలో అభివృద్ధినే నమ్ముకుంది. అమలు చేసిన సంక్షేమాన్నే ప్రచార ఆయుధంగా చేసుకుంది. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, పెన్షన్లను నినాదాలుగా మార్చింది. పాజిటివ్ మార్గంలోనే ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేసింది. ప్రతీ పథకంలోనూ మరింత పెంపును జోడించింది. కానీ రానురాను బీఆర్ఎస్ ప్రచార సరళి మార్చింది. పాజిటివ్ నుంచి కాంగ్రెస్పై విరుచుకుపడే నెగెటివ్ సరళిని ఎంచుకుంది. దీన్ని ఆ పార్టీ అనివార్యంగా భావించింది. ‘మళ్ళీ కాంగ్రెస్ వస్తే...’కరెంట్ ఉండదు.. మత కలహాలు వస్తాయి... ముఖ్యమంత్రులు మారతారు... అభివృద్ధి కుంటుపడుతుందనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేసింది. రాజకీయ ప్రత్యర్థి దూకుడుకు కళ్లెం వేస్తుందని భావించింది. నెగెటివ్ ప్రచార సరళి అప్పటి వరకూ జరిగిన పాజిటివ్ ఓటింగ్ను డామినేట్ చేసిందనేది విశ్లేషకుల అభిప్రాయం. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి వల్ల నష్ట నివారణకు ... ముఖ్యమంత్రిగా తన వ్యక్తిగత ఇమేజ్తో ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రజాక్షేత్రాన్ని ఇవేవీ అందుకోలేకపోయాయి. అభివృద్ధి కన్పించే ప్రాంతాల్లోనూ బీఆర్ఎస్ అనుకున్న రీతిలో లాభపడకపోవడం విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. ప్రజల అభిమానం చూరగొనలేని అభ్యర్థుల వల్ల బీఆర్ఎస్ ఎన్నికల అ్రస్తాలన్నీ నిష్ఫలమయ్యాయా? అనే చర్చ విన్పిస్తోంది. కమలానికి కలిసి రాని బీసీ మంత్రం బీజేపీ సీట్లు, ఓట్లు పెరగడానికి కారణాలేంటి? మోదీ, షాల ప్రచారమా? ఆ పార్టీ ఎన్నికల నినాదమా? అన్ని వర్గాల్లో జరిగే చర్చ ఇది. ఏడాది క్రితం ఊపు పెంచిన బీజేపీ ఎన్నికల వేళ చతికిల పడ్డా... ఆశాజనకమైన ఫలితాలనే చవిచూసింది. ప్రధానంగా తాము అధికారంలోకి వస్తే బీసీలకే పెద్దపీట వేస్తామని చెప్పింది. బీసీ నేతలకే ప్రధాన భూమికని చెప్పింది. అయితే, బీసీలుగా చెప్పుకునే బలమైన నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేదు. దీన్నిబట్టి బీజేపీ బీసీ నినాదాన్ని ప్రజలు విశ్వసించలేదనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు ఎక్స్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ట్వీట్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై ఏఐసీసీ అ«ధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హర్షం వ్యక్తం చేశారు. పార్టీ గెలుపులో భాగస్వాములైన ప్రజలకు ఎక్స్ ద్వారా ఆయన ధన్యవాదాలు తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇచ్చామని, అయితే అక్కడి ఫలితాలు నిరాశపరిచాయని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీపై అభిమానం చూపి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పాటుపడ్డ కార్యకర్తల సేవలను గుర్తిస్తున్నట్లు వివరించారు. ఒడిదుడుకులను అధిగమించి లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం సిద్ధపడతామంటూ ఖర్గే ఎక్స్లో పోస్ట్ చేశారు. గెలిచిన బీజేపీ, కాంగ్రెస్లకు అభినందనలు ఏపీ సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపులో గెలుపొంది అధికారం చేజిక్కించుకున్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’ సామాజిక మాధ్యమం ద్వారా ఆయా పార్టీలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో గెలిచిన బీజేపీకి, పొరుగు రాష్ట్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. హామీలన్నీ అమలు చేస్తాం రాహుల్ తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన, మద్దతు పలికిన వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో చరిత్ర సృష్టించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అగ్రనేత ప్రియాంకాగాంధీ తెలిపారు. ఇది ప్రజలతోపాటు కార్యకర్తలందరి విజయమని ఆదివారం ఎక్స్లో ట్వీట్ చేశారు. పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పారు. ఆశించిన విధంగానే ప్రజలు ఫలితాన్నిచ్చారు కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నరకాసురుడి పాలనకు ముగింపు పలుకుతామని, హిట్లర్ను ఫామ్హౌస్కే పరిమితం చేస్తామని ఏడాదిగా ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చెప్పినట్లుగానే ఫలితం ఇచ్చారని కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్, పాలేరు అభ్యర్థి గా గెలిచాక పొంగులేటి వ్యాఖ్యానించారు. ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లలో రాష్ట్ర ప్రజల అభీష్టం, అభిప్రాయాలకు భిన్నమైన పాలన సాగించడంతోనే బీఆర్ఎస్కు ఈ రకమైన ఫలితాలొచ్చాయని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ చెప్పినట్లుగా మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారంటీలపై తీర్మానం చేస్తామని, వంద రోజుల్లోనే ఇవి కార్యరూపం దాల్చేలా చర్యలుంటాయని పొంగులేటి వెల్లడించారు. గాందీభవన్ కళకళ సాక్షి, హైదరాబాద్/ బంజారాహిల్స్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గాందీభవన్ పరిసరాలు తొలిసారి కళకళలాడాయి. గత పదేళ్లుగా జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఎప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చినా గాందీభవన్ బోసిపోతూ కనిపించేది. కానీ, ఇప్పుడు దానికి భిన్నంగా గాంధీభవన్లో హడావుడి నెలకొంది. ఫలితాలు అనుకూలంగా వస్తుండటంతో పార్టీ శ్రేణులు ఉదయం 9 గంటల నుంచే గాందీభవన్ బాట పట్టాయి. నృత్యాలు చేస్తూ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ పార్టీకి ఆధిక్యం పెరగటంతో గాందీభవన్ పరిసరాలు మారుమోగాయి. జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనూ కేడర్ సంబురాలు చేసుకుంది. -
అమిత్ షా పర్యటనలో మార్పు.. 18న రాక
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత అమిత్ షా రాష్ట్రంలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 17వ తేదీన ఆయన రాష్ట్రానికి రావ లసి ఉండగా.. ఆ కార్యక్రమాలన్నీ ఒకరోజు వాయిదా పడ్డాయి. ఈనెల 18న రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈనెల 18వ తేదీన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత నల్లగొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్లలో జరిగే బహిరంగ సభల్లో షా పాల్గొంటారు. -
బరిలోకి బీఆర్ఎస్ ఫుల్ టీమ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫుల్టీమ్ రంగంలోకి దిగింది. పార్టీ అభ్యర్థులంతా ఖరారవడంతోపాటు బీఫారాల పంపిణీ మంగళ వారం పూర్తయింది. పెండింగ్లో ఉన్న గోషామహ ల్ నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నంద కిషోర్ వ్యాస్ బిలాల్, నాంపల్లి నుంచి సీహెచ్ ఆనంద్కుమార్గౌడ్లకు టికెట్లు ఖరారయ్యాయి. ఇక అలంపూర్ (ఎస్సీ) అభ్యర్థిగా గతంలో ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను మారుస్తూ.. ఆయన స్థానంలో కొత్తగా కోడెదూడ విజయుడును ఎంపిక చేశారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని ఎనిమిది స్థానాల అభ్యర్థులకు, విజయుడుకు మంగళవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ బీఫారాలను అందజేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, బీఫారాల జారీ పూర్తయిందని నేతలు ప్రకటించారు. చల్లా అనుచరుడికి చాన్స్.. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం తొలి జాబితాలోనే అలంపూర్ బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నా.. స్థానిక నేతల్లో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమైంది. దానికితోడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డితో ఉన్న విభేదాలు కూడా ప్రభావం చూపాయి. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తన అనుచరుడు ‘విజయుడు’కు టికెట్ కోసం ఒత్తిడి చేసిన ఎమ్మెల్సీ చల్లా చివరికి తన పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్సీ చల్లా మంగళవారం అలంపూర్ అభ్యర్థి విజయుడును వెంటబెట్టుకుని తొలుత ప్రగతిభవన్కు, తర్వాత తెలంగాణ భవన్కు వచ్చారు. తాజాగా బీఫారం అందుకున్న అభ్యర్థులు వీరే.. కేటీఆర్ చేతుల మీదుగా మంగళవారం బీ ఫారాలు అందుకున్న వారిలో సామ సుందర్రెడ్డి (యాకుత్పురా), అయిందాల కృష్ణయ్య (కార్వాన్), నందకిషోర్ వ్యాస్ బిలాల్ (గోషామహల్), ఇబ్రహీం లోడీ (చార్మినార్), ఎం.సీతారాంరెడ్డి (చాంద్రాయణ్గుట్ట), అలీ బఖ్రీ (బహదూర్పురా), తీగల అజిత్రెడ్డి (మలక్పేట), సీహెచ్ ఆనంద్గౌడ్ (నాంపల్లి), విజయుడు (అలంపూర్) ఉన్నారు. గోషామహల్ టికెట్ ఆశించిన ఆశిష్కుమార్ యాదవ్ మంగళవారం ప్రగతిభవన్లో కేటీఆర్ను కలిశారు. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని, నందకిషోర్తో కలసి పనిచేయాలని ఆశిష్ను కేటీఆర్ బుజ్జగించారు. 119 స్థానాల్లోనూ అభ్యర్థుల ఖరారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆగస్టు 21వ తేదీనే 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తూనే.. ఏడుగురికి మాత్రం నిరాకరించారు. నాలుగు చోట్ల పూర్తిగా కొత్తవారికి అవకాశమిచ్చారు. అప్పట్లో జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల ప్రకటనను పెండింగ్లో పెట్టారు. తర్వాత మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడటంతో.. ఆ స్థానంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డికి అవకాశమిచ్చారు. జనగామ నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిలకు టికెట్ లభించింది. తాజాగా గోషామహల్, నాంపల్లికి కూడా అభ్యర్థులను ప్రకటించారు. అలంపూర్ అభ్యర్థిని మార్చారు. -
అలా మార్చేస్తే ఎలా?
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా విధానంలో మార్పులు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఇండియా పేరును భారత్గా మార్చడం పక్కన బెడితే, కొన్ని చాప్టర్లు తీసివేయడం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే వీలుందని విద్యావేత్తలు అంటున్నారు. పురాతన చరిత్ర స్థానంలో క్లాసికల్ హిస్టరీని తేవాలని తాజాగా జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. దీన్ని తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు స్వాగతించడం లేదు. ఇప్పటికే రాష్ట్రాల పరిధిలో స్థానిక అంశాలతో సిలబస్ ఉంది. వీటిని పరిగణనలోనికి తీసుకుని సిలబస్లో మార్పులు చేస్తేనే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వేర్వేరు సిలబస్లతో ఇబ్బందులు ప్రపంచీకరణ ప్రభావం విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రం వేర్వేరు సిలబస్లు అమలు చేయడం వల్ల పోటీ పరీక్షల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న వాదన విద్యావేత్తల నుంచి విన్పిస్తోంది. మారిన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా రాష్ట్రాల్లోని సిలబస్లో మార్పులు తేవాలనే అంశంపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. పోటీ పరీక్షలుసవాలే.. ఎన్సీఈఆర్టీ సూచించిన మార్పుల్లో అనేక అంశాలున్నాయి. క్లాసికల్ హిస్టరీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటోంది. ప్రాచీన చరిత్రను ఎత్తివేయడమే సమంజసమని భావిస్తోంది. ఇప్పటికే కొన్ని సబ్జెక్టులను తీసివేయాలనే ప్రతిపాదన రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. మొఘల్ సామ్రాజ్యం, గాందీజీ హత్య, ప్రజాస్వామ్యం–రాజకీయ పారీ్టలు అనే చాప్టర్స్ను ఎన్సీఈఆర్టీ అనవసరమైనవిగా చెబుతోంది. పాత చరిత్రలో విజయాలకన్నా, అపజయాల గురించే ఎక్కువగా ఉందనేది ఎన్సీఈఆర్టీ అభిప్రాయం. అయితే ఇవి రాష్ట్రాల పరిధిలో ఇప్పటికీ బోధనాంశాలుగా కొనసాగుతున్నాయి. పోటీ పరీక్షల్లోనూ వీటిలోంచి ప్రశ్నలు ఇస్తున్నారు. ఎడ్సెట్, లాసెట్, గ్రూప్స్, వివిధ రకాల పోటీ పరీక్షల్లో ఆర్ట్స్’ విద్యార్థులు వీటిని చదవాల్సి ఉంటుంది. సీబీఎస్ఈ సిలబస్ చదివే వాళ్ళకు ఈ చాప్టర్లు చదివే వీలుండదు. దాంతో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో విద్యార్థులకు నష్టం కల్గించే వీలుందని నిపుణులు అంటున్నారు. సైన్స్ నేపథ్యంతో సీబీఎస్ఈ చదివే విద్యార్ధులకు... సైన్స్లో డార్విన్ సిద్ధాంతాన్ని కేంద్ర విద్యా సంస్థ ఎత్తివేయాలని ప్రతిపాదించింది. మానవ పరిణామ క్రమాన్ని సహేతుకంగా నిరూపించే సిద్ధాంతాన్ని ఎన్సీఈఆర్టీ కమిటీ విభేదించినట్టు తెలుస్తోంది. దీంతో పాటే పైథాగరస్ సిద్ధాంతానికి స్వస్తి పలకాలని సూచి స్తోంది. దీనివల్ల కూడా సైన్స్ నేపథ్యంతో సీబీఎస్ఈ చదివే విద్యార్థులు రాష్ట్రాల్లోని పోటీ పరీక్షలకు హాజరవ్వడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కేంద్ర స్థాయిలో నిర్వహించే పరీక్షలకు సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగానే ప్రశ్నలు ఇస్తారు. రాష్ట్ర బోర్డు పరిధిలో ఉండే విద్యార్థులు కొత్త చాప్టర్స్ చదివే వీలుండదు. వాళ్లు చదివిన పురాతన భారత చరిత్ర వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి అనేక సమస్యలు ఎదురయ్యే వీలుందని పలువురు అంటున్నారు. అన్ని రాష్ట్రాలనూ పరిగణనలోకి తీసుకోవాలి ప్రపంచవ్యాప్తంగా విద్యా విధానంలో వస్తున్న మార్పులను ఆకళింపజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా విద్యార్థి విద్యా విధానంలోనే స్కిల్కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ దిశగా పాఠ్యాంశాలు ఉండటం మంచిది. అయితే, మార్పు జరిగేటప్పుడు రాష్ట్రాల పరిధిలోని విద్యా విధానాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. లేనిపక్షంలో అనేక మంది విద్యార్థులు రెండు సిలబస్లతో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. –ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్) వక్రీకరణ సరికాదు చరిత్రను వక్రీకరించే విధానం ఎన్సీఈఆర్టీ సిఫార్సుల్లో బోధపడుతోంది. ప్రాచీన చరిత్రను తీసివేయాలనే ధోరణి మంచిది కాదు. చరిత్ర తెలుసుకుంటేనే ప్రతిభ పెరుగుతుంది. ఇది తెలియకుండా ఇష్టానుసారంగా చరిత్రను పాఠ్యాంశాల్లో జోడిస్తే ప్రతికూల ఫలితాలొస్తాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో వేర్వేరు సిలబస్లు వల్ల కూడా నష్టం జరుగుతుందనే విషయాన్ని కేంద్రం గుర్తించాల్సిన అవసరం ఉంది. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
కేసీఆర్ సభల షెడ్యూల్లో స్వల్ప మార్పు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్వల్పవిరామం తర్వాత తిరిగి గురువారం నుంచి బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభల్లో పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖరరావు పాల్గొంటారు. అయితే గతంలో ప్రకటించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేస్తూ బహిరంగ సభల ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఈ నెల 26న నాగర్కర్నూలు, 27న స్టేషన్ ఘన్ పూర్లో నిర్వహించ తలపెట్టిన సభలను వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ తాజాగా ప్రకటించింది. రద్దయిన సభల స్థానంలో 26న వనపర్తి, 27న మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. 26న వనపర్తితోపాటు అచ్చంపేట, మునుగోడులో, 27న మహబూబాబాద్, వర్ధన్న పేటతోపాటు పాలేరులో జరిగే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. 28న విరామం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భా గంగా ఈ నెల 15 నుంచి నవంబర్ 9 వరకు 17 రోజుల్లో 41 అసెంబ్లీ నియోజ కవర్గాల్లో కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభల షెడ్యూల్ను గతంలో బీఆర్ఎస్ ప్రకటించింది. ఈనెల 15 మొదలుకుని 18 వరకు కేసీఆర్ హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట, జడ్చర్ల, మేడ్చల్లో జరిగిన సభల్లో ప్రసంగించారు. సద్దుల బతుకమ్మ, దసరా నేప థ్యంలో ఈనెల 19 నుంచి 25 వరకు కేసీఆర్ పాల్గొనే సభలకు విరామం ప్రకటించారు. 26 నుంచి తిరిగి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు ప్రారంభమై వచ్చే నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ నెల 28న ప్రచారానికి విరా మం ఇచ్చి 29న కోదాడ, తుంగతు ర్తి, ఆలేరు 30న జుక్కల్, బాన్సువాడ, నారాయ ణ్ఖేడ్లలో, 31న హుజూర్నగర్, మిర్యాలగూ డ, దేవరకొండ సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. తిరిగి నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లెందు, 2న నిర్మల్, బాల్కొండ, ధర్మపురి 3న భైంసా (ముధోల్), ఆర్మూర్, కోరుట్ల, 5న కొత్తగూడెం, ఖమ్మం, 6న గద్వాల్, మఖ్తల్, నారాయణపేట, 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి, 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, 9న కామారెడ్డి సభల్లో ప్రసంగిస్తారు. 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. -
దేశ దేశాల నామాయణం! పేర్లు మార్చకున్న దేశాలు ఇవే!
పేరులోనేముంది అని చాలామంది కొట్టిపారేస్తారు గాని, పేరు మీద పట్టింపుగల వాళ్లు తక్కువేమీ కాదు. మనుషులు పేర్లు మార్చుకోవడం పెద్ద విశేషమేమీ కాదు. చిరపరిచితమైన ఊళ్లు, దేశాల పేర్లు మారిపోతే మాత్రం విశేషమే! ‘ఇండియా దటీజ్ భారత్’ అని మన రాజ్యాంగంలోని మొదటి అధికరణలో ఉంది. విదేశీయులు మనల్ని ఇండియన్స్గానే సంబోధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మన దేశానికి భారత్గా పునర్నామకరణం చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపింది. ఇప్పటికైతే అధికారికంగా మన దేశం పేరు మారలేదు. త్వరలోనే మారితే మారవచ్చు కూడా! అలాగని దేశాలు పేరు మార్చుకోవడం కొత్తేమీ కాదు. ఆధునిక ప్రపంచంలో పేర్లు మార్చుకున్న దేశాలు కొన్ని ఉన్నాయి. వాటి విశేషాలు మీ కోసం... రాచరికాలు కొనసాగిన కాలంలో రాజుల ఆధిపత్యాలను బట్టి రాజ్యాల పేర్లు తరచు మారిపోతూ ఉండేవి. ఆధునిక ప్రపంచంలో దేశాల పేర్లు అంత తరచుగా మారిపోవడం లేదు గాని, అప్పుడప్పుడూ రకరకాల కారణాల వల్ల అవి మారుతూనే ఉన్నాయి. ఇరవయ్యో శతాబ్ది నుంచి ఇప్పటి వరకు పేర్లు మార్చుకున్న కొన్ని దేశాల గురించి తెలుసుకుందాం. చెకియా చెకొస్లోవేకియా నుంచి 1992 విడివడిన తర్వాత ఈ దేశం పేరు ‘చెక్ రిపబ్లిక్’గా ఉండేది. ఈ దేశం పేరు మార్పు వెనుక ఘనమైన చారిత్రక, సాంస్కృతిక కారణాలేవీ లేవు. మరెందుకు పేరు మార్చుకున్నారంటే, ఇదివరకటి పేరు పెద్దగా ఉందట! పెద్దగా ఉన్న పేరుతో అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు పొందడం కష్టమని, విదేశీయులకు ఆ పేరు పలకడం కష్టంగా ఉందని పాలకులు భావించారు. అంతర్జాతీయ సమాజాన్ని ఆకట్టుకోవడానికి, మరింతగా విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడానికి 2016 ఏప్రిల్లో దేశం పేరును ప్రభుత్వం ‘చెకియా’గా మార్చుకుంది. అధ్యక్షుడు మిలోస్ జెమాన్ ఆధ్వర్యంలో ఈ మార్పు జరిగింది. ఇరాన్ ఇప్పుడు ఇరాన్ అంటే జనాలకు బాగా అలవాటైపోయిన పేరు. ఇదివరకు దీని పేరు పర్షియాగా ఉండేది. పర్షియా తన పేరును 1935లో ఇరాన్గా మార్చుకుంది. ఈ మార్పు వెనుక నాజీల ప్రభావం ఉంది. ఆర్యుల జనాభా ఎక్కువగా ఉండే దేశాలతో నాజీ జర్మనీ ‘సత్సంబంధాలు’ కలిగి ఉండేది. ‘ఆర్యన్’ నుంచి వచ్చిన పేరే ఇరాన్! జర్మనీలో అప్పటి పర్షియా రాయబారి మొహసిన్ రియాస్ ఈ పేరు మార్పు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగించాడు. బహుశా నాజీల మెప్పు కోసం ఆయన ఆ ప్రయత్నాలు చేసి ఉండవచ్చనే వాదన లేకపోలేదు. మొత్తానికి అప్పటి పర్షియా అధినేత రెజా షా పహ్లావీ 1935లో ఇకపై తమ దేశాన్ని ‘ఇరాన్’ పేరుతో గుర్తించాలని తమ దేశంతో దౌత్యసంబంధాలు కలిగి ఉన్న దేశాలన్నింటినీ కోరారు. అవి ఆ కోరికను మన్నించడంతో పర్షియా పేరు ఇరాన్గా మారింది. రెండో ప్రపంచయుద్ధం ఫలితంగా జర్మనీలో నాజీ ప్రభుత్వం పతనమైన తర్వాత మిగిలిన దేశాలు కూడా పర్షియాను ఇరాన్గా గుర్తించడంతో అదే పేరు స్థిరపడింది. బోత్స్యానా ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఉన్న చిన్న దేశం బోత్స్యానా. దీనికి ఇంతకు ముందున్న పేరు ‘బెషువాన్లాండ్ ప్రొటెక్టరేట్’. బ్రిటిష్ పాలకులు దీన్ని 1885లో ప్రొటెక్టరేట్గా ప్రకటించారు. స్థానిక ‘త్సా్వనా’ పదాన్ని పలకలేక వారు ‘బెషువానా’గా వ్యవహరించేవారు. చాలా పోరాటాలు, చర్చోపచర్చల తర్వాత ఈ దేశానికి 1966లో స్వాతంత్య్రం దక్కింది. సెరెత్సె ఖామా తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ‘త్వ్సానా’ తెగ ప్రజలు అత్యధికులుగా ఉన్న ఈ దేశానికి బ్రిటిష్వారు అపభ్రంశ పదాలతో పెట్టిన పేరును మార్చి, ‘బోత్స్యానా’గా మార్చారు. ‘బోత్స్యానా’ అంటే ‘త్వ్సానా’ ప్రజల నేల. ఈ పేరు మార్పును అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించింది. శ్రీలంక శ్రీలంక పాత పేరు సిలోన్. బ్రిటిష్ పాలకులు ఆ పేరు పెట్టారు. ‘సహీలన్’ అరబిక్ పదం నుంచి వారు ఆ పేరు పెట్టారని చెబుతారు. అయితే, ఆ పేరు పుట్టుపూర్వోత్తరాల గురించి వేర్వేరు వాదనలు ఉన్నాయి. పదో శతాబ్దానికి చెందిన అరబిక్ రచయిత ఇబ్న్ షహ్రియార్ తన ‘అజబ్–అల్–హింద్’ పుస్తకంలో శ్రీలంకను ఉద్దేశించి ‘సెరెన్దిబ్’, ‘సహీలన్’ అనే పదాలను ఉపయోగించాడు. తొలినాళ్లలో దీని పేరు ‘తామ్రపర్ణి’గా ఉండేది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన గ్రీకుయాత్రికుడు మెగస్తనీస్ దీనినే తన రచనల్లో ‘తప్రోబన’ అని పేర్కొన్నాడు. బ్రిటిష్వారి కంటే ముందు ఈ ప్రాంతాన్ని పోర్చుగీసు, స్పానిష్, ఫ్రెంచ్, డచ్ వాళ్లు కూడా కొంతకాలం పరిపాలించారు. పోర్చుగీసులు దీనిని ‘సీలావో’ అని, స్పానిష్ వాళ్లు ‘సీలాన్’ అని, ఫ్రెంచ్వాళ్లు ‘సీలన్’ అని, డచ్వాళ్లు ‘జీలన్’ అని వ్యవహరించేవారు. అయితే, బ్రిటిష్ హయాంలో పెట్టిన ‘సిలోన్’ పేరు ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. ఈ దేశానికి 1948లోనే స్వాతంత్య్రం వచ్చినా, 1966 వరకు సిలోన్ పేరుతోనే ఉండేది. సిరిమావో బండారునాయకె ప్రధానిగా ఉన్న కాలంలో దేశం పేరును ‘శ్రీలంక’గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐర్లండ్ ఇప్పటి ప్రపంచానికి ఐర్లండ్ పేరు బాగా పరిచయం గాని, అంతకుముందు దీని పేరు ‘ఐరిష్ ఫ్రీ స్టేట్’. ఇంగ్లిష్ వాళ్ల పాలనలో దాదాపు మూడు శతాబ్దాలు మగ్గిన దేశం ఇది. ఐరిష్ జాతీయోద్యమం తర్వాత తొలుత ఇది 1922లో బ్రిటిష్ సామ్రాజ్యంలోని స్వయంపాలిత రాజ్యంగా మారింది. బ్రిటిష్ ప్రభుత్వం 1931లో దీనిని ‘నిర్వివాద స్వతంత్ర దేశం’గా ప్రకటించడంతో ‘ఐరిష్ ఫ్రీ స్టేట్’గా అవతరించింది. ఐర్లండ్ ద్వీపంలోని మొత్తం 32 కౌంటీలు ఉంటే, వాటిలోని 26 కౌంటీలతో ‘ఐరిష్ ఫ్రీ స్టేట్’ ఏర్పడింది. మిగిలిన ఆరు కౌంటీలు ‘నార్తర్న్ ఐర్లండ్’గా బ్రిటిష్ సామ్రాజ్యంలోని భాగంగానే ఉన్నాయి. ఐరిష్ రాజ్యాంగం 1937లో దేశం పేరును అధికారికంగా ‘ఐర్లండ్’గా మార్చింది. ఐర్లండ్ 1949లో ‘రిపబ్లిక్’గా మారడంతో మిగిలిన ప్రపంచం అప్పటి నుంచి ఇదే పేరుతో గుర్తించడం ప్రారంభించింది. థాయ్లాండ్ థాయ్లాండ్ ఇప్పుడు అందరికీ అలవాటైపోయిన పేరు. ఇదివరకు దీని పేరు ‘సియామ్’. ‘శ్యామ’ అనే సంస్కృత పదం నుంచి ‘సియామ్’ పేరు వచ్చింది. ‘సియామ్’ అనేది ఈ దేశవాసులు పెట్టుకున్న పేరు కాదు, విదేశీయులు పెట్టిన పేరు. ఫీల్డ్ మార్షల్ ప్లేక్ ఫిబున్సాంగ్ఖ్రామ్ ప్రధాని పదవిలోకి వచ్చి, నియంతృత్వాధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆయన 1939లో ‘సియామ్’ పేరును ‘థాయ్లాండ్’గా మార్చారు. ‘థాయ్’ భాషలో ‘థాయ్’ అంటే ‘మనిషి’, ‘స్వతంత్రుడు’ అనే అర్థాలు ఉన్నాయి. స్వతంత్రుల దేశం అనే అర్థం వచ్చేలా ‘థాయ్లాండ్’ పేరును ఎంపిక చేసుకున్నారు. మిగిలిన ప్రపంచం దీనిని గుర్తించడంతో ఇదే పేరు స్థిరపడింది. ఇస్వాతిని ఆఫ్రికా ఆగ్నేయ ప్రాంతంలోని చిన్న దేశం ఇది. ఈ దేశం ఇదివరకటి పేరు ‘స్వాజిలాండ్’. చాలాకాలం బ్రిటిష్ వలసరాజ్యంగా ఉండేది. ఇక్కడ ఎక్కువగా స్వాజీ తెగకు చెందిన ప్రజలు ఉంటారు. పూర్వీకుడైన తెగ నాయకుడి పేరు మీదుగా తమ తెగకు ‘స్వాజీ’ అని పేరు పెట్టుకున్నారు. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొంది యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ దేశానికి రాజుగా ఉన్న మూడో ఎంస్వాతి దేశం పేరును తన పేరు కలిసొచ్చేలా ‘ఇస్వాతిని’గా మార్చారు. ఎవరితోనూ సంప్రదించకుండా రాజు ఏకపక్షంగా దేశం పేరు మార్చేశారనే విమర్శలు ఉన్నా, అంతర్జాతీయ సమాజం కొత్తగా మార్చిన పేరు గుర్తించడంతో మారిన పేరుతోనే చలామణీ అవుతోంది. నార్త్ మాసిడోనియా యూరోప్ ఆగ్నేయ ప్రాంతంలోని దేశం నార్త్ మాసిడోనియా. ఇదివరకు దీని పేరు మాసిడోనియా మాత్రమే! రెండో ప్రపంచయుద్ధ కాలంలో 1944లో ఈ ప్రాంతం ‘సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా’గా ఆవిర్భవించింది. తర్వాత 1991లో రిఫరెండం ద్వారా స్వాతంత్య్రం సాధించుకుని, ‘మాసిడోనియా’గా మారింది. ఈ ప్రాంతానికి చాలా పురాతన చరిత్ర ఉంది. ప్రాచీనకాలంలో గ్రీకు సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఇప్పటికీ మాసిడోనియా ప్రాంతంలోని కొంతభాగం ఈ దేశానికి దక్షిణాన గల గ్రీస్లో ఉంది. పొరుగుదేశంతో గందరగోళం తొలగించుకోవాలనే ఉద్దేశంతో 2019లో ఈ దేశం తన పేరును ‘నార్త్ మాసిడోనియా’గా మార్చుకుంది. మయాన్మార్ మన దేశానికి సరిహద్దుల్లోని ఆగ్నేయాసియాలో ఉన్న ఈ దేశానికి ఇదివరకటి పేరు ‘బర్మా’. అధికారికంగా మయాన్మార్గా మారినా, ‘బర్మా’ పేరుతో ఈ దేశాన్ని గుర్తుపట్టేవాళ్లు ఇప్పటికీ ఎక్కువమందే ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా బర్మన్ తెగకు చెందిన ప్రజలు నివసిస్తారు. అందువల్ల ‘బర్మా’గా పేరుపొందింది. బ్రిటిష్ పాలన నుంచి ఈ దేశం 1948లో స్వాతంత్య్రం పొందింది. అలజడులతో అతలాకుతలమైన ఈ దేశం 1989లో జరిగిన సైనిక కుట్రలో పూర్తిగా సైనిక పాలనలోకి వెళ్లింది. అప్పట్లో అధికారంలోకి వచ్చిన సైనిక పాలకులు దేశం పేరును మయాన్మార్గా మార్చారు. ‘మయాన్మార్’ పదం పుట్టుపూర్వోత్తరాల గురించి ఇప్పటికీ గందరగోళం ఉంది.బెనిన్ అట్లాంటిక్ తీరంలో ఉన్న ఆఫ్రికన్ దేశం ఇది. ఆఫ్రికా పడమటి తీరాన ఉన్న ఈ చిన్న దేశానికి గతంలో ఉన్న పేరు ‘దహోమీ’. చిన్న రాజ్యంగా ఉండే ఈ దేశం పదిహేనో శతాబ్దిలో చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలను కలుపుకొని ‘దహోమీ’ రాజ్యంగా అవతరించింది. స్థానిక ఫోన్ తెగకు చెందిన ప్రజలు మాట్లాడే ‘ఫోంగ్బే’ భాషలో ‘ఫోన్ ద హోమీ’ అంటే ‘పాము పొట్ట’ అని అర్థం. దేశం ఆకారం దాదాపు అలాగే ఉండేది కాబట్టి వారు ‘దహోమీ’ అని పేరు పెట్టుకున్నారు. ఈ దేశాన్ని 1872లో ఫ్రెంచ్వాళ్లు ఆక్రమించుకుని, 1960 వరకు పరిపాలన కొనసాగించారు. ఫ్రెంచ్ పాలన అంతమయ్యాక 1960లో స్వాతంత్య్రం వచ్చినా, ‘దహోమీ’ పేరుతోనే పదిహేనేళ్లు కొనసాగింది. మాథ్యూ కెరెకోవు నేతృత్వంలోని సైనిక బలగాలు 1972లో అప్పటి ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. కెరెకోవు నేతృత్వంలోని ప్రభుత్వం 1975లో దేశం పేరును ‘బెనిన్’గా మార్చింది. ‘ఫోన్’ తెగ తర్వాత ‘బిని’ తెగవారు కూడా ఈ దేశంలో గణనీయంగా ఉంటారు. ‘బిని’ తెగ మూలం గానే బెనిన్ పేరు పెట్టారు. అయితే, ‘బిని’ తెగ జనాభా నైజీరియాలో ఎక్కువగా ఉంటారు. సూరినామా దక్షిణ అమెరికాలోని ఈశాన్యతీరంలో ఉన్న దేశం సూరినామా. దీని ఇదివరకటి పేరు సూరినామ్. స్థానిక స్రానన్ టోంగో భాషలో ‘ఆమ’ పదానికి నది లేదా నదీముఖద్వారం అనే అర్థాలు ఉన్నాయి. ఈ దేశాన్ని వేర్వేరు యూరోపియన్ దేశాల వారు ఆక్రమించుకున్నారు. బ్రిటిష్వారు 1630లో వలస రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ అధికసంఖ్యాకులు సూరీనియన్ తెగకు చెందినవారు. స్థానిక భాష అర్థంకాని బ్రిటిష్ వలస పాలకులు దీని పేరును ‘సూరినామ్’గా వ్యవహరించేవారు. పదిహేడో శతాబ్ది చివర్లో బ్రిటిష్ వారి నుంచి ఈ దేశం డచ్ పాలకుల చేతిలోకి వెళ్లింది. అప్పట్లో ఇది డచ్ గయానాలో భాగంగా ఉండేది. డచ్ పాలకులు ఇక్కడి నుంచి భారీగా చక్కెర ఎగుమతి చేసేవారు. దాదాపు రెండు శతాబ్దాలు సాగిన డచ్ పాలన నుంచి ఈ దేశానికి 1975లో స్వాతంత్య్రం లభించింది. స్వాతంత్య్రం వచ్చాక, పాశ్చాత్యులు తమ దేశానికి పెట్టిన అపభ్రంశ పదాన్ని తమ భాషకు అనుగుణంగా మార్చుకుని, 1978లో ‘సూరినామా’గా స్వతంత్ర పాలకులు ప్రకటించుకున్నారు. స్వతంత్ర దేశానికి తొలి అధ్యక్షుడైన హెంక్ ఆరన్ హయాంలో ఈ మార్పు అమలులోకి వచ్చింది. నెదర్లాండ్స్ మూడేళ్ల కిందటి వరకు ఈ దేశం పేరు హాలండ్. పశ్చిమ యూరోప్లోని డచ్ ప్రజల దేశం ఇది. ఇక్కడి ప్రభుత్వం 2020లో దేశం పేరును ‘నెదర్లాండ్స్’గా మార్చినట్లు ప్రకటించింది. ‘హాలండ్’ పేరు దేశంలోని రెండు డచ్ రాష్ట్రాలు గల ప్రాంతానికే వర్తిస్తుందని, దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా కలుపుకొనేలా ఒక పేరుపెట్టడం బాగుంటుందని దేశ నేతలు కొంతకాలం మల్లగుల్లాలు పడ్డారు. చివరకు ప్రధాని మార్క్ రుట్టే నేతృత్వంలోని ప్రభుత్వం ‘నెదర్లాండ్స్’ పేరును ఖాయం చేసింది. జింబాబ్వే ఆఫ్రికా ఆగ్నేయప్రాంతంలోని దేశం ఇది. దీని ఇదివరకటి పేరు ‘రొడీషియా’. ఇక్కడ బ్రిటిష్ వలస రాజ్యానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు సెసల్ రోడ్స్ పేరు మీద అప్పటి బ్రిటిష్ వలస పాలకులు ఈ దేశానికి ‘రొడీషియా’ అని పేరు పెట్టారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1960లలో ఇక్కడి నల్లజాతీయులు తీవ్రస్థాయిలో ఉద్యమించారు. ఉద్యమకాలంలో వారు తమ దేశానికి ‘జింబాబ్వే’ పేరును వాడుకలోకి తెచ్చారు. ‘జింబాబ్వే’ అంటే స్థానిక ‘షువావు’భాషలో ‘రాతి ఇళ్ల దేశం’ అని అర్థం. పోరాట ఫలితంగా 1965లో స్వాతంత్య్రం వచ్చినా, పాలనలో 1979 వరకు నల్లజాతీయులు మైనారిటీలుగానే మిగిలారు. గెరిల్లా పోరాటం తర్వాత 1979లో జరిగిన ఎన్నికల్లో రాబర్ట్ ముగాబే నాయకత్వంలో నల్లజాతీయ ప్రభుత్వం ఏర్పడింది. ముగాబే ప్రభుత్వం దేశం పేరును ‘జింబాబ్వే’గా మార్చింది. బుర్కీనా ఫాసో ఆఫ్రికా పశ్చిమ ప్రాంతంలోని చిన్న దేశమిది. స్వాతంత్య్రానికి ముందు ఫ్రెంచ్ పాలనలో ఉండేది. ఫ్రెంచ్ పాలకులు దీనిని ఫ్రెంచ్ భాషలో ‘హాట్–వోల్టా’ అని, ఇంగ్లిష్లో ‘అప్పర్ వోల్టా’ అని వ్యవహరించేవారు. ఈ దేశానికి ‘అప్పర్ వోల్టా’ పేరు ఎక్కువగా చలామణీలో ఉండేది. ఫ్రెంచ్ వలస పాలకుల నుంచి 1958లో ఈ దేశానికి స్వయంపాలనాధికారం లభించింది. తర్వాత రెండేళ్లకు 1960లో పూర్తి స్వాతంత్య్రం వచ్చింది. స్వాతంత్య్రం వచ్చాక ‘రిపబ్లిక్ ఆఫ్ వోల్టా’గా దేశం పేరు మారింది. వలస పాలకుల ఆనవాళ్లను పూర్తిగా తుడిచివేయాలనే ఉద్దేశంతో 1984లో అప్పటి అధ్యక్షుడు థామస్ సంకారా తమ దేశానికి ‘బుర్కీనా ఫాసో’ పేరును ప్రకటించారు. స్థానిక మూరీ భాషలో ‘బుర్కీనా ఫాసో’ అంటే నిజాయతీపరుల దేశం అని అర్థం. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆఫ్రికా మధ్య ప్రాంతంలోని రెండో అతిపెద్ద దేశం ఇది. బెల్జియం రాజు రెండో లియోపోల్డ్ 1885లో ఇక్కడ సొంతరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. లియోపోల్డ్ హయాంలో ఈ దేశాన్ని ‘కాంగో ఫ్రీ స్టేట్’ అనేవారు. తర్వాత 1908 నాటికి ఇది పూర్తిగా బెల్జియం ప్రభుత్వం స్వాధీనంలోకి వచ్చింది. బెల్జియన్ల పాలనలో ఈ దేశాన్ని ‘బెల్జియన్ కాంగో’గా వ్యవహరించేవారు. బెల్జియన్ల నుంచి ఈ దేశానికి 1960లో స్వాతంత్య్రం వచ్చాక ‘రిపబ్లిక్ ఆఫ్ జైరీ’గా అవతరించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దాదాపు ఐదేళ్లు దేశం తిరుగుబాట్లు, అంతర్యుద్ధాలతో అతలాకుతలమైంది. అంతర్యుద్ధంలో సైనికాధికారి మొబుటు సెసె సీకో 1965లో అధికారాన్ని చేజిక్కించుకుని నియంతృత్వ పాలన ప్రారంభించారు. దేశంలో ప్రవహించే కాంగో నది పేరు మీదుగా ఆయన దేశానికి ‘కాంగో’ పేరు పెట్టాడు. రెండేళ్లలోనే 1967లో సీకో ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన తిరుగుబాటు నాయకుడు లారెంట్ డిజైర్ కబిలా దేశానికి ‘డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’ పేరును ఖాయం చేశారు. కాబో వెర్డీ ఆఫ్రికా పశ్చిమాన ఉన్న చిన్న ద్వీపసమూహ దేశం ఇది. పదేళ్ల కిందటి వరకు ఈ దేశం ‘కేప్ వెర్డీ’ అనే ఇంగ్లిష్ పేరుతోనే చలామణీ అయ్యేది. తొలుత పోర్చుగీసులు ఈ ద్వీపసమూహాన్ని 1462లో ఆక్రమించుకుని, నావికా స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి నుంచి వస్తువులే కాకుండా, బానిసలను కూడా దేశదేశాలకు ఎగుమతి చేసేవారు. స్థానిక క్రియోలె భాషలో ఈ దీవులకు ‘కాప్–వెర్ట్’ అనేవారు అంటే, ‘ఆకుపచ్చని అగ్రం’. దాని ఆధారంగానే పోర్చుగీసులు ఈ ద్వీపసమూహానికి తమ భాషలో ‘కాబో వెర్డీ’ అనే పేరు పెట్టుకున్నారు. ఇంగ్లిష్ మాట్లాడే దేశాలతో వారు లావాదేవీలు సాగించడంతో వారికి అర్థమయ్యేలా ‘కేప్ వెర్డీ’ అనేవారు. పోర్చుగీసుల నుంచి ఈ దేశానికి 1975లో స్వాతంత్య్రం వచ్చింది. దేశాధ్యక్షుడు జోస్ మారియా నెవిస్ 2013లో దేశానికి తిరిగి పోర్చుగీసు పదాన్ని అధికారికంగా వాడుకలోకి తీసుకొచ్చారు. తుర్కియే నిన్న మొన్నటి వరకు ఈ దేశం ‘టర్కీ’ పేరుతోనే చలామణీలో ఉండేది. ఇక్కడి తుర్కు ప్రజల ప్రాచీన నాగరికత, సంస్కృతి ప్రతిబింబించేలా స్థానిక భాషలోనే దేశం పేరు ఉండాలనే ఉద్దేశంతో అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్ గత ఏడాది దేశం పేరును ‘తుర్కియే’గా మార్చినట్లు ప్రకటించారు. అంతర్జాతీయ సమాజం ఈ దేశాన్ని ఇప్పుడు ఇదే పేరుతో గుర్తిస్తోంది. నిజానికి అంతర్జాతీయంగా ఏర్పడిన ఒక చిన్న ఇబ్బంది ఈ దేశం పేరు మార్చుకోవడానికి కారణమైంది. ‘థాంక్స్ గివింగ్ డే’ సందర్భంగా ఉత్తర అమెరికన్లు సంప్రదాయంగా ఇచ్చేవిందులో టర్కీ కోళ్లు తప్పనిసరి. టర్కీ కోళ్లను వాళ్లు ‘టర్కీ’గానే వ్యవహరిస్తారు. కోడిజాతికి చెందిన పక్షుల పేరు, తమ దేశం పేరు ఒకటే కావడంతో గందరగోళం ఏర్పడుతోందని, దీన్ని తప్పించుకోవడానికే దేశం పేరు మార్చుకోవాల్సి వచ్చిందని ‘తుర్కియే’ విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు. (చదవండి: ఆదర్శగురువులెందరో..వారందరికీ ప్రణామం!) -
మరో వివాదం.. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్' వంతు
ఢిల్లీ: జీ-20 డిన్నర్ మీటింగ్ ఆహ్వానంలో 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పేర్కొనడం రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ప్రధాని మోదీని కూడా 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్' అని పేర్కొన్నారు. ఏసియన్-ఇండియా సమ్మిట్, 'ఈస్ట్ ఏసియా సమ్మిట్' లకు ప్రధాని మోదీ బుధవారం, గురువారం వరుసగా హాజరుకావాల్సి ఉండగా.. ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందులో భారత ప్రధానిని 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్' అని పేర్కొనడంతో పేరు మార్పు వివాదం మరింత ముదిరింది. 20వ 'ఏసియన్-ఇండియా సమ్మిట్', 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా' రెండు పదాలను ఒకే ప్రకటనలో విడుదల చేయడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. ప్రధాని మోదీ ప్రభుత్వం ఎంతటి గందరగోళంలో ఉందో ఈ విషయంతో స్పష్టమవుతోందని వెల్లడించింది. ఇండియా పేరుతో ప్రతిపక్షాలు ఏకమవ్వడంతోనే బీజేపీ నాయకులు ఈ డ్రామా క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. ‘The Prime Minister Of Bharat’ pic.twitter.com/lHozUHSoC4 — Sambit Patra (@sambitswaraj) September 5, 2023 అయితే.. జీ-20 డిన్నర్ మీటింగ్కి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకి అధికారిక ఆహ్వానాన్ని పంపారు అధికారులు. ఇందులో సాంప్రదాయంగా ఉపయోగించే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బదులు ప్రిసెడెంట్ ఆఫ్ భారత్ అని సంభోదించారు. దీంతో ఇండియా పేరును రానున్న ప్రత్యేక పార్లమెంట్ సెషన్లో భారత్గా మార్చనున్నారనే ఊహాగానాలు వచ్చాయి. బీజేపీని ఓడించడానికి దేశంలో ప్రధానంగా 28 ప్రతిపక్ష పార్టీలు ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. విపక్ష కూటమి పేరు ఇండియా ఉండటం బీజేపీకి నచ్చనందునే దేశం పేరును ఇండియా నుంచి భారత్గా మార్చుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. అటు.. తమ కూటమి పేరును త్వరలో భారత్గా నామకరణం చేస్తామని కూడా పలువురు నాయకులు చెప్పారు. Look at how confused the Modi government is! The Prime Minister of Bharat at the 20th ASEAN-India summit. All this drama just because the Opposition got together and called itself INDIA 🤦🏾♂️ pic.twitter.com/AbT1Ax8wrO — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 దేశం పేరును భారత్గా పిలవడం స్వాగతిస్తున్నామని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇది దేశానికి గర్వకారణం అని అన్నారు. అటు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఆ వెబ్సైట్లకు కష్టాలు -
ఇది దేనికి సంకేతం?
అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న మోదీ సర్కారు అతి త్వరలో మన దేశం పేరును కూడా భారత్గా మార్చే ఆలోచనలో ఉందా? జీ 20 దేశాధినేతలకు తాజాగా కేంద్రం లాంఛనంగా పంపిన విందు ఆహ్వానంలో రాష్ట్రపతి హోదాను ఇంగ్లీష్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. దేశం పేరు మార్పు దిశగా కేంద్రం నుంచి త్వరలో రానున్న ప్రకటనకు ఇది కచ్చితమైన ముందస్తు సంకేతమేనని అనుమానిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి జీ 20 దేశాధినేతలకు పంపిన విందు ఆహ్వానంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కేంద్రం పేర్కొనడం రాజకీయంగా పెను దుమారమే రేపుతోంది. కానీ మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న చర్చ నిజానికి చాలాకాలంగా జరుగుతున్నదే... కేంద్రంలో మోదీ సారథ్యంలోని – బీజేపీ సర్కారు కూడా దీన్ని ఎన్నోసార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్థిస్తూనే వచ్చింది, వస్తోంది. బ్రిటిష్ వలస వాసనలను సమూలంగా వదిలించుకోవాల్సిందేనని పదేపదే చెబుతోంది. ఆ దిశగా ఎన్నో చర్యలు చేపడుతోంది. 150 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ వంటి బ్రిటిష్ జమానా నాటి పేర్లకు భారత్ పేరు చేరుస్తూ తీసుకున్న తాజా నిర్ణయం అలాంటిదే. ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు బిల్లులు ప్రవేశపెడుతూ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్న మోదీ సర్కారు, మెజారిటీ ఓటర్ల భావోద్వేగాలతో ముడిపడ్డ ఇలాంటి మరిన్ని నిర్ణయాలు తీసుకోవడం ఖాయమని పరిశీలకులు అప్పుడే అభిప్రాయపడ్డారు. ఆ అంచనాలు సత్య దూరం కాదనేందుకు తాజా ’ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ ఆహ్వానాలే నిదర్శనమని భావిస్తున్నారు. ఒకటో అధికరణాన్నే మార్చేయాలి! ఈ నేపథ్యంలో దేశం పేరు మార్పుకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నది ఆసక్తికరంగా మారింది. రాజ్యాంగంలోని తొలి అధికరణే మన దేశాన్ని ’ఇండియా, అంటే భారత్, రాష్ట్రాల సమాఖ్య’ అని స్పష్టంగా పేర్కొంటోంది. అంటే, ఇండియా, భారత్ రెండింటినీ మన దేశ అధికారిక నామాలుగా ఒకటో అధికరణే గుర్తిస్తోందన్నది ఇక్కడ ఆసక్తికర అంశం. ఇప్పుడు వాటిలోంచి ఇండియాను తొలగిస్తూ, భారత్ను మాత్రమే ఏకైక అధికారిక నామంగా గుర్తించాలని కేంద్రం భావిస్తోందా అన్నది ఇక్కడ కీలకమైన అంశం. అలా జరగాలంటే ఆ మేరకు ఒకటో అధికరణాన్ని సవరించాల్సి ఉంటుంది. నచ్చిన పేరుతో పిలుచుకోవచ్చు ‘భారతా? ఇండియానా? మన దేశాన్ని భారత్ అని పిలుచుకుంటారా? భేషుగ్గా పిలుచుకోండి.అదే సమయంలో ఎవరన్నా ఇండియా అని పిలవాలని అనుకుంటే అలాగే పిలవనివ్వండి‘– 2016లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ వ్యాఖ్య గట్టిగా వ్యతిరేకించిన సుప్రీంకోర్టు మన దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలన్న యోచనను సుప్రీంకోర్టు గట్టిగా వ్యతిరేకించడం విశేషం. ఈ మేరకు కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ 2016లో దాఖలైన పిల్ను నాటి సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్ సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసింది. ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించే సమస్యే లేదని కుండబద్దలు కొట్టింది. 2020లో కూడా ఇలాంటి మరో పిల్ను తిరస్కరించింది. దాన్ని విజ్ఞాపనగా మార్చి సరైన నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నాటి సీజేఐ జస్టిస్ ఎస్ ఏ బొబ్డే సూచించారు. జంబూ ద్వీపం నుంచి ఇండియా దాకా.. అతి ప్రాచీనమని భావించే జంబూ ద్వీపం మొదలుకుని భారత్, హిందూస్తాన్ నుంచి ఇండియా దాకా. ఎన్నో, మరెన్నో పేర్లు. మన దేశానికి ఉన్నన్ని పేర్లు ప్రపంచంలో మరే దేశానికీ లేవేమో! ఇంగ్లీష్ వాడకంలో మన దేశాన్ని ఇండియా అని, స్థానికులు భారత్ అని అంటారు. పాలక వర్గం ఇండియా అని, పాలిత (సామాన్య) వర్గం భారత్ అని అంటారు. జంబూ ద్వీపం పురాణాలు, ప్రాచీన గ్రంథాలలో మన దేశాన్ని జంబూ ద్వీపం అన్నారు. జంబూ అంటే నేరేడు పండు. అప్పట్లో మన దేశంలో ఆ చెట్లు విస్తారంగా ఉండేవి గనుక ఆ పేరు వచ్చిందని అంటారు. నాటి మన సువిశాల దేశపు ఆకృతి కూడా నేరేడు ఫలం మాదిరే ఉండేదని, అందుకే ఆ పేరు వచ్చిందని కూడా అంటారు. చైనా యాత్రికుడు ఫాహియాన్ కూడా మన దేశాన్ని అదే పేరుతో ప్రస్తావించడం విశేషం. ‘జంబూ ద్వీపం ఉత్తరాన విశాలంగా, దక్షిణాన సన్నగా ఉంటుంది. అక్కడి ప్రజల ముఖాలు అలాగే ఉంటాయి‘ అని తన యాత్రా చరిత్రలో రాసుకొచ్చాడు. హిందూస్తాన్, ఇండియా బ్రిటిష్ వలస పాలన దాకా మనకు హిందూస్తాన్ అనే పేరు వాడుకలో ఉండేది. తర్వాత బ్రిటిష్ వారు మన దేశం పేరును ఇండియాగా మార్చారు. ఈ రెండు పేర్లూ సింధు నది నుంచి వచ్చి నట్టు చెబుతారు. నాటి భారత ఉప ఖండానికి సింధు నది సరిహద్దుగా ఉండేది. దానికి ఈవలి వైపున ఉన్న దేశం అనే అర్థంలో తొలుత తురుషు్కలు ముఖ్యంగా పర్షియన్లు మనను హిందూస్తాన్ అని పిలిచారు. సింధులో ‘స’ అక్షరాన్ని వాళ్లు ‘హ’గా పలుకుతారు గనుక అలా పేరు పెట్టారు. అలా సనాతన ధర్మం పేరు హిందూ మతంగా మారింది. భారత్ భరతుడనే పౌరాణిక చక్రవర్తి పేరిట మన దేశానికి భారత్ అని పేరు వచ్చి నట్టు ఐతిహ్యం. విశ్వామిత్రుడు, మేనక సంతానంగా పుట్టి ముని కన్యగా పెరిగిన శకుంతలకు, మహారాజు దుష్యంతునికి పుట్టినవాడే భరతుడు. -
హైబ్రిడ్ వర్కే సో బెటరూ!
మూడేళ్ల క్రితం యావత్ ప్రపంచం కరోనా కోరల్లో చిక్కి అన్నిరంగాలు ప్రభావితమయ్యాక వర్క్ ఫ్రం హోం విధానం అమల్లోకి వచ్చింది.దీంతో ఇంటి నుంచి పనిచేసే పద్ధతికి పలు రంగాల ఉద్యోగులు అలవాటుపడ్డారు. కొంతకాలంగా పరిస్థితులు సద్దుమణగడంతో ఐటీతో సహా పలు కంపెనీలు, సంస్థలు ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేయడం తప్పనిసరి చేస్తున్నాయి. దీనిపై ఉద్యోగుల మనోగతం ఎలా ఉందో తెలుసుకునేందుకు ‘సీఐఈఎల్ హెచ్ఆర్’ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సాక్షి, హైదరాబాద్: వర్క్ ఫ్రం హోం, ఆఫీసులకు తిరిగి వెళ్లడంపై ఉద్యోగుల్లో పెద్ద చర్చే సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో హైబ్రిడ్ పనివిధానమే (ఆన్లైన్+ఆఫ్లైన్) మేలని అధికశాతం టెకీలు, ఇతర రంగాల ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీలు తప్పనిసరిగా ఆఫీసుల నుంచే పనిచేయాలని పట్టుబట్టకుండా వర్క్ ఫ్రం హోం లేదా వారానికి ఒకరోజు ఆఫీసుకు రావడం లాంటి పద్ధతులను అనుమతించాలనే డిమాండ్ పెరుగుతోంది. వర్క్ ఫ్రం హోం లేదా హైబ్రిడ్ విధానానికి అనుమతించకపోతే వేరే కంపెనీల్లోకి మారేందుకూ సిద్ధమని 73 శాతం టెకీలు, ఇతర ఉద్యోగులు చెప్పినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే, 35 శాతం మంది మాత్రం ఆఫీసుల నుంచి పనిచేసే రోజుల సంఖ్యను పెంచడాన్ని స్వాగతించారు. 26 శాతం మంది ఆఫీసు నుంచి పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐటీ, ఇతర రంగాల్లో పనిచేస్తున్న 3,800 ఉద్యోగుల అభిప్రాయాలతో ఈ సర్వే నివేదిక రూపొందించారు. వర్క్ ఫ్రం ఆఫీసుకు కంపెనీల మొగ్గు ఇప్పటికే టీసీఎస్, మెటా, గోల్డ్మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ తదితర కంపెనీలు కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తమ ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. గతంలో వర్క్ ఫ్రం హోంను పూర్తిస్థాయిలో ప్రోత్సహించిన ‘జూమ్’ సంస్థ కూడా తమ ఆఫీసులకు 50 మైళ్ల పరిధిలో ఉన్న వారు వారానికి రెండురోజులు ఆఫీసుకు రావాలని చెబుతోంది. రెండువందలకు పైగా కంపెనీల్లో డెలాయిట్ ఇండియా బెనిఫిట్స్ ట్రెండ్స్ 2023 నిర్వహించిన సర్వేలో... 88 శాతం ఉద్యోగులు ఏదో ఒక రూపంలో తమకు అనుకూలమైన పని పద్ధతులను మార్చుకున్నట్లు వెల్లడైంది. ఐటీసీ సంస్థ వర్క్ ఫ్రం ఆఫీస్ను పునఃప్రారంభించడంతోపాటు కొందరు ఎంపిక చేసిన ఉద్యోగులను వారానికి రెండురోజులు ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతిస్తోంది. డీబీఎస్ బ్యాంక్ ఇండియా నిర్వహించిన సర్వేలో హైబ్రిడ్ విధానానికి అత్యధికులు మొగ్గుచూపుతున్నట్టు తేలింది. దీనికి అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన హైబ్రిడ్ వర్క్మోడల్/ ఫ్లెక్సిబుల్ వర్క్ వసతులను రూపొందించినట్టు డీబీఎస్ బ్యాంక్ ఇండియా హెచ్ఆర్ కంట్రీ హెడ్ కిషోర్ పోడూరి తెలిపారు. హైబ్రిడ్ విధానంతో వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంతోపాటు ట్రాఫిక్రద్దీ, వాహన కాలుష్యం నుంచి ఉపశమనం దొరుకుతుందని ఉద్యోగులు భావిస్తున్నట్లు చెప్పారు. అనుకూలమైన పని గంటలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఉండే సంప్రదాయ ఆఫీసు పనివేళల విధానం కాకుండా నిర్దేశిత లక్ష్యాల సాధనకు ఉద్యోగులు తమకు అనుకూలమైన పని సమయాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. దీనివల్ల ఉత్పాదకత కూడా పెరుగుతోంది. దీంతో వారు వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలను కూడా సరైన పద్ధతుల్లో నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. –నీలేశ్ గుప్తా, డైరెక్టర్, డెలాయిట్ ఇండియా వర్క్ఫోర్స్ ఉండేలా... ఉద్యోగుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పని ప్రదేశంలో చేపట్టాల్సిన చర్యలు, తీసుకురావాల్సిన మార్పులపై కంపెనీలు దృష్టి పెట్టాల్సిన అవసరముంది. వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఉత్పాదకతను పెంచే వర్క్ఫోర్స్, నైపుణ్య ఉద్యోగులు ఉండేలా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.–ఆదిత్య నారాయణ్ మిశ్రా, సీఈవో, సీఐఈఎల్ హెచ్ఆర్ హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ అంటే... ఆఫీసు, ఇంటి నుంచి పనిచేయడాన్ని సమ్మిళితం చేస్తే హైబ్రిడ్ పనివిధానం అవుతుంది. ఇందులో వారంలో కొద్ది రోజులు ఆఫీసు నుంచి, కొద్దిరోజులు ఇంటి నుంచి పనిచేస్తారు. యాజమాన్యం, ఉద్యోగులకు అనుకూలంగా ఉండే పని విధానాన్ని, ఆఫీసు వేళలను నిర్ణయిస్తారు. ఇందులో భాగంగానే ఉద్యోగుల ఇళ్లకు దగ్గర్లోని లేదా ఉద్యోగులకు అనుకూలంగా ఉండే కో వర్కింగ్ ప్లేస్ల నుంచి పనిచేసే వీలు కూడా కల్పిస్తారు. దీంతో యాజమాన్యాలు, ఉద్యోగులకు అనువైన విధానాలను ఎంపిక చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది. -
త్వరలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ పేరు మార్పు
సాక్షి, అమరావతి: ఇప్పటివరకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్గా ఉన్న తమ సంఘం పేరును త్వరలో ఏపీ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఎన్జీజీవో) అసోసియేషన్గా మార్పు చేయనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రకటించారు. సంఘం రాష్ట్ర 21వ కౌన్సిల్ సమావేశాల్లో రెండో రోజు ఆయన మాట్లాడారు. సంఘం పేరు మార్చేందుకు తీర్మానం చేసినట్లు చెప్పారు. గెజిటెడ్ అధికారులకు సంఘంలో సభ్యత్వం ఇచ్చేందుకు అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు. గతంలో తమ సంఘంలో ఉన్న ఉద్యోగులు కొందరు గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకులోకి వెళ్లారని, దీంతో వారిని కూడా సంఘంలో చేర్చుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచామని, వీలైనంత వేగంగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించారు. ప్రభుత్వంతో సామరస్యంగా ఉండి డిమాండ్లను సాధించుకుంటామన్నారు.సంఘం నిర్వహించే మహాసభలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించడం 7 దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోందని, అందులో భాగంగానే సీఎం జగన్ను ఆహ్వానించామని చెప్పారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేందుకు ప్రభుత్వం అంగీకరించడం శుభ పరిణామమన్నారు. కౌన్సిల్ సమావేశాల ముగింపు సందర్భంగా జిల్లాల పునర్విభజనతో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కొత్త కార్యవర్గాలను ఎన్నుకోవాలని, మరింత మంది మహిళలకు నూతన కార్యవర్గంలో చోటు కల్పించాలని తీర్మానించారు. ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్రెడ్డి, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సురేష్ లాంబ, 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
రూ.6 చిల్లర ఇవ్వనందుకు 26 ఏళ్లుగా శిక్ష..
ముంబయి: ఆరు రూపాయలు చిల్లర తిరిగి ఇవ్వనందుకు ఓ రైల్వే క్లర్కుకు గత 26 ఏళ్లుగా ఉపశమనం లభించలేదు. విజిలెన్స్ టీం పంపిన వ్యక్తికి చిల్లర ఇవ్వని కారణంగా 26 ఏళ్ల క్రితం విధుల నుంచి తొలగించబడ్డారు. అనంతరం అప్పీలుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. రైల్వే టికెట్ క్లర్క్ రాజేశ్ వర్మ ముంబయి కుర్లా టెర్మినల్ జంక్షన్ వద్ద పనిచేసేవారు. 1997 ఆగష్టు 30న విజిలెన్స్ టీం ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ను ప్యాసింజర్గా పంపి టికెట్ కొనుగోలు చేయించగా.. వర్మ బుక్కయ్యారు. సదరు ప్యాసింజర్ రూ.500 ఇవ్వగా.. టికెట్టు ధర రూ.214 పోగా మిగిలిన రూ.286 ఇవ్వాల్సి ఉంది. కానీ రాజేశ్ వర్మ రూ.280 ఇచ్చి చిల్లర ఇవ్వలేదు. విజిలెన్స్ అధికారులు చెక్ చేయగా.. ఆ రోజు వసూళ్లలో రూ. 58 మిస్ అయ్యాయి. అంతేకాకుండా ఆ క్లర్క్ వెనక ఉన్న అల్మారాలో రూ.450 ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాజేశ్ వర్మ తప్పుడు మార్గంలో డబ్బు సంపాదిస్తున్నట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చారు. క్రమశిక్షణా చర్యల కింద రాజేశ్ వర్మను జనవరి 31, 2002న విధుల నుంచి తప్పించారు. అయితే.. ఆ నిర్ణయాన్ని రాజేశ్ వర్మ సవాలు చేస్తూ అప్పీలుకు వెళ్లారు. చిల్లర రూ.6 లేనందుకే ఇవ్వలేకపోయాడని రాజేశ్ వర్మ తరుపున లాయర్ మిహిర్ దేశాయ్ కోర్టుకు విన్నవించారు. అల్మారాను రాజేశ్ వర్మతో పాటు ఉద్యోగులందరూ ఉపయోగిస్తారని తెలిపారు. చిల్లర ఇవ్వలేదనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ అల్మారాకు ప్రవేశం ఉందని, అధిక ఛార్జీలు వసూలు చేశారనడానికి రుజువు ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజేశ్ వర్మ అప్పీలును తిరస్కరించింది. ఇదీ చదవండి: ఆ పని చేస్తే.. శరద్ పవార్కు కేంద్ర మంత్రి పదవి..? క్లారిటీ.. -
సద్ధర్మం! శరత్కాలంలోని సూర్యుని కాంతిలా హయిగా ఉంటుంది!
సద్ధర్మంఅది శ్రావస్తి నగరానికి దాపున ఉన్న జేతవనం. ఆ వనం మధ్యలో ఉన్న ఆనందబోధి వృక్షం కింద ప్రశాంత వదనంతో కూర్చొని ఉన్నాడు బుద్ధుడు. భిక్షు సంఘం ఆ చెట్టు చల్లని నీడలో కూర్చొని ఉన్నారు. వారు ధరించిన కాషాయ వస్త్రాలు కాంతిమంతంగా ఉన్నాయి. ఆ వెలుగు వారి దేహం మీద పడి ప్రకాశిస్తోంది. ‘‘భిక్షువులారా! మనం ఎలాంటి ధర్మాన్ని తెలుసుకోవాలి? ఎలాంటి ధర్మాన్ని సేవించాలి? ఎలాంటి ధర్మాన్ని ఆచరించాలి? అని ఆలోచించాలి’’ అన్నాడు గంభీరంగా. భిక్షువులందరూ ప్రశాంతంగా వినసాగారు. మనం పాటించే ధర్మం నాలుగు విధాల ఫలితాలనిస్తుంది. అందులో మొదటిది విషపదార్థం కలిసిన చేదు గుమ్మడికాయ రసం లాంటిది. దీని రుచీ, వాసన, రంగూ ఏదీ బాగోదు. పైగా తాగితే ప్రమాదం కూడా. అలాగే... వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ దుఃఖాన్ని ఇచ్చే ధర్మం అలాంటిది.అలాంటి కుశలం ఇవ్వని ధర్మాన్ని గ్రహించి దూరంగా ఉండాలి. ఇక, రెండోరకం ధర్మాచరణ బంగారు పాత్రలో ఉన్న కుళ్ళిన పదార్థం లాంటిది. ఈ పదార్థం రంగు, రుచి, వాసనలు ఇంపుగా ఉంటాయి. పైగా బంగారు పాత్రలో ఉంది. కానీ, దీన్ని సేవిస్తే అనారోగ్యం కలిగి, ప్రాణాలకే ముప్పు. వర్తమానంలో సుఖాన్ని, దీర్ఘకాలంలో దుఃఖాన్ని ఇచ్చే ధర్మాచరణ ఇలాంటిది. మరి, భిక్షువులారా! ఒక చెక్క పాత్ర ఉంది. దానిలో ఎన్నో మూలికలతో మరిగిన మూత్రం ఉంది. పాండు రోగానికి అది మంచి ఔషధం. దాని రంగు, రుచి, వాసనలు ఏవీ బాగోలేదు. అయినా దాన్ని సేవిస్తే రోగం తగ్గుతుంది. ఉపశమనం కలుగుతుంది. అలాగే... వర్తమానంలో దుఃఖాన్ని, దీర్ఘకాలంలో సుఖాన్ని ఇచ్చే ధర్మాచరణ కూడా ఇలాంటిదే!’’ అన్నాడు. ‘‘అలాగే... ఒక పాత్రలో పెరుగు, తేనె, నెయ్యి కలిపిన బెల్లం రసం ఉంది. అది కడుపులో బాధల్ని హరించే ఔషధం. ఆ బెల్లం రసం రంగు బాగుంటుంది. రుచి బాగుంటుంది. వాసన కూడా బాగుంటుంది. అది చేసే మేలు కూడా బాగుంటుంది. ఇలా వర్తమానంలో సుఖాన్ని, దీర్ఘ కాలంలో కూడా సుఖాన్ని ఇచ్చేది సద్ధర్మం.’’ ‘‘భిక్షువులారా! సద్ధర్మం అనేది శరత్కాలంలోని సూర్యుని కాంతి లాంటిది. అది ప్రకాశిస్తుంది. మనిషి దుఃఖాన్ని పారద్రోలుతుంది’’ అని చెప్పి, అందరి వంకా ఓసారి చూశాడు. అందరి మనస్సుల్లోని ఉషస్సు వారందరి ముఖాల్లో తేజస్సుగా ప్రతిఫలిస్తోంది! – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: సద్ధర్మం! శరత్కాలంలోని సూర్యుని కాంతిలా ప్రకాశిస్తూ నేఉంటుంది!) -
కాశీకి వెళ్తున్నారా? ఈ మార్పులు తెలియకపోతే.. దారి తప్పడం ఖాయం..!
ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలోని పలు రోడ్లు, భవనాల పేర్లు త్వరలోనే మారిపోనున్నాయి. ఆయా ప్రాంతాలు నూతన పేర్లతో, పలు హంగులు సంతరించుకోనున్నాయి. నగరంలోని గిరిజాఘర్ రహదారికి భారతరత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పేరు పెట్టనున్నారు. ఫాత్మాన్ రోడ్డు సర్దార్ పటేల్ రోడ్డుగా మారనుంది. మక్బుల్ ఆలం రోడ్డు.. బిర్హా గాయకుడు పద్మశ్రీ హీరాలాల్ యాదవ్ రోడ్డుగా మారనుంది. వారణాసి మేయర్ అశోక్ తివారి ఈ మార్పులకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కాశీ నగరం ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక నగరంగా పేరొందిందని అశోక్ తివారి పేర్కొన్నారు. ఇక్కడి ప్రాచీనత, ఆధ్మాత్మికత, కళలు, సాహిత్యం, సంప్రాదాయం మానవాళికి మార్గదర్శక మన్నారు. నగరంలోని పలు రహదారులు, భవనాల పేర్లను మార్చేందుకు యోగి సర్కారు నడుంబిగించిందన్నారు. ఈ మేరకు తాజాగా జరిగిన నగరపాలక సమావేశంలో సభ్యుల సూచనలు, సలహాలు తీసుకున్నామన్నారు. స్థానికతను ప్రతిబింబించేలా ఈ మార్పులు ఉండబోతున్నాయన్నారు. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలకు అనుగుణంగా పేర్లు పెట్టడం జరుగుతుందన్నారు. నగరంలోని భోజుబీర్ మార్గానికి రాజర్షి ఉదయ్ ప్రతాప్ జూదేవ్, పాండేయ్పూర్-ఆజమ్గఢ్ రహదారికి మున్షీ ప్రేమ్చంద్ పేర్లు పెట్టేందుకు అన్ని సన్నాహాలు పూర్తయ్యాయన్నారు. నగరంలోని పలు వార్డుల పేర్లు కూడా మారనున్నాయన్నారు. ఇది కూడా చదవండి: ఈ ఐదు రైళ్లు ఎక్కితే మర్నాడు లేదా ఆ మర్నాడు దిగాల్సిందే..! -
స్నేహితురాలిపై ప్రేమతో ఆమె..‘అతని’గా మారాలనుకుంది.. తరువాత జరిగిన దారుణమిదే..
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఒక యువతి తన స్నేహితురాలిని గాఢంగా ప్రేమించింది. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, పురుషునిగా మారేందుకు ఒక మాంత్రికుని వద్దకు వెళ్లింది. ఇదే అవకాశంగా భావించిన ఆ మాంత్రికుడు ఆమెపై ఘాతుకానికి తెగబడ్డాడు. రెండు నెలల క్రితం కుటుంబ సభ్యులు ఆ యువతి అదృశ్యమయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మాంత్రికునితో పాటు ఆమె స్నేహితురాలిని కూడా అరెస్టు చేశారు. ఆర్సీమిషన్ పరిధిలో ఉంటున్న పూనమ్ ఇంటి నుంచి ఏప్రిల్ 18న మాయమయ్యింది. ఏప్రిల్ 26న ఆమె సోదరుడు దీనిపై పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాయమైన ఆ యువతి తన స్నేహితురాలు ప్రీతిని పెళ్లాడాలనుకుందని తెలిసింది.ఇదిలా ఉండగా మే 18న లఖీంపురా పరిధిలో ఒక యువతి అస్థిపంజరం పోలీసులకు లభ్యమయ్యింది. పోలీసులు ఆ అస్థిపంజరం శాంపిల్ ల్యాబ్కు పంపగా మాయమైన పూనమ్దేనని తేలింది. ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ.. పువాయులో ఉంటున్న ప్రీతి, పూనమ్లు స్వలింగ సంపర్కులుగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో పూనమ్ తన స్నేహితురాలు ప్రీతిని వివాహం చేసుకోవాలని అనుకుంది. అయితే పూనమ్ కారణంగా ప్రీతికి పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో ప్రీతి తల్లి ఊర్మిళ.. లఖీంపూర్ ఖీరీ పరిధిలో ఉంటున్న రామ్నివాస్ అనే వ్యక్తిని కలుసుకుంది. తన కుమార్తె వివాహానికి పూనమ్ అడ్డుగా ఉందని, ఆమెను అంతమొందిస్తే రెండున్నర లక్షల రూపాయలు ఇస్తానని అతనికి చెబుతూ రూ. 5 వేలు అడ్వాన్స్గా ఇచ్చింది. తరువాత ప్రీతి, పూనంలను రామ్నివాస్ ఒక అడవికి తీసుకువెళ్లాడు. అక్కడ వారిద్దరికీ వివాహం చేసే విషయమై మాట్లాడాడు. మంత్ర విద్యలతో పురుషునిగా మార్చేస్తానని పూనమ్కు రామ్నివాస్ హామీనిచ్చాడు. ఇందుకోసం మరోమారు అడవికి రావాల్సివుంటుందని పూనమ్కు చెప్పాడు.అతను చెప్పిన సమయానికి పూనమ్ అడవికి రాగానే రామ్నివాస్ ఆమెపై దాడి చేసి, హత్యచేశాడు. తరువాత ఆమె మృతదేహాన్ని అక్కడున్న పొదల్లో దాచిపెట్టాడు. ఈ కేసు గురించి సిటీ ఎస్పీ సుధీర్ మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తు చేస్తున్న తాము మే 18న వివిధ ఆధారాలతో పూనమ్కు చెందిన అస్థిపంజరాన్ని గోమతి నది ఒడ్డున స్వాధీనం చేసుకున్నామన్నారు. పూనమ్ సోదరుడు పర్వీందర్ తన సోదరి దుస్తులను చూసి గుర్తుపట్టాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడ్డ రామ్నివాస్, ప్రీతి, ఆమె తల్లి ఊర్మిళలపై కేసు నమోదు చేశారు. రామ్నివాస్, ప్రీతిలను అరెస్టు చేశారు. పరారైన ఊర్మిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఆ హ్యాండ్సమ్ సీరియల్ కిల్లర్పై అమ్మాయిల మోజు.. -
హస్తం నేతలో మార్పు...
-
డోంట్ వర్రీ నేటి నుంచి 2000 వేల నోట్ల మార్పిడి..!
-
దొంగను మార్చేసిన భగవద్గీత.. చోరీ చేసిన నగలు వెనక్కి!
భగవద్గీత ఓ దొంగలో మార్పు తీసుకొచ్చింది. చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందడమే కాదు.. తొమ్మిదేళ్ల కిందట ఓ ఆలయంలో చోరీ చేసిన నగలను సైతం తిరిగి ఇచ్చేలా చేసింది. ఆశ్చర్యకరమైన ఈ ఘటన భువనేశ్వర్(ఒడిషా)లో జరిగింది. భువనేశ్వర్లోని గోపీనాథ్పూర్ రాధాకృష్ణ ఆలయంలో 2014 మే నెలలో చోరీ జరిగింది. కృష్ణ భగవానుడికి చెందిన లక్షల విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. అవి దొరకపోవడంతో కొత్త అభరణాలు చేయించారు ఆలయ నిర్వాహకులు. కట్ చేస్తే.. ఈ మధ్య ఆలయ ద్వారం వద్ద ఓం సంచి ఒకటి దొరికింది. అందులో ఓ లేఖ.. పోయిన నగలు కనిపించాయి. చేసిన చోరీకి క్షమాపణలు కోరుతూ లేఖ, జరిమానా కింద రూ.300 కూడా ఉంచాడు ఆ వ్యక్తి. ఈ మధ్యకాలంలో తాను భగవద్గీత చదివానని.. తన మార్గం తప్పని తెలుసుకొని విలువైన ఆ ఆభరణాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు దొంగ పేర్కొన్నాడు. మరోవైపు, తొమ్మిదేళ్ల క్రితం చోరీకి గురైన ఆభరణాలు తిరిగి దొరకడంతో ఆలయ అధికారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చోరీకి గురైన ఆభరణాలు ఇలా మళ్లీ దొరకడం అద్భుతమే అంటున్నారు. Video Source: OTV News English -
ఎస్బీఐ అకౌంట్ బ్రాంచ్ మార్చుకోవాలా? ఇదిగో ఇలా సింపుల్గా
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో మీకు అకౌంట్ ఉందా. ఎస్బీఐ ఖాతాను ఒక శాఖ నుండి మరొక శాఖకు బదిలీ చేయాలనుకుంటున్నారా? బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేకుండానే డిజిటల్గా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. వివరాలు ఇలా.. ముఖ్యంగా ఎస్బీఐలో ఖాతాదారు ఫోన్ నంబరు రిజిస్టర్ అయి ఉండాలి. YONO యాప్ లేదా YONO Lite ద్వారా కూడా బ్రాంచ్ని మార్చుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఎస్బీ బ్యాంక్ ఖాతా ఒక శాఖ నుండి మరొక శాఖకు ఎలా బదిలీ చేయాలి. ఎస్బీఐ అధికారిక పెర్సనల్ బ్యాంకింగ్ వెబ్యాంకింగ్ విభాగంలోకి వెళ్లి యూజర్ నేమ్, పాస్వర్డ్ నమోదు చేయాలి. తర్వాత ఈ-సర్వీస్ కేటగిరీని ఎంచుకోవాలి. అందులో ట్రాన్స్ఫర్ సేవింగ్స్ అకౌంట్పై ఆప్షన్పై క్లిక్ చేసి మీరు మార్చుకోవాలనుకుంటున్న బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎంటర్ చేయాలి. అన్ని వివరాలు నమోదు చేశాక రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కొద్దిరోజుల్లో మీ అకౌంట్ సంబంధిత శాఖకు బదిలీ అవుతుంది. యోనో యాప్లో కూడా దాదాపు ఇదే పద్దతిలో బ్రాంచ్ను మార్చుకోవచచ్చు. (Nokia C22: నోకియా సీ22 స్మార్ట్ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర) ఎస్బీఐ యోనో యాప్ ద్వారా అయితే యోనో యాప్లో లాగిన్ అయ్యి 'సర్వీసెస్'ఆప్షన్ను ఎంచుకోవాలి. ఇక్కడ ‘ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్’ ఆప్షన్ను ఎంచుకోవాలి కొత్త బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్తో పాటు బదిలీ చేయాలనుకుంటున్న ఖాతావివరాలివ్వాలి. గెట్ బ్రాంచ్ నేమ్ క్లిక్ చేయాలి. కొత్త బ్రాంచ్ పేరు ఫ్లాష్ అవుతుంది. అది సరియైనది అని నిర్దారించుకున్నాక, సబ్మిట్ 'సమర్పించు' ఆప్షన్పై క్లిక్ చేయండి. -
మార్పు ఒక సాంత్వన
మార్పును పొందడం, మారడం బతుకుతున్న మనిషికి ఎంతో అవసరం. మనిషి రాయి కాదు మార్పును పొందకుండా మారకుండా పడి ఉండడానికి. బతుకుతున్న మనిషి మార్పును పొందుతూ ఉండాలి, మారుతూ ఉండాలి. బతకడానికి సిద్ధంగా ఉన్న మనిషి మారడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఒక మనిషి మారకపోవడం అతడు సరిగ్గా బతకలేక పోవడమూ, బతకకపోవడమూ అవుతుంది. ‘నువ్వు ఇక్కడ ఉంది బతకడానికి; నువ్వు ఇక్కడ ఉంది ఆడడానికి; నువ్వు ఇక్కడ ఉంది బతుకును అనుభవించడానికి‘ అని ఓషో చెప్పా రు. మార్పు లేకుండా, మారకుండా రాయిలా బతికితే ఎలా? బతుకుతూ ఉండడానికి, బతుకును అనుభవిస్తూ ఉండడానికి మనిషిలో ఎప్పటికప్పుడు మార్పు వస్తూ ఉండాలి; మనిషి తనను తాను మార్చుకుంటూ, తనకు తాను మార్పులు చేసుకుంటూ బతుకును ఆస్వాదిస్తూ ఉండాలి. ర్పుల్ని స్వీకరించని మనిషికి, మారని మనిషికి, ఊరట ఉండదు, సాంత్వన ఉండదు. ‘ఎవరికి ఏది తెలియదో అది వాళ్లకు ఉండదు’ అని తాత్త్వికకృతి త్రిపురారహస్యం మాట. మారడం తెలియనివాళ్లకు మార్పు అనేది ఉండదు. మార్పు లేనివాళ్లకు బతుకు సరిగ్గా ఉండదు. అంతేకాదు బతకడమే భారమైపోతుంది. మనిషిలో మార్పులు రాకపోడానికి ముఖ్యమైన కారణాలు అభిప్రాయాలు. అభిప్రాయాల వలలో చిక్కుకుపోయినవాళ్లు మారడం చాతకాకుండా మానసికంగా బాధపడుతూనే ఉంటారు; తమవాళ్లను అదేపనిగా బాధపెడుతూనే ఉంటారు. అభిప్రాయాలకు అతీతమైన అవగాహన మనిషికి అవసరమైన మార్పుల్ని తీసుకొస్తూ ఉంటుంది. వయసువల్ల మనిషికి శారీరికమైన మార్పులు రావడం సహజం. ఆ విధంగానే ప్రతి మనిషికీ ఆలోచనపరంగా, దృక్పథంపరంగా, ప్రవర్తనపరంగా, మనస్తత్వంపరంగా మార్పులు రావాలి. మన దైనందిన జీవితంలో భాగం అయిపోయిన కంప్యూటర్లను మనం రిఫ్రెష్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా మనల్ని కూడా మనం మాటిమాటికీ రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉండడంవల్ల జడత్వం లేదా స్తబ్దత తొలగిపోతుంది. జడత్వం, స్తబ్దతలు తొలగిపోతున్న కొద్దీ మనలో మార్పు వస్తూ ఉంటుంది. మన జీవితాన్ని మన మస్తిష్కం నిర్ణయిస్తుంది. మస్తిష్కంలో మార్పులు రాకపోతే జీవితంలో మార్పులు రావు. మారని మస్తిష్కం మొద్దులాంటిది. మస్తిష్కం మొద్దుగా ఉంటే జీవితం మొద్దుబారిపోతుంది. మన చుట్టూ ఉన్నవాళ్లలో ఇలా మొద్దుబారిన జీవితాలతో చాలమంది కనిపిస్తూ ఉంటారు. మార్పులకు మాలిమి అవని వాళ్లు మానసికరోగులుగా కూడా అయిపోతారు. కొంతమంది ఉన్మాదులుగా అయిపోవడానికి కారణం వాళ్లలో మార్పు అనేది రాకపోవడమే; వాళ్లకు మార్పు అవసరం అని వాళ్లు గ్రహించకపోవడమే. ప్రపంచానికి ఎంతో కీడు చేస్తున్న మతోన్మాదం,ప్రాం తీయవాదం, ముఠాతత్త్వం వంటివాటికి మూలం మారని, మారలేని మనుషుల మనస్తత్వమే. మనుషులు పసితనం నుంచి మారుతూ వచ్చాక ఒక వయసు తరువాత మారడాన్ని ఆపేసుకుంటారు. తమ అభిప్రాయాలు, నమ్మకాలు, ఆలోచనలు, అభిరుచులు, ఉద్దేశాలు, ప్రవర్తన సరైనవే అని తీర్మానించుకుని తమలో తాము కూరుకుపోతూ ఉంటారు. మారకపోవడం తమ గొప్పతనం అని నిర్ణయించుకుంటారు. అటుపైన వాళ్లు మూర్ఖులుగానో, చాదస్తులుగానో, తిక్కవ్యక్తులుగానో, పనికిరానివాళ్లుగానో, అసూయాపరులుగానో, దొంగలుగానో, ఇంగితం లేనివాళ్లుగానో, వంచకులుగానో, చెడ్డవాళ్లుగానో, హంతకులుగానో రూపొందుతూ ఉంటారు. సంఘానికి, ప్రపంచానికి మారని పలువురివల్ల ఎంతో హాని జరిగింది, జరుగుతోంది. మారకపోవడంవల్ల మనుషులు మనుషులకు అపాయకరమైపోతూ ఉన్నారు. మార్పును పొందడం, మారడం మనుషులకు ఉండి తీరాల్సిన లక్షణం. ఊరట, సాంత్వన కావాలంటే, రావాలంటే, ఉండాలంటే మనుషులు మారడం నేర్చుకోవాలి. మారడం నేర్చుకుని మనుషులు శాంతంగా బతకాలి. – రోచిష్మాన్ -
చిల్లర డబ్బులతో రెస్టారెంట్ బిల్ చెల్లింపు! వీడియో వైరల్
ఇక్కడొక వ్యక్తి రెస్టారెంట్ బిల్ని చిల్లర పైసలతో చెల్లించాడు. దీంతో అక్కడ ఉన్న రెస్టారెంట్లోని వ్యక్తులంతా ఒక్కసారిగా అతని వైపు విచిత్రంగా చూస్తారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ముంబైకి చెందిన సిద్ధేష్ లోకరే అనే వ్యక్తి తాజ్మహల్ ప్యాలెస్ అనే రెస్టారెంట్కి వెళ్లి చిల్లర డబ్బులతో బిల్ పే చేయాలనుకుంటాడు. అనుక్నుట్లుగానే రెస్టారెంట్కి వెళ్లాడు. రెస్టారెంట్కి వెళ్లాలంటే అక్కడ ఉన్నవాళ్లు మొదటగా చూసేది మన లుక్ అందుకని లోకర్ దానికి తగ్గట్టుగా రెడీ అయ్యి మరీ వెళ్లాడు. అక్కడ తనకు నచ్చిన పిజ్జా, మాంక్టైల్ డ్రింక్ని ఆర్డర్ చేసి శుభ్రంగా లాగించేశాడు. ఆ తర్వాత బిల్ పే చేసేందుకు అదే టేబుల్పై చిల్లర నాణేలను లెక్క పెట్టుకుంటూ వరుసగా పేర్చి ఉంచాడు. ఇంతలో సర్వర్ వస్తాడు అతను వాటిని చూసి నవ్వుతూ తీసుకుని వెళ్లిపోతాడు. చివర్లో లోకర్ అతన్ని లెక్కచూసుకోమంటే పర్వాలేదు లెక్కపెట్టుకుంటాం అని నవ్వుతూ బదులిస్తాడు. ఈ వీడియోకి మిత్రమా డాలర్తో చెల్లిస్తామా లేక మరేదైనా అనేది విషయం కాదు కేవలం బిల్ పే చేయడం ముఖ్యం అని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశాడు. అంతేకాదు చివర్లో మనం ఒక రెస్టారెంట్కో లేదా ఎక్కడికైనా మనల్ని ప్రజలందరూ గమనిస్తారన్న భయంతో లేనిపోని హంగులకు పోతామే తప్ప మనం ఎలా ఉన్నామో అలా కనిపించేందుకు అస్సలు ఇష్టపడం. పైగా ఇలా చేస్తే ఏమనుకుంటారో అనే భయంతో ఇతరులకు నచ్చినట్లు ఉంటే మనకు నచ్చిన విధంగా ఉండటం మర్చిపోతుంటాం అని ఒక చక్కని సందేశం కూడా ఇచ్చాడు. ఐతే ఈ స్టంట్ని చూసి నెటిజన్లు.. "మంచి సందేశం. మనం ఎలా ఉన్నాం అనేది పెద్ద విషయం కాదు. మనమే ఇతరులను అనుకరిస్తూ మనకు నచ్చినట్లు ఉండలేకపోతున్నాం." ఇది నిజం అంటూ సదరు వ్యక్తిని మెచ్చుకుంటూ ఇన్స్టాలో కామెంట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Siddhesh Lokare🙋🏻♂️ (@sidiously_) (చదవండి: 'విజిల్ విలేజ్'! అక్కడ గ్రామస్తులు పేర్లు ఎలా ఉంటాయంటే.) -
ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు..చివరకు..
బెంగళూరు: మనం ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు టికెట్ తీసుకుంటే కండక్టర్ ఒక్కోసారి చిల్లర లేదని చెబుతుంటాడు. కొన్నిసార్లు టికెట్ వెనకాల రాసి దిగేటపుడు తీసుకోమంటాడు. దీంతో కొంతమంది ఒక్క రూపాయి, రెండు రూపాయల చిల్లరను కండక్టర్కే వదిలేసి వెళ్తుంటారు. కానీ కర్ణాటకకు చెందిన ఒ వ్యక్తి మాత్రం ఇలా కాదు. తనకు రావాల్సిన ఒక్క రూపాయిని కూడా వదులుకోలేదు. దీని కోసం వినియోగదారుల కోర్టు వరకు వెళ్లి విజయం సాధించాడు. ఏం జరిగిందంటే? ఒక్క రూపాయి కోసం కోర్టు వరకు వెళ్లిన ఇతని పేరు రమేశ్ నాయక్. 2019లో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టు కార్పోరేషన్(బీఎంటీసీ) బస్సు ఎక్కి శాంతి నగర్ నుంచి మజెస్టిక్ బస్ డిపో వరకు టికెట్ తీసుకున్నాడు. టికెట్ ధర. రూ.29. దీంతో కండక్టర్కు రూ.30 ఇచ్చాడు రమేశ్. మిగతా ఒక్క రూపాయి చిల్లర ఇవ్వమని అడిగాడు. ఇందుకు కండక్టర్ అతనిపై కోపపడ్డాడు. చిల్లర లేదు ఇవ్వనని గట్టిగా అరిచాడు. కండక్టర్ తీరు చూసి వాపోయిన రమేశ్.. బీఎంటీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు కూడా పట్టించుకోలేదు. అతనికి ఒక్క రూపాయి తిరిగి ఇవ్వలేదు. ఇక లాభం లేదని భావించిన రమేశ్ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. రూ.15వేలు పరిహారంగా ఇప్పించాలని కోరాడు. ఈ విషయాన్ని పరిశీలించిన న్యాయస్థానం బీఎంటీసీకి షాక్ ఇచ్చింది. రమేశ్కు రూ.2,000 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. న్యాయప్రక్రియకు అయిన ఖర్చు కోసం మరో రూ.1,000 అదనంగా చెల్లించాలని చెప్పింది. 45 రోజుల్లోగా పరిహారం అందజేయాలని పేర్కొంది. ఒకవేళ చెప్పిన తేదీలోగా పరిహారం ఇవ్వకపోతే ఏటా రూ.6,000 వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. విషయం రూపాయి గురించే కాదు.. అయితే ఈ వ్యవహారంలో బీఎంటీసీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇది బస్సుల్లో రోజూ జరిగే సాధారణ విషయమేమని, సేవల్లో ఎలాంటి లోపం లేదని వాదించింది. రమేశ్ పిటిషన్ను కొట్టివేయాలని కోరింది. న్యాయస్థానం మాత్రం వీరి వాదనను తోసిపుచ్చింది. ఇది ఒక్క రూపాయి చిల్లర విషయం గురించి మాత్రమే కాదని, వినియోగదారుడి హక్కు అంశమని స్పష్టం చేసింది. కండక్టర్ ప్రవర్తించిన తీరును తప్పుబట్టింది. పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. చదవండి: గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 70 చోట్ల ఎన్ఐఏ దాడులు.. -
భారత్ నాయకత్వ పాత్ర పోషించాలి
దావోస్: భారత్ ఇటీవలి కాలంలో మార్పు దిశగా చక్కని వైఖరి ప్రదర్శించిందని, ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలంగా పైకి తీసుకొచ్చేందుకు భారత్ నాయతక్వం పోషించాల్సిన స్థానంలో ఉన్నట్టు టాటా గ్రూపు చైర్పర్సన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో భాగంగా.. ‘10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ మార్గం’ అనే అంశంపై చర్చా కార్యక్రమంలో చంద్రశేఖరన్ పాల్గొన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడంలో భారత్ ప్రావీణ్యం సంపాదించినట్టు చెప్పారు. భారత్ అధిక సంఖ్యలో గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోందని, భారత్ను అనుకూల స్థితిలో ఉంచేందుకు కారణమైన అంశాల్లో ఇది కూడా ఒకటన్నారు. ‘‘భారత్ కరోనా సమయంలో గొప్ప పనితీరు చూపించింది. కావాల్సిన టీకాలను భారత్లోనే తయారు చేసుకోవడాన్ని చూశాం. డిజిటల్ దిశగా అనూహ్యమైన మార్పును చూస్తున్నాం. నా వరకు వృద్ధి, వృద్ధి, వృద్ధి అన్నవి ఎంతో ముఖ్యమైనవి. ప్రపంచం పుంజుకోవాలని చూస్తోంది. సరఫరా వ్యవస్థ సహా నాయకత్వం వహించాల్సిన స్థానంలో భారత్ ఉంది’’అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. భారత్కు అపార అవకాశాలున్నాయంటూ.. హెల్త్కేర్, పర్యాటకం తదితర రంగాల్లో ముఖ్య పాత్ర పోషించగలదన్నారు. భారత్కు ఏటా కోటి మంది పర్యాటకులు ప్రస్తుతం వస్తుండగా, 10 కోట్ల మందిని ఆకర్షించే సామర్థ్యం ఉందని చెప్పారు. ఈ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను నిర్మించాలని, ఎయిర్ పోర్ట్లు, ఉపరితల రవాణా, షిప్పింగ్ విభాగాల్లో ఎన్నో పనులు జరుగుతున్నట్టు చెప్పారు. అన్ని లక్ష్యాలను 25 ఏళ్ల అమృత కాలంలో సాధించొచ్చన్నారు. కరోనా సమయంలో భారత్ ఎన్నో అంశాల్లో తన సామర్థ్యాలను నిరూపించుకున్నట్టు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ పేర్కొన్నారు. ఈ లక్ష్యాలను భారత్ సునాయాసంగా సాధించగలదన్నారు. -
వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్పుపై స్పందించిన అడిషనల్ ఎస్పీ
సాక్షి, ఒంగోలు (ప్రకాశం జిల్లా): బాలకృష్ణ చిత్రం వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్పుపై వస్తున్న వార్తలపై అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. ఈవెంట్కి పోలీసులు మొదట అనుమతి ఇచ్చి తర్వాత అనుమతి నిరాకరించారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. మొదట ఏబీమ్ స్కూల్ ఆవరణలో వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్కి నిర్వహకులు సన్నాహాలు చేసుకున్నారని.. ఆ విషయం మేం తెలుసుకొని నిర్వాహకులతో మాట్లాడి.. అక్కడ ఈవెంట్ చేస్తే పార్కింగ్కి, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందని నచ్చ చెప్పామన్నారు. పక్కనే రైల్వే స్టేషన్, ఆసుపత్రులు ఉనందున్న ప్రజల రాకపోకలకు ఇబ్బందవుతుందని సూచించామని అడిషనల్ ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రదేశంలో ఈవెంట్ జరుపుకోమని సూచించామని, దానికి నిర్వాహకులు కూడా సమ్మతించి.. ఈవెంట్ ప్లేస్ మార్చుకున్నారన్నారు. మొదట మేము అనుమతి ఇచ్చి ఆ తర్వాత వెనక్కి తీసుకున్నామన్న వార్తలలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. రేపు ఒంగోలు-గుంటూరు రోడ్డు అర్జున్ ఇన్ఫ్రాలో జరిగే వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వారు అడిగిన దాని కన్నా ఎక్కువే భద్రత ఇస్తున్నామని అడిషనల్ ఎస్పీ చెప్పారు. ట్రాఫిక్ను కూడా డైవర్ట్ చేస్తున్నామని, ఇటువంటి ఇబ్బంది లేకుండా హీరో బాలకృష్ణ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్కి సహకరిస్తున్నామని అడిషనల్ ఎస్పీ తెలిపారు. చదవండి: సూసైడ్ చేసుకునేవాడినంటూ బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. ఆయన లేకపోతే.. -
.. అయితే మోదీని మార్చడం కష్టమంటారా!
.. అయితే మోదీని మార్చడం కష్టమంటారా! -
ఏపీలో చురుగ్గా కదులుతున్న ఈశాన్య రుతుపవనాలు
-
‘కేంద్రంలో అధికార మార్పునకు అదే సంకేతం’
లక్నో: బిహార్లో ఎన్డీఏ కూటమి అధికార పీఠాన్ని చేజార్చుకుందని, ఈ పరిణామం హస్తినలో అధికార మార్పునకు శుభసూచక మని సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఇదే తరహాలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించే బలమైన జాతీయస్థాయి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం అఖిలేశ్ లక్నోలో పీటీఐకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సరిసాటి అయిన ప్రత్యామ్నాయ కూటమి అవతరిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరంచేశారు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్, వీపీ సింగ్ల నాటి స్వల్పకాలిక కూటమి ప్రభుత్వాలకు ఇప్పుడు కాలం చెల్లింది. సుస్థిర, అభివృద్ది చోదక, ప్రభావవంతమైన నాయకత్వంలో కొనసాగే ప్రభుత్వాన్నే ప్రస్తుతం దేశం కోరుకుంటోంది’ అని అఖిలేశ్ అన్నారు. మీరు కోరింది ఇదేగా: రవిశంకర్ ప్రసాద్ ‘సుధృఢ ప్రభుత్వం కావాలనేదే మీ అభిలాష. ప్రధాని మోదీ సారథ్యంలో ఇప్పుడున్న ప్రభుత్వం అదే’ అంటూ అఖిలేశ్నుద్దేశిస్తూ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. -
జీఎంఆర్ ఇన్ఫ్రా పేరు మార్పు
న్యూఢిల్లీ: జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ పేరు ఇక జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్గా మారనుంది. ఈ ప్రతిపాదనకు సంబంధించి షేర్హోల్డర్ల నుంచి అనుమతి తీసుకోనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలియజేసింది. ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ జులై 29న ప్రారంభమై ఆగస్టు 27న ముగుస్తుందని వివరించింది. హైదరాబాద్, ఢిల్లీ ఎయిర్పోర్టులతో పాటు ఫిలిప్పీన్స్లోని మక్టాన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కూడా జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తోంది. -
టేక్ హోం సాలరీ, పనిగంటలు: జూలై 1 నుంచి మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం జూలై 1నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయనుంది. ఈ కొత్త కార్మిక చట్టాలు అమలుతో కార్యాలయ పని వేళలు, ఉద్యోగుల భవిష్య నిధి, వేతనాలలో గణనీయమైన మార్పు చోటు చేసుకోనుంది. అలాగే ఆఫీసు వేళలు, పీఎఫ్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ టేక్-హోమ్ జీతం తగ్గే అవకాశం ఉంది. జూలై 1 నుంచి కొత్త లేబర్ కోడ్లను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, కొన్ని రాష్ట్రాలు ఇంకా నాలుగు లేబర్ కోడ్ల కింద నిబంధనలను రూపొందించలేదు. 23 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు (UTలు) మాత్రమే వేతనాలపై కోడ్ ముసాయిదా నిబంధనలను ప్రచురించాయని కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ లోక్సభ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. కొత్త లేబర్ కోడ్స్, మార్పులు జూలై 1వ తేదీ నుంచి కొత్త కార్మిక చట్టాలు అమలైతే, ఆఫీసు పని గంటలను 8-9 గంటల నుండి 12 గంటల వరకు పెంచవచ్చు. అయితే పనిగంటలు పెరిగితే ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్లు ఇవ్వడం తప్పనిసరి. అలాగే ఆఫీస్ పనివేళలను మార్చుకోవడానికి కంపెనీలకు వీలుంటుంది. కాబట్టి, వారంలో పనిదినాలు నాలుగు రోజులకు తగ్గించబడతాయి, కానీ వారంలో మొత్తం పని గంటలు ప్రభావితం కావు. కొత్త వేతన కోడ్ ప్రకారం వారానికి మొత్తం 48 పని గంటలు తప్పనిసరి. కొత్త వేతన కోడ్ ప్రకారం టేక్-హోమ్ జీతం కాంపోనెంట్, ప్రావిడెంట్ ఫండ్కు యజమానుల సహకారంలో మార్పు ఉంటుంది. స్థూల నెలవారీ జీతంలో కనీసం 50 శాతం బేసిక్ జీతం ఉంటుంది కాబట్టి ఉద్యోగుల టేక్-హోమ్ జీతం కూడా గణనీయంగా మారుతుంది. ఇది ఉద్యోగి, యజమాని పీఎఫ్ కంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. కొంత మంది ఉద్యోగులకు, ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు టేక్ హోం జీతం తగ్గుతుంది. అయితే ఉద్యోగి పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు, గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది. కాగా కేంద్ర ప్రభుత్వ నాలుగు కొత్త లేబర్ కోడ్స్ అమలుకు కేంద్రం యోచిస్తోంది. వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం- పని పరిస్థితులు లాంటి అంశాల ఆధారంగా 29 కేంద్ర కార్మిక చట్టాలను విలీనం చేసి ఈ కొత్త కోడ్స్ను రూపొందించింది. -
అమిత్ షా వ్యాఖ్యలకు నితీశ్ కుమార్ కౌంటర్!
పాట్నా: ఎన్డీయే కూటమిలో జేడీయూ వైఖరి ఎప్పుడూ ప్రత్యేకమే. మిత్రపక్షంగా ఉంటూనే.. గ్యాప్ను మెయింటెన్ చేస్తూ, కూటమి ప్రధాన పార్టీ బీజేపీపై నేరుగా విమర్శలకు దిగుతుంటుంది కూడా. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీ కీలక నేత అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చరిత్రలో ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. ఎవరైనా దానిని ఎలా మారుస్తారు? ఒకవేళ మారుద్దాం అనుకున్నా. ఎలా మారుస్తారో నాకైతే అర్థం కావడం లేదు. భాష అనేది వేరే అంశం. కానీ, చరిత్రలో ప్రాథమిక అంశాలను మార్చలేరు కదా!. చరిత్ర అంటే చరిత్ర.. అది ఎన్నటికీ మారదు.. ఏం చేసినా కూడా’’ అంటూ బీహార్ సీఎం నితీశ్ స్పందించారు. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. చరిత్రకారులు కేవలం మొఘలుల మీద దృష్టిసారించి.. దేశంలోని మిగతా పాలకుల గొప్పతనం గురించి పుస్తకాల్లో చెప్పలేకపోయారంటూ వ్యాఖ్యానించారు. చరిత్ర అనేది ప్రభుత్వాల మీద ఆధారపడే అంశం ఎంతమాత్రం కాదు. వాస్తవాలకు తగ్గట్లుగా ఉండాలి. కాబట్టి, చరిత్రకారులు ఇప్పటికైనా మేల్కొని.. చరిత్రలో చోటు దక్కని మన పాలకుల వైభవాన్ని గుర్తించి.. చరిత్రను తిరగరాయాలంటూ కోరారు అమిత్ షా. ఈ వ్యాఖ్యలను బీహార్ సీఎం వద్ద ప్రస్తావించిన మీడియా.. ఆయన స్పందన తెలియజేయాలంటూ కోరింది. ఈ నేపథ్యంలోనే సీఎం నితీశ్ కుమార్ పైవ్యాఖ్యలు చేశారు. -
‘మమ్మల్ని తేలిగ్గా తీసుకోవద్దు’ - రాజీవ్ బజాజ్ కీలక వ్యాఖ్యలు
పుణె: ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో స్టార్టప్స్ సంస్థలు కుప్పతెప్పలుగా వస్తున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశీ టూ–వీలర్ దిగ్గజాలను అంత తేలికగా తీసుకోవద్దని పేర్కొన్నారు. ‘ఏవో కొన్ని స్టార్టప్లు అనుకుంటున్నట్లుగా మంచి భారతీయ ద్విచక్ర వాహన కంపెనీలు మరీ అంత తేలికైనవి కాదు. మేము అక్టోబర్లో మోటర్సైకిల్ను ఆవిష్కరిస్తే.. మీకు నవంబర్లో చేతికి అందుతుంది. అంతే గానీ 2021లో ఆవిష్కరిస్తే డెలివరీ తీసుకునేందుకు మీరు 2022 దాకా వేచి చూస్తూ కూర్చోనక్కర్లేదు. అది స్టార్టప్లు పనిచేసే తీరు. చాలా ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న దిగ్గజాల పనితీరు అలా ఉండదు‘ అని ఆయన వ్యాఖ్యానించారు. డార్విన్ సిద్ధాంతం 150 సీసీ మించిన స్పోర్ట్స్ మోటర్సైకిల్స్ విభాగంలో ఎన్ఫీల్డ్, బజాజ్, టీవీఎస్లకు 70–80 శాతం మార్కెట్ వాటా ఉంటుందన్నారు. సరికొత్తగా పల్సర్ 250ని ఆవిష్కరించిన సందర్భంగా బజాజ్ ఈ విషయాలు రాజీవ్ బజాజ్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో స్టార్టప్ల నుంచి బడా కంపెనీలకు పోటీ ఎదురయ్యే అంశంపై స్పందిస్తూ.. చార్లెస్ డార్విన్ పరిణామ క్రమం సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. అత్యంత తెలివైన, బలమైన జీవి కాకుండా మార్పులకు అనుగుణంగా మారే జీవులే మనుగడ సాగించగలవని, సంస్థలకు కూడా అదే వర్తిస్తుందని పేర్కొన్నారు. -
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఖాయం!
-
Aadhar Card: పుట్టినతేదీని ఆన్లైన్లో ఇలా సవరించండి!
దేశ పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు కేవలం ఐడెంటిటీ ప్రూఫ్, చిరునామా గుర్తింపు పత్రంగా మాత్రమే కాకుండా అనేక పథకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తున్నాయి. ఒక బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు తీసుకోవాలన్న ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డులో మమూలుగా ఎవైనా మార్పులు చేయాలంటే ఆధార్ సెంటర్లకు జనాలు పరుగులు తీస్తారు. కాగా ప్రస్తుతం ఆధార్ తెచ్చిన సదుపాయంతో పుట్టినతేదిని మార్చడం మరింత సులువుకానుంది. నేరుగా యుఐడిఎఐ వెబ్సైట్లో పుట్టినతేదీలో మార్పులు చేయవచ్చును. యుఐడిఎఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ లింక్ https://ssup.uidai.gov.in/ssup/ ద్వారా ఆన్లైన్లో మీ పుట్టినతేదీని మార్చుకోవచ్చును. ఆధార్ కార్డులో పుట్టిన తేదీని సవరించడానికి అవసరమైన పత్రాలు: జనన ధృవీకరణ పత్రం ఎస్ఎస్ఎల్సి బుక్ / సర్టిఫికేట్/ ఎస్ఎస్సీ లాంగ్ మెమో పాస్పోర్ట్ గుర్తింపుపొందిన విద్యా సంస్థ జారీ చేసిన పుట్టిన తేదీని కలిగి ఉన్న ఫోటో ఐడి కార్డ్. పాన్ కార్డ్ ఆధార్కార్డులో పుట్టినతేదీని ఇలా సవరించండి: ముందుగా ఈ https://ssup.uidai.gov.in/ssup/ లింకును ఓపెన్ చేయాలి. అందులో ఫ్రోసిడ్ టూ ఆప్డేట్ ఆధార్ను క్లిక్ చేయాలి. ఆప్డేట్ ఆధార్ ఆన్లైన్ను క్లిక్ చేసిన తరువాత 12 అంకెల ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి కాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి. తరువాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఆధార్తో లింక్ ఐనా ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. మొబైల్కు వచ్చిన 6 అంకెల వన్ టైం పాస్వర్డ్ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ ఐనా తరువాత మీకు సంబంధించిన ఆధార్ వివరాల వెబ్ పేజ్ ప్రత్యక్షమవుతుంది. ఈ వెబ్ పేజీలో మీకు పుట్టిన రోజు మార్పు చేసే ఆప్షన్ కనిపిస్తుంది. పుట్టిన రోజు మార్పు చేసే ఆప్షన్ క్లిక్ చేసిన తరువాత వెబ్పేజీలో పుట్టినరోజుకు సంబంధించిన స్కాన్డ్ సర్టిఫికెట్ను అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ను నొక్కండి. విజయవంతంగా వేరిఫికేషన్ జరిగిన తరువాత మీ మొబైల్ ఫోన్కు కన్ఫర్మెషన్ వస్తుంది. కాగా ఆధార్కార్డులో పుట్టినతేదీని మార్చినందుకుగాను రూ.50 సర్వీస్ ఛార్జ్ను వసూలు చేస్తుంది. ఇలా చేయాలంటే ఆధార్ కార్డుకు కచ్చితంగా మొబైల్ ఫోన్ నంబర్ రిజస్ట్రేషన్ తప్పనిసరి. #AadhaarOnlineServices Update your DoB online through the following link - https://t.co/II1O6Pnk60, upload the scanned copy of your original document and apply. To see the list of supportive documents, click https://t.co/BeqUA0pkqL #UpdateDoBOnline #UpdateOnline pic.twitter.com/QPumjl6iFr — Aadhaar (@UIDAI) June 16, 2021 చదవండి: పది నిమిషాల్లో ఈ-పాన్ కార్డు పొందండి ఇలా..? -
మన లైక్ కౌంట్... ఇకపై సీక్రెట్
యువతకు, సామాజిక మాధ్యమాలపై కోట్లాది మందికి మోజు పెరగడానికి ఒక ప్రధాన కారణం లైక్స్. తాము పెట్టే పోస్టులు, చేసే షేరింగ్స్...ఇంకేవైనా సరే విశ్వవ్యాప్తంగా లైక్స్ను కొల్లగొట్టే అవకాశం ఉండడంతో పోటా పోటీగా సోషల్ వీరులు చెలరేగిపోతున్నారనేది తెలిసిందే. అదే సమయంలో లైక్స్ తగ్గడం, పెరగడం అనేవి అనేక రకాలుగా సమస్యలు సృష్టిస్తున్న సంగతీ తెలిసిందే. ఈనేపథ్యంలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పై ప్రతి ఒక్కరికీ తమకు వచ్చే లైక్ కౌంట్స్ను ఇతరులకు కనబడకుండా దాచుకునే అవకాశం అందిస్తున్నట్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రతినిధులు ప్రకటించారు. సాధారణ ప్రజలతో పాటుగా నిపుణుల నుంచి విన్నదాని ప్రకారం లైక్ కౌంట్స్ అనేవి కొంతమందికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించడం లేదు, కొంతమందికి మాత్రం ఇది బాధను మిగులుస్తుంది. కొంతమంది ప్రజలు లైక్ కౌంట్స్ను ఏది ట్రెండింగ్లో ఉందనేది తెలుసుకోవడం కోసం వినియోగిస్తున్నారని తేలింది. అందుకే ఈ మార్పు చేర్పులను జత చేసినట్టు వెల్లడించారు. తాము జత చేసిన కొత్త టూల్స్ ద్వారా తమ డీఎంల నుంచి ప్రమాదకరమైన కంటెంట్ను యూజర్స్ ఫిల్టర్ చేసుకునేందుకు వీలు కలుగుతుందని, అలాగే ఫేస్బుక్ న్యూస్ ఫీడ్పై తాము ఏది చూస్తున్నాం, ఏది పంచుకుంటున్నామనే అంశాలపై నియంత్రణకు సాధ్యమవుతుందని వివరించారు. ఇప్పుడు యూజర్స్ మరింత ప్రైవసీని, సౌకర్యాలను కోరుకుంటున్నారనీ రాబోయే కొద్ది వారాలో ఈ కంట్రోల్స్ అన్నీ కూడా ఫేస్బుక్పై కనిపించనున్నాయనీ వీరు తెలిపారు. దాచుకోండి ఇలా... సొంత పోస్ట్లపై లైక్ కౌంట్స్ను దాచుకునే అవకాశం వల్ల ఇతరులు మన పోస్ట్లకు ఎన్ని లైక్లు వచ్చాయనేది ఏ మాత్రం తెలుసుకోలేరు. దాంతో ఎవరైనా సరే మన పోస్ట్లకు ఎన్ని లైక్లు వచ్చాయన్న అంశం పై దృష్టి సారించకుండా, మనం షేర్ చేసే ఫోటోలు, వీడియోలపై మాత్రం దృష్టి సారించవచ్చు. సెట్టింగ్స్పై న్యూ పోస్ట్స్ విభాగాన్ని సందర్శించడం ద్వారా ఇతరుల పోస్ట్లపై లైక్ కౌంట్స్ను సైతం మనం దాయవచ్చు మన ఫీడ్లోని అన్ని పోస్ట్లకూ ఇది వర్తిస్తుంది. ఓ పోస్ట్ను షేర్ చేసే ముందే లైక్ కౌంట్స్ను హైడ్ చేసుకోవచ్చు.. అంతేకాదు ఈ సెట్టింగ్ను ఒక వేళ పోస్ట్ లైవ్లోకి వెళ్లిపోయినప్పుడు సైతం ఆప్షన్ ఆఫ్ చేయవచ్చు. ఇలాంటి అనేక మార్పులతో సోషల్ మీడియా మరింత కొత్తదనాన్ని సంతరించుకోనుంది. చదవండి: ట్విటర్పై కేంద్రం ఆగ్రహం -
కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా వైరస్ సోకిన తరువాత కోలుకోవడం ఒక ఎత్తయితే.. కోలుకున్న తరువాత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నకోవిడ్-19 వ్యాక్సిన్లు వైరస్కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తాయని చెబుతున్నప్పటికీ అన్ని పరిస్థితులలోనూ 100 శాతం రక్షణ ఇవ్వలేదని నిపుణులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్నవారు, వ్యాధినుంచి కోలుకున్న వారు కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ముఖ్యగా వైరస్ బారిన పడి కోలుకున్న వారు వెంటనే తమ టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ మార్చాలని దంత వైద్యులు తాజాగా సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు వచ్చిన 20 రోజుల తర్వాత వీటిని మార్చాలని పేర్కొన్నారు. లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ డెంటల్ సర్జరీ అధిపతి డాక్టర్ ప్రవేష్ మెహ్రా అభిప్రాయం ప్రకారం వైరస్ నుంచి కోలుకున్నవారు తక్షణమే తమ టూత్ బ్రష్లను మార్చాలి. అలా చేయడం వల్ల మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్కు గురికాకుండా కాపాడవచ్చని చెబుతున్నారు. అంతేకాదు అదే వాష్రూమ్ను ఉపయోగిస్తున్న వారిని కూడా ఇది రక్షిస్తుందంటున్నారు. బ్రష్లు, టంగ్ క్లీనర్లు కూడా వైరస్ను వ్యాప్తి చేస్తాయనే విషయాన్ని విస్మరించొద్దని డాక్టర్ ప్రవేష్ మెహ్రా వివరించారు. ఈ వాదనను ఆకాష్ హెల్త్కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ (డెంటల్) డాక్టర్ భూమికా మదన్ కూడా అంగీకరించారు. సాధారణంగా ఫ్లూ, దగ్గు, జలుబు బారిన పడిన వ్యక్తులకు కోలుకున్న తర్వాత టూత్ బ్రష్, క్లీనర్లను మార్చమని తాను సిఫారసు చేస్తాననీ, ఇపుడు కోవిడ్ బాధితులకు కూడా ఇదే సలహా ఇస్తున్నామని ఆమె తెలిపారు. టూత్ బ్రష్ ఉపరితలంపై బ్యాక్టీరియా / వైరస్ దాగి ఉంటుందని ఇది శ్వాసకోశ అంటువ్యాధులకు కారణమవుతుందని డాక్టర్ వివరించారు. టూత్ బ్రష్ ద్వారా ఎలా వ్యాప్తి చెందుతుంది? సాధారణంగా ఒక వ్యక్తి దగ్గు, తుమ్ము, అరవడం, మాట్లాడటం లేదా నవ్వినప్పుడు విడుదలయ్యే తుంపర్లు , డైరెక్టుగా గానీ, కొంతకాలం గాలిలో ఉండిగానీ ముక్కు లేదా నోటిద్వారా ఇతరుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధి సోకిన వ్యక్తి బ్రష్ చేసినపుడు కూడా వైరస్ ఇలాగే వ్యాప్తి చెందుతుంది. కోలుకున్న తరువాత కూడా ఈ వస్తువులను నిరంతరం ఉపయోగించడం వల్ల అధిక సాంద్రత గల సార్స్ సీవోవీ-2 వైరస్ ఇతరులకూ సోకుతుంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటిలో ఎవరికైనా కరోనావైరస్ సంక్రమించినట్లయితే, సోకిన వ్యక్తి ఉపయోగించిన టాయిలెట్ వస్తువులను (టూత్ బ్రష్, నాలుక క్లీనర్ మొదలైనవి) బయటకు విసిరేయడం మంచిదని వీరు సూచిస్తున్నారు. చదవండి: ఆక్సిజన్ సరఫరా: కేంద్రానికి చుక్కెదురు సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వచ్చేసింది: రష్యా సీటీ స్కాన్: ఎయిమ్స్ డైరెక్టర్ వాదనలను ఖండించిన ఐఆర్ఐఏ -
భూమిని చేరిన చంద్రుడి మట్టి నమూనాలు
బీజింగ్: చైనా ప్రయోగించిన ఛాంగీ – 5 సేకరించిన జాబిల్లి నమూనాలు గురువారం విజయవంతంగా భూమిని చేరాయి. ఛాంగీ–5 శోధక నౌక గురువారం తెల్లవారుజామున 1.59 గంటల సమయంలో చైనా ఉత్తర ప్రాంతంలోని ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజన్లోని సిజీవాంగ్ బానర్లో ల్యాండ్ అయినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. ఛాంగీ–5 ప్రయోగం విజయవంతం కావడంతో జాబిల్లి కేంద్రంగా చైనా జరిపిన మూడు ప్రయోగాలు కాస్తా పూర్తయినట్లు అయింది. దాదాపు ఎనిమిది టన్నుల బరువున్న ఛాంగీ –5ను నవంబర్ 24న ప్రయోగించారు. జాబిల్లి నమూనాలతో కూడిన ఛాంగీ–5 భాగం అట్లాంటిక్ మహా సముద్రంపై సుమారు 5,000 కిలోమీటర్ల ఎత్తులో ప్రధాన నౌక నుంచి విడిపోయింది. సుమారు 120 కిలోమీటర్ల ఎత్తులో భూమి వాతావరణంలోకి ప్రవేశించిన ఈ భాగపు పారాచూట్ పది కిలోమీటర్ల ఎత్తులో తెరుచుకుంది. ఆ తరువాత ముందుగా నిర్ణయించిన ప్రాంతంలో నమూనాలతో కూడిన భాగం ల్యాండ్ అయ్యింది. నమూనాతో కూడిన క్యాప్సూల్ను బీజింగ్ తీసుకెళ్లి అక్కడే తెరుస్తారని సీఎన్ఎస్ఏ తెలిపింది. ఇతర దేశాల శాస్త్రవేత్తలకూ ఈ నమూనాల్లో కొన్నింటిని పరిశోధనలకు అందుబాటులో ఉంచుతామని సీఎన్ఎస్ఏ డిప్యూటీ డైరెక్టర్ పీ ఝా యూ తెలిపారు. -
చంద్రుడి మట్టిని పట్టిన చాంగె–5
బీజింగ్: చైనాకు చెందిన అంతరిక్ష నౌక చాంగె–5 చంద్రుడి మీద మట్టిని సేకరించిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు బుధవారం వెల్లడించారు. చంద్రుడి మీద మట్టిని సేకరించడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చంద్రుడి మీద ఉన్న ఓసియానుస్ ప్రొసెల్లారమ్ అనే ప్రాంతంనుంచి చాంగె–5 మట్టిని సేకరించింది. ఈ సేకరణలో భాగంగా ల్యాండర్ రెండు మీటర్ల లోతులోని మట్టిని సేకరించిందని చెప్పారు. మరికొన్ని శాంపిళ్లను కూడా సేకరించే ప్రక్రియ సాగుతోందని చెప్పారు. దాదాపు రెండు కేజీల మట్టిని సేకరించిందని తెలిపారు. చంద్ర ఉపరితలం నుంచి, అలాగే లోతుల్లోంచి కూడా మట్టిని సేకరించామని తెలిపారు. మొదటిసారే విజయం సాధించడం గమనార్హం. దీనిపై అమెరికా స్పేస్ ఏజెన్సీ చైనా స్పేస్ ఏజెన్సీకి అభినందనలు తెలిపింది. అంతర్జాతీయ పరిశోధనా కమ్యూనిటీ ద్వారా కొన్ని శాంపిళ్లపై పరిశోధన చేసే అవకాశం తమకూ రావచ్చని అమెరికా అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సైన్స్ కమ్యూనిటీకి లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పింది. చంద్రుడి నుంచి శాంపిళ్లను సేకరించిన మూడో దేశంగా అమెరికా, రష్యాల సరసన చైనా నిలిచింది. మట్టిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు పటిష్టమైన కంటెయినర్ను వాడాల్సి ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు చెప్పారు. -
కొన్ని నిబంధనలను సడలించాలి
టీవీ, ఫిల్మ్ షూటింగ్లకు కొన్ని షరతులతో కూడిన నియమ, నిబంధనలతో ముంబై ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ షరతుల్లో ‘65ఏళ్లకు పై బడినవారిని షూటింగ్స్కు అనుమతించవద్దు’, ‘షూటింగ్ లొకేషన్లో తప్పనిసరిగా ఒక డాక్టర్, ఓ నర్స్, ఓ అంబులెన్స్ ఉండాలి’ అనే నిబంధనలను పునఃపరిశీలించాలని ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్టీడీఏ) ప్రభుత్వాన్ని కోరింది. తాజాగా ‘ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ కూడా ఈ రెండు నిబంధనలపై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. ఇవి కాకుండా ప్రభుత్వం సూచించిన నిబంధనల్లో మరికొన్నింటిని తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను విడుదల చేసింది. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘స్టూడియోలో లేదా లొకేషన్కి దగ్గర్లోని హాస్పటల్స్, అపార్ట్మెంట్స్లో చిత్రబృందం బస చేసేలా నిర్మాతలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం సూచన సాధ్యమైంది కాదు. ఇప్పటికే హోటల్స్, అపార్ట్మెంట్స్ను కోవిడ్ 19 బాధితుల కోసం వినియోగిస్తున్నారు. కేవలం చిత్రబృందం కోసమే ఓ అపార్ట్మెంట్ను ఈ క్లిష్ట పరిస్థితుల్లో తీసుకోవడం కుదరకపోవచ్చు. అలాగే సినిమాల్లోని కుటుంబ సన్నివేశాల కోసం నిజమైన కుటుంబాన్నే ఎంపిక చేసుకుని షూటింగ్ చేయాలన్న సూచన అర్థరహితమైనది. ఎందుకంటే ఒకే కుటుంబంలో అందరూ యాక్టర్స్ ఉండరు. షూటింగ్ లొకేషన్స్లో ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఎలా అమలు అవుతున్నాయని పరిశీలించడానికి ఓ ఇన్స్పెక్టర్ ఉండాలని కొన్ని వర్కర్స్ అసోసియేషన్స్ వారు కోరుతున్నారు (ప్రభుత్వం సూచించకపోయినా). కానీ ఇది సరైంది కాదు. షూటింగ్స్ ఎలా జరుగుతున్నాయో ఓ వీడియో రూపంలో చిత్రీకరించి ప్రభుత్వ ప్రతినిధులకు నిర్మాతలు అందజేసే ఏర్పాటు జరుగుతుంది’’ అని ఆ లేఖలో పేర్కొంది. -
ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ పేర్ల మార్పు!
శాన్ఫ్రాన్సిస్కో: ఇన్స్ట్రాగామ్, వాట్సాప్ల పేర్లు రానున్న కాలంలో మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వాటి మాతృసంస్థ, సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్ కసరత్తులు చేస్తోంది. ఆండ్రాయిడ్, యాపిల్ స్టోర్లలో ఇన్స్టాగ్రామ్ పేరు ‘ఇన్స్టాగ్రామ్ ఫ్రమ్ ఫేస్బుక్’, వాట్సాప్ పేరు ‘వాట్పాప్ ఫ్రమ్ ఫేస్బుక్’గా మారే అవకాశం కనిపిస్తోంది. మెసేజింగ్ అప్లికేషన్లను ఏకీకృతం (మెర్జ్) చేయడంతోపాటు పాటు, ఈ సేవలన్నీ ఫేస్బుక్ నుంచే వస్తున్నాయన్న విషయాన్ని వినియోగదారులు గుర్తించేలా ఈ మార్పులకు శ్రీకారం చుట్టామని ఫేస్బుక్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ విషయం తమ ఉద్యోగులకు ఇప్పటికే వివరించినట్లు తెలిపారు. ఇతర సోషల్మీడియా వేదికల నుంచి వస్తున్న గట్టి పోటీ మేరకే ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకుంటోందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొది. -
చంద్రబాబు హావభావల్లోని మార్పు ఏ మార్పునకు సంకేతం?
-
పాక్ మారాలంటే ముందు భారత్ మారాలి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రవర్తనలో మార్పు తీసుకురావాలంటే ముందుగా భారత్ పాక్పట్ల తన ప్రవర్తనను మార్చుకోవాలని కేంద్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం తెలిపారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో చిదంబరం మాట్లాడుతూ..‘మనం బలమైన సైన్యాన్ని తయారుచేసుకునేది యుద్ధం చేయడానికి కాదు. యుద్ధంరాకుండా నివారించడానికే. ఈ విషయం తెలుసుకున్నప్పుడు అని సమస్యలు పరిష్కారమైపోతాయి. ఇందుకోసం సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా సరికొత్తగా, విప్లవాత్మకంగా వ్యవహరించాలి’అని సూచించారు. భారత్–పాక్ల మధ్య సత్సంబంధాల కోసం ఇరుదేశాల పౌరులు విరివిగా రాకపోకలు సాగించేలా వీలు కల్పించాలని చిదంబరం అన్నారు. ఇరుదేశాల మధ్య సమస్యలకు యుద్ధం ఎన్నటికీ పరిష్కారం కాదన్నారు. -
ఏం చేద్దాం! ఓటర్లకు గాలం వేద్దాం?
పాలమూరు: పోలింగ్కు గడువు సమీపిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. తక్కువ వ్యవధిలో వీలైనన్ని ఎక్కువ ఓట్లను కొల్లగొట్టాలనే పంథాను ఆచరణలో పెడుతున్నారు. ఊరూరా తిరగడం కష్టమని భావించి గంపగుత్తగా ఓట్లను రాబట్టేందుకు పార్టీలో సీనియర్ల సలహాలు, సహకారం తీసుకుని కుల సంఘాల మద్దతును కోరుతూ రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. పగలు ప్రచారం నిర్వహిస్తూనే తీరిక వేళల్లో కులపెద్దలతో మంతనాలు చేస్తున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు సెగ్మెంట్లలో సుమారు 15 లక్షలకు పైగా ఓటర్లు ఉండటం, సమయం తక్కువగా ఉండటంతో ఈ తరహా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిఘా ఉన్నా.. కానరాని నియంత్రణ నిబంధనల ప్రకారం కుల సంఘాలతో నిర్వహించే సమావేశాల నిర్వహణ విషయమై ఎన్నికల పరిశీలకులు ప్రత్యేక దృష్టిని సారించాల్సి ఉంటుంది. చాలాచోట్ల ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇటీవల ఒకరిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులను మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారనే నెపంతో వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదే తరహాలో ఆయా పార్టీలు ఏ రకంగా ఓటర్లకు చేరువవుతున్నాయనే విషయమై మరింత నిశితంగా పరిశీలనలు పెంచాల్సి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిఘా తీరుని పటిష్టపరిస్తే ప్రజాస్వామ్యంలో ఓటును స్వేచ్ఛాయుత వాతావరణంలో వేయించే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్కు ముందు ఓటర్లను అందించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు తీసుకొచ్చిన తాయిలాలను, నజరానాలను పలుచోట్ల పోలీసులు పట్టుకున్నారు. ఇదే తరహాలో ఈ ఎన్నికల్లోనూ మరింత పకడ్బందీగా తనిఖీలను చేపట్టడంతో పాటు అభ్యర్థుల ప్రచారాల తీరుతెన్నులపై వారు చేస్తున్న ఖర్చులపై పరిశీలకులు దృష్టిసారించాల్సి ఉంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి మరింత పక్కాగా నిఘాను పెంచాల్సిన అవసరముంది. అదే పద్ధతి గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే కొన్ని పార్టీలు సంఘాల మద్దతు కూడగట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మండలం, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థిత్వానికి బలం చేకూరేలా ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రం, పట్టణ కేంద్రాల్లో అభ్యర్థుల అనుచరులు నేరుగా కుల సంఘాలను కలుస్తూ బేరాలు మాట్లాడుకుంటున్నారు. మూడు నెలల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ పద్ధతి అనుకూలించిన విషయం తెలిసిందే. దాన్నే కొనసాగిస్తూ గంపగుత్తగా ఓట్లకు తగ్గట్టు మాట్లాడుకుంటున్నారు. ఎవరు చెబితే ఓట్లు ఎక్కువగా పడతాయో వారిని గుర్తించి వ్యూహరచన చేస్తున్నారు. పడే ఓట్లకే డబ్బుల పంపిణీ.. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రతి గ్రామానికి వెళ్లే అవకాశం, సమయం ఉండదు. ఈ క్రమంలో గ్రామానికి ఒకరిద్దరు రెండో కేడర్ నాయకులకు డబ్బులు పంచే బాధ్యతలు ఇస్తున్నట్లు తెలిసింది. మరికొందరు పార్టీ నుంచి డబ్బులు తక్కువగా వస్తాయి.. భవిష్యత్లో మీకు అధికారం, ఉన్నత అవకాశాలు.. చేసుకోవడానికి పనులు కావాలంటే ఖర్చు పెట్టండి అంటూ ఆఫర్లు ఇస్తే వారితోనే డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈ సారి అభ్యర్థులు బలంగా పడే ఓట్లను మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే పోలింగ్ బూత్లపై ఆధారపడి ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధమైన నాయక గణంలో ఇప్పుడు కలవరపాటు మొదలైంది. డబ్బులు తీసుకున్నవారు ఓటు వేయకపోతే ఎవరు బాధ్యులన్న ప్రశ్నలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాఇ. పైకి గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నా లోలోపల దిగులు గుబులు వెంటాడుతోంది. -
కిచిడీ ప్రభుత్వం వస్తే ఆరు నెలలకో ప్రధానమంత్రి
సాక్షి, హన్మకొండ: వివిధ ప్రాంతీయ పార్టీలతో కూడిన కిచిడీ ప్రభుత్వం కేంద్రంలో వస్తే ఆరు నెలలకో ప్రధానమంత్రి మారుతారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి చింత సాంబమూర్తి అన్నారు. శుక్రవారం హన్మకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వీర్యమై పోయిందని, ఆ పార్టీ నాయకులు నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అన్నట్లుగా ఉందని విమర్శించారు. తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితులు లేవన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్–బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. దేశ ప్రజలు నరేంద్ర మోదీ వైపు చూస్తున్నారని, మోదీ ద్వారానే దేశానికి రక్షణ ఉంటుందని, అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఉగ్రవాదులను కూకటి వేళ్లతో పెకిలించే సత్తా మోదీకి మాత్రమే ఉందన్నారు. నేడు నిత్యావసర వస్తువుల ధరలు చాలా తగ్గాయన్నారు. మోదీ పేదలకు ఉచితంగా గ్యాస్ ఇస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 15 మంది ఎంపీలుండి ఏం చేశారని వచ్చే ఎన్నికల్లో 16 మంది ఎంపీలు గెలిచి టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ సాధించేది ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ మతతత్వ పార్టీ ఎంఐఎంతో చేతులు కలిపి, మతపరమైన, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 25న చింత సాంబమూర్తి నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. 26న హన్మకొండ హంటర్ రోడ్డులోని అభిరాం గార్డెన్లో బీజేపీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు సాంబమూర్తిని సన్మానించారు. మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావుపద్మ, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, నాయకులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ పెసరు విజయచంద్రారెడ్డి, దొంతి దేవేందర్రెడ్డి, గంఢ్రతి యాదగిరి చందుపట్ల కీర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యలమంచిలి మార్పు కోసం..
సాక్షి, అచ్యుతాపురం: యలమంచిలి నియోజకవర్గంలో ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ పలుమార్లు అధికారం చేపట్టాయి. అయితే అభివృద్ధి జాడ మాత్రం కానరాలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గత ఎన్నికల్లో అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఈసారి ఎన్నికల్లో మార్పు తథ్యమని ప్రజలు భావిస్తున్నారు. అనుచరుల పాలన అవసరమా? ఇప్పటివరకూ అనధికార జాబితాప్రకారం యలమంచిలి టీడీపీ అసెంబ్లీ టికెట్ను పంచకర్ల రమేష్బాబుకు ఇవ్వడానికి అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. పంచకర్ల రమేష్బాబు స్థానికేతరుడని ఆ పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకులే ముఖం చాటేస్తున్నారు ఐదేళ్లలో పంచకర్ల మండలానికి ఒక ఇన్చార్జిని నియమించి పాలన సాగించారు. రెవెన్యూ, పోలీసు కార్యాలయాలను వారి గుప్పెట్లో పెట్టుకుని కార్యకర్తలకు కనీసం విలువలేకుండా చేశారు. ఆ అనుభవాలను ఇప్పటికీ గ్రామస్థాయి నాయకులు మర్చిపోలేదు. గ్రామంలో సమస్యలపై ఆ నాయకులు కార్యాలయాలకు వెళ్లే ఎమ్మెల్యే అనుచరులతో చెప్పించాలని స్వయంగా అధికారులే చెప్పడం నచ్చేదికాదు. దీంతో అనుచరుల పాలన మరలా అవసరమా అన్నట్టుగా ఆ పార్టీ గ్రామ నాయకులే పెదవి విరుస్తున్నారు. నియోజకవర్గంలో ఎప్పటినుంచో జెండా మోసి పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకులు ఉండగా మరోసారి స్థానికేతరుడికి సీటు కేటాయించడం దేశం పార్టీ స్థానిక నాయకులకు నచ్చడంలేదు. హామీలన్నీ నీటి మూటలే... నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. సెజ్లో నిర్వాసితులకు ఆర్ కార్డులు ఇచ్చి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అమలుకు నోచుకోలేదు. దుప్పుతూరు గ్రామాన్ని తరలిస్తామన్నారు. సెజ్ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేసి జీతాలు పెంచుతామని చెప్పారు. ఈఎస్ఐ ఆస్పత్రి, పూడిమడక మత్స్యకారులకు జట్టీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. యలమంచిలి పట్టణంతో పాటు రాంబిల్లి మండలంలో 20 గ్రామాలకు తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. మునగపాకలో పల్లపు ప్రాం తాలకు ముంపు సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఇవేమీ పరిష్కరించలేదు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు రోడ్ల విస్తరణ చేపడతామని, కొండకర్ల ఆవను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎలాంటి పనులు చేపట్టలేదు. అధికార పార్టీ నాయకలు ఐదేళ్లలో విస్మరించిన హామీలు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఆ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. మునగపాక, అచ్యుతాపురంలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయకుండా లాలం భాస్కరరావు గ్రామమైన లాలంకోడూరుకు కాలేజీ మంజూరు చేయడంపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. యలమంచిలి మున్సిపాలిటీలో పన్నుల భారాన్ని తగ్గించలేదు. ఫ్లెవోవర్ పనులు పూర్తికాలేదు. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించడంలో శ్రద్ధచూపలేదు. ఉపాధి హామీ పథకం అమలు చేయమని పట్టణ ప్రజలు ఏళ్ల తరబడి కోరినా పట్టించుకోలేదు. ఇవన్నీ ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి దారితీసే అంశాలు కానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలతో మమేకమైన వైఎస్సార్సీపీ... వైఎస్సార్సీపీ ప్రచారంలో ముందంజలో ఉంది. జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ సాగింది. సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన యు.వి.రమణమూర్తిరాజు 130 రోజుల్లో 98 పంచాయతీలు, 27 మున్సిపల్ వార్డుల్లో ప్రతి ఇంటికీ తిరిగి నవరత్నాలను ప్రచారం చేశారు. మొదటి విడతలోనే ఎన్నిక జరగాల్సి రావడంతో సుమారు నెల రోజులకు మించి సమయంలేదు. టీడీపీ చెందిన పంచకర్ల రమేష్బాబు పెందుర్తి లేదా, విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామనున్నారు. అయితే పెందుర్తిని సిట్టింగ్ ఎమ్మెల్యేకు కేటాయించగా, ఉత్తరాన్ని లోకేష్కి కేటాయించనున్నట్టు సమాచారం. దీంతో పంచకర్ల ఇక్కడే పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. తక్కువ సమయంలో ప్రత్యర్థి పార్టీ నాయకులు ఇంటింటికి తిరగడం సాధ్యపడదు. వైఎస్సార్సీపీ మాత్రం వివిధ కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారితో మమేకమైంది. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్కు పట్టం కట్టడం తథ్యం. నవరత్నాలే వైఎస్సార్ సీపీకి అండ... వైఎస్సార్సీపీకి నవరత్నాలే శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. నియోజకవర్గం వ్యవసాయ, పారిశ్రామికరంగం మిళితమై ఉటుంది. మత్స్యకారులు, వివిధ కులవృత్తిదారులు ఉన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపొందించిన నవరత్నాలలో అన్ని పథకాలు ఈ నియోజకవర్గ ప్రజలకు సంపూర్ణంగా అందుతాయి. వైఎస్సార్సీపీ పాలనలో నియోజకవర్గం అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని ఓటర్లు వ్యక్తంచేస్తున్నారు. అధికారాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఏడు రోజులు పర్యటించారు. ప్రజలందరినీ కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. దారి పొడవునా నీరాజనం పలికారు. ప్రజల సమస్యలను గుర్తించారు. ఆయన అధికారంలోకి వస్తే పాదయాత్రలో గుర్తించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారన్న నమ్మకం ప్రజలకి ఉంది. -
అహ్మదాబాద్.. ఇకపై కర్ణావతి!
అహ్మదాబాద్: చాలాకాలంగా కాషాయ వర్గాలు డిమాండ్ చేస్తున్న గుజరాత్లోని అహ్మదాబాద్ పేరులో మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చే డిమాండ్ను పరిగణనలోకి తీసుకున్నామని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ గురువారం తెలిపారు. రాష్ట్ర రాజధాని గాంధీనగర్లో రూపానీ మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికలలోపే ఈ నిర్ణయం అమలవుతుందని తెలిపారు. ‘అహ్మదాబాద్ అన్న పేరు బానిసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కర్ణావతి పేరు మన ఆత్మాభిమానాన్ని, సంస్కృతిని, స్వయం ప్రతిపత్తిని సూచిస్తుంది’’ అని డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ వ్యాఖ్యానించారు. -
సిద్ధిపేట టీఅర్ఎస్ ఎమ్మెలే అభ్యర్ధిని మార్చబోతున్నారు
-
ఊహిస్తే చాలు... ఆలోచనలు మారతాయి!
‘‘నువ్వు తలచుకోవాలేగానీ.. ఏదైనా సాధ్యమే’’ అని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతూంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయి గానీ.. ఎంత మనం అనుకున్నా ఐన్స్టీన్లా మారిపోగలమా అనే అనుమానం మనకూ వస్తుంది. ఇందులో కొంత నిజం లేకపోలేదని అంటున్నారు బార్సిలోనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం... ఐన్స్టీన్లా అనుకునేవారి ఆలోచనలు క్రమేపీ మెరుగైన దిశగా మార్పు చెందుతాయి. వర్చువల్ రియాలిటీ ఆధారంగా తాము కొందరిపై ఒక పరిశోధన నిర్వహించామని, ఇందులో ఐన్స్టీన్ మాదిరి శరీరం ఉన్నట్టు ఊహించుకోవలసిందిగా సూచించినవారు కొంత సమయానికి ఆత్మవిశ్వాస పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించారని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మెల్ స్లేటర్ అంటున్నారు. వర్చువల్ రియాలిటీ ప్రయోగాల్లో ఇతరుల శరీరం, కదలికలను ఊహించుకోవడం వల్ల తమ అసలు శరీరం, ఆలోచనలను ప్రభావితం చేస్తుందని గతంలోనే కొన్ని ప్రయోగాలు నిరూపించాయని ఆయన అన్నారు. తెల్ల రంగు వారు నల్లటి రంగు శరీరాలను ఊహించుకుని వర్చువల్ రియాలిటీలో చూసుకున్న తరువాత వారికి అప్పటివరకు నల్ల రంగు వారిపై ఉన్న భేదభావం తగ్గిందని చెప్పారు. ఇదే తరహాలో ఐన్స్టీన్లా ఊహించుకున్నప్పుడు వారి ఆలోచనల్లోనూ మార్పులు వచ్చినట్లు తమ తాజా అధ్యయనం చెబుతోందని వివరించారు. -
జాబితాలో సవరణకు అవకాశం
ధరూరు : ఓటరు లిస్టులో సవరణల కోసం ఈ నెల 8 వరకు అవకాశం ఉందని దానిని రాజకీయ పార్టీల నాయకులు సద్వినియోగం చేసుకోవాలని మండల అభివృద్ధి అధికారి నరసింహనాయుడు అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ మీటింగ్ హాల్లో అయిదో సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటరు లిస్టులో తొలగింపు చేయాల్సి ఉందని, కొత్తగా చేర్చిన వారి జాబి జాబితాలో నమోదు కాలేదని నాయకులు ఎంపీడీఓకు విన్నవించుకున్నారు. సమస్య పరిష్కారం కోసం ఎక్ట్రోరల్ అధికారి, లేదా డీపీఓలను కలవాలని సూచించారు. మూడు చోట్ల ఓటు హక్కు.. మల్దకల్ : ప్రభుత్వం ఒక ఓటరు ఒకే చోట తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని నిబంధనలు విధించినప్పటికీ బీఎల్ఓల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో కొన్ని గ్రామాల్లో ఒక ఓటరు మూడు చోట్ల తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నప్పటికీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల మండల అధ్యక్షుడు పాలవాయి రాముడు, బ్రహ్మోజిరావు, బంగి గోవిందులు ఆరోపించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో ఓటరు జాబితాపై సూపరింటెండెంట్ రాజారమేష్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. ఓటరు నమోదులో ఎలాంటి తప్పొప్పులు ఉన్నా.. తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జాబితాలో ఒక కుటుంబ సభ్యుల పేర్లు ఒకేచోట ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇంకా ఎవరైనా వేర్వేరు చోట ఉన్నట్లు గుర్తించినా వెంటనే ఈ నెల 10లోపు తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు ఓటరు జాబితాలో కొందరు ఓటర్ల పేర్లను బీఎల్ఓలు తొలగించకుండా అలాగే ఉంచారని, బీఎల్ఓలు కొన్ని పార్టీలకు కొమ్ముకాస్తూ.. వారి అనుచరుల పేర్లు తొలగించడం లేదన్నారు. వివాహాలు చేసుకుని వెళ్లిన, గ్రామంలో నివాసం లేకుండా వెళ్లిన వారి పేర్లు ఇంకా ఓటరు జాబితాలో ఉన్నాయని వాటన్నింటిని తొలగించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సవారమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేషంపల్లి నర్సింహులు, నీలిపల్లి కృష్ణయ్య, కిశోర్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రజనీ పార్టీ చిహ్నంలో మార్పు?
సాక్షి ప్రతినిధి, చెన్నై: సినీ నటుడు రజనీకాంత్ రాజకీయ పార్టీ చిహ్నంగా తామరపువ్వు అందులో బాబా ముద్రతో కూడిన చేయి గుర్తును పెడతారని అందరూ భావిస్తుండగా అకస్మాత్తుగా మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రజనీ రాజకీయ ప్రవేశం వెనుక బీజేపీ హస్తం ఉందని కొందరు ప్రచారం చేస్తుండటంతో తామరపువ్వును తొలగించి బాబా ముద్ర చుట్టూ ఒక పామును చేర్చిన బొమ్మ తాజాగా ప్రచారంలోకి వచ్చింది. అయితే పార్టీ పేరును, చిహ్నాన్ని ఎప్పుడు ప్రకటిస్తారని విలేకరులు రజనీని అడగ్గా ఆ విషయం తనకే తెలీదన్నారు. చారిత్రక తమిళనాడులో రాజకీయ విప్లవం తీసుకురావాలనేది తన ఆశయమనీ, భావి తరాల కోసం చేస్తున్న ప్రజాస్వామ్య పోరాటం తనదని రజనీ చెప్పారు. 234 నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని ఇప్పటికే ప్రకటించిన రజనీ...ఒక్కో నియోజకవర్గం నుంచి తొలుత ముగ్గురిని ఎంపిక చేసి వారిలో ఒకరికి టికెట్ కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో కనీసం రూ. కోటి ఖర్చు భరించగలిగే వ్యక్తిని అభ్యర్థిగా ఉంచాలని ఆయన భావిస్తున్నారట. రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్న ఇద్దరు ప్రముఖ తమిళ కథానాయకులు రజనీకాంత్, కమల్ హాసన్ ఈ నెల 6న మలేసియాలో భేటీ అయ్యే అవకాశం ఉంది. అక్కడ జరిగే ఓ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరుకానున్నారు. -
ఐఎఫ్ఎస్సీ కోడ్, శాఖల పేర్లలో భారీ మార్పులు
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన శాఖల పేర్లను, ఐఎఫ్ఎస్సీ (ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్)లో భారీ మార్పులు చేసింది. ఇటీవల అయిదు బ్యాంకులను విలీనం చేసుకున్న నేపథ్యంలో దిగ్గజ బ్యాంకు ఈ చర్యలు చేపట్టింది. ఎస్బీఐ శాఖలలో 1,300 బ్రాంచ్ల పేర్లను, వాటి ఐఎఫ్ఎస్సీ కోడ్లను మార్చింది. ముఖ్యంగా హైదరాబాద్ సహా, ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోలకతా, లక్నో వంటి ప్రధాన నగరాల్లో ఈ మార్పులు చేసింది. ఈ మార్పులకు సంబంధించిన వివరాలను వెబ్సైట్లో పొందుపర్చింది. ఎస్బీఐ సుమారు 23వేల శాఖలుండగా 13వందల బ్రాంచ్లలో ఈ మార్పులు చేపట్టింది. పాత అసోసియేట్ బ్రాంచీలలో కొన్ని ఎస్బీఐ శాఖలతో విలీనం అవుతున్నాయి. ఈ విలీనం కారణంగా ఐఎఫ్ఎస్సీ కోడ్స్ మారతాయని బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ (రీటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) ప్రవీణ్ గుప్తా చెప్పారు. ఈ మార్పు గురించి కస్టమర్లకు సమాచారం అందించినట్టు చెప్పారు. అలాగే పాత కోడ్ జత చేసినా, కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలుతీసుకున్నామన్నారు. నగదు లావాదేవీల సందర్భంగా బ్యాంకు శాఖలను ప్రత్యేకంగా గుర్తించడానికి ఉపయోగించే ఆల్ఫా న్యూమరికల్ కోడ్ ఐఎఫ్ఎస్సీ. ఆర్టీజీఎస్, నెఫ్ట్ తదితర పద్దతులను ఉపయోగించి ఒక ఖాతా నుండి వేరొకదానికి నగదు బదిలీకి ఈ కోడ్ చాలా అవసరం. -
ఆ జాబ్స్ కనుమరుగు
సాక్షి,న్యూఢిల్లీ: నైన్ టూ ఫైవ్ జాబ్లు, ఏటా బోనస్, బోలెడన్ని లీవ్లు ఇవన్నీ ఇక తీపిగుర్తులుగా మారనున్నాయి. మారుతున్న వ్యాపార ధోరణులు, విపరీతంగా పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు నియామక వ్యూహాలను మార్చేస్తున్నాయి. ఆటోమేషన్ వంటి నూతన టెక్నాలజీలకు మళ్లుతున్న క్రమంలోనూ నియామక ప్రక్రియ రూపురేఖలు మారుతున్నాయి. శాశ్వత ఉద్యోగులు, నాలుగైదేళ్ల కాలపరిమితితో కూడిన కాంట్రాక్టు నియామకాలకు కంపెనీలు స్వస్తి పలకనున్నాయి. అవసరమైనప్పుడు హైరింగ్ ఆ తర్వాత ఫైరింగ్ విధానానికి సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే భారత్లో 56 శాతం కంపెనీలు తమ ఉద్యోగుల్లో 20 శాతం మందిని తాత్కాలిక ఉద్యోగులుగా నియమించుకున్నాయని కెల్లీఓసీజీ నిర్వహించిన అథ్యయనంలో వెల్లడైంది. రానున్న రెండేళ్లలో తాత్కాలిక ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని 71 శాతం కంపెనీలు యోచిస్తున్నట్టు ఈ అథ్యయనంలో తేలింది. అత్యవసర, తాత్కాలిక ఉద్యోగుల నియామకాలు ఎక్కువగా ఐటీ, స్టార్టప్ కంపెనీల్లో చోటుచేసుకుంటున్నాయి. ఈ పద్ధతిలో ఆయా సంస్థలు డిమాండ్ను అనుసరించి ఆయా ప్రాజెక్టులు, సైట్పై అత్యవసర, తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటాయి. తమ అవసరం తీరిన తర్వాత సదరు ఉద్యోగులను సాగంపుతాయి. మరోవైపు ఈ ప్రాజెక్టుల్లో ఉద్యోగులకు వెసులుబాటు కలిగిన పనివేళలుండటంతో ఫ్రీల్యాన్సర్లుగా సేవలందించేందుకు ఉద్యోగులూ ముందుకొచ్చే పరిస్థితి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
ఉపాధ్యాయుల్లో మార్పు రాకపోతే చర్యలు తప్పవు
కలెక్టర్ రేవు ముత్యాలరాజు గూడూరు రూరల్ : విద్యార్థులకు అర్థమ య్యే రీతిలో బోధనా విధానంలో మార్పు రాకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ రేవు ము త్యాలరాజు ఉపాధ్యాయులను హెచ్చరిం చారు. బుధవారం గూడూరులోని ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాలోని ప్రిన్సిపల్స్, హెచ్ఎంలు, విద్యాశాఖాధికారులకు ఓరియంటేషన్ ప్రోగామ్ నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ పాల్గొని, మాట్లాడారు. కెరీర్ ఫౌండేషన్ కోర్సుకు నిధులు మంజూరయ్యాయని, ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించి బోధన మెరుగు పరుస్తామన్నారు. ఈ ఏడాదిని విద్యానామ సంవత్సరంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వారాంతపు పరీక్షల ఫలితాలపై స్పష్టత లేదన్నారు. 70 శాతం వరకు విద్యార్థులకు మార్కులు చెప్ప డం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ మేరకు విద్యాశాఖ రూపొందించిన నివేదికను చదివి వినిపించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చదువు చెప్పని ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని, అందుకు హెచ్ఎంలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ ఏడాది విద్యార్థులను నాలుగు గ్రేడ్లుగా విభజించడం జరుగుతుందన్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఈ ఏడాది అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, కాపీ చేసే పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు మార్కులు చెప్పాల్సిందేనని, ఎస్ఎంఎస్ల ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందిచా లన్నారు. డిపార్ట్మెంట్ వారీగా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. డీఈఓ మువ్వా రామలింగం మాట్లాడుతూ ప్రతి సోమవా రం సబ్జెక్టుల వారీగా హెచ్ఎంలు సమీక్ష నిర్వహించాలన్నారు. నవంబరు 30వ తేది లోగా ఫిజిక్స్, గణితం సిలబస్ పూర్తి అయ్యేలా ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. అనంతరం పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ పీఓ కాశీ విశ్వనాథ్, డీఐఓ సాయి, ట్రైనీ కలెక్టర్ మహేష్, గూడూరు తహసీల్దార్ జి.వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈఓ ఎండీ ఇస్మాయిల్, ఎంఈ ఓలు, ప్రిన్సిపల్స్, హెచ్ఎంలు, సీఎఫ్సీ కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
అంతర కళాశాలల టోర్నీ షెడ్యూల్ మార్పు
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర కళాశాలల టోర్నీ షెడ్యూల్ మార్పు చేసినట్లు క్రీడా కార్యదర్శి డాక్టర్ బి.జెస్సీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మిడ్ సెమిష్టర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో మార్పు చేసిన షెడ్యూల్ ప్రకటించామన్నారు. - గ్రూప్ఏ : కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ధర్మవరం – ఆగస్టు 29 నుంచి 31 వరకు, గ్రూప్బీ : ఎస్ఎస్బీఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అనంతపురం – సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు, - గ్రూప్సీ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉరవకొండ –సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు, - ఉమెన్ మీట్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అనంతపురం– సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు, - క్రికెట్ టోర్నమెంట్ : ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల , అనంతపురం– నవంబర్ 25 నుంచి డిసెంబర్ 3 వరకు . - అథ్లెటిక్ మీట్ : ఎస్కేయూ కళాశాల – డిసెంబర్ 7 నుంచి 8 వరకు -
చమన్.. చమక్కా!.. పూల పాన్పా!
► జిల్లా పరిషత్ చైర్మన్ మార్పుపై సర్వత్రా చర్చ ► ఈ నెల 15న రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రితో చెప్పిన చమన్ ► కొత్త చైర్మన్గా పూల నాగరాజుకు అవకాశం ► పదవి నుంచి దిగిపోయేందుకు చమన్ అయిష్టత ► చైర్మన్గిరి దక్కుతుందా? లేదా? అని పూలనాగరాజులో ఆందోళన ► చమన్ విషయంలో చేతులెత్తేసిన మంత్రి పరిటాల సునీత జిల్లా పరిషత్ చైర్మన్ మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఒప్పందం మేరకు రెండున్నరేళ్లకు జెడ్పీ పీఠం నుంచి దిగిపోవల్సిన చమన్ ఐదేళ్ల పాటు తనే కొనసాగాలని ఆశిస్తున్నారు. ఇదే సమయంలో జెడ్పీ పీఠం దిక్కించుకోవాలనే కోరిక ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ నెరవేరదని పూల నాగరాజు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఎట్టకేలకు సీఎం జోక్యంతో రాజీనామాకు చమన్ అంగీకరించినట్లు చర్చ జరుగుతున్నా.. ఇప్పటికీ అయిష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పూల నాగరాజు కోరిక నెరవేరుతుందా? లేదా? అనే చర్చ అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. రాజీనామాకు మరో ఐదురోజులే గడువు ఉండటం ఉత్కంఠకు దారితీస్తోంది. సాక్షిప్రతినిధి, అనంతపురం: జిల్లాలో అధిక శాతం జెడ్పీటీసీ స్థానాలు టీడీపీ గెలవడంతో జిల్లా పరిషత్ పీఠం ఆ పార్టీ వశమైంది. మొదటి రెండున్నరేళ్లు చమన్, ఆ తర్వాత గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు పూల నాగరాజు జెడ్పీ చైర్మన్గా ఉండేందుకు పార్టీ నిర్ణయించింది. ఒప్పందం మేరకు ఈ ఏడాది జనవరి 5న చమన్ రాజీనామా చేసి గద్దెదిగాలి. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్లో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి ఆ బాధ్యతను అప్పటి పార్టీ ఇన్చార్జి మంత్రి కొల్లురవీంద్రకు అప్పగించింది. సమావేశంలో జెడ్పీ చైర్మన్ అంశాన్ని మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి ప్రస్తావించారు. ఒప్పందం మేరకు జెడ్పీ చైర్మన్ నాగరాజుకు ఇవ్వాలని కోరారు. దీన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళదామని జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి చెప్పారు. ఈ నేపథ్యంలో మరో మూన్నెల్లు చమన్ పదవీకాలన్నీ పొడిగించారు. ఈ లెక్కన మార్చి 5న రాజీనామా చేయాలి. అప్పుడూ చమన్ రాజీనామా చేయలేదు. జెడ్పీ చైర్మన్ పీఠం కాపాడుకునేందుకు చమన్ ఈ ఆర్నెల్ల కాలంలో అన్ని రకాలుగా ప్రయత్నించారు. ఎన్నికలకు పూల నాగరాజు పెట్టుకున్న ఖర్చు చెల్లించి, ఐదేళ్లపాటు తానే చైర్మన్గా కొనసాగుతానని రాయబారాలు పంపినట్లు టీడీపీలో జోరుగా చర్చ నడిచింది. అయితే ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ జిల్లాస్థాయి పదవి దక్కదని, తనకెలాంటి డబ్బు అవసరం లేదని, ఒప్పందం మేరకు పదవిని కట్టబెట్టాలని నాగరాజు తేల్చి చెప్పారు. దీంతో తన సామాజికవర్గం నేతలతో ఉద్యమం చేయించే ప్రయత్నం కూడా చమన్ చేశారు. డిసెంబర్లో టీడీపీ సమన్వయకమిటీ భేటీ సమయంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ చమన్కు అనుకూలంగా నినాదాలు చేశారు. కొల్లుకు వినతి పత్రం అందజేశారు. అప్పట్లో దీనిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత విషయాలపై కాంగ్రెస్ నేతల జోక్యం ఏంటని ఆగ్రహించారు. సీఎం ఇచ్చిన గడువు జూలై 15 గత నెల అమరావతిలో ‘అనంత’ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జెడ్పీచైర్మన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఒప్పందం మేరకు జనవరి 5న రాజీనామా చేయాల్సి ఉంటే, ఇంకా ఎందుకు కొనసాగుతున్నారని సీఎం ప్రశ్నించారు. తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశించారు. అయితే అనివార్య కారణాలతో జూలై 15న రాజీనామా చేస్తానని చమన్ విన్నవించారు. ఇదే సమావేశంలో పుట్టపర్తి మునిసిపల్ చైర్మన్ గంగన్న కూడా రాజీనామా చేయాలని సీఎం ఆదేశించారు. గంగన్న చైర్మన్గిరి వదులుకునేందుకు విముఖత చూపుతూ ప్రకటనలు చేయడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో చమన్ కూడా జెడ్పీ పీఠం దిగేందుకు అయిష్టంగా ఉన్నారు. ఇటీవల దూదేకుల, ముస్లిం సామాజికవర్గాలకు చెందిన కొందరు నేతలు అక్కడక్కడా చమన్ను కొనసాగించాలని ప్రకటనలు చేస్తున్నారు. గత పదిరోజుల్లో ఇలాంటి ప్రకటనలు కాస్తా అధికమవుతున్నాయి. చమన్ సూచనతో ఇలాంటి ప్రకటనలు వెలువడుతున్నాయని టీడీపీ వర్గాలు చెబుతన్నాయి. దీన్నిబట్టి చూస్తే 15న చమన్ రాజీనామా చేస్తారా? లేదా? అనే సందిగ్ధం కూడా ఇటు టీడీపీతో పాటు జిల్లాలోని రాజకీయనేతల్లో నెలకొంది. చమన్కు మద్దతుగా ఎవ్వరూ లేరా? చమన్ మంత్రి పరిటాల సునీత అనుచరుడు. ప్రస్తుతం జిల్లాలో పరిటాల వర్గం అత్యంత బలహీనంగా ఉంది. చమన్, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ మినహా సునీత వెంట నడిచేవారు ఎవ్వరూ లేరు. పార్టీ ప్రధాన కార్యదర్శి వరదాపురం సూరి, ఎమ్మెల్సీ కేశవ్, జేసీ బ్రదర్స్, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, చివరకు జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి సునీత వ్యతిరేకవర్గంగా కొనసాగుతున్నారు. సునీత అంశం ఏదున్నా వీరంతా ఏకమై వ్యతిరేకిస్తున్నారు. ఆమెను మరింత బలహీనపరచాలనే లక్ష్యంతో ఒప్పందం మేరకు జెడ్పీ పీఠం నాగరాజుకు కట్టబెట్టాల్సిందేనని వీరు అధిష్టానం వద్ద తమ వాణి గట్టిగానే విన్పించారు. తనను జెడ్పీ పీఠంలో కొనసాగేలా చూడాలని చమన్ సునీతకు విన్నవించినా ఆమె కూడా ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత తగ్గించి శాఖను మార్చడం, పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చే అంశంలో అంచనాలను భారీగా పెంచి డిజైన్లు పంపారనే నిర్ణయానికి సీఎం రావడం లాంటి అంశాలు సునీతను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన మాట సాగనప్పుడు మౌనంగా ఉండటమే మేలనే నిర్ణయానికి ఆమె వచ్చినట్లు తెలుస్తోంది. పరిటాల వర్గం బలహీనపడటం, ఆ వర్గం అనుచరుడు కావడం కూడా తనకు ప్రతికూలాంశంగా పరిణమించడంతో ఒంటరిగానే రాజకీయాల్లో బలపడాలనే యోచనకు చమన్ వచ్చినట్లు సమాచారం. -
ఈఎస్ఐ సంఖ్య నమోదు సీరీస్ మార్పు
హిందూపురం అర్బన్ : ఈఎస్ఐ సంఖ్య నమోదు సీరీస్ మార్పు జరిగినట్లు ఈఎస్ఐ బ్రాంచ్ అధికారి ఉబేదుల్లా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉపప్రాంతీయ కార్యాలయం తిరుపతి పరిధిలోకొచ్చే అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో నమోదైన సంస్థల ఈఎస్ఐ సంఖ్య మార్పు జరిగినట్లు తెలిపారు. ఈఎస్ఐ నమోదు సంఖ్య 52 సీరీస్కు బదులు 79 సీరీస్గా మార్చామన్నారు. ఈవిషయంలో అవసరమైన వివరాలకు ఈఎస్ఐ పోర్టల్లో లాగిన్ అవ్వడానికి ఇబ్బందులు ఉంటే sro-tirupathi@esic.inకు మెయిల్ చేసుకోవాలన్నారు. అలాగే మరింత సమాచారం కోసం 0877–2246187 ఫోన్ చేసి సంప్రదించొచ్చన్నారు. -
ఎండ మండుతోంది.. వాన కురుస్తోంది
నరసాపురం : వాతావరణంలో నాలుగు రోజులుగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఎండలు మండిపోతుఉన్నాయి. ఏప్రిల్ రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించాయి. వారం రోజులుగా కొన్నిచోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచీ భానుడు భగభగలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. సాయంత్రం వేళ ఈదురుగాలులు, అకాల వర్షం రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. సాధారణంగా మే నెలాఖరు నుంచి (రోహిణి కార్తె వెళ్లాక) ఈదురు గాలులు వీయటం.. వర్షాలు కురవటం పరిపాటి. అందుకు భిన్నంగా ఏప్రిల్ చివరి వారం నుంచే భారీ గాలులు వీస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉష్ణోగ్రతలు పెరగడమే కారణం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడమే ఈ మార్పులకు కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మొన్నటివరకూ 35నుంచి 37 డిగ్రీల మధ్య నమోదైన ఉష్ణోగ్రతలు వారం రోజుల నుంచి ఒక్కసారిగా పెరిగాయి. భూమి ఒక్కసారిగా వేడెక్కడం, సాయంత్రం చల్లబడుతుండటంతో భూమి నుంచి వేడి వాయువుల పీడనం పైకి వెళుతోంది. ఈ కారణంగా మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తు న్నాయి. వాతావరణంలో నెలకొన్న ఈ సర్దుబాట్లే ప్రస్తుత స్థితికి కారణమని వాతావరణ శాఖ చెబుతోంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే గాలుల్లో వేగం పెరగడం ఈదురు గాలులకు కారణమని చెబుతున్నారు. తగ్గుతున్న తేమశాతం తీర ప్రాంతం కావడంతో మన జిల్లాలో తేమ శాతం అధికంగా ఉంటుంది. నాలుగు రోజులుగా గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. పగటిపూట తేమశాతం 60 నుంచి 70 శాతానికి తగ్గింది. రాత్రివేళ 80 నుంచి 90 శాతం నమోదవుతోంది. వారం క్రితం వరకు పగటిపూట 70 నుంచి 80 తేమ శాతం నమోదైంది. తగ్గుతున్న తేమ శాతంలోను గంటకో రకంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. దీనివల్ల ఉక్కపోత కాస్త తగ్గిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. విజృంభిస్తున్న వ్యాధులు రోజుల వ్యవధిలో తేమ శాతంలో ఒక్కసారిగా మార్పులు సంభవించడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ వాతావరణంలో వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్న వారు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని నరసాపురం పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బళ్ల మురళి సూచించారు. వారం రోజులు ఇదే పరిస్థితి నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో భూమి బాగా వేడెక్కింది. వాతావరణం చల్లబడ్డ తరువాత వచ్చే వేడి గాలుల వల్ల మేఘాలు ఏర్పడి వర్షిస్తున్నాయి. దీనికి ఈదురు గాలులు తోడయ్యాయి. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. – ఎన్.నరసింహరావు, వాతావరణ శాఖ అధికారి, నరసాపురం -
ఈదురు గాలులు.. పెరిగిన ఉష్ణోగ్రతలు
నరసాపురం : జిల్లాలో నాలుగు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ముందెన్నడూ లేనివిధంగా శీతాకాలం మధ్యలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు ఈదురు గాలులు వీస్తున్నాయి. పగలు ఎండ.. రాత్రి చలికి ఈదురు గాలులు తోడవటంతో ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇదిలావుంటే.. గాలిలోని తేమ శాతంలోనూ భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం మంచు ప్రభావం అంతగా లేదు. డిసెంబర్ రెండో వారం, జనవరి మొదటి వారంలోమాత్రమే మంచు ఎక్కువగా కురిసింది. నాలుగు రోజుల నుంచి పగటిపూట ఈదురు గాలులు ప్రభావం ఎక్కువగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సైతం పెరిగాయి. శీతాకాలంలోనూ 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తగ్గుతున్న తేమ శాతం సాధారణంగా శీతాకాలంలో పగటిపూట గాలిలో తేమశాతం 50 శాతం పైనే ఉంటుంది. తెల్లవారుజామున 95 శాతంగా ఉంటుంది. మొత్తంగా శీతాకాలంలో అత్యల్పంగా 50 అత్యధికంగా 98 శాతం ఉంటుంది. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గాలిలో తేమశాతం పడిపోతోంది. పగటిపూట 45 శాతం, తెల్లవారుజాము సమయంలో 85 నుంచి 90శాతంగా నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. గత 15 రోజుల నుంచి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పగటిపూట అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా 28 డిగ్రీలు నమోదు చేసుకుంది. సాధారణంగా వేసవి సమీపించే కాలంలో.. అంటే ఫిబ్రవరి మొదటి, రెండు వారాల్లో గాని ఇంతగా ఉష్ణోగ్రతలు పెరగవు. ఇదిలా ఉంటే శుక్రవారం నరసాపురం ప్రాంతంలోనే పగటిపూట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో 32 డిగ్రీలు దాటింది. సహజంగా తీరప్రాంతం కావడంతో వేసవిలో కూడా మిగిలిన ప్రాంతాల్లో పోల్చుకుంటే నరసాపురం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా నమోదవుతుంటాయి. ఇప్పుడే ఇలా ఉంటే సంవత్సరం వేసవి ప్రభావం కాస్త ముందుగానే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈశాన్య రుతు పవనాల ప్రభావం ఈశాన్య రుతుపవనాల ప్రభావం, ఉత్తర భారతం నుంచి దక్షిణ దిశకు గాలులు వీయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు అండమాన్ దీవుల్లో ఏర్పడిన అల్పపీడనం ఈదురు గాలుల రూపంలో మన జిల్లాపై ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. మొత్తంగా వాతావరణంలో మార్పులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వాకు కష్టమే ప్రస్తుతం కూల్ అండ్ డ్రై అన్న రీతిలో జిల్లాలో వాతావరణం ఉంది. వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలకు మందులు వాడుతున్న వారు, చిన్నపిల్లలు ఈ వాతావరణం ఇల్ల ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధిక చలిగాలులు, గాలిలో తేమశాతం తక్కువవుతూ ఉండటం వంటి కారణాలతో ఆక్వా సాగుకూ ఇబ్బందులు ఏర్పడ్డాయి. పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి జిల్లాలో నాలుగు రోజుల నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. అల్ప పీడనాలు, తుపాన్లు పట్టినప్పుడు ఎలా ఉంటుందో.. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పగటి పూట గాలిలో తేమ శాతం 45శాతం నుంచి 50 శాతం వరకు నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతున్నాయి. ఉత్తర ఆగ్నేయ గాలుల ప్రభావం మనపై కనిపిస్తోంది. అండమాన్లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కూడా మనపై ఉంది. ఈ పరిస్థితి తాత్కాలికమే. నాలుగు రోజుల తరువాత మార్పు వచ్చే అవకాశం ఉంది. – ఎన్.నరసింహరావు, వాతావరణ శాఖ అధికారి, నరసాపురం జాగ్రత్త వహించాలి ప్రస్తుత వాతావరణం ఇబ్బందికరమే. ఆస్త్మా రోగులు జాగ్రత్తగా ఉండాలి. ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారు బయట తిరక్కూడదు. ప్రస్తుత డ్రై అండ్ కూల్ వాతావరణంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో స్వైన్ ఫ్లూ మరణాలు కూడా సంభవించాయి. చర్మ వ్యాధులు ఉన్నవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి. – డాక్టర్ సీహెచ్.కృష్ట అప్పాజీ, ఎండీ, నరసాపురం -
ట్రంప్ ‘మార్పు తెచ్చే వ్యక్తి’: ఒబామా
వాషింగ్టన్: అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ‘మార్పు తెచ్చే వ్యక్తి’అనీ, అతణ్ని తక్కువ అంచనా వేయొద్దని మరో మూడు రోజుల్లో దిగిపోనున్న అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. అధ్యక్షుడిగా తన చివరి ఇంటర్వూ్యనుసీబీఎస్ న్యూస్కి ఇచ్చిన ఆయన, అమెరికా ప్రజలే వాషింగ్టన్ను మార్చగలరని, కానీ అలా అది మారదని, ఎందుకంటే ఆ మార్పును కొందరు పెద్దలు నిర్దేశిస్తారని పేర్కొన్నారు. ట్రంప్కు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉన్నా, విజయవంతంగా ప్రచారంనిర్వహించాడనీ, ప్రస్తుతం జరుగుతున్న అధికార మార్పిడి మాత్రం అసాధారణంగా ఉందనీ, ట్రంప్ తనకన్నా మెరుగ్గా పాలించగలడని తాను అనుకోవడం లేదని ఒబామా అన్నారు. -
కొత్త నగర పంచాయతీల ఏర్పాటు అటకెక్కినట్లేనా..?
అనంతపురం అర్బన్ : జిల్లాలో కొత్తగా మూడు మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా (మునిసిపాలిటీలు) మార్పు ప్రక్రియ అటకెక్కినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం కోరిన ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయాల్సిన నగర పంచాయతీలకు సంబంధించిన ఫైలును ప్రభుత్వానికి జిల్లా పంచాయతీ అధికారులు ఆరు నెలల క్రితమే పంపించారు. అయితే ఏర్పాటు ప్రక్రియ చేపడుతున్నారా? లేదా అనేదానిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారులకు ఎలాంటి సమాచారం లేదని తెలిసింది. జిల్లాలో 25 వేలు జనాభా దాటిన మూడు మేజరు పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్పు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అంతే కాకుండా ఉరవకొండ, పెనుకొండ, ఎ.నారాయణపురం మేయర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్పు చేయాలని ప్రభుత్వమే నిర్ణయించిం ది. ఇందుకు సంబంధించి జనాభా, భౌగోళిక పరిస్థితి, విస్తీర్ణం, ఆదాయ, వ్యయాల వివరాలను నివేదించాలని అదేశించింది. ప్రభుత్వం కోరిన విధంగా అన్ని వివరాలతో ఫైలును ఇక్కడి జిల్లా పంచాయతీ కార్యాలయం అధికారుల పంపించారు. ఆరు నెలలు దాటింది కొత్తగా ఏర్పాటు కానున్న ఉరవకొండ, పెనుకొండ, ఎ.నారాయణపురం నగర పంచాయతీలకు సంబంధించి సమగ్ర సమాచారం, వివరాలతో కూడిన ఫైలును ప్రభుత్వానికి పంపించి, ఆరు నెలలు దాటినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే వీటి ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన జీఓను ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీన్ని బట్టి చూస్తే కొత్త నగర పంచాయతీల ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పక్కకు పెట్టినట్లు కనిపిస్తోంది. -
ముక్కంటి దర్శనం వేళలు మార్పు
శ్రీకాళహస్తి: ధనుర్మాసం సందర్భంగా ఈనెల 16 నుంచి జనవరి 15 వరకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శనం వేళలు మారుస్తున్నట్లు ఆలయాధికారులు ఆదివారం తెలిపారు. మాములుగా తెల్లవారుజామున 5.30 నుంచి ఆలయంలో దర్శనం ధనుర్మాసంలో 5 గంటల నుంచే ఉంటుంది. వేకువున 3.30 గంటలకు నిర్వహించే జేగంటను 3 గంటలకు నిర్వహిస్తారు. 4.30Sకు జరిగే మంగళవాయిద్యాల కార్యక్రమం 4 గంటలకే ఉంటుంది. 5 గంటలకు జరిగే సుప్రభాతం 4.30 గంటలకు ఉంటుంది. ఉదయం 5.30 గంటలకు నిర్వహించే మొదటి అభిషేకం 5 గంటలకే నిర్వహించి స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పిస్తారు. 6.30 గంటలకు జరిగే రెండో అభిషేకం 6 గంటలకే ఉంటుంది. 7.30 గంటలకు జరిగే పరివార దేవతలకు పూజలు 7 గంటలకే నిర్వహిస్తారు. 7.30 గంటలకు గొబ్బి ఉత్సవం ఉంటుంది. 10.30 గంటలకు జరిగే మూడో అభిషేకం 10 గంటలకే పూర్తి చేస్తారు. సాయంత్రం 5.30 గంటలకు నిర్వహించే ప్రదోష అభిషేకం మాత్రం యథావిధిగానే నిర్వహిస్తారు. -
పర్యాటకులకు నోట్ల రద్దు సెగ
హైదరాబాద్: పెద్ద నోట్లు రద్దైన నేపధ్యంలో సరైన చిల్లర అందుబాటులో లేకపోవడంతో పాతబస్తీలోని పర్యాటక కేంద్రాలను సందర్శించే పర్యాటకులకు ఇంకా తిప్పలు తప్పడం లేదు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఒర్చి ఓల్డ్సిటీకి వచ్చినప్పటికీ... చిల్లర సమస్య పర్యాటకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. బాధిస్తుంది. కేవలం కొత్త రూ.2000 నోట్లు అందుబాటులో ఉండటం.. దీనికి చిల్లర దొరకకపోవడంతో పాతబస్తీ పర్యాటక కేంద్రాలను సందర్శించే పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆదివారం పర్యాటక స్థలాలన్నీ సందర్శకులతో కళకళలాడినా...చిల్లర సమస్యతో పర్యాటకులు పడరాని పాట్లు పడ్డారు. సాధారణంగా సెలవు రోజుల్లో చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహాల్లా ప్యాలెస్, జూ పార్కు తదితర పర్యాటక కేంద్రాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతాయి. ఈ ఆదివారం కూడా పర్యాటకుల సంఖ్య బాగానే ఉన్నప్పటికీ...చిల్లర సమస్య కొట్లోచ్చినట్లు కనిపించింది. పర్యాటకులపై ఆదారుపడిన వ్యాపారాలు కూడా రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. చిరు వ్యాపారస్తులు గిరాకీలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. సండే ఎక్కువగా కనిపించే చిల్లర సమస్య... సెలవు రోజైన ఆదివారం పర్యాటకుల సంఖ్య బాగానే ఉన్నా...మండే టూ ఫ్రై డే సందర్శకుల సంఖ్య తగ్గుతోంది. సాధారణ రోజుల కన్నా..ఆదివారం చిల్లర సమస్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పెద్ద నోట్లు ఏవీ చెల్లకపోవడం...కొత్తగా వచ్చిన రెండు వేల నోట్లకు చిల్లర అందుబాటులో లేకపోవడంతో పర్యాటకులతో పాటు చిరువ్యాపారులకు చిల్లర సమస్య ఎక్కువైంది. ఈ ఆదివారం చార్మినార్ కట్టడాన్ని 5,168 మంది పర్యాటకులు సందర్శించగా...సాలార్జంగ్ మ్యూజియంను 4,700, చౌమహాల్లా ప్యాలెస్ను 1,192, జూ పార్కును 18232 మంది సందర్శించారు. వీరంతా చిల్లర సమస్యతో ఇబ్బందుకలు గురయ్యారు. సోమవారం సందర్శకుల సంఖ్య తగ్గడంతో చిల్లర కష్టాలు ఎక్కువగా కనిపించ లేదు. -
ప్చ్.. ఏం లాభం!
- వచ్చిన కరెన్సీ మొత్తం రూ. 2వేల నోట్లే - ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన కరెన్సీ రూ. 700 కోట్లు - ఇందులో రూ.600 కోట్లు రూ.2వేల నోట్లే - ప్రత్యామ్నాయం లేక తీసుకుంటున్న జనం - దాన్ని మార్చుకునేందుకు నానా తంటాలు - జనానికి తీరని నగదు కష్టాలు రూ. 2వేల నోటు.. నగదు కొరత నేపథ్యంలో ఎవరి వద్ద చూసినా రూ.2వేల నోటే కనిపిస్తోంది.. కానీ ఏ లాభం.. ఆ నోటు జనం అవసరాలను ఏ మాత్రం తీర్చలేకపోతోంది.. జేబుల్లో డబ్బుందన్న మాటే కానీ దాన్ని మార్చుకునేందుకు ప్రజలు పడుతున్న తంటాలు అన్నీఇన్నీ కావు. .బ్యాంకుకు వెళ్లినా, ఏటీఎం వద్ద క్యూ కట్టినా బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయం లేక ఈ నోటును తీసుకుంటున్నారు తప్ప దానికి ఆ స్థాయి ఆదరణ లభించడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే బయట చెల్లకుండా మిగిలిపోయిన వెయ్యి, పాత ఐదొందల నోటుకు ప్రస్తుతం అంతటా లభిస్తున్న రెండు వేల నోటుకు పెద్ద తేడా ఉండడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ నోటును రద్దు చేశారు కాబట్టి దుకాణదారులు తీసుకోవడం లేదు.. అంత మొత్తంలో చిల్లర దొరకదు కాబట్టి ఈ నోటును వద్దంటున్నారు. కర్నూలు(అగ్రికల్చర్): రూ.500, 1000 నోట్ల రద్దు తర్వాత జిల్లాకు కొత్త కరెన్సీ దాదాపు రూ.700 కోట్లు వచ్చింది. ఇందులో రూ.600 కోట్ల వరకు రూ.2వేల నోట్లు మత్రమే వచ్చాయి. ఇంతవరకు జిల్లాకు కొత్త రూ.500 నోట్లు నామమాత్రంగానే వచ్చాయి. రూ.100 నోట్ల సరఫరా తగ్గిపోయింది. దీంతో మార్కెట్లో చిల్లర పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలుగా రూ.2000 నోట్లే ఇస్తున్నారు. పింఛన్ దారులు బ్యాంకుకు వెళ్తే ఇద్దరికి కలిపి రూ.2వేల నోటు ఇస్తున్నారు. మార్కెట్లో రెండు వేల నోట్లు తప్ప ఇతర నోట్లు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో రూ.2వేల నోట్లను మార్చుకోవడంలో వివిధ వర్గాల ప్రజలు పడుతున్న ఇక్కట్లు అన్ని, ఇన్నీ కావు. ఇంత పెద్దనోటు వద్దు బాబోయ్ అన్ని జనం మొత్తుకుంటున్నా.. రూ. 500, రూ.100 నోట్లు సరఫరా చేయాలని బ్యాంకర్లు కోరుతున్నా... ఆర్బీఐ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో జిల్లాకు వందలు, ఐదు వందల నోట్లు తెప్పించాలని బ్యాంకర్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తెస్తున్నారు. తీవ్రమవుతున్న చిల్లర కొరత జిల్లాకు ఇటీవలే రూ.160 కోట్లు వచ్చాయి. ఇదంతా రూ.2వేల నోట్ల రూపంలోనే ఉంది. దీంతో చిల్లర సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు, పింఛన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దనోటుకు చిల్లర లభించకపోవడం, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇటీవల నందికొట్కూరులో ఓ వ్యక్తి అత్మహత్యాప్రయత్నం చేశారు. జేబులో రెండువేల నోటున్నా టీ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. రూ.1000కి పైగా వ్యాపారం చేస్తే తప్ప వ్యాపారులు చిల్లర ఇవ్వడం లేదని ప్రజలు వాపోతున్నారు. హోటల్కు వెళ్తే రూ.500, 100 నోట్లుంటేనా రావాలని చెబుతుండంతో జనం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ‘వంద’కు వెలుగు.. బ్యాంకింగ్ వర్గాల సమాచారం మేరకు జిల్లాలో దాదాపు రూ. 200 కోట్ల విలువైన 100 నోట్లున్నాయి. కాని ఈ స్థాయిలో 100 కనిపించడం లేదు. కర్నూలుతో సహా వివిధ ప్రాంతాల్లో వ్యాపారులు, మరికొందరు 100 నోట్లను భారీ ఎత్తున బ్లాక్ చేయడంతో కొరత మరింత తీవ్రమైంది. కొంత మంది 2వేల నోటుకు కమీషన్ విధానంలో చిల్లర ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. వ్యాపారులు వంద నోట్లను బ్లాక్ చేయడం వల్ల మార్కెట్లో వీటికి కృత్రిమ కొరత ఏర్పడింది. నేడు కరెన్సీలో వందనోట్లు రారాజుగా మారాయి. రెండు వేల నోట్లను మార్చడం కష్టంగా మారింది.... విజయకుమార్ ఏపీఎంఐపీ ఉద్యోగి ఇటీవల కలెక్టరేట్లోని ట్రెజరీ బ్రాంచీకి జీతం తీసుకునేందుకు వెళ్తే అన్ని 2వేల నోట్లు ఇచ్చారు. వీటిని మార్చుకోవడంలో తల ప్రాణం తోకకు వస్తోంది. ఎక్కడ అడిగినా వంద నోట్లు లేవంటున్నారు. ప్రభుత్వం అన్ని రకాల కరెన్సీ సరఫరా చేస్తే బాగుంటుంది. కాని అన్ని పెద్దనోట్లే వస్తుండటం వల్ల చిల్లర సమస్య తీవ్రమవుతోంది. రూ.2వేల నోటు జేబులో ఉన్నా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. -
మీకూ చిల్లర కావాలా: హీరోయిన్
అమృత్ సర్: పెద్ద నోట్ల రద్దుతో చిల్లర దొరక్క గత కొన్ని రోజులుగా పడుతున్న ఇబ్బందులను చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా డిసెంబర్ నెల ప్రారంభమవడంతో ఈ కష్టాలు మరీ పెరిగిపోయాయి. బ్యాంకులో డబ్బున్నా చేతిలో చిల్లిగవ్వలేక సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఏటీఎం క్యూలలో గంటల తరబడి ప్రయత్నించి డబ్బు(రూ. 2000) దొరికినా వాటిని విడిపించడం మరో సాహసమే అవుతోంది. ఇలాంటి సమయంలోనే దక్షిణాది హీరోయిన్ లక్ష్మీ రాయ్, తన స్నేహితురాలుతో కలిసి పంజాబ్లోని అమృత్ సర్లో చక్కర్లు కొడుతోంది. అంతేనా ఏకంగా రూ.10 నోట్లతో చేసిన దండలను లక్ష్మీరాయ్, తన స్నేహితురాలు హారంగా ధరించి.. మనీ హై తో హనీ హై అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టేసింది. ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పు తీసుకు వచ్చే నోట్ల రద్దు నిర్ణయంతో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నా చిల్లరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని నటి లక్ష్మీరాయ్ పేర్కొంది. అంతేనా చిన్న నోట్ల దండలతో అలంకరించుకుని మరీ మీకూ చిల్లర కావాలా అంటూ...సరదాగా తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. -
టోల్ ప్లాజాల వద్ద చిల్లర కష్టాలు
-
నెల ఖర్చుల కోసం సామాన్యుల కష్టాలు
-
పిక్నిక్ ఆనందానికి చిల్లర కష్టాలు
-
చిల్లర కోసం ఎస్బీఐ ముట్టడి
ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన రూ.2వేల నోట్లను రద్దుచేయాలని డిమాండ్ నోట్ల రద్దు వ్యవహారంలో రాజకీయ కోణం – కర్నాకుల జగ్గంపేట : సామాన్యులు నుంచి అన్ని వర్గాల ప్రజలు పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. మెట్ట ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు దాదాపు స్తంభించడంతో కూలీలు, చిన్నచిన్న వ్యాపారులు, మహిళలు చిల్లర సమస్యతో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మ«ధ్యాహ్నం జగ్గంపేట స్టేట్బ్యాంక్ శాఖను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు నాయకత్వం వహించిన రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ ముందస్తు సర్దుబాటు చర్యలు తీసుకోకుండా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడం వెనక రాజకీయ కోణం ఉందన్నారు. ఈ నిర్ణయం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా ముద్రించిన రూ.2వేల నోటు రద్దు చేయాలన్నారు. బ్యాంక్ వద్ద ఆందోళన అనంతరం సర్వీసు రోడ్డు మీదుగా గ్రామంలో మెయి¯ŒS రోడ్డు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు కూలీ సంఘ నేతలు బి.రమేష్, రామలింగేశ్వరరావు, త్రిమూర్తులు, కొండేపూడి మంగయ్యమ్మ, సతీష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఉసురు తీసిన పింక్ నోటు
సకాలంలో చిల్లర దొరక్క ఆస్తమాతో బాధపడుతున్న తాపీ మేస్త్రి మృతి కిండ్ర (రాజవొమ్మంగి): పెద్ద నోట్ల రద్దు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంటే, మరో వ్యక్తి జేబుకు చిల్లు పెట్టింది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామంలో రూ.2 వేల నోట్లకు సకాలంలో చిల్లర దొరక్క ఆస్తమాతో బాధపడుతున్న ఓ తాపీమేస్త్రి మృతి చెందాడు. గ్రామానికి చెందిన గంగబోయిన కృష్ణ (45) వ్యవసాయంతో పాటు తాపీపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల కిందట తాను సాగు చేసిన పత్తి అమ్మగా రూ.2 వేల నోట్లు రెండు అందాయి. అప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న అతడు వైద్యం కోసం మైదాన ప్రాంతంలోని ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆదివారం పగలంతా రూ.2 వేల నోట్లకు చిల్లర కోసం తిరిగాడు. ఆస్పత్రికి వెళ్లాలని, చిల్లర ఇప్పించాలని పలువురిని ప్రాధేయపడ్డాడు. చివరకు ఒక నోటుకు చిల్లర లభించింది. ఆ సొమ్ముతో కిండ్ర నుంచి తన మోటారు సైకిల్పై సాయంత్రం ఏలేశ్వరం వైపు పయనమయ్యాడు. అప్పటికే శ్వాస ఆడక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కృష్ణ ఊరి చివరకు వెళ్లేసరికే మోటారు సైకిల్పై నుంచి కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నాలుగు వేల కోసం వెళితే లక్ష ఖర్చు మార్టూరు: ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన పొత్తూరి సత్యబ్రహ్మం స్థానిక గన్నవరంలో ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తుంటాడు. స్థానిక స్టేట్ బ్యాంకులో రూ. 4 వేల నోట్లు మార్చుకోవటానికి శనివారం క్యూలో నిలుచున్నాడు. బ్యాంకు గేటు తెరవడంతో తొక్కిసలాటలో గాయపడ్డాడు. చిన్న గాయమనుకుని ఆస్పత్రికి వెళ్లిన బ్రహ్మ ంకు వైద్యులు షాకిచ్చారు. వెన్నెముక, నడుముకు మధ్య ఉన్న జాయింట్ విరిగినందున సర్జరీ చేయాలని చెప్పారు. లక్ష రూపాయలు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకుని ఆదివారం ఇంటికి తీసుకువచ్చారు. -
పదో రోజూ తప్పని చిల్లర కష్టాలు
-
రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో మార్పులు
–డోన్ స్థానంలో పత్తికొండ డివిజన్ ఏర్పాటు –కర్నూలు డివిజన్లోనే డోన్ నియోజకవర్గం కర్నూలు(అగ్రికల్చర్): రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ నేతల సూచనలకనుగుణంగా డోన్ స్థానంలో పత్తికొండ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు ఊపందుకున్నాయి. గతంలో డోన్ కేంద్రంగా పత్తికొండ, బనగానపల్లె నియోజకవర్గాలను కలిపి రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయతలపెట్టారు. మారిన సమీకరణలతో పత్తికొండ కేంద్రంగా పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటును ప్రతిపాదించారు. డోన్ నియోజకవర్గం కర్నూలు రెవెన్యూ డివిజన్లోనే ఉంటుంది. ఇది వరకు డోన్ రెవెన్యూ డివిజన్లో కలపాలని ప్రతిపాధించిన బనగానపల్లె నియోజక వర్గాన్ని నంద్యాల రెవెన్యూ డివిజన్లోనే ఉంచనున్నారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం కర్నూలు రెవెన్యూ డివిజన్లో కర్నూలు, కోడుమూరు, డోన్, పాణ్యం, డోన్ నియోజకవర్గాలు ఉంటాయి. (జనాభా 12,09,821) నంద్యాల రెవెన్యూ డివిజన్లో నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లి నియోజకవర్గాలు ఉంటాయి. (జనాభా 8,92, 526) ఆదోని రెవెన్యూ డివిజన్లో ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవ్గాలు ఉంటాయి. (జనాభా 8, 38,817) పత్తికొండ రెవెన్యూ డివిజన్లో పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలు ఉంటాయి. (జనాభా 5,92,703) ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాలు ఉంటాయి. (జనాభా 5,12,734) -
2000 రూపాయల నోటుతో కొత్త కష్టాలు
-
2000 రూపాయల నోటుతో కొత్త కష్టాలు
లక్నో: పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవాలంటే గంటల కొద్దీ బ్యాంకుల ముందు పడిగాపులు కాయాలి. ఎకౌంట్లోని డబ్బు డ్రా చేయాలన్నా ఇదే పరిస్థితి. ఇక ఏటీఎంల వద్ద పెద్ద క్యూలో నిల్చున్నా తమ వంతు వచ్చేసరికి అందులో డబ్బు ఉంటుందన్న నమ్మకం లేదు. చాలా ఏటీఎంలలో డబ్బులు లేవు. ఇన్ని కష్టాలు పడి కొత్త 2000 రూపాయల నోటు సంపాదిస్తే మరో సమస్య ఎదురవుతోంది. కొత్త 2000 రూపాయల నోటును చాలా చోట్ల తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీనికి చిల్లర నోట్లు అందుబాటులో లేకపోవడమే కారణమని చెబుతున్నారు. కొత్త 2 వేల నోటు తీసుకుని వెళితే చిల్లర లేదని వ్యాపారులు చెబుతున్నారని, ఏం చేయాలో పాలుపోవడం లేదని ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ వాసి చెప్పారు. రద్దయిన 500, 1000 రూపాయల నోట్ల స్థానంలో కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా 2 వేల రూపాయల నోటు అందుబాటులోకి రాగా, 500 రూపాయల నోట్లు ఇంకా రాలేదు. దీంతో 2 వేల రూపాయల నోటు మార్చేందుకు చిల్లర సమస్య ఏర్పడింది. ప్రస్తుతం ఎక్కువగా 100, 50 నోట్లే అందుబాటులో ఉన్నాయి. 2 వేల నోటుకు సరిపడా, లేదా కాస్త తక్కువగా సరుకులు తీసుకుంటే నోటు తీసుకుని చిల్లర వాపసు ఇస్తున్నారు. అదే తక్కువ మొత్తంలో కొనేందుకు వెళితే 2 వేల రూపాయల నోటును తీసుకోవడం లేదు -
పరీక్షలో ‘పది’లమేనా!
మారిన విద్యావిధానంపై తర్జనభర్జన ఫలితాల్లో జిల్లా స్థానంపై పెరుగుతున్న ఆసక్తి నూతన విధానంపై ఉపాధ్యాయుల భిన్నాభిప్రాయాలు భానుగుడి (కాకినాడ) : దశాబ్దాల కాలంగా పాఠశాల విద్యా విధానంలో ప్రశ్న సమాధానాల పద్ధతిని పాటిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ పద్ధతి నుంచి మూల్యాంకనానికి పరీక్ష విధానం మార్పు చేశారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు తొలిసారి నిరంతర సమగ్రమూల్యాంకన విధానంలో నిర్వహించనున్నారు. ఈ విధానం విద్యార్థుల మాటెలా ఉన్నా నిర్వహణ ఉపాధ్యాయులకు కత్తిమీద సాములా ఉంది. దీనిపై ఉపాధ్యాయులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది తగ్గిన విద్యార్థులు 2013–14 విద్యాసంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే జిల్లా తొలి స్థానంలో నిలిచింది. 2014–15లో రెండో స్థానం, 2015–16లో మూడో స్థానం దక్కించుకుంది. గత ఏడాది 67,493 మంది విద్యార్థులు రెగ్యులర్గాను, 3 వేల మంది ప్రైవేట్గాను పరీక్షలు రాశారు. ఈ ఏడాది మొత్తం 68 వేల మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది పరీక్షలను సీసీ కెమెరాల మధ్య నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లా స్థానం తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదీ జరిగిన మార్పు గతంలో ప్రశ్నపత్రం ఆధారంగా విద్యార్థులు జవాబులు రాసేవారు. రాసిన జావాబులు ఆధారంగా మార్కులు వేసేవారు. విషయాన్ని ఆకళింపు చేసుకోకుండా బట్టీపట్టి జావాబులు రాస్తున్నారన్న విమర్శలతో దీనికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని ఈ ఏడాది అమలులోకి తెచ్చింది. వంద మార్కుల ప్రశ్న పత్రంలో 80 మార్కులు పరీక్ష పత్రానికి, మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్స్గా నిర్ణయించింది. ఈ 20 మార్కుల్లో 10 మార్కులు 8 నుంచి 10 వరకూ విద్యార్థి పరీక్షల్లో సాధించిన ప్రగతిని, (4 నిర్మాణాత్మక మూల్యాంకన పరీక్షలకు+2 సంగ్రహణ మూల్యాంకన పరీక్షలకు) వెరసి 360 మార్కులకు ప్రగతిని గణిస్తారు. ఈ మార్కులతో పాటు తరగతిలో విద్యార్థి స్పందన, ప్రాజెక్టు తయారీలకు గాను 20 మార్కులు కేటాయించారు. మిగిలిన 80 మార్కులను పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థి సాధించాల్సి ఉంటుంది. ఇందులో 35 శాతం మార్కులు వస్తేనే ఉత్తీర్ణత సాధించినట్టు. -
ఐఎస్ఐ చీఫ్ మార్పు..?
ఇస్లామాబాద్: త్వరలో పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్ట్నెంట్ జనరల్ రిజ్వాన్ అక్తర్ స్థానంలో మరొకరిని నియమించనున్నట్లు సమాచారం. మార్పు ప్రక్రియ జరుగుతున్నట్లు శనివారం ఓ మీడియా సంస్థ వెల్లడించింది. 2014 సెప్టెంబర్లో ఐఎస్ఐ డీజీగా అక్తర్ బాధ్యతలు స్వీకరించారు. ఐఎస్ఐ డీజీ పదవీ విరమణ పొందితేనో.. లేదా ఆ స్థానంలో ఆర్మీ చీఫ్ మరొకరిని నియమిస్తేనో తప్ప.. ఐఎస్ఐ చీఫ్ను మూడేళ్ల పదవీ కాలానికి నియమిస్తారు. అయితే తాజా కథనం ప్రకారం అక్తర్ తన పదవీ కాలం కన్నా ముందుగానే బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అక్తర్ స్థానంలో కరాచీ సైనిక దళం కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ నవీద్ ముఖ్తార్ను నియమించనున్నట్లు అధికారులు తెలిపారని మీడియా సంస్థ వెల్లడించింది. అయితే దీన్ని పాక్ మిలటరీ ప్రతినిధి బజ్వా కొట్టిపారేశారు. కథనాన్ని ప్రచురించిన మీడియా సంస్థ కూడా.. ఐఎస్ఐ చీఫ్ను ఎందుకు మార్చుతారనే విషయాన్ని ప్రస్తావించలేదు. -
పాక్ ఉగ్రవాదుల వ్యూహం ఎందుకు మారింది?
న్యూఢిల్లీ: మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు 2008లో ముంబైపై ఉగ్రవాదులు జరిపిన దాడి సందర్భంగా భారత్, పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయంలో పాక్ భూభాగంలో జరిపిన సర్జికల్ దాడుల సందర్భంగా మళ్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నాటి సంఘటనకు, నేటి సంఘటనకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఉగ్రవాదుల వ్యూహం కూడా మారింది. ముంబై దాడుల వరకు పౌరులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు జరపగా, ఆ తర్వాత నుంచి భారత సైనిక దళాలనే లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతున్నారు. ఉడీ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 19 మంది సైనికులు మరణించిన విషయం తెల్సిందే. ఈ సంఘటనకు మూడు నెలల ముందు పాంపోర్ సమీపంలోని సీఆర్పీఎఫ్ శిబిరంపై జరిగిన దాడిలో 8 మంది సైనికులు మరణించారు. గతేడాది డిసెంబర్లో సైనిక 31వ రిజిమెంట్ ఆర్డినెన్స్ క్యాంప్పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ లెఫ్ట్నెంట్ కల్నల్ సహా 8 మంది సైనికులు, ముగ్గురు పోలీసులు మరణించారు. ఉగ్రవాదులు ఎందుకు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు? 2008లో జరిగిన ముంబై దాడులతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్పై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి వచ్చింది. పాక్ ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఉగ్రవాదులు తమ వ్యూహాన్ని మార్చుకొని ఉంటారని రక్షణ శాఖ నిపుణులు మనోజ్ జోషి తెలిపారు. సైనిక, పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపితే అది అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాదులు దాడుల కిందకు రాదని, కశ్మీర్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న మిలిటెంట్ల దాడుల కిందకు వస్తుందని పాకిస్థాన్ భావించి ఉంటుందని ఆయన అన్నారు. నాటి నుంచి నేటి వరకు పౌరులపై దాడులు 93 శాతం తగ్గి, అదే స్థాయిలో సాయుధ బలగాలపై ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. -
పలు రైళ్ల వేళల్లో మార్పులు
కర్నూలు(రాజ్విహార్): దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న పలు రైళ్లు వేళల్లో మార్పులు చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు నుంచి సికింద్రాబాదుకు వరకు ప్రతి రోజు నడుస్తున్న హంద్రీ (ఇంటర్ సిటీ) ఎక్స్ప్రెస్ రైలు (నంబర్ 17223) సికింద్రాబాదులో ఇకపై సాయంత్రం 4:45కి బయలుదేరనుంది. కాచిగూడలో 5:10కి బయలుదేరి కర్నూలుకు రాత్రి 9:35 గంటలకు చేరనుంది. కాచిగూడా నుంచి చెన్నై వరకు నడిచే చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైలు (నంబర్ 17652)ను తమిళనాడులోని తంబరం, చెంగల్పట్టు వరకు పొడగించారు. కర్నూలులో రాత్రి 8:08కి వచ్చి 8:10కి బయలుదేరే ఈ రైలు చెన్నైకు ఉదయం 7:25 గంటలకు, చెంగల్పట్టుకు ఉదయం 9:10 గంటలకు చేరుతుంది. అక్కడి నుంచి 17651 నంబరు రైలు మధ్యాహ్నం 3:20గంటలకు, చెన్నై నుంచి 5గంటలకు కర్నూలుకు మరుసటి రోజు తెల్లవారుజామున 03:33గంటలకు చేరి 03:35గంటలకు బయలుదేరుతుంది. కాచిగూడకు ఉదయం 7:55గంటలకు చేరుకుంటుంది. నంద్యాల నుంచి కర్నూలు వరకు నడుస్తున్న డెమో (నంబరు 77695) రైలు నంద్యాలలో ఉదయం 6:15 గంటలకు బయలుదేరి కర్నూలుకు 10:20 గంటలకు చేరుతుంది. ఇక్కడి నుంచి సాయంత్రం 5:30గంటలకు నంబరు 77696గా బయలుదేరి రాత్రి 10:10గంటలకు నంద్యాల చేరుతుంది. ఈ మార్పులు శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. -
నిరసన భెల్ మోగింది
‘భెల్’ తరలింపు యోచనపై పెల్లుబుకుతున్న ఆగ్రహం – తీవ్రంగా ప్రతిఘటిస్తామంటోన్న వైఎస్సార్సీపీ – నియోజకవర్గ కేంద్రాల్లో ఏఐఎస్ఎఫ్ ఆందోళనలు – తరలిస్తే ఊరుకోం : భూమన కరుణాకర్రెడ్డి మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల తయారీ భారీ కర్మాగారాన్ని(భెల్) పక్క రాష్ట్రాలకు తరలించాలన్న యోచనపై నిరసన పెల్లుబుకుతోంది. తరలించాలనే ప్రతిపాదన గుట్టును సాక్షి బహిర్గతం చేశాక వివిధ వర్గాలు కదిలాయి. కేంద్ర ప్రభుత్వ కుట్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతలపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీలు, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు దీనిపై ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. మన్నవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబునాయుడు కనబరుస్తోన్న నిర్లక్ష్య వైఖరిని జిల్లా ప్రజానీకం తీవ్రంగా పరిగణిస్తోంది. నిధుల కేటాయింపులో చూపుతున్న అనాసక్తిని తప్పుబడుతోంది. –––––––––––––––––––– సాక్షి ప్రతినిధి, తిరుపతి : మన్నవరంలో రూ.6 వేల కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉపకరణాల తయారీ ఫ్యాక్టరీకి ప్రతిపాదనలు జరిగాయి. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ వైఎస్ హయాంలోనే లభించాయి. ఈ ఫ్యాక్టరీ కోసం 720 ఎకరాలను కేటాయించారు. 2010 సెప్టెంబరు 1న అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ భూమి పూజ కూడా చేశారు. అప్పట్లో వేలాది మంది యువకుల్లో ఉపాధి అవకాశాల ఆశలు చిగురించాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన కంప్యూటర్ ఇంజినీరింగ్ పట్టభద్రులు ఫ్యాక్టరీపై బోలెడన్ని కలలు కన్నారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు పరిశ్రమను పూర్తిస్థాయిలో నెలకొల్పే విషయంలోనూ, నిధుల కేటాయింపులోనూ అనాసక్తి చూపింది. దీంతో ఈ ఫ్యాక్టరీ తరలింపు కోసం కేంద్రం యత్నాలు ప్రారంభించింది. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకూ తరలింపు వ్యవహారం శరాఘాతంలా తాకింది. గడచిన వారం రోజులుగా జిల్లా అంతటా నిరసన ఉద్యమాలు మొదలయ్యాయి. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, వాçమపక్ష పార్టీలు ఈ యోచనను వ్యతిరేకిస్తున్నాయి. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు 27న జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిరుద్యోగ, గిరిజన, మహిళా సంఘాలు కూడా తరలింపు యోచనను విరమించుకోవాలని నినదిస్తున్నాయి. 15 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగజేసే భారీ ప్రాజెక్టును పక్క రాష్ట్రాలకు తరలిస్తే ఆమరణ దీక్షకు పూనుకుంటామని పలువురు స్పష్టం చేస్తున్నారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ పార్టీలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భెల్ ఫ్యాక్టరీ తరలింపు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెరచాటున చేస్తోన్న ప్రయత్నాలను తిప్పి కొట్టేందుకు సమాయత్తమవుతున్నాయి. ఏఐఎస్ఎఫ్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఫ్యాక్టరీని తరలిస్తే ఊరుకోం : భూమన వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే మన్నవరం భెల్ ఫ్యాక్టరీని ఇతర రాష్ట్రాలకు తరలిస్తే సహించేది లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి హెచ్చరించారు. కర్మాగారం పనులు పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైతే వైఎస్ రాజశేఖర్రెడ్డికి ఎనలేని కీర్తి, ప్రజాభిమానం లభిస్తుందన్న భయంతోనే టీడీపీ సర్కారు కేంద్రంతో కలిసి కుయుక్తులు పన్ని పరిశ్రమను తరలించేందుకు యోచన చేస్తుందని ధ్వజమెత్తారు. కొత్త పరిశ్రమల స్థాపనతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని నిత్యం చెప్పే చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో భారీ పరిశ్రమ తరలిపోతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటారని భూమన ప్రశ్నించారు. -
కింది కోర్టు శిక్షను తగ్గించిన జిల్లా కోర్టు
నరసరావుపేట టౌన్: కిందికోర్టు ఖరారు చేసిన శిక్షను జరిమానాగా సవరిస్తూ 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.జయకుమార్ మంగళవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2007 ఆగస్టు 13వ తేదీన గుంటూరు రోడ్డులోని బాపూజీ లెబరేటరీపై ఔషధ నియంత్రణశాఖ అధికారులు దాడులు నిర్వహించి అనుమతులు లేకుండా ఔషధాలు విక్రయిస్తుండటాన్ని గుర్తించారు. సంబంధిత దుకాణ యజమాని షేక్ ఖాదర్మస్తాన్పై కేసు నమోదుచేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడిపై నేరం రుజువుకావటంతో మూడేళ్ల జైలు, రూ.55 వేలు జరిమానా విధిస్తూ 2013 ఫిబ్రవరి 19వ తేదీన తీర్పు చెప్పారు. ఈ తీర్పుపై నిందితుడు జిల్లా కోర్టుకు అప్పీలు చేసుకోగా, వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి రూ.1.30 లక్షల జరిమానా విధించి శిక్షను రద్దు చేశారు. -
గ్రూప్-1 పరీక్ష కేంద్రాల మార్పు
హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్కు సంబంధించి కొన్ని పరీక్ష కేంద్రాల్లో మార్పులు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్గగొండ జిల్లా చౌటుప్పల్లోని అశోకా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (కోడ్ 80102), రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ (80103), నాదర్గుల్లోని ఏఎల్ఆర్ఆర్ జూనియర్ కాలేజీ (80109), ఇబ్రహీంపట్నంలోని ఎంఆర్ఎం గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ (80110)లలో ఇప్పటివరకు పరీక్ష రాసిన అభ్యర్ధులు ఇకపై సాగర్రోడ్డులో ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ సమీపంలోని చింతపల్లిగుడ వద్దగల అరబిందో కాలేజీ ఆఫ్ మేనేజ్మెంట్ (కోడ్ 80106) లో తదుపరి పరీక్షలకు హాజరు కావలసి ఉంటుంది. పటాన్చెరులోని ఆర్ఆర్ఎస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (80104)లో పరీక్ష రాస్తున్న అభ్యర్ధులు పటాన్చెరు మండలం ఇంద్రశాం దగ్గరి ఆర్టీఓ ఆఫీసు సమీపంలోని టర్బోమెషినరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కోడ్ 80101) పరీక్ష కేంద్రంలో తదుపరి పరీక్షలకు హాజరుకావలసి ఉంటుంది. -
తక్షణమే ఏటీఎం పిన్ మార్చుకోండి!
ముంబై: బ్యాంకు ఏటీఎం కార్డు పిన్, ఆన్ లైన్ లావాదేవీల పాస్ వర్డ్ లు మార్చుకోవాల్సిందిగా బ్యాంకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా హెచ్ డీఎఫ్ సీ, ఫెడరల్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంకు అధికారులు తమ ఖాతాదారులను ఎస్ ఎంఎస్ ల ద్వారా అలర్డ్ చేస్తున్నారు. కేరళ, ఢిల్లీ, చండీఘడ్ రాష్ట్రాల్లో వెలుగు చూసిన స్కాం నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల ఇక్కడ ఏటీఎం కార్డు దారుల లక్షల రూపాయలు మాయమైన కేసులు నమోదు కావడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఏటీఎం మోసాలు పెరుగుతున్నాయంటూ ఖాతాదారులకు సేఫ్ బ్యాంకింగ్ పై అవగాహన కల్పిస్తున్నారు. గార్డు లేని, జనావాసాలు లేని ప్రాంతాలలోని ఏటీఎం లావాదేవీలను నివారించాలని బ్యాంకులు కోరాయి. కాగా కేరళలో గత నెలలో రోమేనియన్ వ్యక్తి ఏటీఎం కేంద్రంలో స్కిమ్మింగ్ పరికరాన్ని అమర్చుతూ అరెస్టయిన సంగతి తెలిసిందే. -
ఆర్థిక సంవత్సరం మార్పుపై సలహాలకు ఆహ్వానం
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలోని పలు కంపెనీలు ప్రస్తుతం తమ ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1-మార్చి 31గా పాటిస్తున్నాయి. అయితే బడ్జెటరీ ప్రక్రియ మెరుగుకు, తగిన నగదు నిర్వహణకు ఈ కాలం మార్పు అవసరమని పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా సంబంధిత వర్గాల నుంచి సలహాలనూ, సూచనలను ఆహ్వానించింది. ఇందుకు సెప్టెంబర్ 30 వరకూ గడువు పెట్టింది. ఇప్పటికే ఈ అంశంపై మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు శంకర అచార్య నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ డిసెంబర్ చివరినాటికి తన నివేదికను సమర్పించే వీలుంది. 1985లో ఎల్కే ఝా కమిటీ ఈ అంశంపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ ప్రభుత్వాలు ఆర్థిక సంవత్సరాన్ని పాటించాలని ఈ కమిటీ చేసిన సిఫారసును అప్పటి ప్రభుత్వం అంగీకరించలేదు. -
పట్టాల మార్పుపై పీడీ విచారణ
నూకపల్లి హౌసింగ్బోర్డుకాలనీలో అక్రమాలు అధికారుల విచారణలో వెలుగుచూస్తున్న నిజాలు జగిత్యాల రూరల్ : జగిత్యాల పట్టణ ంలోని నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన నూకపల్లి హౌసింగ్బోర్డుకాలనీలోని పట్టాల మార్పుపై విచారణ కొనసాగుతోంది. హౌసింగ్ పీడీ పి.నర్సింహరావు గురువారం కాలనీకి వచ్చి విచారణ చేపట్టారు. హౌసింగ్బోర్డుకాలనీలో 4 వేల గృహాలకు పట్టాలివ్వగా ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం 1,675 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు ఆన్లైన్లో నమోదు చేసినట్లు పీడీ తెలిపారు. వీరు మాత్రమే ఇళ్లు నిర్మించుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. గతంలోని పట్టాలు, ఇటీవల డీఈ పంపిణీ చేసిన పట్టాలు సైతం చెల్లవని ఆయన ప్రకటించారు. హౌసింగ్ ఈఈ శ్రీనివాస్, డీఈ రాజేశ్వర్, ఏఈ రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రొసీడింగ్లు గతంలో హౌసింగ్ డీఈగా పనిచేసిన అధికారి ప్రస్తుతం డెప్యూటేషన్పై హైదరాబాద్లోని జలమండలి శాఖకు బదిలీపై వెళ్లారు. సదరు అధికారి అనధికారికంగా ఇందిరమ్మ గృహాల పట్టాలను పంపిణీ చేస్తూ సుమారు రూ.30 లక్షల మేర వసూలు చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆయనతోపాటు నూకపల్లికి చెందిన ఓ ప్రజాప్రతినిధి తమ్ముడి పాత్ర ఉందని అధికారుల వద్ద సమాచారం ఉంది. -
ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహిస్తాం
ఖమ్మం మార్కెట్ పరిరక్షణ కమిటీ నిర్ణయం నేడు ఖమ్మంలో భారీ ప్రదర్శన.. 2 లక్షల సంతకాల సేకరణ హైకోర్టులో పిటిషన్ వేయనున్న కమిటీ ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తరలింపును అడ్డుకోవడానికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మార్కెట్ పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కెట్ పరిరక్షణ కమిటీ నాయకులు ఉద్యమ పంథాను వెల్లడించారు. శనివారం త్రీటౌన్లోని కార్మిక, వ్యాపార,వాణిజ్య వర్గాలతో పాటు, పరిసర గ్రామాలకు చెందిన రైతులు, త్రీటౌన్కు అనుసంధానంగా ఉన్న నగరంలోని వన్టౌన్ కార్మికులు, వ్యాపారులతో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు త్రీటౌన్లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం నుంచి ప్రదర్శన ప్రారంభమై గాంధీచౌక్లోని గాంధీ విగ్రహానికి, అక్కడ నుంచి కాల్వొడ్డు మీదుగా బస్ స్టాండ్, వైరా రోడ్ గుండా జెడ్పీసెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వ్యాపారులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. అనంతరం 2 లక్షల సంతకాలను సేకరించి ప్రభుత్వానికి అందించాలని తీర్మానం చేశారు. 2013లోనే మార్కెట్ను తరలించడానికి జీఓ విడుదలైందని దానిని ప్రస్తుతం రద్దు చేసినా.. మార్కెట్ తరలింపు అంశం తిరిగి తెరపైకి రావటంతో మళ్లీ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నట్లు వివరించారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. మార్కెట్ పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షుడు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మార్కెట్పై ఆధారపడి నివసించే ప్రజల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మార్కెట్పై ఆధారపడి జీవించే ప్రజలను, కార్మికులను, వ్యాపారులను, రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. సమావేశంలో మార్కెట్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ సన్నే ఉదయ్ప్రతాప్, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణారావు, పరిరక్షణ కమిటీ కోకన్వీనర్లు ఎర్రా శ్రీకాంత్, కల్వకుంట్ల గోపాల్ రావు, ఎర్రా శ్రీను పాల్గొన్నారు. -
రాజమహేంద్రవరంగా పేరు మార్చండి
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : రాజమహేంద్రవరం పేరును ఇంకా చాలా ప్రాంతాల్లో, చాలామంది రాజమండ్రిగానే వినియోగిస్తున్నారని రాజమహేంద్రవరం ఇన్చార్జి ఆర్డీఓ శ్రీరామచంద్రమూర్తి అన్నారు. వెంటనే ఆ పేరు మార్చాలని సూచించారు. నగరంలోని సినిమా థియేటర్లు, హోటళ్లు, చాంబర్ ఆఫ్ కామర్స్ తదితర సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులతో మంగళవారం ఆయన సబ్కలెక్టర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజమండ్రికి బదులుగా రాజమహేంద్రవరం అని వాడుకలోకి తీసుకురావాలని సూచించారు. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర సంస్థలన్నీ తమ బోర్డులు, తదితర విషయాల్లో రాజమహేంద్రవరం అనే రాయాలన్నారు. -
సర్టిఫికెట్ల పరిశీలన తేదీ మార్పు
బుక్కపట్నం : 2016 ఎల్పీ సెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తేదీలో ప్రభుత్వం మార్పు చేసిందని డైట్ ప్రిన్సిపాల్ జనార్దన్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థలో ఈనెల 26,27 తేదీల్లో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. అభ్యర్థులు ప్రొవిజనల్ అలాంట్మెంట్లోని ఒరిజి నల్, జిరాక్స్ సర్టిఫికెట్లు తీసుకురావాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. వచ్చే నెల 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. -
పనితీరులో మార్పురావాలి
రెవెన్యూశాఖ అధికారులపై సీసీఎల్ఏ కమిషనర్ రేమండ్ పీటర్ ఆగ్రహం మహబూబ్నగర్ న్యూటౌన్: రాష్ట్రంలో మహబూబ్నగర్ రెవెన్యూ శాఖ పనితీరు పూర్తిగా అధ్వానంగా ఉందని, ఎన్నిసార్లు చెప్పినా పనితీరులో మార్పు రావడం లేదని, ఇక లాభం లేదని, తేదీలు ఖరారు చేసి తానే స్వయంగా తహసీల్దార్లతో సమీక్షిస్తానని భూపరిపాలన శాఖ కమిషనర్ రేమండ్ పీటర్ అసహనం, అసంతప్తి వ్యక్తంచేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియాకాన్ఫరెన్స్లో జిల్లా అధికారులతో సమీక్షించారు. రెక్టిఫికేషన్ మాడ్యూల్లో 7528 దరఖాస్తులకు మాత్రమే పరిష్కరించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విషయంపై ప్రతిసారి చర్చిస్తున్నా పట్టించుకోవడం లేదని, తానే మండలాలకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ వెబ్ల్యాండ్ సమస్య ఉందని జేసీ చెప్పడంపై.. ఎక్కడా లేని సమస్య మీకే వస్తుందా? అని ప్రశ్నించారు. రుణఅర్హత కార్డుల దరఖాస్తులను వ్యవసాయశాఖ అధికారుల సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. త్వరలో వ్యవసాయ శాఖ వెబ్సైట్ను వెబ్ల్యాండ్తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఇకనుంచి పంటరుణాలను వెబ్ల్యాండ్ ద్వారా సరిచూసుకుని ఇచ్చే విధంగా డీఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లకు సూచించాలని కోరారు. గ్రామాల్లో అవసరానికి మించి వీఆర్వోలను ఎందుకు ఉంచారని సీసీఎల్ కమిషనర్ రేమండ్ పీటర్ అధికారులపై మండిపడ్డారు. జిల్లాలో నందిగామ, మహబూబ్నగర్, ఆమనగల్లు, గద్వాల, పెబ్బేరు, కోస్గిలో అవసరానికి మించి ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. జిల్లాలో 30 శాతం వీఆర్వోల ఖాళీలు చూపిస్తూ అనవసరమైన చోట ఎక్కుమంది వీఆర్వోలను కేటాయించడంపై అసంతప్తి వ్యక్తంచేశారు. మాడ్గుల మండలం ఇర్విన్లో ఇద్దరు వీఆర్వోలు ఏం అవసరం ఉందని, వెంటనే ఒకరిని బదిలీచేయాలని సూచించారు. అదేవిధంగా గద్వాలలో ఇద్దరిని ఉంచి మిగతా ఇద్దరిని ఇతర గ్రామాలకు కేటాయించాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎం.రాంకిషన్, డీఆర్వో భాస్కర్, సర్వే ల్యాండ్ ఏడీ శ్యాంసుందర్రెడ్డి, తహసీల్దార్ సువర్ణరాజు, మీసేవా సూపరింటెండెంట్ బక్క శ్రీనివాసులు పాల్గొన్నారు. -
బాధ్యత... భరోసా
సామాజిక సేవలో పోలీసులు జనమైత్రి ద్వారా జనంతో మమేకం జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చెన్నూర్ : ఖాకీ చొక్కా తొడిగి ధర్మాన్ని కాపాడుతారు. లాఠీ పట్టి నేరస్తుల బెండు తీస్తారు. తలపై ధరించిన టోపీలోని సింహాల్లా సమాజంలోని మానవ మృగాల బారి నుంచి సామాన్యులను రక్షిస్తారు. 24 గంటలు 7 రోజులు 365 రోజులు శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమవుతారు. సమాజాన్ని డేగ కన్నులతో పహారా కాస్తారు. పీ ఫర్ పోలీస్... పోలీస్ ఫర్ పబ్లిక్.. జనంతో మమేకమవుతున్న పోలీసులపై ఈ కథనం. ప్రజల సేవలో మేము సైతం అంటూ ‘జనమైత్రి’ పోలీసులు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నిన్న మొన్నటి వరకు పోలీసులు మీకోసం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. పోలీసులు మీలో ఒకరేననే కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. పోలీసులు శాంతి భద్రతలతో పాటు సామాజిక సేవకులని చాటి చెప్పేందుకు నేడు జనమైత్రి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామానికో జనమైత్రి పోలీసు అధికారిని నియమించారు. ఆయా గ్రామాల్లో జనమైత్రి గ్రామసభలు నిర్వహించి ప్రజలను అన్ని రకాలుగా చైతన్యం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి దిశగా పయనించాలని ప్రజలకు మార్గ నిర్దేశం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం సత్వరమే గ్రామాలలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలు జనమైత్రి పోలీసు అధికారి దృష్టికి తీసుకొని వస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. గ్రామ అభివద్ధికి ఆయా పంచాయతీల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నప్పటికీ ఇతర అభివృద్ధి పనుల్లో జనమైత్రి పోలీసు అధికారులు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. యువతకు ప్రోత్సాహం గ్రామాలలోని నిరుద్యోగ యువతపై జనమైత్రి పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అన్ని ఉండి అవకాశాలు లేక నిరుత్సాహంలో ఉన్న యువతను ప్రోత్సహిస్తున్నారు. వారి లోని ప్రతిభను వెలికితీసేందుకు పలు పోటీలను నిర్వహిస్తున్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని గ్రామస్తులను కోరుతున్నారు. గుడుంబా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గ్రామాల్లో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారు. -
రెండు జిల్లాల్లో ‘ఎస్సై’ పరీక్షా కేంద్రాల మార్పు
సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) దేహదారుఢ్య పరీక్షలకు రెండు జిల్లాల్లో కేంద్రాల వేదికలను మార్చినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (పీఆర్బీ) చైర్మన్ జె.పూర్ణచందర్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27 నుంచి జరగనున్న దేహదారుఢ్య పరీక్షలకు వరంగల్, నల్లగొండ జిల్లాల్లో వేదికలను పీఆర్బీ మార్చింది. వరంగల్లో పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి మార్చారు. అలాగే నల్లగొండ జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియానికి వేదికను మార్చినట్లు తెలిసింది. -
జీవితంపై విరక్తి పుట్టి మేకగా మారాడు
పాశ్చాత్య జీవితం పట్ల విరక్తి చెందిన ఓ వ్యక్తి వలస వెళ్లి మరీ మేకలాగా జీవితం గడుపుతున్నాడు. లండన్ లో విలాసవంతమైన జీవితంలో ఏం తక్కువయ్యిందో ఏమో 35 ఏళ్ల థామస్ థ్వైటెస్ తన మిగతా జీవితాన్ని స్విట్జర్లాండ్ లో విభిన్నంగా గడపాలనుకున్నాడు. అందుకు ఒక జీవనశైలిని కూడా ఎంచుకున్నాడు. అదేంటని అనుకుంటున్నారా..! మేకలాగా జీవనం సాగించడం. నాలుగు కాళ్లతో నడుస్తూ.. పర్వతాలపై తిరుగుతూ తమ ఆహారాన్ని వెతుక్కునే ఈ జీవుల్లా బతకాలని నిర్ణయించుకున్నాడు. అంతే తన కాళ్లు, చేతులకు సరిపడే విధంగా(పర్వతాలపై నడవడానికి వీలుగా) నాలుగు కాళ్లను, గడ్డి తినడానికి కృత్రిమ పొట్టను తయారు చేయించుకున్నాడు. అక్కడి మేకలతో పాటు తిరుగుతూ గడ్డి మేస్తూ హాయిగా జీవనం గడుపుతున్నాడు. ఇప్పటికి ఏడాదిగా ఇలా జీవనాన్ని కొనసాగిస్తున్న థామస్ ను గొర్రెల కాపరులు తమ మందలతో పాటు తిప్పి తీసుకువచ్చేందుకు ఒప్పుకున్నారు. ప్రత్యేకంగా మేక సైకాలజీలో గ్రాంట్స్ యూనివర్సిటీలో థామస్ పట్టా కూడా పొందాడు. తనతో పాటు తిరిగి గడ్డిని మేసే మేకలకు అనుమానం రాకుండా ఉండటానికి, తిన్న గడ్డిని కృత్రిమ పొట్టలోకి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. ఏడాదిగా మేక జీవితం గడుపుతున్న మీరు ఏం తెలుసుకున్నారు? అని థామస్ ను ప్రశ్నించగా మేకలు కష్టమైన జీవితాన్ని గడుపుతాయని, వాటి సంరక్షణ కోసం పోరాడుతాయని తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు. మనుషుల కంటే మేకలు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాయని స్విట్జర్లాండ్ వచ్చాక తాను అటువంటి జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని వివరించాడు. -
త్వరలో ఇంటికో జెట్ విమానం!
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది... అనుకునే వారికి శుభవార్త! ప్రతి ఇంటికీ బైక్, కారు మామూలైపోయిన ఈ రోజుల్లో ప్రతి ఇంటికీ జెట్ విమానం అన్న నినాదంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఏఎస్) అడుగులు వేస్తోంది. ట్రాఫిక్ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవినియోగదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించేందుకు త్వరలోనే మొట్టమొదటి వ్యక్తిగత జెట్ విమానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంట్లో కారును వాడినట్లుగానే ఈ కొత్త జెట్ ఫ్లైట్ ను వాడుకునేందుకు వీలుగా దీన్ని వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ పద్ధతిలో రూపొందిస్తోంది. నలుగురు మ్యూనిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయ ఇంజనీర్లు, డాక్టోరల్ విద్యార్థులు స్థాపించిన లిల్లుమ్ ఏవియేషన్ సంస్థ, వ్యక్తిగత వాహనాల మాదిరిగానే, వ్యక్తిగత విహంగాలను అభివృద్ధి చేస్తోంది. జర్మనీ ఆధారిత ఇంజనీర్లు ఈ వీటీవోఎల్ జెట్ విమానాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇంక్యుబేషన్ సెంటర్లో డిజైన్ చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ గా ఉండి, తక్కువ శబ్దంతోనూ, హెలికాప్టర్లకన్నా సులభంగా ఎగిరే కొత్త తరహా జెట్ విమానాలను 2018 నాటికి అందుబాటులోకి తేనున్నారు. ఈ నూతన ఆవిష్కరణలో విమానాలను... హెలికాప్టర్ల మాదిరిగానే భూమినుంచి నిలువుగా టేకాఫ్ అవ్వడంతో పాటు, నిలువుగా ల్యాండింగ్ అయ్యే వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (వీటివోఎల్) విధానంతో రూపొందిస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రోడ్లపై ట్రాఫిక్ సమస్యను కొంత అధిగమించే అవకాశం కనిపిస్తోంది. అయితే కార్లు, టూ వీలర్స్ అయితే ఇంట్లోని సెల్లార్, లేదా పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేస్తాం. కానీ ఈ జెట్ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కేవలం ఓ చిన్నగది సైజు స్థలం ఉంటే సరిపోతుంది. వీటివోఎల్ జెట్ ఎగిరేందుకు దీనిలో ఎలక్ట్రిక్ మోటార్లను వినియోగిస్తున్నారు. దీంతో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో 500 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించవచ్చు. అయితే దీనికి ధర వివరాలను మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు. లిల్లుమ్ ఏవియేషన్ ఈ జెట్ విమానాన్ని ప్రజలకు సరసమైన ధరకు అందుబాటులోకి తెస్తే ఇక భవిష్యత్తులో వ్యక్తిగత ప్రయాణ విధానమే మారిపోయే అవకాశం కనిపిస్తోంది. -
‘అంగన్వాడీ’ వేళల్లో మార్పు
ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకే ప్రొద్దుటూరు : మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల పని వేళలను మార్పు చేసింది. ఈ ప్రకారం నేటి నుంచి అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు పని చేయాలని ఆదే శాలు జారీ అయ్యాయి. జూన్ 12వ తేది వరకు ఈ విధానాన్ని అమలు చేస్తారు. జిల్లాలో మొత్తం 15 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో వేలాది మంది చిన్నారులు, గర్భవతులు, బాలింతలు ప్రతి రోజు పౌష్టికాహారం తీసుకుంటున్నారు. ప్రొద్దుటూరు రూరల్, ముద్దనూరు, పులివెందుల, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, బద్వేలు, పోరుమామిళ్ల ప్రాజెక్టుల పరిధిలో అన్న అమృత హస్తం పథకం అమలవుతోంది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి. కొద్ది రోజులుగా వాతావరణంలో పూర్తి మార్పు కనిపిస్తోంది. పలు చోట్ల 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో చిన్నారులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో పని వేళలను మార్పు చేశారు. ఉదయం 11 గంటల లోపే లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. అయితే అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు మాత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉండాలని సూచించడంపై నిరసన వ్యక్తమవుతోంది. మే 1 నుంచి 15వ తేది వరకు కార్యకర్తలకు, 16 నుంచి 31 వరకు ఆయాలకు సెలవులు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా ప్రాజెక్టు డైరక్టర్ రాఘవరావు ఆయా ప్రాజెక్టుల సీడీపీఓలకు పని వేళల మార్పుపై సమాచారం అందించారు. -
ఉపాధికి ‘ఉపశమనం’
♦ వేసవి నేపథ్యంలో పనివేళల్లో మార్పు ♦ ఎండ తీవ్రత పెరగకముందే పనులు పూర్తి ♦ సాయంకాలమూ పని చేసుకునే వెసులుబాటు ♦ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో మార్పులు ♦ కొత్త పనివేళలు నేటినుంచి అమల్లోకి.. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధిహామీ కూలీలకు శుభవార్త. వేసవి తాపంతో అల్లాడిపోతున్న కూలీలకు ఉపాధి పనివేళలు మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్నారు. తాజాగా ఎండలు మండిపోతుండడం కూలీల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం ఈ వైఖరిని తీవ్రంగా పరిగణించి పనివేళలు మార్చాలని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పనివేళల మార్పు నిర్ణయాన్ని తీసుకుంది. బుధవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి 10.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3.30 గంటల నుంచి 6గంటల వరకు ఉపాధి పనులు చేపట్టాల్సిందిగా జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్లను ఆదేశించింది. క్షేత్రస్థాయి అధికారులకు ఎస్ఎంఎస్లు.. జిల్లాలో 33 గ్రామీణ మండలాలకు గాను 25 మండలాల్లో ఉపాధి హామీ పథకం అమలవుతోంది. ఈ మండలాల్లో 2,89,885 జాబ్ కార్డులు జారీ చేయగా.. ప్రస్తుతం రోజుకు సగటున 62 వేల మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారు. జనవరి నెలలో రోజుకు లక్ష మంది హాజరుకాగా.. తాజాగా ఎండల తీవ్రత పెరగడంతో కూలీల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పనుల వేళలను ప్రభుత్వం మార్చింది. బుధవారం నుంచి కొత్త పనివేళలను అమలు చేయాలంటూ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ క్షేత్రస్థాయి అధికారుల మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సమాచారాన్ని అందజేశారు. ఉదయం వేడి తీవ్రత తక్కువగా ఉండడంతో కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అయితే సాయంత్రం వేళలో కూలీల హాజరు తగ్గుతుందని డ్వామా అధికారులు చెబుతున్నారు. బకాయిల భారంతోనూ.. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రెండు నెలలుగా కూలీ డబ్బుల చెల్లింపులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ నిధులను సర్దుబాటు చేయలేదు. ఫలితంగా రెండు నెలలుగా కూలీలకు డబ్బుల పంపిణీ స్తంభించింది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 2.8 లక్షల మంది కూలీలకు రూ.32 కోట్లు చెల్లించాల్సి ఉంది. కూలీ డబ్బులు చెల్లించని కారణంగా ఉపాధి పనులకు కూలీల హాజరు తగ్గుతోంది. మంగళవారం గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. పలువురు పీడీలు ఈ అంశాన్నే ప్రస్తావించారు. దీంతో ఉన్నతాధికారులు స్పందిస్తూ రెండ్రోజుల్లో నిధులు విడుదలవుతాయని.. కూలీలకు వెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
ఆ మొక్కలు నాటితే నష్టమే..
అడవులు నరికేయడం సులభమే... కానీ పెంచడం అంత తేలిక కాదు అంటున్నారు యూరోపియన్లు. ఎందుకంటే వారు చేపట్టిన అడవుల పెంపకంవల్ల లాభం కన్నా నష్టాలే ఎదురైనట్లు కనుగొన్నారు. ఫ్రాన్స్ అల్సాస్ ప్రాంత అడవుల్లో పాతిన మొక్కలవల్ల తీవ్ర వాతావరణ మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుసుకున్నారు. రీ ఫారెస్టేషన్ తో మరింత భూ తాపం పెరిగినట్లు పరిశీలకులు చెప్తున్నారు. పర్యావరణంలో మార్పులు సంభవించడానికి అడవులు నరికేయడమే ప్రధాన కారణం అని ఇప్పటిదాకా మనకు తెలుసు. చెట్లు కార్పన్ ను పీల్చుకొని... ప్రాణవాయువును అందిస్తాయని... వాతావరణాన్ని, భూ తాపాన్ని సమతుల్యంగా ఉంచుతాయని తెలుసు. అందుకే చెట్లు నాటడం మంచిదని చెప్తారు. చెట్ల పెంపకం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు కూడ చేపడతాయి. అయితే అడవుల నిర్వహణ అంత సులభం కాదని ఇటీవల వెల్లడైన పరిశోధనలు చెప్తున్నాయి. అడవుల పెంపకంతో ఎన్నో తలనొప్పులు కూడ ఎదురౌతున్నట్లు అధ్యయనకారులు అంటున్నారు. వాతావరణానికి అనుకూలంగా ఉండే చెట్లు నాటకపోవడం, చెట్ల ఎంపికలో సమస్యల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని, భూతాపం మరింత పెరిగిపోయిందని తెలుసుకున్నారు. యూరప్ లో అంతరించి పోతున్న అడవుల స్థానంలో తిరిగి పెంపకాన్ని చేపట్టి...2010 నాటికి 85 శాతం పూర్తి చేశారు. అయితే 250 ఏళ్ళలో ఎక్కువగా వాణిజ్యపరంగా విలువైన, త్వరగా పెరిగే, ప్రాణులకు అనువుగా ఉండే మొక్కలపైనే.. నిర్వహణాధికారులు దృష్టి పెట్టినట్లు చరిత్రను పరిశీలించిన అధ్యయన కారులు తెలుసుకున్నారు. ముఖ్యంగా అడవుల పెంపకంలో వాడిన మూడు జాతుల్లో ఓ జాతి మొక్కలకు ఎక్కువ స్థానం కల్పించారని, వాటిని సుమారు 4 లక్షల చదరపు మైళ్ళలో నాటారని చెప్తున్నారు. కోనిఫర్ జాతికి చెందిన ఆ చెట్లు... అడవుల్లో లేతరంగు ఆకులున్న చెట్లుకన్నా ఎక్కువగా ఉండటమే కాక, చెట్లకు ఆకులకన్నా సూదుల్లాంటి ముళ్ళు కలిగి ఉన్నాయని....అవి సూర్య కాంతిని ఆకర్షించడంకంటే... వికిరణానికి తోడ్పడుతున్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఈ అడవులున్న ప్రాంతంలో తీవ్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, భూ తాపాన్ని తగ్గించే బదులు, పెరగడానికి కారణమౌతోందని ఓ సైన్స్ జర్నల్ లో పేర్కొన్నారు. మొక్కలు నాటడం ముఖ్యం కాదని, నాటే మొక్కలు పనికొచ్చేవా... కావా అన్నది తెలుసుకోవడం అవసరమని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. -
నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి
-
జనతా గ్యారేజ్కు రిపేర్
-
అమరావతి నిర్మాణంలో పచ్చ తమ్ముళ్ళ ఇష్టారాజ్యం
-
రోల్ మోడల్ గా 'ట్వంటీ 20'..!
క్రికెట్ లో ఎంతో గుర్తింపు పొందిన ట్వంటీ 20 పేరు... ఇప్పుడు కేరళ పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించింది. గ్రామంలో సమూల మార్పుల కోసం కృషి చేసేందుకు స్థానిక వస్త్ర పరిశ్రమ సభ్యులు.. ట్వంటీ20 పేరున ఎన్నికల్లో నిలిచి.. అత్యధిక మెజార్జీతో గెలిచి.. నూతన అంకానికి తెరతీశారు. ఉత్పాదక రంగంనుంచీ రాజకీయ రంగంలో ప్రవేశించారు. గతంలోని సాంప్రదాయ వస్త్రధారణను సైతం తోసిరాజని హైటెక్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. స్థానిక రాజకీయాలు తమ సంస్థ అభివృద్ధికి అడ్డుపడుతుండటంతో.. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని ఉద్యోగులే సంచలన నిర్ణయం తీసుకొని ఏళ్ళ చరిత్రను తిరగరాశారు. కేరళ ఎర్నాకుళం జిల్లాలోని కిజక్కంబాలమ్ పంచాయితీ ఎన్నికల్లో కోచీ ఆధారిత వస్త్ర తయారీదారీ సంస్థ కైటెక్స్ గ్రూప్ విజయపతాకం ఎగురవేసింది. గ్రామాభివృద్ధే ధ్యేయంగా శాశ్వత ఉద్యోగులు రాజకీయాల్లో అడుగుపెట్టారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉన్నపుడు... పంచాయితీ అభివృద్ధికోసం కైటెక్స్ చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ ను అడ్డుకుంది. సెక్షన్ 144 కింద నేషేధాజ్ఞలు విధించి ట్రేడ్ ఫెయిర్ ను బలవంతంగా మూసివేయించింది. ఇటువంటి అనేక కారణాలతోనే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడాల్సి వచ్చిందని మాజీ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, కైటెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ జాకబ్ చెప్తున్నారు. లేదంటే తమకు రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశ్యమే లేదని, సామాజిక బాధ్యతగానే గ్రామాభివృద్ధిని కాంక్షిస్తున్నామని సాబు జాకబ్ అంటున్నారు. ట్వంటీ20 అభివృద్ధి మంత్రం ఓటర్లపై భారీ ప్రభావం చూపడంతో మొత్తం పంచాయితీలోని 19 వార్డుల్లో 17 వార్డుల్లో విజయ పథంలో దూసుకుపోయారు. ఈసారి ఓనమ్ పండుగకు ప్రత్యేక ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తామని, ప్రజలకు వస్తువులను సగం ధరకే అందిస్తామని చెప్తున్నారు. 1968 నుంచి కైటెక్స్ పరిశ్రమ ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పనిచేస్తుండగా... ఎల్డీఎఫ్ అధికారంలోని చేదు అనుభవాలే తమను పోటీకి నిలబడేలా చేశాయని జాకబ్ చెప్తున్నారు. యూడీఎఫ్, ఎల్డీఎఫ్ ఆధ్వర్యంలో స్థానికంగా ఎటువంటి అభివృద్ధీ జరగకపోవడంతోనే స్థానికులు తమను గెలిపించారని, ట్వంటీ20 సభ్యుడు, కంపెనీ చిత్రకారుడు శిబు కుమరన్ చెప్తున్నారు. ట్వంటీ20 అధికారంలోకి రాకముందే.. సామాజిక సేవలో భాగంగా సగం ధరకు నిత్యావసర వస్తువులు అదించిందని, నాలుగు వందల ఇళ్ళు, ఐదు వందల టాయిలెట్లు కూడ నిర్మించి ఇచ్చిందని చెప్తున్నారు. దీనికి తోడు రోడ్లు రిపేర్లు చేయించడం, పేదలకు వైద్యం అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంతోనే తమకు స్థానికులు పట్టం కట్టారని చెప్తున్నారు. ముఖ్యంగా గ్రామాన్ని వ్యవసాయంతోపాటు అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని, ఇప్పటికే ట్వంటీ20 అభివృద్ధి పనులకోసం 36 కోట్ల రూపాయలను వెచ్చించడంతోపాటు... వచ్చే ఐదేళ్ళలో మొత్తం 350 కోట్ల రూపాయలను వెచ్చించేందుకు ప్లాన్ చేస్తోందన్నారు. కైటెక్స్ గ్రూప్, ఇతర కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా నిధులు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని, అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులను వినియోగిస్తామని జాకబ్ చెప్తున్నారు. నిధులను సక్రమంగా వినియోగించడానికి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవారిని ప్రత్యేకంగా టీమ్ లో ఉంచామని చెప్తున్నారు. ఎన్నికైన పంచాయితీ అధికారులకు నెలసరి వేతనం 3,500 రూపాయలు మాత్రమే ఉందని, గ్రామీణ ఉపాధిహామీ పథకంలో కార్మికులకు చెల్లించే వేతనాల కంటే అధికారులకు అన్యాయంగా ఉండటంతో వారి వేతనం 15 వేలకు పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇది అధికారులు అవినీతికి పాల్పడకుండా ఉండేందుకు తోడ్పడుతుందని ఆశిస్తున్నారు. పంచాయితీ అధికారులు ఫంక్షన్లకు, ప్రారంభోత్సవాలకు అనవసరంగా సమయం వృధా చేయకుండా..పంచాయితీ కార్యాలయంలో కొంత సమయాన్ని కేటాయించి... అభివృద్ధికోసం పాటుపడాలని ట్వంటీ20 సభ్యులకు నిబంధనలను విధించారు. వారికి సహకరించేందుకు సామాజిక కార్యకర్తలను కూడ ఏర్పాటు చేశారు. కిజక్కంబాలమ్ పంచాయితీ చేపట్టిన ప్రత్యేకాభివృద్ధి పై రాష్ట్రంలోని పంచాయితీలన్నీ దృష్టి సారిస్తున్నాయి. ఈ గ్రామాన్ని రోల్ మోడల్ గా తీసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అంతేకాక యూఎస్ ఆధారిత వ్యాపార సంస్థలు సైతం... కేరళలోని పది పంచాయితీలను దత్తత తీసుకొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. అయితే డబ్బు, ప్రతిభ ఉన్నంత మాత్రాన అభివృద్ధి సాధ్యం కాదని, ప్రజల అంకిత భావంకూడ ఎంతో అవసరమని జాకబ్ చెప్తున్నారు. -
మా ఆయన మారాలని ఎప్పుడూ కోరుకోలేదు
న్యూఢిల్లీ: తన జీవితంలో వివాహం ఎలాంటి మార్పులు తేలేదని బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ చెబుతోంది. వైవాహిక జీవితంలో తామిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నామని, తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా చాలా హ్యాపీగా ఉన్నామని తెలిపింది. సైఫ్ అలీఖాన్తో పెళ్లి అనంతరం.. మీ జీవితంలో ఏవైనా మార్పులు వచ్చాయా అని మీడియా ప్రశ్నించినపుడు ఈ బాలీవుడ్ బ్యూటీ ఇలా స్పందించింది. పెళ్ళి చేసుకొని మూడేళ్ళు అవుతున్నా తమ మధ్య చిన్నపాటి సమస్య కూడా తలెత్తలేదని పెళ్లికి ముందు తన భర్త, సైఫ్ ఎలా వున్నాడో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉన్నాడని చెప్పింది. తన వ్యక్తిత్వాన్ని, ఇష్టాలను మార్చుకోమని ఎపుడూ కోరలేదని, భవిష్యత్తులో కూడా అలా కోరనని కరీనా తెలిపింది. హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ సందర్భంగా కరీనా కపూర్ ఖాన్.. . మీడియాతో తన మనసులోని భావాలను ఇలా వ్యక్తం చేసింది. 'మా ఆయన మారాలని నేను ఎపుడూ కోరుకోలేదు...కోరను కూడా.. నేను తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి నా జీవితంలో మార్పులు తేవాలని అనుకోలేదు. నేను కూడా పెళ్లికి ముందు ఎలా వున్నానో ఇపుడూ అలాగే ఉన్నాను.. ఉంటాను కూడా... అంటూ వైవాహితక జీవితం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భర్తకు ఏ రోజూ ... ఎలాంటి షరతులు పెట్టలేదని, తనని సాధ్యమైనంత వరకు అర్ధం చేసుకోడానికే ప్రయత్నిస్తానని ఈ అమ్మడు పేర్కొంది. ఈ మూడేళ్ళలో సైఫ్ లో ఎలాంటి మార్పులు తను చూడలేదని, పెళ్లికి ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడని పేర్కొంది. భవిష్యత్ లో కూడా ఆ అవసరం రాకుండా చూసుకుంటానంటూ కరీనా వెల్లడించింది . కాగా కపూర్ కుటుంబం నుంచి వచ్చిన కరీనా 2012 లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పెళ్లాడిన విషయం తెలిసిందే. -
పార్లమెంటు తీరు మారదా!
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తీరు గమనించినవారికి ఈ శీతాకాల సమావేశాలపై పెద్దగా నమ్మకాలు లేవు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన రెండు రోజుల ప్రత్యేక సమావేశాల చివరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అలా నిరాశ పడేవారిని ఆలోచింపజేసింది. అందరినీ కలుపుకొనిపోయే రీతిలో ఆయన మాట్లాడటం...ఆ తర్వాత మోదీ నివాసానికి సోనియాగాంధీ, మన్మోహన్సింగ్లు వెళ్లడం శుభసూచకమని అందరూ అనుకున్నారు. కానీ అసహనంపై సోమవారం జరిగిన చర్చల్లో రేగిన దుమారం అలాంటి భరోసానివ్వడం లేదు. లోక్సభ పదే పదే వాయిదా పడిన తీరు...సభ్యుల ఆగ్రహావేశాలు అందరినీ దిగ్భ్రాంతిపరిచాయి. నిజానికి ఈ అంశంపై చర్చను సభ్యులంతా సహనంతో సాగిస్తారని, ఆవేశాలు అసలే వ్యక్తం కావని ఎవరూ అనుకోలేదు. కనీసం ఒకరు చెప్పేది ఒకరు వింటారని, జరిగిన ఉదంతాలపై స్పందించే సందర్భంలో ప్రభుత్వ పక్షం కూడా దూకుడుగా వ్యవహరించదని భావించారు. కానీ సీపీఎం సభ్యుడు మహ్మద్ సలీం చేసిన ఆరోపణ తర్వాత సభ యధాప్రకారం వాయిదాల బాణీలో సాగింది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక అంతర్గత సమావేశంలో చేశారని చెబుతున్న వ్యాఖ్య గురించి ఆంగ్లపత్రికను ఉటంకిస్తూ సలీం చేసిన ప్రసంగంతో ప్రభుత్వ పక్షం ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడమే కాదు, ఆ వ్యాఖ్యను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టడం...అందుకు సలీం నిరాకరించడంలాంటి పరిణామాలతో సభ స్తంభించిపోయింది. మొత్తంగా రోజులో సగభాగం వృథా అయింది. సాధారణంగా సభను స్తంభింపజేసే పాత్రను విపక్షం తీసుకుంటుంది. ప్రభుత్వ కార్యకలాపాలు సాగకుండా అడ్డుకుని దాన్ని దారికి తెచ్చుకోవాలని చూస్తుంది. కానీ ఇవాళ అధికార పక్షమే ఆ పని చేసింది. ఆరోపణలను ఉపసంహరించుకునేవరకూ సభ సాగదని అధికార పక్షం ప్రకటించడం ఈమధ్య కాలంలో ఇదే మొదటిసారి కావొచ్చు. సలీం ఆరోపణలు రాజ్నాథ్ను తీవ్రంగానే కదిలించాయని ఆయన స్పందన చూస్తేనే అర్ధమవుతుంది. రాజ్నాథ్సింగ్ నేపథ్యాన్ని గమనించినా, ఆయన నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకుండే ప్రాముఖ్యాన్ని గ్రహించినా ఆయన స్పందన ఎవరికీ ఆశ్చర్యం కలిగించదు. రాజ్నాథ్కు ఆదినుంచీ సౌమ్యుడన్న పేరుంది. ఏ స్థాయికైనా వెళ్లి దూకుడుగా మాట్లాడే నేతలకు ఆయన భిన్నం. పైగా నరేంద్ర మోదీ సర్కారులో ఆయనది రెండో స్థానం. నిరుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక రాజ్నాథ్సింగ్ కుమారుడి తీరుపై మోదీ ఆగ్రహించి అతన్ని పిలిచి మందలించారని వార్తలొచ్చినప్పుడు కూడా ఆయన కలవరపడ్డారు. ఇందులో ఏ కొంచెం నిజమున్నా రాజకీయ జీవితంనుంచి తప్పుకుంటానని ప్రకటించారు. సలీం ఆరోపణలకు ఆయన మళ్లీ అదే స్థాయిలో స్పందించారు. చివరికది రికార్డుల్లోకి ఎక్కడం లేదని స్పీకర్ ప్రకటించాక సద్దుమణిగినా రోజులో సగభాగం వాయిదాల్లో గడిచిపోయింది. అసహనానికి సంబంధించి విపక్షాల ఆరోపణల్ని తిప్పికొడుతున్న సందర్భంలో బీజేపీ మొదటినుంచీ చేస్తున్న వాదననే మరోసారి చెప్పింది తప్ప అందులో కొత్తదనం లేదు. అవార్డులు వెనక్కి ఇస్తున్నవారికి 1984లో జరిగిన సిక్కుల ఊచకోత, హషీంపురా, ముజఫర్నగర్ మతకల్లోలాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించడం...సాహితీవేత్త కల్బుర్గిని కాల్చిచంపడం, దాద్రీలో ఒక ముస్లిం కుటుంబంపై దాడిచేసి యజమానిని కొట్టి చంపడంవంటి అంశాల్లో దర్యాప్తు జరిపి దోషులను పట్టుకునే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదని వాదించడం బీజేపీకి కొత్తేమీ కాదు. లోక్సభలో ఆ పార్టీ తరఫున మాట్లాడిన మీనాక్షి లేఖి ఆ మాటలే మరోసారి చెప్పారు. అవార్డులు వెనక్కి ఇస్తున్నవారిని ఫలానా సమయంలో ఎందుకివ్వలేదని ప్రశ్నించడం శుద్ధ తర్కమవుతుందేమోగానీ సరైన జవాబు కాదు. ఇదంతా ‘కాంగ్రెస్ను అప్పుడేమీ అనలేదు కాబట్టి మమ్మల్ని కూడా ఇప్పుడు ఏం అనకండి’ అని వాదించినట్టుంది. హత్యల విషయంలో బీజేపీ చేస్తున్న వాదన మరీ ఘోరం. హత్య కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల సంరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనివని ఆ పార్టీ ఎవరికీ చెప్పనవసరం లేదు. ఆ సంగతి అందరికీ తెలుసు. కానీ అలాంటి ఉదంతాల తర్వాత బీజేపీ నేతలు ఇచ్చిన ప్రకటనలు చూసినా, ఆ పార్టీతో సాన్నిహిత్యాన్ని ప్రదర్శించే పరివార్ సంస్థల నేతలు మాట్లాడిన మాటలు విన్నా వాటిని ఏదో మేరకు సమర్థించినట్టే, ఆ మాదిరి శక్తులకు ఊతం ఇచ్చినట్టే కనబడింది. వారలా మాట్లాడుతున్నప్పుడు నరేంద్ర మోదీ లేదా మరో ముఖ్య నాయకుడు జోక్యం చేసుకుని చక్కదిద్ది ఉంటే, ఆ అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదని చెబితే వేరుగా ఉండేది. అలా చెప్పనందువల్లే ఈ విమర్శలన్నీ వచ్చాయని బీజేపీ నేతలు ఇంకా గ్రహించడంలేదని తాజా చర్చ గమనించాక అర్ధమవుతుంది. ఈ విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నయం. రాజ్యాంగంపై రాజ్యసభలో చర్చ జరిగిన సందర్భంలో అసహనం అంశం ప్రస్తావనకొచ్చినప్పుడు అది నరేంద్ర మోదీ అధికారంలోకి రాకముందునుంచీ ఉన్నదని ఆయన అంటూనే... కొందరు నేతలు మాట్లాడిన మాటలు సరిగా లేవని అంగీకరించారు. అలాంటి నాయకులను ఏకాకులను చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. మొన్నటి వర్షాకాల సమావేశాలు ఒక్కనాడైనా సజావుగా సాగకుండా వాయిదా పడ్డాయి. లోక్సభ సమయంలో 48 శాతం, రాజ్యసభ సమయంలో 9 శాతం మాత్రమే సద్వినియోగమైంది. నిజానికి గత అయిదేళ్లుగా పార్లమెంటు తీరు తెన్నులు ఇలాగే ఉన్నాయి. అధికార, విపక్షాలు రెండూ ఈమధ్య కనబరిచిన సుహృద్భావ వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషి చేసి, ఈ స్థితిని మార్చాలి. పార్లమెంటులో జరిగే చర్చలు ప్రజలకు ఒక భరోసానిచ్చేలా, అసహనాన్ని రెచ్చగొట్టే ఉన్మాదులకు హెచ్చరికగా ఉండాలి. అంతేతప్ప ఉన్న వాతావరణాన్ని మరింత దిగజార్చకూడదు. ఆ సంగతిని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. -
ఆ వీడియో చూస్తే చాలు...
కాంక్రీట్ ప్రపంచం.. ఉరుకులు.. పరుగుల జీవితాలు.. తెల్లారింది మొదలు పొద్దుగూకే వరకూ హడావిడి. ప్రతిరోజూ ఒకేలా సాగుతున్న పనితో బోర్ కొట్టేస్తోందా? ఉద్యోగంలోనూ కొత్తదనం కనిపించడం లేదా? వర్క్ మీద ధ్యాస పెట్టలేక పోతున్నారా? అటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే కొత్త విషయాలను తెలుసుకోవడం ఎంతో అవసరం. అందుకు ఒక్కటే మార్గం అని చెప్తున్నారు. ప్రముఖ ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్... బాతుల్ కాప్సీ. ఆయన సృష్టించి యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే చాలట. అందులో మీకు అద్భుతం ఏమీ కనిపించకపోయినా జీవితం పట్ల మీ అవగాహనే పూర్తిగా మారిపోతుందని చెప్తున్నారు. మరి మీరూ ఆ మార్పును కోరుకునేవారైతే ఇంకెందుకాలస్యం... ఆ వీడియో చూసేయ్యండి. -
విశాఖలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
చింతపల్లి(విశాఖపట్నం జిల్లా): విశాఖలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. మరో కాశ్మీర్ను తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం అత్యల్పంగా లంబసింగిలో 7 డిగ్రీలు, చింతపల్లిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లంబసింగిలో ఒక్క రోజే 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోవడం గమనర్హం. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముండవచ్చునని వాతావారణ నిపుణులు పేర్కొంటున్నారు. -
మూడీగా ఉండటం అందుకు మంచిదే!
లండన్: మూడీగా ఉండటంవల్ల కొన్ని దుష్ప్రభావాలు సంభవించవచ్చేమోగానీ, దానివల్ల వ్యక్తిగతంగా సత్వర మార్పు మాత్రం పొందడం ఖాయం అంటున్నారు లండన్కు చెందిన కొందరు ప్రముఖ పరిశోధకులు. మూడీగా ఉన్నవారు జీవితానికి సంబంధించిన సానుకూల అంశాలుగానీ, ప్రతికూల అంశాలుగానీ తొందరగా స్వాగతిస్తారని, వారిలో సత్వర మార్పును తెచ్చుకుంటారని ఎరాన్ ఎల్దార్ అనే యూనివర్సిటీ ఆఫ్ లండన్ కు చెందిన పరిశోధనకారుడు తెలిపారు. 'మూడీనెస్ వ్యక్తిగతంగా సత్వర మార్పులను ఆహ్వానించడానికి అనుకూలంగా ఉంటుంది. దీనిని పాజిటివ్గా తీసుకోవాలనుకున్నా, నెగిటివ్గా తీసుకోవాలనుకున్నా వారి ఇష్టం. అయితే, ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభావవంతంగా ఉండే అవకాశం ఉన్నందున నైపుణ్యాలు పెంచుకోవడం, సామాజిక లక్ష్యాలు పెట్టుకోవడం, హుందాను, హోదాను కోరుకోవడంలాంటి పాజిటివ్ లక్ష్యాలను పెట్టుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. -
మృతదేహన్ని మార్చి ఇచ్చారు
చెన్నై : చెన్నై ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని మార్చి ఇవ్వడంతో కలకలం చెలరేగింది. దీంతో పాతిపెట్టిన శవాన్ని వెలికితీశారు. చెన్నై మేడవాక్కం, రంగనాథపురం, ఏరికరై వీధికి చెందిన రామదాస్. ఇతని కుమారుడు మణికంఠన్ (20). మాదకద్రవ్యాలకు అలవాటుపడిన మణికంఠన్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మణికంఠన్ మృతిచెందాడు. దీంతో మణికంఠన్ మృతదేహాన్ని బంధువులు తీసుకొచ్చి గురువారం సాయంత్రం మేడవాక్కం శ్మశానవాటికలో పాతిపెట్టారు. ఈ క్రమంలో క్షయతో మృతి చెందిన వేలూరు వాసి మనోజ్ మృతదేహాన్ని తీసుకునేందుకు అతని కుటుంబీకులు, బంధువులు చెన్నై జీహెచ్ చేరుకున్నారు. ఆ సమయంలో మణికంఠన్ మృతదేహానికి బదులుగా మనోజ్ మృతదేహాన్ని బంధువులు తీసుకువెళ్లినట్లు తెలిసింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన మనోజ్ బంధువులు ఆస్పత్రి ఉద్యోగులతో తగాదాకు దిగారు. దీనిగురించి ఆస్పత్రి ప్రాంగణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే మేడవాక్కం పోలీసు స్టేషన్కు సమాచారం తెలిపారు. పోలీసులు మణికంఠన్ బంధువులతో శుక్రవారం ఉదయం మేడవాక్కం శ్మశానవాటిక చేరుకున్నారు. అక్కడ పాతిపెట్టిన మనోజ్ మృతదేహాన్ని వెలికితీసేందుకు నిర్ణయించారు. తాంబరం తహవీల్దార్ జయకుమార్ ఆధ్వర్యంలో మనోజ్ మృతదేహాన్ని శుక్రవారం వెలికితీశారు. జీహెచ్ మార్చురీ నుంచి శవాన్ని మార్చి ఇవ్వడం గురించి తాంబరం ఆర్డీవో, ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు విచారణ జరుపుతున్నారు. -
రైల్వే టైమ్ టేబుల్లో భారీ మార్పులు
సాక్షి, హైదరాబాద్ : పలు రైళ్ల వేళలు, స్టాపేజ్లు, వాటి నెంబర్లు, నడిచే రోజులు తదితరాల్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేసిన మార్పుల వివరాలను బుధవారం అధికారులు విడుదల చేశారు. ఆ వివరాలతో కూడిన టైంటేబుల్ పుస్తకాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు. దురంతో రైళ్లకు కొత్త స్టాపులను, 4 ఎక్స్ప్రెస్, 2 ప్యాసింజర్ రైళ్లను మరిన్ని స్టేషన్లకు పొడిగించగా మూడు రైళ్ల మార్గాన్ని మళ్లించారు. 30 రైళ్ల వేగాన్ని పెంచి ప్రయాణ సమయాన్ని తగ్గించారు. 12 రైళ్ల నెంబర్లను మార్చగా, 59 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. మళ్లింపు/పొడిగింపు.. మేడ్చల్-సికింద్రాబాద్ డెమూ ప్యాసింజర్ ఫలక్నుమా వరకు సికింద్రాబాద్తో సంబంధం లేకుండద మల్కాజ్గిరి, సీతాఫల్మండి మీదుగా ఫలక్నుమాకు చేరుకుంటుంది. మహబూబ్నగర్-సికింద్రాబాద్ ప్యాసింజర్ మిర్జాపల్లి వరకు సికింద్రాబాద్కు వెళ్లకుండా సీతాఫల్మండి, మల్కాజ్గిరి మీదుగా నడుస్తుంది. తిరుపతి- హజ్రత్ నిజాముద్దీన్ ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఇక నుంచి సికింద్రాబాద్ స్టేషన్తో సంబంధం లేకుండా కాచిగూడ మీదుగా ప్రయాణిస్తుంది. దురంతో ైరె ళ్లకు కొత్త స్టాప్లు... సికింద్రాబాద్-విశాఖపట్నం దురంతో ఎక్స్ప్రెస్ ఇకపై విజయవాడలో నుంచి విజయవాడలో ఆగుతుంది. సికింద్రాబాద్-ముంబై దురంతో పుణేలో ఆగుతుంది. యశ్వంత్పూర్-ఢిల్లీ సరాయి రోహిల్లా దురంతో గుంతకల్, సికింద్రాబాద్లో, హౌరా-యశ్వంత్పూర్ విజయవాడ, రేణిగుంటలో, చెన్నై-హజ్రత్ నిజాముద్దీన్ విజయవాడలో ఆగుతాయి. -
ఫోన్ నంబర్లు మార్చుకోండి
- అనుచరులు, నేతలకు సూచించిన లోకేష్ సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం తెలుగుదేశం పార్టీనేతల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణంలో ఏమౌతుందోనన్న ఆందోళనలో ఉన్న నేతలు ఇప్పటి వరకూ తాము ఉపయోగిస్తున్న ఫోన్లలో ఇతరులతో సంప్రదింపులు జరిపేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. అన్ని స్థాయిల నేతలకు ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో ఫోన్ నంబర్లు మార్చి తాత్కాలికంగా ఉపశమనం పొందాలని నిర్ణయించారు. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ కూడా ఈ మేరకు పార్టీ నేతలకు ఇదే రకమైన సూచన చేశారు. పార్టీలోని అన్ని స్థాయిల నేతల సాధ్య మైనంత వరకూ ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్లను మార్చాల్సిందిగా ఆయన మౌఖికంగా సూచించారు. కొద్ది రోజుల పాటు కొత్త ఫోన్ నంబర్లు ఉపయోగించటం ద్వారా మనపై నిఘా పెట్టిన వారి దృష్టి మరల్చవచ్చని ఆయన చెప్పినట్లు సమాచారం. లోకేష్ ప్రస్తుతం ఏపీలోని పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అధికారిక కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉన్న నేపథ్యంలో లోకేష్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ముఖ్య నేతలు కీలకపాత్ర పోషించారని తెలంగాణ ఏసీబీ నిర్ధారించటంతో పాటు కొన్ని సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది. పార్టీ ముఖ్య నేతలు ఉపయోగించే ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం సేకరించిన ఏసీబీ వారు ఎవరెవరితో ఏం మాట్లాడారో కూడా కోర్టుకు సమర్పించారు. తనకు ప్రధాన అనుచరులుగా, సహాయకులుగా ఉన్న వారి ఫోన్ నంబర్లను కూడా లోకేష్ ఇప్పటికే మార్పించారు. తాను నిత్యం ఉపయోగించే తన సహధ్యాయి ఒకరి ఫోన్ నంబర్ను లోకేష్ ఇప్పటికే మార్పించినట్లు టీడీపీ వర్గాల సమాచారం. ఇప్పటికే తెలంగాణ ఏసీబీ లోకేష్ ఫ్రధాన అనుచరులుగా ఉన్న ప్రదీప్ చౌదరి తదితరులను పిలిపించి విచారించింది. ఇక ముందు కూడా పలువురిని పిలిపించి విచారించే అవకాశం ఉండటంతో పాటు వారి కదలికలపై నిఘా పెట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఉపయోగించే ఫోన్ నంబర్లలో ఎవ్వరికీ అందుబాటులో ఉండవద్దని వీరికి ఎన్టీఆర్ భవన్ ద్వారా లోకేష్ సమాచారం ఇచ్చినట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో పాత్ర ఉన్న వారిని గుర్తిస్తున్న ఏసీబీ విచారణకు విడతల వారీగా పిలుస్తున్న నేపథ్యంలో తన కదలికలపై కూడా దర్యాప్తు సంస్థ నిఘా ఉంటుంది కాబట్టి ఇక నుంచి ఎక్కువ సమయం విజయవాడలోనే మకాం వేస్తానని లోకేష్ పార్టీ నేతలకు చెప్పారు. వారంలో నాలుగు నుంచి ఐదు రోజులు విజయవాడలో , రెండు నుంచి మూడు రోజులు హైదరాబాద్లో మకాం వేస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే గత కొద్దిరోజల క్రితం వరకూ తన వద్ద డ్రైవర్గా పనిచేసిన కొండల్ రెడ్డి స్థానంలో పవన్ అనే వ్యక్తిని లోకేష్ డ్రైవర్గా నియమించుకున్నట్లు సమాచారం. కొండల్రెడ్డిని ఏసీబీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేయగా ఆయన గైర్హాజరైన విషయం తెలిసిందే. విచారణకు గైర్హాజరైనప్పటి నుంచి కొండల్రెడ్డికి జూబ్లీహిల్స్లోని ఒక రహస్య ప్రదేశంలో ఆశ్రయం కల్పించినట్లు ఎన్టీఆర్ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
బయట తిరిగే అవకాశం లేదు!
హోటల్ మార్చండన్న టీమిండియా ఢాకా: గతంలో బంగ్లాదేశ్కు ఎప్పుడు వచ్చినా భారత్ అదే హోటల్లో ఉంది. ఆతిథ్య జట్టుతో పాటు ఏ విదేశీ జట్టుకైనా అక్కడే బస. ఇటీవల మన ప్రధాని మోది కూడా అక్కడే ఉన్నారు. కానీ ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు మాత్రం తాము ఉంటున్న పాన్ పసిఫిక్ హోటల్ (సొనార్గావ్ ప్రాంతం)నుంచి తమను మార్చమని కోరుతున్నారు. ‘ఈ ఏరియాతోనే అసలు సమస్య. ఇక్కడ జనం చాలా ఎక్కువగా ఉన్నారు. మేం బయటికి వెళ్లలేకపోతున్నాం. దగ్గరలోని గుల్షన్ ప్రాంతం అయితే బాగుంటుంది. అక్కడ రెస్టారెంట్లు కూడా చాలా ఉన్నాయి’... ఇదీ మనవాళ్లు చెబుతున్న కారణం. అయితే ఇప్పటికిప్పుడు మరో హోటల్లో గదులు సమకూర్చడం కష్టమవడంతో పాటు భద్రతా కారణాల వల్ల కూడా ఇది సాధ్యం కాదని బంగ్లా బోర్డు స్పష్టం చేసినట్లు తెలిసింది. అసలు ఫతుల్లా టెస్టు సమయంలోనే భారత్ ఫిర్యాదు చేసినా ఆటగాళ్లు అక్కడే ఉండేందుకు బీసీబీ ఒప్పించింది. భారీ వర్షం కారణంగా టెస్టులో ఎక్కువ భాగం రద్దు కాగా, వన్డేలకు కూడా వాన ముప్పు ఉండటంతో భారత ఆటగాళ్లు హోటల్లో ఉండేందుకు చికాకు పడుతున్నట్లు తెలిసింది. భారత జట్టు తమ హోటల్ మార్చమని కోరడం గతంలో ఎన్నడూ జరగలేదు. -
జూన్ నుంచి స్కూళ్ల వేళలు మార్పు!
-
జూన్ నుంచి స్కూళ్ల వేళలు మార్పు!
మార్చిలోనే కొత్త తరగతులు ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ సమావేశం సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో (జూన్ నుంచి) రాష్ట్రంలోని పాఠశాలల పని వేళలు మారనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయనున్న విద్యా విషయక క్యాలెండర్పై చర్చించేందుకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ టి.చిరంజీవులు, ఇతర అధికారులు.. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు. ఉదయం ప్రధాన సంఘాలతో, మధ్యాహ్నం ఇతర సంఘాలతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయ సంఘాలన్నీ పాఠశాలల వేళలను ఉదయం 9:30 గంటల నుంచి కొనసాగించేలా మార్పు చేయాలని కోరాయి. ఇదే విషయాన్ని విద్యాశాఖ కూడా పరిశీలిస్తోందని ఈ సందర్భంగా డెరైక్టర్ చిరంజీవులు వెల్లడించారు. దీంతో పాఠశాలల వేళలను మార్పు చేయాలని నిర్ణయించారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలను ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగించేందుకు ఏకాభిప్రాయం కుదిరింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం ప్రాథమిక పాఠశాలలను ఉదయం 8:45 గంటల నుంచి మధ్యాహ్నం 3:45 గంటల వరకు, ఉన్నత పాఠశాలలను ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. అలాగే సమరేటివ్ 1, 2, 3 (త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక) పరీక్షల విధానం కాకుండా రెండు సమరేటివ్ పరీక్షలనే నిర్వహించాలని కోరాయి. ఈ సమావేశంలో ప్రధాన సంఘాలతో ఉదయం, మిగతా సంఘాలతో సాయంత్రం సమావేశం నిర్వహించడంపై ఇతర సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్తోపాటు అదనపు డెరైక్టర్ గోపాల్రెడ్డి, రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణ మండలి డెరైక్టర్ జగన్నాధరెడ్డి, మోడల్ స్కూల్స్ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి, కన్సల్టెంట్ ఉపేందర్రెడ్డి, పీఆర్టీయూ-టీఎస్, టీఎస్-యూటీఎఫ్, ఎస్టీయూ, టీపీటీఎఫ్, టీటీయూ, పండిత పరిషత్తు, పీఆర్టీయూ-తెలంగాణ, జీటీఏ, బీటీఏ, టీఎస్టీఎఫ్, టీటీఎఫ్, హెచ్ఎంల సంఘం నేతలు పాల్గొన్నారు. పాఠశాలల విలీనంపై భిన్నాభిప్రాయాలు ‘‘ఒక నివాస ప్రాంతంలో లేదా ఒకే స్కూల్ ఆవరణలో ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలను కిలోమీటరు పరిధిలోకి విలీనం చేస్తారు. ఇది చేసేప్పుడు ఎన్రోల్మెంట్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే ఒకటి నుంచి ఐదో తరగతి వరకున ్న ప్రతి ప్రాథమిక పాఠశాలలో కచ్చితంగా ముగ్గురు టీచర్లు ఉండేలా చర్యలు చేపడతారు. వారిలో ఒక టీచర్ పూర్తిగా తెలుగు/ఉర్దూ బోధనను, మరో టీచర్ ఇంగ్లిష్, ఇంకో టీచర్ గణితం ఇతర అంశాలను బోధించాలి’’ అని పాఠశాల విద్యా విషయక క్యాలెండర్లో పొందుపరిచిన నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది. ప్రాథమికోన్నత పాఠశాలలను మూడు కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఒకవేళ 5 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నత పాఠశాల లేకపోతే ఆ ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేస్తారు. వాటిలో ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ను ఇస్తారు. ఉన్నత పాఠశాలల్లో 75 మందికంటే తక్కువ మంది విద్యార్థులుంటే ఆ స్కూళ్లను ఐదు కిలోమీటర్ల పరిధిలోని మరో స్కూల్లో విలీనం చేయాలా? కొనసాగించాలా? అన్న దానిపై సంఘాలు అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు టీచర్లు ఉండాలన్న నిబంధనను సమర్థించారు. ఏకాభిప్రాయం కుదిరిన అంశాలు.. టెన్త్ పరీక్షలను ఇంటర్ పరీక్షల్లాగే మార్చి 15కి పూర్తి చేయాలి. మిగతా తరగతుల వార్షిక పరీక్షలను ఫిబ్రవరి చివరికి పూర్తి చేయాలి. కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్ఈ పాఠశాలల తరహాలో వేసవి సెలవులకు ముందే పై తరగతికి వెళ్లే విద్యార్థులకు కొత్త పాఠ్యాంశాల బోధనను మార్చి 16 నుంచి ప్రారంభించాలి. పాఠ్య పుస్తకాలను మార్చి మొదటి వారం నాటికే విద్యార్థులకు అందించాలి. అందుకోసం పక్కాగా ముద్రణ చేపట్టాలి. స్కూళ్లను ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగించాలి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వాలి. ఉపాధ్యాయులకు నిష్ణాతులైన వారితో నాణ్యమైన శిక్షణను అందించాలి. -
పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలి : కొ౦డారఘవరెడ్డి
-
గజ్వేల్ రూపురేఖలు మారుస్తా : సీఎం కేసీఆర్
సంగారెడ్డి (మెదక్) : గజ్వేల్ పట్టణం ఏం సక్కగలేదు.. నా సొంత నియోజకవర్గ పరిస్థితులు ఇలా ఉంటాయని ఊహించలేదు.. పట్టణం రూపు రేఖలు మార్చి సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తా’నని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. గురువారం ఆయన మెదక్ జిల్లా గజ్వేల్ లో పర్యటించారు. పట్టణమంతా కలియతిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు పట్టణ అభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ మహిళలు సీఎంకు హారతులు పట్టారు. మీకు పదివేల జీతం ఇద్దామనుకున్నా అయితే కుదరలేదు.. వచ్చేసారి వేతనాలు మరింత పెంచుతా’నంటూ వారి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అనంతరం రాష్ట్ర, జిల్లా, గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ సమగ్ర అభివృద్ధికి మాస్టర్ప్లాన్ సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు సీఎం హెలిపాడ్ వద్ద స్వాగతం పలికేందుకు వేచి చూస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్.సత్యనారాయణ తదితరులపై తేనెటీగలు దాడి చేయటంతో ఎవరికి వారు పరుగులు తీశారు. గజ్వేల్ పట్టణమంతా కలియతిరిగిన సీఎం సీఎం కేసీఆర్ గజ్వేల్ పట్టణంలో మంత్రులు హరీశ్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలసి కలియతిరిగారు. తహశీల్ కార్యాలయం, హౌసింగ్ కాలనీ, రైతుబజార్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత పాండవుల చెరువును కోటమైసమ్మ దగ్గర ఉన్న ఎస్సీ కాలనీని పరిశీలించారు. -
ఇంటి పేరు మార్చుకోం
కోల్కతా: పెళ్లయినా తమ ఇంటిపేరు మార్చుకునేందుకు 40 శాతం మందికి పైగా ఒంటరి మహిళలు ఆసక్తిచూపడంలేదని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని షాదీ డాట్కామ్ ఈ సర్వే నిర్వహించింది. వివాహం గురించి తమ అభిప్రాయాలు చెప్పాలని అడగ్గా... 40 శాతం మంది ఒంటరి మహిళలు ఇంటి పేరు మార్చుకోమని చెప్పారు. మరో 27 శాతం మంది పెళ్లయిన తర్వాత ఆర్థిక స్వతంత్రంతో ఉండడానికి ఇష్టం చూపగా, 18 శాతం మంది మగవారితో సమానంగా కుటుంబ బాధ్యతలను పంచుకుంటామన్నారు. 14 శాతం మంది భర్తలు తమ తల్లిదండ్రులను సొంతవారిగా చూసుకోవాలని చెప్పారు. -
చిన్న చిత్రానికి పెద్ద కీర్తి
సాక్షి, బెంగళూరు: తెలుగు విద్యార్థి రూపొం దించిన చిన్న చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. సినీ జగత్తులో అత్యున్నత పురస్కారం గా భావించే ఆస్కార్ లైబ్రరీలోకి ‘చేంజ్' అనే షార్ట్ఫిల్మ్ చేరింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురం వాసి రాజేంద్ర వి నోద్(23) ఈ షార్ట్ ఫిల్మ్ను రూపొందించారు. ప్రస్తుతం బెంగళూరులోని విజ్టూంజ్ కళాశాలలో మల్టీమీడియా విభాగంలో ఎమ్మెస్సీ చదువుతున్న రాజేంద్ర వినోద్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్ పై ‘సాక్షి' ప్రత్యేక కథనం.... సమాజంలోని దురాచారాలు, మనుషుల మ నస్తత్వంలో రావాల్సిన మార్పులు... ఇలా అం శమేదైనా సరే కేవలం పదినిమిషాల నిడివిలో అందరికీ అర్థమయ్యేలా చూపించగలగడమే షార్ట్ ఫిల్మ్ మేకింగ్. చిత్రం చిన్నగానే ఉన్నా ఆ చిత్రాన్ని అంత తక్కువ నిడివితో రూపొం దించగలగడం మాత్రం చాలా క్లిష్టమైన పని. ఇందుకు ఎంతో ఓర్పుతోపాటు నైపుణ్యం కూ డా చాలా ముఖ్యం. ఇలాంటి ఓర్పు, నేర్పు, నైపుణ్యాలతో అద్భుతమైన షార్ట్ ఫిల్మ్స్ను రూపొందిస్తూ వినోద్ ముందుకు సాగుతున్నారు. ఒకే ఏడాదిలో ఏడు చిన్న చిత్రాలు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురం గ్రామంలో పుట్టి పెరిగిన రాజేంద్ర వినోద్ అక్కడే బి.టెక్ పూర్తి చేశారు. అనంతరం సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఎంఏ జర్నలిజం చేసిన రాజేంద్ర వినోద్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్పై ఉన్న ఆసక్తితో ఈ రంగం వైపు దృష్టి సారించారు. ఒకే ఏడాదిలో రాజేంద్ర ఏడు షార్ట్ ఫిల్మ్స్ను రూపొందించారు. అంతేకాదు ఏడు చిన్న చిత్రాలతోపాటు ఒక డాక్యుమెంటరీని, ఒక యాడ్ ఫిల్మ్ని రాజేంద్ర ఇదే ఏడాదిలో రూపొందించారు. వీటిలో యాజ్ ఫర్ యాజ్, ఫియర్, ఓవర్ రియాక్షన్, ఎగ్జామ్ షార్ట్ ఫిల్మ్లు ఎలాంటి సంభాషణలు లేకుండా కేవలం ఆయా సన్నివేశాల భావోద్వేగాలను అనుసరించి సాగిపోతుంటాయి. ఇక పయనం పేరిట తెలుగు భాషలో సైతం ఓ షార్ట్ ఫిల్మ్ను రాజేంద్ర రూపొందించారు. 11భాషల్లో ‘చేంజ్' ఇక రాజేంద్ర రూపొందించిన చిన్న చిత్రాల్లో ‘చేంజ్’ చిత్రం ఆస్కార్ లైబ్రరీ వరకు చేరుకుంది. జీవితంలో మార్పు, సాధారణ జీవితం మధ్య చిన్న పాటి తేడాను వివరిస్తూ సాగే ఏడు నిమిషాల నిడివి గల ఈ చిత్రం ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీంతోపా టు అత్యుత్తమ స్క్రీన్ప్లేకి ఆస్కార్ లైబ్రరీలో సైతం స్థానం సాధించింది. అంతేకాదు నేషనల్ స్టూడెంట్స్ ఫిల్మ్ అవార్డ్స్-14లో స్పెషల్ జ్యూరీ అవార్డును సైతం ‘చేంజ్’ సొంతం చేసుకుంది. ఈ చిత్రం 11 భాషల్లోకి సైతం అనువాదమవడం మరో విశేషం. ఈ చిత్రాన్ని 11 భాషల్లోకి అనువదించేందుకు గాను వి జ్టూంట్ కళాశాలలో తనతోపాటు చదువుతు న్న వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో వినోద్ సంభాషణలు చెప్పించారు. ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిం దీ, మరాఠీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీతో పాటు ఫ్రెంచ్ భాషలోకి సైతం ఈ చిత్రం అనువాదమైంది. ఇక రాజేంద్ర రూపొందించిన లేపాక్షి డాక్యుమెంటరీ సైతం 11 భాషల్లోకి అనువదించబడింది. లేపాక్షిలోని శిల్ప సౌందర్యాన్ని కళ్లకు కట్టేలా రూపొందించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఆర్వీ ఫిల్మ్స్ బ్యానర్పైనే నిర్మాణం సినిమాలన్నింటిని సొంత నిర్మాణ సంస్థ పేరిటే రూపొం దించాను. నా స్నేహితులైన రవిగౌడ, ప్రవీణ్ సాగర్, పవన్కుమార్, ప్రవీణ్ పై, పరమేష్ కాల్య, రవికుమార్, సంతోష్రెడ్డిలతో కలిసి ‘ఆర్వీ ఫిల్మ్స్’ పేరిట ప్రొడక్షన్ హౌస్ను ఏర్పాటు చేసుకున్నాం. నాకు చిన్నప్పటి నుంచి సృజనాత్మక రంగంలో పనిచేయాలనే లక్ష్యం ఉండేది. అందుకే ఫిల్మ్మేకింగ్ని కెరీర్గా ఎంచుకున్నాను. ఇక సమాజానికి నా వంతుగా ఏదైనా చేయాలనే భావంతోనే షార్ట్ ఫిల్మ్ల రూపకల్పనను ప్రారంభించా ను. నేను రూపొందించిన ‘ఆరణి' మహిళా సాధికారత ఎంత ముఖ్యమో చెబితే, యాజ్ ఫర్ యాజ్, పయనం చిత్రాలు మా నవ సంబంధాల ప్రాముఖ్యతను చెబుతాయి. ఇక రానున్న రోజుల్లో చలనచిత్ర రంగంలో సైతం నన్ను నేను నిరూపించుకోవడమే ముందున్న లక్ష్యం. - రాజేంద్ర వినోద్ -
షార్ట్ ఫిలిమ్స్ ఎక్స్పర్ట్ రాజేంద్ర వినోద్
-
చలి.. గాలి.. వాన..!
జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చలి.. గాలి.. వాన కలగలిపి ఇబ్బంది పెడుతోంది. దాదాపు మూడు వారాల క్రితం నుంచి చలి విజృంభిస్తోంది. రోజు రోజుకూ అది ఉధృతరూపం దాలుస్తూ వణికిస్తూ వస్తోంది. రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతూ జనాన్ని అవస్థల పాల్జేస్తున్నాయి. * ఒక్కసారిగా మారిన వాతావరణం * అల్పపీడనమే కారణం * నేడు, రేపూ వర్షాలు కురిసే అవకాశం సాక్షి, విశాఖపట్నం : జిల్లా వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఏజెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం రోజంతా ఆకాశం మేఘావృతమై అసలు సూర్యుడు కనిపించనే లేదు. నైరుతి బంగాళాఖాతంలో మూడు రోజుల క్రితం ఏర్పడ్డ అల్పపీడనం బలపడుతోంది. అది మంగళవారం నాటికి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావం విశాఖపై స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం నుంచి చలికి గాలి కూడా తోడైంది. మధ్యాహ్నం వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. ఇలా రోజంతా ఇదే వాతావరణం కొనసాగింది. రానున్న రెండ్రోజులు ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడినప్పుడు ఆకాశంలో మేఘాలు ఆవరించి కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఫలితంగా చలిని నియంత్రిస్తాయి. కానీ ప్రస్తుతం పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. దీనివల్ల పగటి పూట కూడా చల్లదనం పరచుకుంటోంది. పగలూ, రాత్రి చలి ప్రభావం కనిపించడానికి ఇదే కారణమని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో ఇప్పటిదాకా రాత్రి పూటే చలిని చవిచూసిన జిల్లా వాసులు ఇప్పుడు పగలూ శీతలంలో ఉన్న అనుభూతిని పొందుతున్నారు. దీనికి ఈశాన్య గాలులు కూడా తోడవడం వల్ల జనం అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత వాతావరణానికి పలువురు ఇళ్లకే పరిమితమవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో స్వెటర్లు, జర్కీన్లు, మంకీ క్యాప్లతో బయటకు వస్తున్నారు. మరోవైపు మంగళవారం, బుధవారం జిల్లాలో మోస్తరు వర్షం గాని, అప్పుడప్పుడు భారీ వర్షం గాని కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుత అల్పపీడనం మంగళవారం నాటికి వాయుగుండంగా బలపడనున్నందున ఈదురు గాలులు కూడా మొదలయ్యాయి. ఇవి ఈశాన్యం దిశగా గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో మంగళవారం నుంచి ఇవి ఇంకా అధికం కానున్నాయి. -
మెట్రో అలైన్మెంట్ మార్పులపై హర్షం
చారిత్రక, వారసత్వ కట్టడాలకు భంగం వాటిల్లకుండా సుల్తాన్బజార్, అసెంబ్లీ, పాతనగరంలో మెట్రో అలైన్మెంట్ మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శ్రీకారం చుట్టడం పట్ల పాతనగర వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాతనగరంలో వారసత్వ కట్టడాలు, ప్రార్థనాస్థలాల మనుగడకు ఎలాంటి నష్టం వాటిల్లదని, పర్యాటక రంగానికి ఢోకా ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా తాజా మార్పులతో పాతనగరంలోని ఏడు చారిత్రక దేవాలయాలు, 28 ప్రార్థనాస్థలాలు, వందలాది నివాసాలకు నష్టం వాటిల్లకుండా జేబీఎస్-ఫలక్నుమా(కారిడార్-2)రూట్లో మార్గం మార్పుపై నిర్మాణసంస్థకు పూర్తివివరాలతో బుధవారం రాష్ట్ర సర్కారు లేఖ అందజేయనున్న విషయం విదితమే. ఇక అలైన్మెంట్ మార్పుపై హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ నిపుణులతోపాటు మెట్రో పనుల నాణ్యత, డిజైనింగ్ను పర్యవేక్షిస్తున్న స్వతంత్ర ఇంజినీరింగ్ సంస్థ లూయిస్ బెర్జర్ నిపుణులు సైతం సుల్తాన్బజార్, అసెంబ్లీతోపాటు పాతనగరంలో అలైన్మెంట్ మారనున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి త్వరలో తాజా అలైన్మెంట్ ఖరారు చేయనున్నారు. ఇందుకు అయ్యే అదనపు వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్ధంగా ఉన్న విషయం విదితమే. పాతనగరంలో అలైన్మెంట్ మార్పులు ఇక్కడే... కారిడార్-2 పరిధిలోని జేబీఎస్-ఫలక్నుమా మార్గంలో (14.78కి.మీ) మెట్రో రైలుమార్గం పాతబస్తీలోని దారుషిఫా-మీర్చౌక్-శాలిబండ మీదుగా వెళితే పలు మసీదులు, అషురుఖానాలు, ఛిల్లాల మనుగడకు నష్టం వాటిల్లుతుందని ఎంఐఎం పార్టీతోపాటు ఇన్టాక్ వంటి వారసత్వ కట్టడాల పరిరక్షణ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈనేపథ్యంలోనే అలైన్మెంట్ మార్పునకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. కాగా తాజాగా మారనున్న మెట్రో మార్గాన్ని బహదూర్పూరా- కాలాపత్తర్- ఫలక్నుమా మీదుగా మళ్లించాలన్న డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో నిపుణుల బృందం ఆయా మార్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నెలరోజుల్లోగా నూతన మెట్రో మార్గాన్ని ఖరారు చేయనుంది. నిపుణుల బృందం పరిశీలన అనంతరం ప్రభుత్వానికి సమర్పించనున్న నివేదికలో అలైన్మెంట్ మార్పునకు అయ్యే అదనపు వ్యయం, ఆస్తులు, స్థలాల సేకరణ, బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, మెట్రో మార్గంలో వచ్చే మలుపులు వంటి అంశాలపై స్పష్టతరానుంది. -
మంత్రుల పనితీరు పై కేసీఆర్ అసంతృప్తి!
-
శాఖలు అటూఇటూ!
మంత్రుల శాఖలు మార్పు.. పలువురి పనితీరుపై కేసీఆర్ అసంతృప్తి సాక్షి, హైదరాబాద్, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్లో పలువురి శాఖలు మార్చాలని యోచిస్తున్నారు. ముఖ్యమైన శాఖలు నిర్వహిస్తున్న కొందరు మంత్రుల పనితీరుపై ఆయన అసంతృప్తిగా ఉండటమే ఇందుకు కారణమని విశ్వసనీయంగా తెలుస్తోంది. మెదక్ లోక్సభకు ఉప ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలు వంటివి పూర్తయిన తర్వాత దసరా పండుగకు అటూఇటుగా శాఖల మార్పుతో పాటు మంత్రివర్గ విస్తరణకు సీఎం శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. తెలంగాణ మంత్రివర్గం ఏర్పాటై మూడు నెలలు (సెప్టెంబర్ 2న) కావస్తోంది. అయినప్పటికీ మెజారిటీ మంత్రులకు తమ శాఖలపై కనీస అవగాహన రాలేదని కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. మరికొందరు మంత్రుల పేషీలు వ్యవహరిస్తున్న తీరు, వారి చాంబర్లలో నడుస్తున్న అపసవ్య ధోరణులు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి వచ్చాయి. కాంగ్రెస్ మంత్రుల హయాంలో చక్రం తిప్పిన వారే ఇప్పుడు టీఆర్ఎస్ మంత్రుల దగ్గర కూడా అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు. గత మంత్రుల దగ్గర పనిచేసిన వారిని మళ్లీ ఓఎస్డీలు, పీఎస్లుగా తీసుకోవద్దని కేసీఆర్ ఆదిలోనే గట్టి హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారిని అధికారికంగా తీసుకోనప్పటికీ కొందరు మంత్రుల దగ్గర వారు ఆంతరంగికులుగా, సన్నిహితులుగా చలామణి అవుతున్నారు. బదిలీలు, ఇతర ముఖ్యమైన వ్యవహారాల్లో వారే చక్రం తిప్పుతున్నట్లు పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. ఇక కొందరు మంత్రుల పేషీల్లో ఉన్న వ్యక్తిగత కార్యదర్శులు, ఓఎస్డీలు సర్వం తామే అన్నట్టుగా వ్యవహరిస్తూ... సందర్శకుల పట్ల నిర్లక్ష్యంగా, అమర్యాదగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఆయనకు ఫిర్యాదులు అందాయి. ఒకరిద్దరు మంత్రులైతే సచివాలయంలోని చాంబర్లో కూర్చుంటున్నప్పటికీ శాఖా పరమైన ఏ పనినీ పట్టించుకోవడం లేదని కూడా సీఎం దృష్టికి వెళ్లింది. వారికిప్పటికీ శాఖాపరమైన కనీస అవగాహన కూడా రాకపోవడం, కనీసం దాని అధ్యయనంపైనా దృష్టి కేంద్రీకరించకపోవడంపై కేసీఆర్ బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కీలక పోర్టుఫోలియోను నిర్వహిస్తున్న హైదరాబాద్కు చెందిన మంత్రి ఒకరిని తక్షణమే మార్చాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. అయితే మంత్రులు కూడా సీఎం తీరుపై ఒకింత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘మంత్రివర్గంలో ఉన్నామనే పేరు తప్ప చిన్న చిన్న బదిలీలకు కూడా సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు రావాల్సిందే. ప్రతీ చిన్న విషయంపైనా సీఎంకే నివేదిక పోతున్నది. మంత్రులుగా ఉన్నా మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు’ అని కొందరు మంత్రులు తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేయడం కొసమెరుపు. చంద్రబాబుపై అసంతృప్తే కారణం.. టీడీపీకి మొదటి నుంచీ అండగా ఉండి, ఖమ్మం జిల్లాను ఆ పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దిన తుమ్మల.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఉన్న అసంతృప్తి వల్లే పార్టీని వీడుతున్నారని ఆయన సన్నిహితులంటున్నారు. జిల్లాలో ఆయనకు ప్రాధాన్యం తగ్గించి, తన వ్యక్తిగత కోటరీలోని సభ్యుడైన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాటకే బాబు విలువనిస్తున్నారని వారు మండిపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో టిక్కెట్ల కేటాయింపులో కూడా నామాకే బాబు ప్రాధాన్యమిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తుమ్మల అనుచరుడు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి రాత్రికి రాత్రే మార్చేశారని, ఇందుకు నామానే కారణమని అప్పట్లోనే తుమ్మల వర్గం ఆగ్రహించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తుమ్మలను ఓడించేందకు నామా వర్గీయులు పనిచేశారని, అందుకే టీడీపీ బలంగా ఉన్నా తుమ్మల ఓటమి పాలయ్యారని ఆయన అనుచరులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దీంతో పార్టీని వీడటంపై తుమ్మల మల్లగుల్లాలు పడ్డారు. పార్టీ కేడర్ కూడా ఆయనపై ఒత్తిడి తెచ్చింది. అయితే, పార్టీ మారే విషయంలో చాలా గుంభనంగా వ్యవహరించిన తుమ్మల కార్యకర్తల ఒత్తిడికి మొదట్లో తలొగ్గినట్టు కనిపించలేదు. కానీ, టీఆర్ఎస్ కూడా ఆయన పట్ల సుముఖంగానే ఉండడం, ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ తర్వాత ఆయన హామీ మేరకు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో తుమ్మల అనుచరులు వారం రోజులుగా హల్చల్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఆయన పేరుతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలంటూ ‘తుమ్మల.. రా.. కదలిరా’.. ‘మీ వెంటే మేమంతా’ అని రాశారు. మరోవైపు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తుమ్మల నిర్ణయమే తనకు శిరోధార్యమని, ఆయన వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, 10 మంది జడ్పీటీసీలు, పెద్ద ఎత్తున సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఇతర నాయకులు తుమ్మలతో వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయన వర్గానికే చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాత్రం తాను టీడీపీలోనే ఉంటానని చెప్పడం గమనార్హం. మంత్రివర్గంలోకి తుమ్మల? టీడీపీ నేత తుమ్మల నాగేశ్వర్రావును మంత్రివర్గంలోకి తీసుకోవడానికి రంగం సిద్ధమైంది! టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కేబినెట్లో కేసీఆర్, తుమ్మల సహచరులు.ఇదే సాన్నిహిత్యంతో వీరిరువురు ఇటీవల సమావేశం కూడా అయ్యారు. మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఈ సందర్భంగా తుమ్మలకు కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా విశ్వసనీయ సమాచారం. టీఆర్ఎస్ నుంచి ఖమ్మం జిల్లాలో ఒక్కరే(జలగం వెంకట్రావు) ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ఇప్పటికే ఎక్కువ ప్రాతినిధ్యం దక్కిందన్న కారణంతో జలగం వెంకట్రావుకు అవకాశమివ్వలేదు. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి తుమ్మలను మంత్రివర్గంలోకి తీసుకుని, ఆ జిల్లాతో పాటు హైదరాబాద్లోనూ టీఆర్ఎస్ను బలోపేతం చేసుకోవాలనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారు. అయితే ప్రజాక్షేత్రంలో గెలిచిన తనను పక్కనబెట్టి, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తుమ్మలను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే సమాచారం అందుకున్న జలగం వెంకట్రావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్కు ఏ మాత్రం బలం లేని ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన తనను గుర్తించకపోవడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు వచ్చే నెల తొలి వారంలోనే టీఆర్ఎస్లో చేరేందుకు తుమ్మల సిద్ధమవుతున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. -
ఇల్లు @ ఈజీ
ఇల్లు కట్టిచూడు..పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు.. కానీ ఇల్లు చాలా విజీ అంటున్నాడు ఓ యువ ఇంజినీర్..తక్కువ వ్యయంతో కొద్ది రోజుల్లోనే కోరుకున్న ఇంటి నిర్మాణం పూర్తిచేయవచ్చని సిస్కాన్ సంస్థ ప్రకటించింది. ఈ టెక్నాలజీతో సామాన్యుడి సొంతింటి కల సులభంగా సాకారమవుతుందని యువ ఇంజినీర్ ధీమాగా ప్రకటిస్తున్నారు. ఇక ఆలస్యమెందుకు..ఆలోచించండి. కూకట్పల్లి: వ్యయాన్ని, సమయాన్ని తగ్గిస్తూ కొత్త టెక్నాలజీతో సులభంగా ఇల్లు కట్టవచ్చని అంటున్నాడు హైదరాబాద్కు చెందిన ఓ యువ ఇంజనీర్. ప్లాస్టిక్ ఫామ్ కన్స్ట్రక్షన్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించవచ్చని సిస్కాన్ సంస్థ ప్రకటించింది. కూకట్పల్లిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిస్కాన్ ఎండీ లక్ష్మీకాంత్, ఇంజినీర్ లక్ష్మణ్రావులు వివరాలు వెల్లడించారు. హౌజ్ డిజైన్ ప్రకారం ప్లాస్టిక్ ఫామ్స్ను అమర్చి అందులో రెడీ మిక్స్ సిమెంట్ కాంక్రీట్ను నింపి నిర్మాణాన్ని పూర్తిచేస్తారు. ఈ విధానాన్ని ప్లాస్టిక్ ఫామ్ టెక్నాలజీగా పిలుస్తారు. గోడలు, బీమ్స్, స్లాబ్ అన్నీ ప్లాస్టిక్ ఫామ్స్తోనే కడతారు. అనంతరం ప్లాస్టిక్ ఫామ్స్ను సులభంగా తొలగించవచ్చు. సాంప్రదాయ పద్ధతిలో పోల్చితే నిర్మాణ వ్యయం దాదాపుగా 25 శాతం, సమయం 50 శాతం తగ్గుతుంది. ఈ పద్ధతిలో ఇప్పటికే పలు కమర్షియల్ నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే బలహీన వర్గాల గృహ నిర్మాణానికి మరింత అనువైనదని వారు తెలిపారు. తక్కువ మంది కూలీలు, మెటీరియల్ వృథా లేకుండా మూడు లక్షలతోనే కోరుకున్న విధంగా ఇల్లు కట్టవచ్చని లక్ష్మీకాంత్ తెలిపారు. -
సాంకేతిక లీలలు
సాంకేతిక... ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న ఊపిరి .అదే టెక్నాలజీ సామాన్యుడికీ నిత్యకృత్యమై ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతోంది. వాటికి పరిష్కారమార్గాలూ వస్తున్నాయి.. తిరిగి కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ వలయాన్ని ఛేదించడానికి జెట్ కింగ్ నెట్వర్కింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఎన్నో అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. టెక్నోఫెస్ట్-14 పేరిట పలు సమస్యలను సులువుగా పరిష్కరిస్తున్నారు. సనత్నగర్: ఇంట్లో మొబైల్ మరచిపోయి ఆఫీసుకు వచ్చేశారనుకోండి...ఎవరెవరు ఫోన్ చేసి ఉంటారోననే ఆతృత.. ఇక ఆ బెంగ అక్కర్లేదు...ఆఫీసులో నుంచే మొబైల్కు ఏయే మెసేజ్లు వచ్చాయి... ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు ఫోన్ చేశారో తెలుసుకోవడమే కాదు...మనకు అవసరమైన కాంటాక్ట్ నెంబర్ను కూడా ఎంచక్కా తీసుకోవచ్చు.మొబైల్ పోయిందా...డోంట్ వర్రీ...లేకపోతే సెలైంట్ మోడ్లో ఉన్న ఫోన్ కనిపించడం లేదా...? రింగ్ టోన్ మోగేలా చేసుకోవాలా? అయితే ఓకే. ఏమిటీ...ఇవన్నీ వింటుంటే మీకు నమ్మశక్యంగా లేవా? తలతిరుగుతుందా...కానీ ఇవి నిజాలు...ఇవే కాదు...మరెన్నో అద్భుతాలను చూడడమే కాదు...వాటి గురించి తెలుసుకోవాలంటే అమీర్పేట్ మైత్రీవిహార్లోని జెట్కింగ్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ఇన్స్టిట్యూట్కు వెళ్లాల్సిందే. ఆ సంస్థకు చెందిన విద్యార్థులు అంగడి సరకులా సాంకేతికతను ఆరబోశారు. టెక్ఫెస్ట్-2014 పేరిట రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో 25 అంశాలకు సంబంధించి ప్రదర్శనలు ఇచ్చారు. స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్, కంప్యూటర్ ఉంటే చాలు... వివిధ రకాల యాప్స్ను ఆధారంగా చేసుకుని స్మార్ట్ఫోన్ను ఇంటర్నెట్ కంప్యూటర్తో అనుసంధానం చేసుకుంటే ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించవచ్చని జెట్కింగ్ విద్యార్థులు చాటిచెబుతున్నారు. ఇంట్లో మరిచిపోయిన ఫోన్కు వచ్చిన కాల్, మెసేజ్ లిస్టును ఆఫీసులో కూర్చొని చూసుకోవాలంటే ముందుగా ‘ఎయిర్ డ్రాయిడ్’ అనే యాప్స్ను ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. యాప్ను కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్మార్ట్ఫోన్కు, పీసీ (పర్సనల్ కంప్యూటర్)కి ఐపీ అడ్రస్ ఇవ్వాలి. అయితే మనకు కావాల్సిన సమాచారాన్ని బట్టి యాప్స్, కాన్ఫిగరేషన్ మారుతుంటాయి. టెక్నోఫెస్ట్లో విద్యార్థులు ప్రాక్టికల్గా చేసి చూపిస్తూ వివరిస్తున్నారు. ఈ అద్భుతాలను తిలకించి ఔరా...! అని నోరెళ్లబెట్టడం సందర్శకుల వంతవుతోంది. టెక్నోఫెస్ట్ విశేషాలు కొన్ని....మొబైల్ కెమెరాను పీసీకి వెబ్కామ్గా... పీసీకి వెబ్కామ్ లేదా...అయితే ఫోన్కు ఉన్న కెమెరానే పీసీకి కూడా వాడుకోవచ్చు. దీనికి డ్రాయిడ్ యాప్స్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. అలాగే ఫోన్ పోయినప్పుడు మొబైల్ ట్రాకింగ్ చేసుకోవడం, లాక్ చేసుకోవడం, ముఖ్యమైన సమాచారం ఉంటే తొలగించుకోవడం వంటి వాటిని ఎయిర్ డ్రాయిడ్ యాప్స్ ఆధారంగా చేసుకోవచ్చు. భేషుగ్గా డాటా రికవరీ.... పీసీలో డాటా డిలేట్ అయిపోయిందనే బెంగ అవసరం లేదు. ‘ఈజెస్’ అనే యాప్స్ను ఇన్స్టాలేషన్ చేసుకుని కాన్ఫిగరేషన్ అయితే, గతంలో పోయిన డేటా దొరుకుతుంటున్నారు. అయితే డేటా ఓవర్రైట్ కానంతవరకు ఓకే. చివరకు ఫార్మెట్ చేసిన సమాచారమూ రాబట్టుకోవచ్చు. మై ఓన్ టెలిఫోన్ ఎక్ఛేంజ్తో బిల్లుకు టాటా.... ఐదంతస్తుల భవనంలో అన్ని ఫ్లోర్లలో ఓ సంస్థ సిబ్బంది పనిచేస్తున్నారు. మామూలుగానైతే టెలిఫోన్ ద్వారా కనెక్షన్ ఇవ్వడమో లేక సెల్ఫోన్ ద్వారానే మెసేజ్ ఇస్తుంటాం. దీని ద్వారా బిల్లు తప్పనిసరి. అయితే బిల్లు ఏమాత్రం లేకుండా ఫ్రీగా మాట్లాడుకునే వ్యవస్థే మై ఓన్ టెలిఫోన్ ఎక్ఛేంజ్. వైప్ అనే మినీ సిప్ సర్వర్ యాప్స్ను ఇన్స్టాలేషన్ చేయడం ద్వారా స్మార్ట్ఫోన్ నుంచి స్మార్ట్ఫోన్కు కంప్యూటర్ సర్వర్ ఆధారంగా ఉచితంగా మాట్లాడుకోవచ్చు నెట్ మీటింగ్తో డేటా షేరింగ్.... ఆఫీసులో బాస్ తన పీసీపై ఏం చేస్తున్నారు...? అలాగే ఉద్యోగుల పీసీ డెస్క్టాప్లపై ఏం నడుస్తోందో తెలుసుకోవచ్చు. ఒకవిధంగా ఇది వీడియో కాన్ఫరెన్స్ లాంటిదే. ఉద్యోగులందరినీ ఒకచోట చేర్చకుండానే డెరైక్ట్గా ఉద్యోగుల పీసీ డెస్క్టాప్ పైకి సమాచారం పంపించవచ్చు. అలాగే తన సీట్లో కూర్చొనే వారితో సంభాషించవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా చేతిలోని స్మార్ట్ ఫోన్ను ఉపయోగించుకోవచ్చని జెట్కింగ్ విద్యార్థులు తమ ప్రదర్శన ద్వారా తెలియజేస్తున్నారు. శనివారం కూడా ఈ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వీటి గురించి నేరుగా తెలుసుకోవాలంటే ఈ ప్రదర్శనను తిలకించవచ్చని సూచించారు. -
పోలీస్ వ్యవస్థ శక్తిమంతమైతే మంచిదేగా!
-
మారనున్న తెలంగాణ 'ఖాకీ' డ్రెస్ కోడ్
-
ముఖ్యమంత్రుల మార్పుపై మంతనాలు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో దారుణ పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చాలని యోచిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ ఈ దిశగా కీలక నేతలతో వరుస మంతనాలు జరుపుతోంది. అసోం, మహారాష్ట్ర, హర్యానాల్లో ముఖ్యమంత్రులను మార్చే అవకాశం కనిపిస్తోంది. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో శనివారం హర్యనా ముఖ్యమంత్రి భూపిందర్సింగ్ హుడా భేటీ అయ్యారు. మహారాష్ట్ర సీనియర్నేతలు శివాజీరావ్ దేశ్ముఖ్, శివాజీరావ్ మోఘే కూడా సోనియాతో సమావేశమయ్యారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు ఏకే అంటోనీ, అహ్మద్ పటేల్తో సమావేశమై చర్చించారు. అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్పై అసంతృప్తి పెరుగుతున్నట్టు సమాచారం. అసోం సీనియర్నేత విశ్వశర్మ అధిష్టానం పెద్దలను కలుసుకోనున్నారు. -
‘టెన్త్’లో నూతనత్వం
విజయనగరం అర్బన్: పదో తరగతి విద్యార్థుల్లో విషయ అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యా ప్రమాణాలు మార్చి, అందుకు తగిన ట్లు పరీక్ష విధానంలోనూ మార్పులు చేశారు. ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఇందులో భాగంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో పదో తరగతి సిలబస్ను తయారు చేయించారు. ఇప్పటి వరకూ తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ పరీక్షలు రెండేసి చొప్పున, హిందీ పరీక్ష ఒక పేపరు కలిపి మొత్తం 11 పేపర్లు రాసేవారు. వీటిని తొమ్మిది పేపర్లకు కుదించారు. ఎక్స్టర్నల్, ఇంటర్నల్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. 80 మార్కులకు రాత పరీక్ష కొత్త విధానంలో మొత్తం 100 మార్కుల కు గాను 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్నల్ పరీక్షలు ఉం టాయి. రాత పరీక్షలో కనీస ఉత్తీర్ణత మార్కులు 27, ఇంటర్నల్ పరీక్షల్లో కనీస ఉత్తీర్ణత మార్కులు 7 గా నిర్ణయించారు. భాషా పరీక్షల్లో ఒక్కొక్క పేపరు భాషా పరీక్షల్లో ఒక్కొక్క పేపరు మాత్రమే ఉంటుంది. గతంలో హిందీ మినహా తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు ఒక్కొక్క దానికి రెండు పేపర్లు చొప్పున పరీక్షలు నిర్వహించేవారు. ఒక్కొక్క పేపరుకు 50 మార్కుల చొప్పున కలిపి మొత్తం వంద మార్కులకు ఉండేవి.కొత్త విధానంలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ (భాష) పరీక్షల్లో ఒక్కొక్క పేపరు మాత్రమే ఉంటాయి. ఇక గణితం, సైన్సు, సోషల్ సబ్జెక్టులకు రెండేసి పేపర్లు పరీక్షలు ఉంటాయి. గణితం మొదటి పేపరులో సంఖ్యలు, సమితులు, బీజగణితం, ప్రోగ్రెషన్, కోఆర్డినేట్ జామెట్రీ పాఠ్యాంశాలు ఉంటాయి. రెండో పేపరులో త్రికోణమితి, క్షేత్రగణితం, సంఖ్యాశాస్త్రాలు ఉంటాయి. సైన్స్ మొదటి పేపరులో భౌతిక, రసాయన శాస్త్రాలు, రెండో పేపరులో జీవశాస్త్రం ఉంటుంది. సోషల్ సబ్జెక్టులో మొదటి పేపరులో భూగోళం, అర్ధశాస్త్రం, రెండో పేపరులో చరిత్ర, పౌరశాస్త్రం ఉంటాయి. రాత పరీక్ష, ఇంటర్నల్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గ్రేడింగ్ మారనుంది. 15 ఏళ్ల తర్వాత టెన్త్ సిలబస్ మార్పు జాతీయ పాఠ్య ప్రణాళిక ప్రకారం రాష్ట్రవిద్యా పరిశోధన మండలి పాఠ్య పుస్తకాలను మార్పు చేసింది. 2012-13 విద్యా సంవత్సరంలో మొదటగా 1, 2, 3, 6, 7 తరగతుల పాఠ్యపుస్తకాలను మార్చారు. ఈ ఏడాది (2014-15) పదో తరగతి సిలబస్ను మార్చారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత పదో తరగతి సిలబస్, పరీక్ష విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మారిన సిలబస్లో విషయ పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆలోచించడం, నేర్చుకున్న విషయాలను వ్యక్తీకరించడం, విశ్లేషణం, వ్యక్తీత్వాన్ని పెంపొందించేలా పాఠ్యపుస్తకాలు రూపొందించారు. నైతిక విలువలు పెంపొందించేందుకు, మహిళా సాధికారిత, వారిని గౌరవించడం తదితర విషయాలకు ప్రాధాన్యమిస్తూ పాఠ్యాంశాలను రూపొందించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో గ్రేడింగ్ ఇలా.. మార్కులు గ్రేడ్ పాయింట్లు 91-100 ఏ-1 10 81-90 ఏ-2 09 71-80 బీ-1 08 61-70 బీ-2 07 51-60 సీ-1 06 41-50 సీ-2 05 35-40 డీ-1 04 1-34 డీ-2 03 భాషేతర సబ్జెక్టులు... 46-50 ఏ-1 10 41-45 ఏ-2 09 36-40 బీ-1 08 31-35 బీ-2 07 26-30 సీ-1 06 21-25 సీ-2 05 18-20 డీ-1 04 1-17 డీ-2 03 -
మోడీ, ఒబామా మధ్య సారూప్యతలెన్నో..
వాషింగ్టన్: నూతన ప్రధానిగా ప్రమాణం చేసిన నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా మధ్య అనేక సారూప్యతలున్నాయి. వీరిద్దరూ ‘మార్పు’ నినాదంతోనే అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. ఇద్దరూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం పొందారు. అలాగే ఎన్నికల ముందు సాగిన ప్రచార పర్వంలో హైటెక్ పంథా అనుసరించారు. మరికొన్ని పోలికలివీ.. ట్విట్టర్లో ఇద్దరికీ లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారుమోడీ, ఒబామా ఇద్దరూ మహాత్మాంగాంధీని అమితంగా అభిమానిస్తారు. ఒబామా వైట్హౌస్లోని తన ఆఫీసులో గాంధీ చిత్రపటాన్ని పెట్టుకున్నారు.పర్యావరణ పరిరక్షణ అంశాల్లో ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలని చెబుతుంటారు.దేశంలో రోడ్లు, బ్రిడ్జీలు, నౌకాశ్రయాలు, ఎయిర్పోర్టులు వంటి మౌలిక వసతులకు ఒబామా పెద్దపీట వేస్తున్నారు. మోడీ కూడా మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్నారు. ఐటీ, ఇంటర్నెట్కు ప్రాధాన్యం పెంచి పాలనలో పారదర్శకత పెంచుతామని, అవినీతిని కట్టడి చేస్తామని మోడీ చెబుతున్నారు. ఒబామా కూడా అమెరికాలో ఈ దిశగా అనేక చర్యలు చేపడుతున్నారు.ఒబామా అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ పాత తరహా విధానాలకు స్వస్తి పలికారు. మోడీ కూడా ఇదే పంథాలో సాగుతున్నారు. మంత్రిత్వ శాఖలను గణనీయంగా తగ్గించాలని యోచిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఒబామా శుభాకాంక్షలు వాషింగ్టన్: భారతదేశ 15వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ట పరిచే క్రమంలో మోడీ నేతృత్వంలోని నూతన నాయకత్వంతో కలిసి ముందుకుసాగుతామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు వైట్హౌస్లోని ప్రెస్ సెక్రటరీ జే కార్నే సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థిక అవకాశాలు, స్వేచ్ఛ, ప్రజా భద్రత తదితర అంశాల్లో ఇరు దేశాలూ నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఒబామా పేర్కొన్నట్టు తెలిపారు. ఇప్పటికే ఆయా విషయాలను మోడీతో ఒబామా చర్చించారని, ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఇరువురు నేతలూ ఫోన్లో సంభాషించుకున్నారని జే వివరించారు. -
అపాయింటెడ్ డే 16కు మార్చండి
కేంద్ర హోం శాఖ కార్యదర్శికి టీఆర్ఎస్ వినతి సాక్షి, న్యూఢిల్లీ: తె లంగాణ రాష్ట్రం మే 16 నుంచే ఉనికిలోకి వచ్చేలా అపాయింటెడ్ తేదీని మార్చాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. టీఆర్ఎస్ నేతలు వినోద్, జగదీశ్వర్రెడ్డిలతో కలిసి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు బుధవారం మధ్యాహ్నం హోం శాఖ కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం నార్త్ బ్లాక్వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైతే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను పార్టీలు ప్రలోభాలకు గురి చేసే ప్రమాదముందన్నారు. ‘‘ఈ విషయమై టీఆర్ఎస్ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున హైకోర్టును ఆశ్రయించాం. ఎన్నికలు జరిగి, ఫలితాలు మే 16నే వస్తున్నా అపాయింటెడ్ తేదీ జూన్ 2న ఉండటం రాజకీయ శూన్యతకు తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి దాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యాక కూడా రాష్ట్రపతి పాలన ఉండటం అయోమయానికి గురి చేస్తుంది. అందుకే అపాయింటెడ్ తేదీపై పునఃపరిశీలించాలని కోరాం. విభజన ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగేలా ఉన్నందున దానితో అపాయింటెడ్ తేదీకి ముడి పెట్టొద్దని విజ్ఞప్తి చేశాం ’’ అని వివరించారు. హైకోర్టు సూచన మేరకే హోం శాఖ కార్యదర్శిని కలిశామని, కేంద్ర హోం మంత్రిని కలవాలనుకున్నా ఆయన అందుబాటులో లేరని చెప్పారు. ‘‘రెండు రాష్ట్రాల్లోనూ ప్రజా ప్రభుత్వాలు ఏర్పాటు కావాలన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ పోరాడుతోంది. ఇది టీఆర్ఎస్ అంశం మాత్రమే కాదు. ఇతర పార్టీలీ మాతో కలిసి వస్తాయి’’ అని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థనపై హోం శాఖ కార్యదర్శి ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. అపాయింటెడ్ తేదీ విషయమై కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన సూచనపై న్యాయ శాఖ సలహా తీసుకోనున్నట్టు హోం శాఖ వర్గాలు తెలిపాయి. -
పదో తరగతి పాఠ్య పుస్తకాలు మారాయి
కామారెడ్డి, న్యూస్లైన్: పదో తరగతి పుస్తకాలు పదిహేనేళ్ల తర్వాత మారాయి. ఈ పుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు చేరాయి. మారిన పాఠ్యాంశాలు విద్యార్థులను ఆకర్షించేలా ఉన్నాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా వీటిని రూపొందించారు. 2012-14 విద్యా సంవత్సరాలలో 1 నుంచి 9వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు మార్చిన సంగతి తెలిసిందే. ఈసారి పదోతరగతి పుస్తకాల్లో కొన్ని పాఠ్యాంశాలు విద్యార్థులను ఆకర్షించే విధంగా ఉన్నాయని, మరికొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు. విద్యార్థులపై తక్కువ ఒత్తిడి ఉండేలా, భౌతిక, రసాయన శాస్త్రాలలో ప్రయోగాలకు సంబంధించినవి ఎక్కువ పాఠ్యాంశాలు ఉన్నాయి. తెలుగు, ఇంగ్లిష్ పాఠ్యాంశాలు బాగున్నాయని పేర్కొంటున్నారు. -
టీ- బిల్లుకు సవరణలు కోరుతాం: హరిబాబు
పార్లమెంటులో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చిన సమయంలో సవరణలు, ఓటింగ్కు పట్టుబట్టాలని తమ పార్టీ అధినాయకత్వాన్ని కోరినట్టు బీజేపీ సీమాంధ్ర నేత హరిబాబు చెప్పారు. ఒక వేళ ఇప్పుడు సీమాంధ్రులకు న్యాయం జరగకుంటే తాము అధికారంలోకి వచ్చాక తగిన న్యాయం చేస్తామన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉంటూనే, విభజన వల్ల సీమాంధ్రకు కలిగే నష్టం విషయంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తమ నాయకులతో మాట్లాడామన్నారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయడానికి బిల్లులో మార్పులు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్కు ఉందన్నారు. టీడీపీతో పొత్తుకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్రెడ్డి అడ్డుపడుతున్నారనే వార్తలు వస్తున్నాయని అడగ్గా.. ‘‘బీజేపీ ఒక జాతీయ పార్టీగా రాష్ట్ర శాఖ అభిప్రాయాన్ని తీసుకుంటుంది. అంతిమంగా జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, రాష్ట్ర పార్టీ అమలు చేస్తుంది. విభేదాలకు తావులేదు’’ అని బదులిచ్చారు. సీమాంధ్ర ప్రజల పీకమీద కత్తి పెట్టి విభజన చేస్తున్నారని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించగా ‘ మేము అలా అనుకోవడంలేదు. సీఎం కిరణ్ అనుకుంటున్నారు’’ అని బదులిచ్చారు.