ఆర్థిక సంవత్సరం మార్పుపై సలహాలకు ఆహ్వానం | invited for advices for finacial year | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంవత్సరం మార్పుపై సలహాలకు ఆహ్వానం

Published Sat, Aug 27 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

ఆర్థిక సంవత్సరం మార్పుపై సలహాలకు ఆహ్వానం

ఆర్థిక సంవత్సరం మార్పుపై సలహాలకు ఆహ్వానం

న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలోని పలు కంపెనీలు ప్రస్తుతం తమ ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1-మార్చి 31గా పాటిస్తున్నాయి. అయితే బడ్జెటరీ ప్రక్రియ మెరుగుకు, తగిన నగదు నిర్వహణకు  ఈ కాలం మార్పు అవసరమని పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా సంబంధిత వర్గాల నుంచి సలహాలనూ, సూచనలను ఆహ్వానించింది. ఇందుకు సెప్టెంబర్ 30 వరకూ గడువు పెట్టింది.

ఇప్పటికే ఈ అంశంపై మాజీ  ప్రధాన ఆర్థిక సలహాదారు శంకర అచార్య నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ డిసెంబర్ చివరినాటికి తన నివేదికను సమర్పించే వీలుంది.  1985లో ఎల్‌కే ఝా కమిటీ ఈ అంశంపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ ప్రభుత్వాలు ఆర్థిక సంవత్సరాన్ని పాటించాలని ఈ కమిటీ చేసిన సిఫారసును అప్పటి ప్రభుత్వం అంగీకరించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement