invitation
-
అదృశ్యమైన జ్యోతిష్యుడు.. అస్థిపంజరమై!
విశాఖపట్నం: భీమిలి బీచ్రోడ్డు కాపులుప్పాడలో అస్థిపంజరం కలకలం రేపింది. సంఘటనా స్థలంలో పూసలు, సగం కాలిన దుర్గాదేవి ఫొటో, పంచె ఆధారంగా.. ఈ అస్థిపంజరం పెందుర్తికి చెందిన జ్యోతిష్యుడు మోతి అప్పన్న(50)గా కుటుంబ సభ్యులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి ఆయన్ని ఇక్కడకు తీసుకుని వచ్చి.. హత్య చేసి, అనంతరం కాల్చి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు భీమిలి సీఐ సుధాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివీ.. పెందుర్తి బీసీ కాలనీకి చెందిన మోతి అప్పన్న.. భార్య కొండమ్మ, కుమారులు ప్రసాద్, దుర్గా ప్రసాద్లతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయనకు అఖిల, భారతి అనే కుమార్తెలు కూడా ఉన్నారు. వీరికి వివాహం అయింది. 9న ఇంటి నుంచి బయటకు వెళ్లి.. వృత్తి రీత్యా ఇంటింటికి వెళ్లి జ్యోతిష్యం చెప్పే అప్పన్న ఈ నెల 9న ఆనందపురం వెళ్తానని ఇంటి వద్ద చెప్పాడు. ఆ రోజు రాత్రి అప్పన్న ఇంటికి తిరిగి రాలేదు. ఈ నెల 10న ఆయన పెద్ద కుమారుడు దుర్గా ప్రసాద్ ఆనందపురం పోలీస్స్టేషన్లో తన తండ్రి కనిపించట్లేదని ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి భీమిలి, ఆనందపురం ప్రాంతాల్లో ఆయన కోసం పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు వెతికారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో ఆనందపురం, బోయపాలెం ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. బోయపాలెం నుంచి కాపులుప్పాడ వైపు ఓ గుర్తు తెలియని వ్యక్తితో అప్పన్న ద్విచక్ర వాహనం(పల్సర్ 220)పై వెళ్లినట్లు గుర్తించారు. దీంతో బోయపాలెం, పరదేశిపాలెం, కాపులుప్పాడ ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు వెతికారు. కాపులుప్పాడ ఆర్ఎన్పీ లేఅవుట్లో బుధవారం గాలించగా.. అక్కడ ఓ వ్యక్తి ఎముకలు, పుర్రె వంటివి చెల్లాచెదురుగా కనిపించాయి. వెంటనే దుర్గాప్రసాద్ భీమిలి పోలీసులకు సమాచారం అందించారు. కాల్ డేటానే కీలకం? అప్పన్న తమ్ముడు కుమార్తె పెళ్లికి సంబంధించి ఆహ్వాన పత్రిక అందజేసేందుకు ఈ నెల 8న అప్పన్న వారి కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లాడు. తిరిగి అదే రోజు రాత్రి ఇంటికి చేరుకున్న అప్పన్న.. ఫోన్లో ఎవరితో గట్టిగా మాట్లాడి వాగ్వాదానికి దిగినట్లు దుర్గాప్రసాద్ తెలిపారు. తమకు ఎటువంటి అప్పులు లేవని, సంతోషంగా జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 8వ తేదీన రాత్రి ఫోన్ వచ్చిందని, ఆ తర్వాత రోజున అప్పన్న కనిపించకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. అప్పన్న కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. సమాచారం అందుకున్న నార్త్ జోన్ ఏసీపీ అప్పలరాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. క్లూస్ టీం వివరాలు సేకరించిందని, ఫోరెన్సిక్ ల్యాబ్కు అస్థిపంజరాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు. అప్పన్న చనిపోయి 4, 5 రోజులు అయి ఉంటుందని, శరీరం సగం కాలడంతో పలు భాగాలను కుక్కలు చెల్లా చెదురుగా తీసుకుపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. భీమిలి సీఐ సుధాకర్ కేసు నమోదు చేశారు. అప్పన్నగా గుర్తింపు సంఘటనా స్థలంలో కేవలం పుర్రె, ఎముకలు వంటివి కాలిపోయి ఉన్నాయి. వాటి పక్కనే మెడలో వేసుకునే పూసలు, సగం కాలిన దుర్గాదేవి ఫొటో, పంచె ఆధారంగా కుటుంబ సభ్యులు అప్పన్నగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి ఇక్కడకు తీసుకుని వచ్చి, హత్య చేసి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
కొత్త బంగారు లోకం.. అనాథ చిన్నారులకు ఆహ్వానం
సాక్షి, సిటీబ్యూరో: మన చుట్టూనే ప్రేమ, ఆదరణ నోచుకోని బాల్యాలెన్నో..తల్లిదండ్రులు లేకపోవడం వలనో, పేదరికం కారణంగానో అనాథ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు ఎందరో.. అందమైన భవిష్యత్ కలలు కంటూ, ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగుతుంటాయి ఆ పసి హృదయాలు. ఆ పిల్లలకు ప్రపంచ విజ్ఞానం, సంస్కృతుల సమ్మేళనం, ప్రస్తుత ఆధునిక జీవన శైలి గురించి తెలియాల్సిన అవసరం ఉందని కొందరి ఆలోచన. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని అనాథ చిన్నారులను హైదరాబాద్కు ఆహ్వానించి, విలాసవంతమైన ఆతిథ్యమిచ్చి వారి సంతోషాలకు, విజ్ఞానానికి ప్రోత్సాహం అందించే ‘యూనిటీ–ఎక్స్’ అనే అద్భుత ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడి చిన్నారులను సైతం వివిధ నగరాలకు తీసుకెళ్లే నూతన సంస్కృతికి నాంది పలికారు. గతేడాది సెప్టెంబర్ నెలలో చెన్నైలోని ఫరెవర్ ట్రస్ట్కు చెందిన 45 మంది చిన్నారులు నగరానికి చేరుకుని 4 రోజుల విజ్ఞాన, వినోద పర్యటనను ఆస్వాదించారు. ఈ యూనిటీ–ఎక్స్ ప్రాజెక్ట్లో భాగంగా నగరంలోని పర్యాటక ప్రాంతాలు, పరిశోధన కేంద్రాలను వీక్షించారు. అదేవిధంగా కొద్ది రోజుల క్రితమే నగరంలోని వాల్మీకి గురుకుల్కు చెందిన 20 మంది చిన్నారులు చెన్నైకి సుసంపన్నమైన యాత్ర చేశారు. ఐకమత్యం, కల్చరల్ ఎక్స్చేంజ్ లో భాగంగా ఈ చిన్నారులు ఎన్నో మధుర జ్ఞాపకాలను, సామాజిక–వాస్తవిక అవగాహన పెంచుకుంటున్నారు. ఇలాంటి వినూత్న ప్రాజెక్టును హైదరాబాద్లోని వాల్మీకి ట్రావెల్ అండ్ టూరిజం సొల్యూషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ హరి కిషన్ వాల్మీకి ప్రారంభించారు. ఈ గొప్ప ప్రయత్నానికి చెన్నైలోని స్కల్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా భాగస్వామిగా చేరింది. ఈ సంస్థల సీఎస్ఆర్ నిధులతో యూనిటీ–ఎక్స్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా జీఆర్టీ రాడిసన్, టెంపుల్ బే, రెయిన్ ట్రీ, ది పార్క్ హోటల్, రెసిడెన్సీ హోటల్స్ తదితర 5–స్టార్ హోటళ్లలో బస చేయడం, అక్కడి ఆహారాన్ని విందు చేయడం, విలాసవంతమైన బెంజ్ బస్సులతో గరుడ లాజిస్టిక్స్లో ప్రయాణం చేయడం వంటి అవకాశాలను కల్పిస్తున్నారు. ముఖ్యంగా విద్య, విజ్ఞానం, కెరీర్ సెమినార్స్ తదితర అంశాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు విభిన్న సంస్కృతుల సమ్మిళిత ప్రయాణం, అనుభవాలు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా గొప్ప ఉపాధ్యాయుడితో సమానం. ఈ కోణంలోనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వ్యవస్థాపకులు డాక్టర్ హరికిషన్ వాల్మీకి తెలిపారు. మా ప్రయత్నానికి చెన్నైలోని స్కల్ అధ్యక్షుడు షబిన్ సర్వోత్తమ్ వంటి వారు భాగస్వామ్య సహకారం అందించడం శుభపరిణామం అన్నారు. ఈ ప్రాజెక్టును నగరంలోని వాల్మీకి ఫౌండేషన్ పర్యవేక్షిస్తూ, అవసరమైన మద్దతు, సహకారం అందిస్తోంది. ఐక్యతకు నిదర్శనంగాప్రేమ, ఆదరణ పొందకపోవడమే కాకుండా సామాజికంగా నిర్లక్ష్యానికి గురైన పిల్లలు ఈ అనాథలు. వారిని భావిపౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటే సౌలభ్యాలు, విద్య మాత్రమే సరిపోదు. అధునాతన ప్రపంచం, ఈ తరం జీవనశైలి, సామాజిక పరిపక్వత చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఇలాంటి చిన్నారులు సైతం అందరి పిల్లలమాదిరిగానే వారి జీవితాన్ని ఆస్వాదించడంలో ప్రాజెక్ట్ యూనిటీ–ఎక్స్ విశేషంగా కృషి చేస్తుంది. ఈ తరహా కార్యక్రమాలు సామాజిక సమానత్వానికి, ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయి. – డాక్టర్ సూర్య గణేష్ వాల్మీకి, వాల్మీకి ఫౌండేషన్ అధ్యక్షుడు. ఆలోచన మారింది.. మా ఆశ్రమం తప్ప మరే ప్రపంచం తెలియని మేమంతా చెన్నై వెళ్లడం మంచి అనుభూతి. ఈ ప్రయాణం విజ్ఞానంతో పాటు చెన్నైలో మంచి మిత్రులనూ చేరుకునేలా చేసింది. మళ్లీ అక్కడి పిల్లలు హైదరాబాద్ రావడం కుటుంబ సభ్యులను కలిసినట్లే అనిపించింది. యూనిటీ–ఎక్స్ నా ఆలోచనా విధానాన్ని, భవిష్యత్ ప్రణాళికలను మార్చింది. ప్రపంచం చాలా పెద్దది, అవకాశాలకు కొదువ లేదు అనే నమ్మకాన్ని ఇచ్చింది. – మారుతి, వాల్మీకి గురుకుల్ విద్యార్థి ఇదీ చదవండి: 2025లో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..బెస్ట్ టిప్స్! -
‘అయోధ్య దీపోత్సవ్కు ఆహ్వానం అందలేదు’
లక్నో: అయోధ్యలో ఇవాళ (బుధవారం) నిర్వహించే దీపోత్సవ్ కార్యక్రమానికి తనను నిర్వాహకులు ఆహ్వానించలేదని సమాజ్వాదీ పార్టీ నేత, ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ తెలిపారు. మన పండుగల విషయంలో కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘దీపావళి సందర్భంగా అయోధ్య ప్రజలందారికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఇక్కడి నుంచి ఎన్నిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. మన పండుగలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. దీపావళి పండుగను బీజేపీ రాజకీయం చేసి ప్రజలను విభజిస్తోంది. నాకు దీపోత్సవ్కు పాస్ లేదా ఆహ్వానం అందలేదు. ఈ పండుగ ఏ ఒక్క వర్గానికి చెందినది కాదు. ..నేను ఈరోజు అయోధ్యకు వెళ్తున్నా. నాకు నిర్వాహకుల నుంచి దీపోత్సవ్ కార్యక్రమానికి ఎటువంటి పాస్ లేదా ఆహ్వానం రాలేదు’’ అని అన్నారు. అయోధ్య ఆధ్యాత్మిక నగరం.. ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందన్న విషయం తెలిసిందే. అయోధ్యలో అట్టహాసంగా నిర్వహించనున్న దీపోత్సవ్ కార్యక్రమానికి స్థానిక ఎంపీని ఆహ్వానించకపోవటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.దీపావళి సందర్భంగా సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగించే దీపోత్సవ్ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి వరకు సరయూ నది ఒడ్డున సుమారు 28 లక్షల దీపాలను వెలిగించటం ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
సీఎల్పీ భేటీకి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ) సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పీఏసీ చైర్మన్గాంధీ, వ్యవసాయశాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డితో పాటు మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎల్పీ సమావేశం హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో ప్రారంభమైంది. ఎమ్మెల్యే లు ,ఎమ్మెల్సీలు ,ఎంపీలు హోటల్కు వచ్చారు.సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరుగుతోంది.లోకల్ బాడీ ఎన్నికలు,పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం,పార్టీ సభ్యత్వం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదీ చదవండి.. జమిలి ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర -
వైఎస్ఆర్ సీపీ మేయర్ కు అరుదైన గౌరవం
-
రకుల్, జాకీ పెళ్లి సందడి : వెడ్డింగ్ కార్డ్ వైరల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో పెళ్లిసందడికి ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్బర్డ్స్ తమ రిలేషన్ షిప్లో మరో అడుగు వేయబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజగా వీరి పెళ్లికి సంబందించిన వెడ్డింగ్ కార్డ్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఫిబ్రవరి 21న రకుల్, జాకీ భగ్నానీ ల వివాహం గోవాలో జరగబోతోంది. వివాహ సన్నాహాలు పూర్తి స్వింగ్లో ఉన్నాయి. వీరి వెడ్డింగ్ స్పెషల్గా , చిరకాలం గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా జరిపేందుకు రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే నీలం, తెలుపు రంగుల్లో రకుల్, జాకీ భగ్నానీ పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుభలేఖలో కొబ్బరి చెట్లు, బీచ్ దృశ్యాలతోపాటు గోవా అందాలు కనిపించేలా ముద్రించడం విశేషం. అందమైన సోఫా నీలం , తెలుపురంగుల్లో క్యూట్ క్యూట్ కుషన్లు.. మరో పూలద్వారం గుండా నీలిరంగు గేటు అందమైన బీచ్కి దారి తీస్తూ, రకుల్, జాగీ పెళ్లి ముహూర్తం విశేషం ఇందులో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అన్నట్టు వీరి వెడ్డింగ్ డెస్టినేషన్ కూడా హాట్ టాపిక్కే. ఎందుకంటే వీరి ద్దరి ప్రేమ కూడా ఇక్కడే మొదలైందట. అందుకే గోవాను ఎంచుకున్నట్టు సమాచారం. -
నితిన్ను పెళ్లికి ఆహ్వానించిన యంగ్ హీరో..!
త్వరలోనే టాలీవుడ్ యంగ్ హీరో ఓ ఇంటివాడు కాబోతున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు, హీరో ఆశిష్ రెడ్డి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు మన యంగ్ హీరో. తాజాగా టాలీవుడ్ హీరో నితిన్ను కలిసి వివాహానికి ఆహ్వానించారు. ప్రత్యేక బహుమతిని అందించిన ఆశిష్ రెడ్డి.. ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. అశిష్ రెడ్డి, అద్వైత రెడ్డిల పెళ్లి వేడుక ఫిబ్రవరి 14న జైపూర్లో జరగనుంది. టాలీవుడ్ హీరోలు ప్రభాస్, అఖిల్, మోహన్ బాబు కూడా ఆహ్వాన పత్రికలు అందజేశారు. వీరితో పాటు చాలామంది టాలీవుడ్ ప్రముఖులందరీకీ ఆహ్వానాలు అందించినట్లు తెలుస్తోంది. ఇకపోతే 'రౌడీ బాయ్స్' సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆశిష్ రెడ్డి.. ప్రస్తుతం 'సెల్ఫిష్' అనే మూవీలో నటిస్తున్నాడు. హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. -
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సైంటిస్ట్ సతీష్ రెడ్డికి ఆహ్వానం!
ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు నేరవేరుతోంది. కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దశాబ్దాల పోరాటం. ఇవాళ అది సాకారం కానుంది. ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఆ ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రుముఖ శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బలరాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంబోత్సవ కార్యక్రమంలో యావత్త్ దేశం ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఇదిలా ఉండగా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పలువు ప్రముఖులు, సెలబ్రెటీలకు ఆహ్వానాలు అందాయి. తాజాగా రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు సైంటిస్ట్ సతీష్ రెడ్డిగారికి కూడా ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరగనున్న రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫు నుంచి ఆయనకు ఆహ్వానం అందడం విశేషం. కాగా, ఆయన రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా ఉండటమేగాక రక్షణ వ్యవస్థల, సాంకేతికతలలో భారతదేశ అభివృద్ధికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన క్షిపణులు, యుద్ధ విమానాలు, మానవ రహిత వైమానికి రక్షణ వ్యవస్థలు, రాడార్ వంటి వ్యవస్థల అభివృద్ధికి కృషి చేశారు. అంతేగాక ఆయన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ గవర్నింగ్ బాడీ చైర్మన్గా కూడా సేవలందించారు. (చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!) -
అయోధ్య నుంచి పిలుపు వచ్చింది..
-
అయోధ్య ‘ప్రాణప్రతిష్ఠ’కు ముఖ్య అతిథులెవరు?
అయోధ్యలో జనవరి 22న నూతన రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య నగరంలోని ప్రధాన రహదారులను సూర్య స్తంభాలతో అలంకరించారు. నయా ఘాట్ సమీపంలోని లతా మంగేష్కర్ చౌక్ను అయోధ్య బైపాస్తో కలిపే ‘ధర్మ మార్గం’ రహదారికి ఇరువైపులా 40 సూర్య స్తంభాలను ఏర్పాటు చేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులను, 2,200 మంది ఇతర అతిథులను ఆహ్వానించారు. కాశీ విశ్వనాథుని ఆలయం, మాతా వైష్ణో దేవి ఆలయ ప్రతినిధులు, ఇస్రో శాస్త్రవేత్తల పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. సినీ పరిశ్రమ, వ్యాపార, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు. ఆ వివరాలు.. నటీనటులు 1. అమితాబ్ బచ్చన్ 2. మాధురీ దీక్షిత్ 3. అనుపమ్ ఖేర్ 4. అక్షయ్ కుమార్ 5. రజనీకాంత్ 6. సంజయ్ లీలా బన్సాలీ 7. అలియా భట్ 8. రణబీర్ కపూర్ 9. సన్నీ డియోల్ 10. అజయ్ దేవగన్ 11. చిరంజీవి 12. మోహన్ లాల్ 13. ధనుష్ 14. రిషబ్ శెట్టి 15. ప్రభాస్ 16. టైగర్ ష్రాఫ్ 17. ఆయుష్మాన్ ఖురానా 18. అరుణ్ గోవిల్ 19. దీపికా చిఖలియా వ్యాపారవేత్తలు 1. ముఖేష్ అంబానీ 2. అనిల్ అంబానీ 3. గౌతమ్ అదానీ 4. రతన్ టాటా క్రీడాకారులు 1. సచిన్ టెండూల్కర్ 2. విరాట్ కోహ్లీ రాజకీయనేతలు 1. మల్లికార్జున్ ఖర్గే 2. సోనియా గాంధీ 3. అధిర్ రంజన్ చౌదరి 4. డాక్టర్ మన్మోహన్ సింగ్ 5. హెచ్డి దేవెగౌడ 6. లాల్ కృష్ణ అద్వానీ 7. మురళీ మనోహర్ జోషి -
రామమందిర ప్రారంభోత్సవం.. ఇక్బాల్ అన్సారికి ఆహ్వానం
అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22న వైభవంగా జరిగిగే బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ వేడుకకు 7000 మంది హాజరుకానున్నారు. తాజాగా రామ జమ్మభూమి-బాబ్రీ మసీద్ స్థలం విషయంలో నాడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇక్బాల్ అన్సారికి కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారిక ఆహ్వానం అందించింది. రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరింది. బాబ్రీ మసీదుగా మద్దతుగా నాడు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన ఇక్బాల్ అన్సారికి 2020 ఆగస్టు 5న రామ మందిర భూమిపూజ కార్యక్రమానికి కూడా ఆహ్వానం పంపించిన విషయం గమనార్హం. అయితే ఇటీవల అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఆ సమయంలో కూడా రోడ్డు షోలో పాల్గొన్న ప్రధానమంత్రికి ఇక్బాల్ అన్సారి పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంలో ఇక్బాల్ స్పందిస్తూ.. అతను(మోదీ) మా ప్రాంతానికి వచ్చారు. ఆయన మాకు అతిథి, మా ప్రధానమంత్రి కూడా’ అంటూ అందుకే స్వాగతం పలికానని వివరణ ఇచ్చారు. కాగా.. ఇక్బాల్ అన్సారి తండ్రి కూడా రామజన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన 95 ఏళ్ల వయస్సులో 2016లో మృతి చెందారు. అనంతరం రామజన్మభూమి వివాదం కేసులో ఇక్బాల్ అన్సారీ కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి కీలకంగా వ్యవహిరించారు. కాగా.. రామజన్మభూమి వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం 2019 నవంబర్ 9న కీలక తీర్పును వెలువరించింది. వివాదంలో ఉన్న స్థలాన్ని రామమందిర నిర్మాణానికి కేటాయిస్తూ.. దానికి దగ్గరలో మరోచోటు ముస్లింలకు 5ఎకరాలకు స్థలాన్ని కేటించిన విషయం తెలిసిందే. చదవండి: జైల్లోని తమిళనాడు మంత్రికి సుప్రీంకోర్టులో ఊరట -
సీఎం జగన్ ఇంటికి సోదరి షర్మిల
సాక్షి, అమరావతి/కడప అర్బన్/గన్నవరం : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని నివాసంలో కలిశారు. తన తనయుడు రాజారెడ్డి వివాహానికి విచ్చేయాలని ఆహ్వానపత్రికను అందజేశారు. తొలి ఆహ్వాన పత్రికను మంగళవారం తన తండ్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన షర్మిల.. ఇడుపులపాయకు రోడ్డు మార్గంలో వెళ్లారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద తనయుడు రాజారెడ్డి వివాహ ఆహ్వానపత్రికను ఉంచి ఆశీస్సులు తీసుకుని, మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్లో బస చేశారు. అందరినీ ఆహ్వానిస్తున్నా.. సీఎం రమేష్ కు చెందిన అదే స్పెషల్ ఫ్లైట్లో తనయుడు రాజారెడ్డి, కూతురు అంజలి తదితరులతో కలిసి బుధవారం కడప నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న షర్మిలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షర్మిల అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మనవడు రాజారెడ్డి వివాహానికి అందరినీ ఆహ్వానిస్తున్నానన్నారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని, అందరూ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం అక్కడికి ముందుగానే ప్యాసింజర్ ఫ్లైట్లో చేరుకున్న భర్త అనిల్కుమార్తో పాటు తనయుడు రాజారెడ్డి, కూతురు అంజలితో కలిసి తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్నారు. సుమారు అరగంటపాటు సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తన తనయుడు రాజారెడ్డి వివాహ ఆహ్వానపత్రికను సీఎం వైఎస్ జగన్కు షర్మిల అందజేశారు. అనంతరం తిరిగి గన్నవరం విమానాశ్రయం చేరుకుని, ఎయిర్ ఇండియా విమానంలో భర్తతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. కాగా, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఈ సందర్భంగాప్రకటించారు. బీటెక్ రవితో అనిల్కుమార్ చర్చలు ప్యాసింజర్ ఫ్లైట్లో విజయవాడకు వెళ్లేందుకు షర్మిల భర్త అనిల్ కుమార్ బుధవారం కడప విమానాశ్రయం చేరుకున్నారు. అయితే అప్పటికే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆ పార్టీ జమ్మలమడుగు సమన్వయకర్త భూపే‹Ùరెడ్డి తండ్రి దేవగుడి నారాయణరెడ్డి (మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి సోదరుడు)లు కూడా విజయవాడకు వెళ్లేందుకు కడప విమానాశ్రయానికి వచ్చారు. వీరిద్దరితో వీఐపీ లాంజ్లో అనిల్కుమార్ సమావేశమవ్వడం ఆసక్తికరంగా మారింది. ఫ్లైట్ అరగంటపాటు ఆలస్యం కావడంతో బీటెక్ రవి, నారాయణరెడ్డి, అనిల్కుమార్ రాజకీయ పరిస్థితులపై మాట్లాడుకున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని.. పీసీసీ అధ్యక్ష పదవి తీసుకుంటే.. కడప జిల్లాలో, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయని తనతో అనిల్కుమార్ చర్చించినట్లు బీటెక్ రవి మీడియాకు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న షర్మిలకు తన తరఫున శుభాకాంక్షలు చెప్పాలని అనిల్కుమార్కు చెప్పానని బీటెక్ రవి అన్నారు. ఆ తర్వాత ఒకే ఫ్లైట్లో అనిల్కుమార్, బీటెక్ రవి, నారాయణరెడ్డిలు విజయవాడ చేరుకున్నారు. -
Hyderabad City Police: హాజరవలేని ఆహ్వానం
సోషల్ మీడియా వైరల్: ఏదైనా విందుకో, వేడుకకో ఎవరైనా ఆహ్వానపత్రిక పంపితే మనం వెళ్లకతప్పదు. కాని ఓ ఆహ్వనపత్రిక మనం హాజరవలేని విధంగా వచ్చిందనుకోండి అదే విడ్డూరం. డిసెంబర్ 31న హైదరాబాద్ సిటీ పోలీస్ హైదరాబాద్ నగరవాసులకు ఇటువంటిదే ఓ ఆహ్వానపత్రిక పంపింది. అదేమిటో మీరూ ఓ లుక్కేయండి. ఈ నూతన సంవత్సర వేడుకలకు మీరు మా అతిధి అవ్వకూడదని ప్రార్ధించండి. కాకపోతే రాష్ డ్రైవర్లకు, తాగి నడిపే వాహనదార్లకు, ఇతర రూల్స్ అతిక్రమించేవారికి మా ఆతిధ్యం ఉచితం. వారికి మాత్రమే స్పెషల్ లాకప్ డీజె షో ఏర్పాటు చేయబడుతుంది. ఇకపోతే మా ఆతిధ్యం స్వీకరించేవారికి రుచికరమైన కాప్ కేక్ , ప్రత్యేకంగా మా డెజర్ట్లో పొందుపరిచిన కష్టడీ వడ్డించబడుతుంది. ఆఖరుగా ఈ పార్టీ వేదిక మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ అని వినూత్నంగా డిజైన్ చేసిన ఈ ‘హాజరవలేని ఆహ్వానం’ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. Please dont be our Guest, our Service is Quite Complicated, Rest on you...#DontDrinkAndDrive#DrunkenDrives pic.twitter.com/9eEvjJhiU5 — Hyderabad City Police (@hydcitypolice) December 31, 2023 చదవండి: Hyd: భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. మద్యం ఎంత తాగారంటే? -
'ఆటా' గ్రాండ్ ఫినాలే.. రాజేంద్రప్రసాద్కు ప్రత్యేక ఆహ్వానం
'ఆటా' గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి నటకిరీటి రాజేంద్రప్రసాద్ను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈనెల 30న రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు రాజేంద్రప్రసాద్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన ఇంట్లో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కాశీ కొత్త, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి తదితరులు పాల్గొన్నారు. -
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
సూపర్స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్హాసన్ ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్ కాలనీ కేడీజీఓ పార్కులో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్ కోసం విజయవాడలో ఉన్న కమల్హాసన్.. కృష్ణ–మహేశ్బాబు ఫ్యాన్స్ ఆహ్వానం మేరకు కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు కమల్హాసన్ . ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్న విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ–‘‘కళామతల్లికి తనదైన శైలిలో సేవలందించి, ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు కృష్ణగారు. తండ్రి గౌరవాన్ని మహేశ్బాబుగారు నిలబెడుతున్నారు’’ అన్నారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణ కేవలం పదిరోజుల వ్యవధిలో పూర్తి చేసేందుకు సహకరించిన సీఎం జగన్ మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు’’ అని కృష్ణ అభిమానుల సంఘం పేర్కొంది. ఈ కార్యక్రమంలో విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కృష్ణ కుటుంబ సభ్యుడు ఘట్టమనేని బాబీ, వైఎస్సార్సీపీ నాయకులు గల్లా పద్మావతి, రాజ్కమల్ పాల్గొన్నారు. గర్వంగా ఉంది: హీరో మహేశ్బాబు ‘‘నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్ గారికి కృతజ్ఞతలు. నాన్నగారు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు, వారసత్వానికి ఇదొక నివాళి. నాన్న విగ్రహం ఏర్పాటుకు కారణమైన అందరికీ, ఈ వేడుక ఘనంగా నిర్వహించిన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు మహేశ్ బాబు. -
అభ్యర్థుల ఖరారుపై చర్చ.. సచిన్ పైలెట్కు అందని ఆహ్వానం
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుంటున్నట్లు కనిపిస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి సీనియర్ నాయకుడు సచిన్ పైలెట్ను ఆహ్వానించలేదు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సుఖ్జీందర్ రాంధావా, రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గోవింద్ దోతస్రా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాజస్థాన్ స్క్రీనింగ్ కమిటీ చీఫ్ గౌరవ్ గొగోయ్ తదితరులను ఆహ్వానించారు. సచిన్ పైలెట్, రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషిల పేర్లు ఇందులో లేవు. बचत, राहत, बढ़त, हिफ़ाज़त और उत्थान, कांग्रेस के सुशासन से ऐसे बदला राजस्थान ! भरोसा है हमें कि जनता फ़िर से देगी आशीर्वाद। आज राजस्थान के परिप्रेक्ष्य में केंद्रीय चुनाव समिति की महत्वपूर्ण बैठक हुई। pic.twitter.com/ygR5auUdUf — Mallikarjun Kharge (@kharge) October 18, 2023 రాజస్థాన్లో మరోసారి అధికారంలోకి వస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. పొదుపు, ఉపషమణం, వృద్ధి, రక్షణలతో కాంగ్రెస్ గుడ్ గవర్నెన్స్ రాజస్థాన్లో సమూల మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. ప్రజలు మరోసారి దీవిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ముఖ్యమైన సమావేశం ఉందని ట్విట్టర్(ఎక్స్) వేదికగా ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) అక్టోబర్ 13 ఢిల్లీలో ఇప్పటికే సమావేశమైన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: నోరు నొక్కేందుకే ఈ కుట్ర: భయపడుతూ కూచుంటే ఎలా? -
హార్వర్డ్ వర్సిటీ నుంచి కేటీఆర్కు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన బోస్టన్ యూనివర్సిటీలో వచ్చే సంవత్సరం జరిగే ఇండియా కాన్ఫరెన్స్లో మాట్లాడేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావుకు ఆహా్వనం అందింది. 2024 ఫిబ్రవరి 18న హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే ఇండియా కాన్ఫరెన్స్ 21వ ఎడిషన్లో ఫైర్సైడ్ చాట్లో మాట్లాడేందుకు కేటీఆర్ను ఆహ్వానించారు. ‘ఇండియా రైజింగ్: బిజినెస్, ఎకానమీ, కల్చర్’అనే అంశంపై ఈ కాన్ఫరెన్స్ సాగనుంది. ‘ఇటీవలి కాలంలో తెలంగాణ సాధించిన వృద్ధిలో చూపిన ప్రభావవంతమైన నాయకత్వం, పోషించిన పాత్ర, తెలంగాణను పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలబెట్టడం, మాకు గొప్ప ప్రేరణగా నిలుస్తుంది’అని ఈ సందర్భంగా కేటీఆర్కు పంపిన ఆహా్వన లేఖలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం పేర్కొంది. విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, నాయకులు, విధాన నిపుణులతో సహా 1,000 మంది భారతీయ ప్రవాస సభ్యులు ఈ సదస్సులో పాల్గొంటారు. కాగా, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. -
నేడు కేసీఆర్తో పొన్నాల భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య భారత్ రాష్ట్ర సమితిలో చేరేందుకు అంగీకరించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో ఆదివారం ఉదయం జరిగే భేటీ తర్వాత పొన్నాల తన నిర్ణయాన్ని ప్రకటించను న్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ నేతలతో కలిసి శనివారం పొన్నాల నివాసానికి వెళ్లారు. పొన్నాల రాజకీయ అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని, బీఆర్ఎస్లో సముచిత స్థానం కల్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 16న జనగామలో జరిగే బహిరంగ సభ వేదికపైపార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. కేటీఆర్ ఆహ్వానాన్ని స్వాగతిస్తూ సీఎంతో భేటీ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పొన్నాల సమాధానం ఇచ్చారు. సీనియర్లను రేవంత్ అవమానించారు: కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించిన సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్లోకి ఆహ్వానించినట్టు ఆయనతో భేటీ అనంతరం కేటీఆర్ విలేకరులకు తెలిపారు. ఆయన పార్టీలోకి వస్తే కె.కేశవరావు, డి.శ్రీనివాస్ తరహాలో సరైన స్థానం కల్పించి గౌరవిస్తామన్నారు. పీవీ నర్సింహారావు సమక్షంలో కాంగ్రెస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్య వంటి సీనియర్ నాయకులను రేవంత్రెడ్డి అవమానించారని విమర్శించారు. ఎన్నో పార్టీలు మారిన రేవంత్రెడ్డి.. ఇతరులు తమకు గౌరవం దక్కక పార్టీ బయటకు వెళ్తుంటే తప్పు పడుతు న్నారని విమర్శించారు. చచ్చే ముందు పార్టీ మారటం ఏమిటని కాంగ్రెస్ నేతలు చిల్లరగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ కాంగ్రెస్ను భ్రష్టు పట్టిస్తున్నారు: పొన్నాల రేవంత్రెడ్డి తన స్థాయిని మరిచి తాము పార్టీకి, ప్రాంతానికి చేసిన సేవలను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ను భ్రష్టు పట్టిస్తున్నారని పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత రేవంత్ ఎమ్మెల్యేగా ఓడి పోయారు. ఆయన ఎంపీగా ప్రాతినిథ్యం వహి స్తున్న మల్కాజిగిరి పరిధిలో గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క కార్పొరేటర్ను కూడా గెలవలేదు. 2014, 2018లో పొన్నాల లక్ష్మయ్య ఒక్కడే ఓడిపోయాడా? జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఓడిపోలేదా?..’ అని పొన్నాల ప్రశ్నించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, పార్టీ నేతలు వాసుదేవరెడ్డి, దాసోజు శ్రవణ్, రాజారాం యాదవ్ తదితరులున్నారు. -
దసరా మహోత్సవాలకు సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వనం
-
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్కు ఆహ్వానం
సాక్షి, గుంటూరు: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం అందింది. గురువారం సాయంత్రం పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు, కాణిపాకం వినాయక స్వామి ఆలయ అధికారులు తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ఆయన్ని కలిసి ఆహ్వానపత్రిక అందించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ను ఆహ్వానించారు స్థానిక ఎమ్మెల్యే, కాణిపాక దేవస్థానం ప్రతినిధులు. ఆహ్వనపత్రికతో పాటు వినాయక స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు సీఎం జగన్కు అందజేశారు. సీఎం జగన్ను ఆహ్వానించిన వారిలో ఆలయ దేవస్ధానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ అగరం మోహన్ రెడ్డి, ఈవో ఎ.వెంకటేశ్ ఉన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం పుణ్యక్షేత్రంలో ఈ నెల 18 నుంచి 21 రోజుల పాటు వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. -
సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం వైఎస్ జగన్కు ఆహ్వానం
-
బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్కు ఆహ్వానం
సాక్షి,అమరావతి/తిరుమల: తిరుమలలో ఈ నెల 18 నుంచి 26 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం జగన్ను టీటీడీ ఆహ్వానించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను, శ్రీవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎంకు వేద పండితులు ఆశీర్వచనమిచ్చారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్కు ఆహ్వానం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏ.వి.ధర్మారెడ్డి మంగళవారం కలిశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానించారు. ముఖ్యమంత్రికి ఆహ్వనపత్రికతో పాటు శ్రీవేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ నెల 18 నుంచి 26 వరకు 9 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. చదవండి: చంద్రబాబు భద్రత ప్రభుత్వం బాధ్యత: హోంమంత్రి -
జీ20 సదస్సుకు ఇద్దరు గిరిజన మహిళలు..ఆ కారణంగానే ఆహ్వానం
దేశాధినేతలు, పలువురు అధికారుల హాజరయ్యే జీ20 శిఖరాగ్ర సదస్సుకు సామాన్య గిరిజన మహిళలకు ఆహ్వానం లభించింది. గిట్టుబాటు ధరలేక, సకాలంలో వర్షాలు పడక తదితర కారణాల రీత్యా వ్యవసాయాన్ని వదిలేస్తున్న ఈ తరుణంలో సంప్రదాయరీతిలో తృణధాన్యాలను పండించి చూపించారు. ఎందరో రైతులకు మార్గం చూపించారు. వారి విజయగాథను జీ20లో వినిపించేందకు ఈ ఇద్దరికి ఆహ్వానించారు. వ్యవసాయరంగానికి సంబంధించిన ప్రదర్శనలో భారత్ తరుఫున ఒడిశా నుంచి ఈ ఇద్దరు మహిళలు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఇద్దరు సంప్రదాయ పద్ధతిలో తృణధాన్యాల సాగు గురించి ఆ సదస్సులో పాల్గొనే ప్రపంచనాయకులకు వివరిస్తారు. వాటి ప్రయోజనాలు, పోషక విలువలు గురించి కూడా వివరిస్తారు. ఇంతకీ అసలు ఈ ఇద్దరు మహిళలు ఎవరు?వారి విజయ గాథ ఏంటంటే.. రాయిమతి ఘివురియా కోరాపుట్ జిల్లాలోని కుంద్ర బ్లాక్కి చెందని రాయిమితి ఘివురియా 124 రకాల తృణధాన్యాలను భద్రపరిచారు. ప్రపంచ స్థాయి శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యి..తాను ఈ రంగంలో ఎలా విజయం సాధించిందో వివరించేందుకు జైపూర్లోని ఎంఎస్ స్వామినాథన్ పరిశోధనా కేంద్రం నుంచి శిక్షణ తీసుకుంది. ఆమె దాదాపు 72 రకాల దేశీ వరి వంగడాలను, ఆరు రకాల వివిధ తృణధాన్యాలను సంరక్షించి విజయవంతమైన మహిళగా నిరూపించుకుంది. సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ.. దాదాపు 2500 రైతులను ఈ వ్యవసాయంలోకి తీసుకొచ్చారు. ఈ వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం 2012లో తన భూమిలోనే అగ్రికల్చర్ స్కూల్ని కూడా ప్రారంభించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఆమె చేసిన కృషికిగానూ ఆమెకు ఎన్నో సత్కారాలు, అవార్డులు వచ్చాయి. ఇప్పుడూ ఈ ప్రతిష్టాత్మక జీ20 సదస్సుకు ఆమెకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు మహిళా రైతు రాయిమితి ఘివురియా మాట్లాడుతూ..ఈ సదస్సులో పాల్గొనే అదృష్టం రావడం చాలా సంతోషంగా ఉంది. సేంద్రియ వ్యవసాయం దాని ప్రయోజనాలు గురించి వివరిస్తాను. గిరిజన మహిళగా ఈ శిఖరాగ్ర సమావేశంలో భాగం కావడం చాలా సంతోషం ఉందన్నారు రాయిమతి మరో మహిళా రైతు సుబాస మెహనత మయూర్భంజ్ జిల్లాలోని జాషిపూర్ బ్లాక్ పరిధిలోని గోయిలీ గ్రామంలో నివసించే సుబాస మోహనత కూడా ఆదివాసీ తెగకు చెందిన నిరుపేద మహిళ. ఒకప్పుడూ ఆమె గ్రామంలో వరి సాగు చేసేవారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల, ఇతర కారణాల వల్ల ఆ పంటలో విపరీతమైన నష్టాలను చూశారు అక్కడి ప్రజలు. ఇక వ్యవసాయ రంగాన్ని వదిలేద్దాం అనుకున్న సమయంలో ఒడిశా ప్రభుత్వం మిల్లెట్ మిషన్ తీసుకొచ్చింది. చాలమంది మిల్లెట్ సేద్యం పట్ల ఆసక్తి కనబర్చ లేదు అయినప్పటికి సుబాస వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం ఇచ్చిన మిల్లెట్ మిషన్ పథకంలో పాల్గొని తృణధాన్యాలను పండించి ఇతర మహిళలకు ఆదర్శవంతంగా నిలిచేలా విజయం సాధించింది. 2018 నుంచి తృణ ధాన్యాలను సేంద్రియ పద్ధతుల్లో పండించడం ప్రారంభించారు. మంచి లాభాలు వచ్చాయి ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. ఆమె ఎకరం భూమిలో 250 గ్రాముల రాగులను విత్తించి, ఎనిమిది క్వింటాళ్లను పండించింది. అంతేగాదు ఆమె 2023 కల్లా ఆమె ఎనిమిది ఎకరాల భూమిని లీజుకు తీసుకుని 60 క్వింటాళ్ల రాగులను పండించాలని భావిస్తోంది. ఈ ఏడాది మార్చిలో తృణధాన్యాలపై జరిగిన ప్రపంచ సదస్సులో మొహంత కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీతో ఆమె కొంతసేపు మాట్లాడే అరుదైన అవకాశం వచ్చింది. తాజాగా జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వనం వచ్చింది. కాగా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో జీ-20 సదస్సులో మిల్లెట్స్కు ప్రాధాన్యం కల్పించడంతో అందులో విజయవంతమైన ఈ గిరిజన మహిళా రైతులిద్దర్నీ ఆహ్వానించారు. (చదవండి: ఎడారి ప్రాంతంలో సాగు...‘జాయ్’ఫుల్గా కరువుకు చెక్!) -
హస్తినకు ‘పొందూరు’ కళాకారులు
పొందూరు: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరుగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన ముగ్గురు ఖాదీ కార్మికులకు ప్రత్యేక ఆహ్వనం అందింది. కేంద్ర ప్రభుత్వ ‘జన్ భాగీదారి’ దార్శనికతకు అనుగుణంగా దేశంలోని 75 మంది వడుకు, నేత కార్మికులకు ఎర్రకోటలోని వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. అందులో పొందూరుకు చెందిన బల్ల భద్రయ్య–లక్ష్మి దంపతులతో పాటు జల్లేపల్లి సూర్యకాంతంకు అదృష్టం దక్కింది. గుర్తింపు లభించిందిలా.. పొందూరులోని చేనేతవాడకు చెందిన బల్ల భద్రయ్య 35 ఏళ్లుగా చేనేత వృత్తిలో ఉన్నారు. పొందూరు ఏఎఫ్కేకే సంఘంలో 15 ఏళ్లు ఫైన్ ఖాదీ పంచెలు (దోవత్) నేయడంలో ఎంతో నైపుణ్యం గల వ్యక్తిగా గుర్తింపు పొందారు. నూరవ కౌంట్ (ఫైన్) చిలపను తయారు చేసి వస్త్రం నేసేందుకు సంప్రదాయంగా అవసరమైన దారాన్ని తీయడంలో జల్లేపల్లి సూర్యకాంతం మంచి నేర్పరితనం కనబరచడంతో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఆమెకు అవకాశం వచ్చింది. -
అయోధ్యలో ప్రతిష్టాపనకు ప్రధానికి ఆహ్వానం
అయోధ్య: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. జనవరిలో జరుగనున్న ఆలయ ప్రారంబోత్సవానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. గర్భాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. విగ్రహ ప్రతిష్టాపన వేడుకలో పాల్గొనాలని కోరుతూ ప్రధాని మోదీకి అధికారికంగా ఆహా్వనం పంపించినట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి 24వ తేదీల మధ్య సమయం ఇవ్వాలని కోరామని, ఈ మేరకు ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ సంతకంతో లేఖ రాశామని తెలిపారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి దేశ విదేశీ ప్రముఖులతోపాటు లక్షలాది మంది సామాన్య భక్తులు తరలివస్తారని, ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ట్రస్టు భావిస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ 2020 ఆగస్టులో స్వయంగా భూమిపూజ చేశారు. -
జాతీయ బాలల పురస్కారాలు.. దరఖాస్తులకు ఆహ్వానం
సాక్షి, విజయవాడ: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారాలు-2024 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. ఏపీకి చెందిన వివిధ రంగాలలో ప్రత్యేక ప్రతిభ కనబర్చిన 18 సంవత్సరాల లోపు బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. క్రీడలు, సామాజిక సేవా రంగం, ధైర్య సాహసాలు, నూతన ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ , సాంస్కృతిక సంప్రదాయాలు, శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానం రంగాల్లో ప్రతిభ కనబర్చిన బాలలు 31, ఆగస్టు, 2023 లోపు http://awards.gov.in వెబ్ సైట్ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అప్పారావు తెలిపారు. -
ఎన్డీఏ సమావేశానికి జనసేన అధినేత పవన్కు ఆహ్వానం.. వణికిపోతున్న చంద్రబాబు..!
-
జూన్ 9న వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్, వాళ్లకు మాత్రమే ఆహ్వానం..!
-
జీ-20 లోగోను వస్త్రంపై నేసిన హరిప్రసాద్
-
చనిపోయిన వ్యక్తి కళ్లు, వెంట్రుకలతో బొమ్మ తయారీ.. చూసేందుకు క్యూ కడుతున్న జనం!
నేరాలు ఘోరాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో మళ్లీ ఎవరో ఎవరినో చంపి సంచిలో మూటకట్టి ఇలా పడేశారేమిటి అని అనుకుంటున్నారా.. అయితే మీరు గోనెసంచిలో కాలు వేసినట్లే. చూడ్డానికి అచ్చం మనిషిలాగే కనిపిస్తున్న ఈ బొమ్మ పేరు జార్జ్. చార్లెస్ రాస్ అనే పురావస్తు నిపుణుడు తయారు చేశాడు. ఒక గుర్తు తెలియని వ్యక్తి 1930లో చనిపోతే అతని కళ్లు, వెంట్రుకలు తీసి, ఈ బొమ్మకు అమర్చాడు. ఇతనికి దెయ్యాల భవంతి కంటే భయం పుట్టించే భవనాన్ని ఏర్పాటు చేయటం ఇష్టం. ఇందుకోసం వివిధ రకాల భయంకరమైన బొమ్మలు, వస్తువులు తయారు చేసేవాడు. వీటన్నింటినీ నాటింగ్హామ్లోని హాంటెడ్ మ్యూజియంలో ప్రదర్శించేవాడు. చార్లీ ఈ జార్జ్ బొమ్మ పెట్టగానే, రోజూ అక్కడికి వచ్చే సందర్శకులు సంఖ్య పెరిగి, చార్లీ ఫేమస్ అయ్యాడు. ఈ మధ్యనే బీబీసీ చానెల్లో ప్రసారమయ్యే ‘బార్గైన్ హంట్’కు ఆహ్వానం కూడా అందుకున్నాడు. అక్కడికి చార్లీ తను తయారు చేసిన కొన్ని బొమ్మలను తీసుకెళ్లడంతో భయంకరమైన ఈ జార్జ్ బొమ్మ ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ జార్జ్ బొమ్మను చూస్తుంటే సినిమాల్లోని అనాబెల్, చూకీ బొమ్మల కంటే భయంకరంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో చాలామంది కామెంట్లు పెడుతున్నారు. -
Sakshi Excellence Awards: ప్రతిభకు పట్టం కడదాం..
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఏదైనా పట్టం కడదాం. రంగం ఏదైనా ప్రతిభే కొలమానం. అంటూ ప్రతి ఏటా వివిధ రంగాల్లో ప్రతి భావంతులను గుర్తించి 'సాక్షి'ఎ క్సలెన్స్ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా.. 'సాక్షి' వెలికితీసి గౌరవిస్తోంది. సమాజ హితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన 'జ్యూరీ అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయించి ప్రకటిస్తోంది. ప్రతీ ఏడాదిలాగే ఈసారి కూడా 'సాక్షి' ఎక్స లెన్స్ అవార్డుల కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. 2022కు సంబంధించి ఎంట్రీలు పంపవచ్చు. అవార్డుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఆసక్తి గల వారు ఏప్రిల్ 15, 2023 సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను పంపించ అప్లోడ్ చేసే వెసులుబాటు ఉంది. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా.. ఆయా వ్యక్తులు, సం స్థల తరపున కూడా ఎంట్రీలను పంపవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి జ్యూరీ ప్రత్యేక ప్రశంస' కూడా లభించవచ్చు. నైపుణ్యాలను ప్రశంసించ డం, సేవలను కొనియాడటం, సాధనను అభి. సందించడం ఎవరైనా చేయదగినవే. ఈ భావన కలిగినవారంతా తమ ఎరుకలో ఉన్న ఇటువంటి ప్రతిభామూర్తులను గుర్తించి, వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని 'సాక్షి' అభిలషిస్తోంది. 'సాక్షి' చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్ ఫారంలో ఇచ్చిన చిరునామాకు పంపించవచ్చు. లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు www.sakshiexcellenceawards.com వెబ్సైట్కు లాగిన్ కావచ్చు. పూర్తి వివరాల కోసం పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23256134 నంబర్పై గాని మెయిల్ ఐడీలో గానీ సంప్రదించవచ్చు. sakshiexcellenceawards@sakshi.com (చదవండి : సేవకు మకుటం.. ప్రతిభకు పట్టం) కేటగిరీలు ఇలా: ప్రధాన అవార్డులు (జ్యూరీ బేస్డ్) ☛ ఎక్స్లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ☛ ఎక్స్లెన్స్ ఇన్ సోషల్ డెవలప్ మెంట్ ☛ ఎక్స్లెన్స్ ఇన్ హెల్త్ కేర్ – వ్యక్తి/ సంస్థ ☛ ఎక్స్లెన్స్ ఇన్ ఫార్మింగ్ ☛ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్– లార్జ్ స్కేల్ ☛ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్/ మీడియం ☛ ఎక్స్లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ ☛ ఎక్స్లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్– కార్పొరేట్ ☛ ఎక్స్లెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్– NGO యంగ్ అచీవర్స్ (జ్యూరీ బేస్డ్) ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– ఎడ్యుకేషన్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– సోషల్ సర్వీస్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – ఇండివిడ్యువల్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – కార్పొరేట్ ☛ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ – NGO -
టీటీడీ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆహ్వానం
సాక్షి, తిరుపతి/ఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పరిధిలో జరగబోయే ఓ కార్యక్రమం కోసం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆహ్వానం వెళ్లింది. టీటీడీలో నిర్మించబోయే ఉడిపి మఠం భూమి పూజకు ఆయన్ని ఆహ్వానించారు బీజేపీ జాతీయస్థాయి సభ్యుడు, ఆ పార్టీ జాతీయ మీడియా ఇంచార్జి పెరిక సురేష్. ఈ మేరకు పలువురు ప్రతినిధులతో కలిసి వెళ్లిన సురేష్.. పార్లమెంట్ హౌజ్లో స్పీకర్ ఓం బిర్లాను కలిసి, ఆయనకు శాలువా కప్పి సాదరంగ భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానం అందించారు. ఇదీ చదవండి: కొల్లేరు పక్షుల లెక్క తేలింది -
దీపికా పదుకోన్కు అరుదైన గౌరవం
బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకోన్కు ఆస్కార్ అవార్డు కమిటీ నుంచి ఆహ్వానం అందింది. మార్చి 12న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) లాస్ ఏంజిల్స్లో ఆస్కార్ వేదికపై మెరవనున్నారామె. జిమ్మి కెమ్మల్ హోస్ట్గా జరగనున్న 95వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో ఓ ప్రెజెంటర్గా వ్యవహరించనున్నారు దీపికా పదుకోన్. ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవ తొలి దశ ప్రెజెంటర్స్ 16 మంది జాబితాను నిర్వాహకులు ప్రకటించారు. రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, మైఖేల్ బి జోర్డాన్, గ్లెన్ క్లోజ్, శ్యాముల్ ఎల్. జాక్సన్, డ్వేన్ జాన్సన్, జోయ్ సాల్డానా, జెన్నిఫర్ కొన్నెల్లీ తదితర హాలీవుడ్ తారలు ఉన్న ఈ జాబితాలో దీపికా పదుకోన్ ఉన్నారు. ఇక 2017లో జరిగిన ఆస్కార్ ఆఫ్టర్ పార్టీ (అవార్డుల ప్రదానోత్సవం తర్వాత జరిగే పార్టీ)లో పాల్గొన్న దీపికా ఈసారి ఓ ప్రెజెంటర్గా ఈవెంట్కు వెళ్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రెజెంటర్స్ మలి జాబితా లోనూ ఇండియన్ స్టార్స్ ఉంటారా? అనే విషయం తెలియాలంటే కొంత సమయం వేచి ఉండాలి. ఇక ‘బెస్ట్ ఒరిజి నల్ సాంగ్’ విభాగంలో అవార్డు కోసం ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్కార్ వేదికపై లైవ్లో ఈ పాట పాడనున్నారు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్. కీరవాణి స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా ప్రేమ్రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ గత ఏడాది మార్చిలో విడుదలైన సంగతి తెలిసిందే. మొదలైన ఓటింగ్ ఆస్కార్ అవార్డు విజేతలకు సంబంధించిన ఆన్లైన్ ఓటింగ్ గురువారం ఆరంభమైంది. ఈ ఓటింగ్ మార్చి 7 వరకు జరుగుతుంది. ఆస్కార్ అకాడమీలో పదివేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరందరూ ఆన్లైన్లో ఓటింగ్ వేస్తారు. ఓటర్స్లో ఉన్న యాక్టర్స్ ‘యాక్టింగ్’ విభాగానికి, ఎడిటర్స్ ‘ఎడిటింగ్’ విభాగానికి.. ఇలా ఇతర విభాగాలకు చెందినవారు ఆ విభాగానికి ఓట్లు వేస్తారు. కానీ ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’, ‘యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్’ విభాగాల ఓటింగ్కు మాత్రం ప్రత్యేక నియమ నిబంధనలున్నాయి. అలాగే బెస్ట్ పిక్చర్స్ విభాగానికి ఆస్కార్ ఓటర్స్ అందరూ ఓటు వేయొచ్చు. ఓటింగ్ పూర్తయ్యాక ఆ ఫలితాలు ప్రైస్వాటర్హౌస్కూపర్స్ సంస్థ వద్ద ఉంటాయి. అవార్డులను అధికారికంగా ప్రకటించడానికి ముందు ప్రైస్వాటర్హౌస్కూపర్స్ (ఆస్కార్ ఆన్లైన్ ఓటింగ్ రిజల్ట్స్ సెక్యూరిటీని చూసేవారు)కు చెందిన ఇద్దరు వ్యక్తులకు మాత్రమే విజేతలు ఎవరో తెలుస్తుందని అవార్డు కమిటీ పేర్కొంది. బెస్ట్ పిక్చర్ ఓటింగ్ ఇలా.. బెస్ట్ పిక్చర్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న చిత్రాలకు ఆస్కార్ ఓటర్లు 1, 2, 3.. అంటూ ర్యాంకింగ్లు ఇస్తారు. ఓటర్లందరూ ర్యాంకింగ్లు ఇచ్చిన తర్వాత ఏ చిత్రం యాభైశాతం ఓటర్ల ఫేవరెట్గా నిలుస్తుందో అదే బెస్ట్ పిక్చర్గా నిలుస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’కు స్టాండింగ్ ఒవేషన్ ఆస్కార్ ప్రమోషన్స్లో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్లో హీరో రామ్చరణ్ (మరో హీరో ఎన్టీఆర్ సోమవారం అమెరికా వెళ్తారని తెలిసింది), దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్కుమార్ అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ను ఈ నెల 3న రీ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా లాస్ ఏంజిల్స్లోని ప్రముఖ ఏస్ హోటల్ థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ను ప్రదర్శించారు. షో పూర్తయ్యాక ‘ఆర్ఆర్ఆర్’కు స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ – ‘‘ఓ నటుడిగా ఈ క్షణాలను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను. ఎంత కష్టపడైనా సరే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలన్నదే నా లక్ష్యం. రాజమౌళిగారితో పని చేస్తే సినిమాల పట్ల నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. ఆయన నాకు ప్రిన్సిపాల్, గురువులాంటివారు. ‘ఆర్ఆర్ఆర్’తో తారక్ (ఎన్టీఆర్) నాకు ఇంకా ఇంకా దగ్గరయ్యాడు’’ అన్నారు. -
నాటా తెలుగు మహాసభలకు సీఎం జగన్కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: నాటా తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వనం అందింది. ఈ మేరకు నాటా ప్రెసిడెంట్, సభ్యులు సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయం వెళ్లి.. ఆయన్ని కలిసి ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్ను ఆహ్వానించిన వాళ్లలో నాటా ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్రెడ్డి కొరసపాటి, నాటా సభ్యులతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్ రెడ్డి భీమిరెడ్డి కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. 2023 జూన్ 30 – జులై 02 వరకు డాలస్లోని డాలస్ కన్వెన్షన్ సెంటర్లో నాటా తెలుగు మహాసభలు జరగనున్నాయి. -
Divorce Celebration: వివాహ రద్దు వేడుక.. ఆహ్వాన ప్రతిక చూశారా!
వివాహం అనేది మనుషులు జీవితాల్లో ముఖ్యమైన ఘట్టం. అందుకే పెళ్లి జ్ఞాపకాలు చిరకాలం గుర్తుండిపోయేలా వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటారు. ఆలుమగల మధ్య అంతా సవ్యంగా సాగితే ఏ సమస్యా ఉండదు. పొరపొచ్చాలు వస్తే పెళ్లి కాస్తా పెటాకులు అవుతుంది. ఇటీవల కాలంలో విడాకులు అనేవి సాధారణంగా మారిపోయాయి. రాజీపడి బతకడానికి ఎవరు ఇష్టపడటం లేదు. విడాకులు తీసుకుని ఎవరికి వారు హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తున్నవారు ఎంతో మంది మనకు కనబడుతున్నారు. ఇక విషయానికి వస్తే వెడ్డింగే కాదు విడాకులను కూడా సెలబ్రెట్ చేసుకుంటామంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఇన్విటేషన్ తెగ వైరలయింది. రెండున్నరేళ్ల పాటు కోర్టులు చుట్టూ తిరిగి డివోర్స్ సాధించిన 18 మంది పురుషులు తమ ‘సింగిల్’ స్టేటస్ను సెలబ్రెట్ చేసుకోవాలని అనుకుని.. ఈ ఆహ్వానపత్రికను తయారు చేయించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారులోని బిల్ఖిరియాలోని రిసార్ట్లో సెప్టెంబర్ 18న ఈ కార్యక్రమం తలపెట్టారు. భాయి వెల్ఫేర్ సొసైటీ అనే ఎన్జీవో ఆధ్వర్యంలో ‘వివాహ రద్దు’ను వేడుకగా చేసుకోవాలని నిర్ణయించారు. స్వేచ్ఛ లభించినపుడు సెలబ్రెట్ చేసుకోవడంలో తప్పేంలేదని, విడాకుల అనంతర జీవితం కూడా ఆనందంగానే సాగుతుందన్న సందేశం ఇవ్వడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు భాయి వెల్ఫేర్ సొసైటీ చెప్పుకొచ్చింది. తాము మహిళలకు వ్యతిరేకం కాదని.. చట్టాలను దుర్వినియోగం కాకుండా చూడాలన్నదే తమ అభిమతమని వివరణయిచ్చింది. అన్నట్టు విడాకుల కేసులతో సమస్యలను ఎదుర్కొంటున్న పురుషుల కోసం ఈ ఎన్జీవో హెల్ప్లైన్ను కూడా నడుపుతోందట! వివాహ రద్దు వేడుక సాగేదిలా.. పెళ్లి తంతుకు రివర్స్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పెళ్లి దండలను నిమజ్జనం చేయడం, జెంట్స్ సంగీత్, సద్బుద్ధి శుద్ధీకరణ యజ్ఞం వంటి క్రతువులు చేస్తారు. మనుషుల గౌరవాన్ని కాపాడతామని ఏడడుగుల సాక్షిగా ప్రమాణం చేయిస్తారట. (క్లిక్ చేయండి: పెళ్లి అనుకుంటే లొల్లి) సంప్రదాయవాదుల మండిపాటు భాయి వెల్ఫేర్ సొసైటీ నిర్వహించ తలపెట్టిన వివాహ రద్దు కార్యక్రమంపై సంప్రదాయవాదులు తీవ్రస్థాయిలో మడిపడుతున్నారు. కొన్ని స్థానిక హిందూ సంస్థలు కూడా ఆక్షేపించడంతో నిర్వాహకులు వెనక్కు తగ్గారు. ‘ప్రైవేట్ ఈవెంట్’ను రాజకీయం చేయాలని తాము కోరుకోవడం లేదని.. అందుకే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు. (క్లిక్ చేయండి: చెప్పులతో చితక్కొట్టుకున్న అంకుల్స్..) -
జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పథకం కింద ప్రపంచంలో టాప్ 200లోపు క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఈ వర్గాలకు చెందిన 35 ఏళ్లలోపువారు జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోవచ్చు. చదవండి: రామోజీ ‘మేనేజ్మెంట్’కు ఇదో ఉదాహరణ డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియెట్ల్లో 60 శాతం మార్కులు/తత్సమాన గ్రేడ్ కలిగి ఉండాలి. ఎంబీబీఎస్ కోర్సుకు నీట్లో అర్హత సాధించి ఉండాలి. ప్రపంచంలో టాప్ 100లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో ప్రవేశం పొందితే ప్రభుత్వమే 100 శాతం ఫీజు చెల్లిస్తుంది. 101 నుంచి 200లోపు ర్యాంకు కలిగినవాటిలో అడ్మిషన్ పొందితే రూ.50 లక్షలు, 50 శాతం ఫీజుల్లో ఏది తక్కువ అయితే అది ప్రభుత్వం భరిస్తుంది. అర్హులైన విద్యార్థులు సెపె్టంబర్ 30లోగా https://jnanabhumi.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కె.హర్షవర్దన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
నయన్-విఘ్నేష్ ఆహ్వానం అదిరింది
హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ పెళ్లి షాపింగ్, ఆహ్వానపత్రికలు పంపడం, పెళ్లి వేడుకలకు సంబంధించిన ప్లాన్స్తో బిజీ బిజీగా ఉంటున్నారు. జూన్ 9న ఈ ఇద్దరూ పెళ్లాడనున్నారు. బంధువులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే కొందరు అతిథులకు ‘డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్’ని కూడా పంపించారట. ఆ వీడియో ఇన్విటేషన్ వైరల్గా మారింది. ఈ పత్రిక ప్రకారం నయన–విఘ్నేష్ తమిళనాడులోని మహాబలిపురంలో పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో పెళ్లి అని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహాబలిపురం అని ఇన్విటేషన్ స్పష్టం చేస్తోంది. ఓ రిసార్ట్లో ఈ వేడుక జరుగుతుందట. కాగా.. ఆకాశం, అందమైన ఇల్లు, చుట్టూ పచ్చని చెట్లతో డిజైన్ చేసిన డిజిటల్ ఇన్విటేషన్ కార్డ్ అదిరిందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. -
దత్త పీఠాధిపతి పుట్టిన రోజు వేడుకలకు సీఎం జగన్కు ఆహ్వానం
సాక్షి, అమరావతి: అవదూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ 80వ పుట్టిన రోజు వేడుకలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని దత్తపీఠం ప్రతినిధులు ఆహ్వానించారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన దత్తపీఠం ప్రతినిధులు ఆహ్వాన పత్రాన్ని అందించారు. సీఎంను కలిసిన వారిలో దత్తపీఠం ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ హెచ్వీ ప్రసాద్, ట్రస్టీ రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులున్నారు. చదవండి: ఏది నిజం: రోడ్లపై గుంతలా? రామోజీ కళ్లకు గంతలా? -
సీఎం జగన్ కు తల్లిదండ్రుల ధన్యవాదాలు
-
జగనన్న పాలనపై వ్యాసాలకు ఆహ్వానం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాహసోపేత నిర్ణయాలతో జరుగుతున్న జన రంజక పాలనపై వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమం, వాలంటీర్ల వ్యవస్థ, రైతుభరోసా, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, వాహనమిత్ర, వసతి దీవెన, విద్యా దీవెన... ఇలా ప్రభుత్వ పనితీరులో చోటుచేసు కున్న మార్పులను విశ్లేషించాలి. చదవండి: ప్రజాదరణ చూసి ఓర్వలేక కుట్రలు మీ వ్యాసం సరళమైన తెలుగులో, 500–800 పదాల మధ్య ఉండాలి. వాట్సప్లో లేదా పేజ్ మేకర్ 7.0 లేదా యూనికోడ్లో టైపు చేసిన ఓపెన్ డాక్యుమెంట్లు మాత్రమే పంపించాలి. బహుమతులకు ఎంపికైన 20 వ్యాసాలే కాక మంచి విశ్లేషణ గల మరో 20 వ్యాసాలను కలిపి పుస్తకంగా ప్రచురిస్తాం. మొదటి (రూ.10 వేలు), రెండు (రూ.5 వేలు), మూడు (రూ.3 వేలు), నాలుగు (రూ.2 వేలు), ఐదు (రూ.1000) బహుమతులతోపాటు ప్రచురించిన ప్రతి వ్యాసానికీ రూ. 1000 ఇస్తాం. బహుమతి ప్రదానం పుస్తకావిష్కరణ రోజే ఉంటుంది. వ్యాసాలు పంపడానికి ఆఖరు తేదీ: 2022 ఏప్రిల్ 30. పంపాల్సిన వాట్సాప్ నంబర్: 9393111740. ఈ–మెయిల్: srdalitsocialmedia@gmail.com – డా.జి.కె.డి.ప్రసాద్, వైఎస్ఆర్ దళిత్ సోషల్ మీడియా, విశాఖపట్నం -
రెడ్డి శాంతి కుమార్తె వివాహానికి సీఎం జగన్కు ఆహ్వానం
సాక్షి, ఎల్.ఎన్.పేట: పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె, ఐఏఎస్ అధికారి రెడ్డి వేదిత వివాహ రిసెప్షన్ నవంబర్ 9న పాతపట్నంలో జరగనుంది. ఈ వేడుకకు రావాలని కోరుతూ.. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి ఆహ్వానపత్రికను అందజేశారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేతో పాటు ఆమె కుమారుడు రెడ్డి శ్రావణ్కుమార్ ఉన్నారు. చదవండి: (రాష్ట్రాభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం) చదవండి: (Andhra Pradesh: చిట్టి చెల్లెమ్మకు 'స్వేచ్ఛ') -
ప్రధాని మోదీకి చినజీయర్ స్వామి ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా.. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని ప్రధాని మోదీని త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వానించారు. శనివారం ఆయనతోపాటు మైహోం గ్రూపు చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నామని, అందులో పాల్గొని 216 అడుగుల భగవద్ రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరారు. భేటీ అనంతరం వివరాలతో ప్రకటన విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న రామానుజుల మహావిగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారని అందులో తెలిపారు. ‘‘శ్రీరామానుజుల దివ్యత్వం ప్రధానికి తెలుసు. ఆయన 70వ స్వాతంత్య్ర వేడుకల్లో ఎర్రకోట బురుజు నుంచి రామానుజుల వైభవాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సంరంభానికి రావాలని, 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించాలని చినజీయర్ స్వామి ఆహ్వానించగా.. ప్రధాని మోదీ అంగీకరించారు. ప్రపంచానికి సమతా సందేశాన్ని అందించే లక్ష్యంతో రామానుజుల మహా విగ్రహాన్ని రూపొందించడం అభినందనీయమంటూ..చినజీయర్ స్వామి సంకల్పాన్ని కొనియాడారు’’ అని వెల్లడించారు. పెద్దలందరికీ ఆహ్వానం ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, రాజ్నాథ్సింగ్, అమిత్షా, కిషన్రెడ్డి, నితిన్ గడ్కరీ ఇతర కేంద్రమంత్రులు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్లను చినజీయర్ స్వామి స్వయంగా కలిసి మహోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. 1,035 హోమగుండాలతో ప్రత్యేక యాగం ముచ్చింతల్లోని దివ్య సాకేతంలో 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగబోయే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1,035 హోమగుండాలతో ఈ యాగం చేస్తారు. 2 లక్షల కిలోల ఆవునెయ్యితోపాటు ఇతర హోమ ద్రవ్యాలను వినియోగించనున్నారు. చదవండి: 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు చూసి -
రాజమౌళన్నా.. కూర ప్రభాకర్ ఏం జేస్తుండు: సీఎం కేసీఆర్
సాక్షి, దుబ్బాక టౌన్: ‘దుబ్బాకకు రాక చాలా రోజులు అవుతోంది. మనోల్లంతా బాగున్నరా రాజమౌళన్నా.. కూర ప్రభాకర్ ఏం జేస్తుండు.. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. బాలాజీ ఆలయ ప్రారంభోత్సవంలో తప్పకుండా పాల్గొంటా.. ఆ రోజు అందరినీ కలుస్తా..’అంటూ ఆహ్వాన పత్రిక అందజేయడానికి ప్రగతి భవన్కు వచ్చిన దుబ్బాక నాయకులతో సీఎం కేసీఆర్ ముచ్చటించారు. శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలసి దుబ్బాక బాలాజీ ఆలయ కమిటీ బాధ్యులు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆగస్టు 20న ఆలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణ చిత్రాలు చూశానని, చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. దుబ్బాక బాలాజీ ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచుతుందని చెప్పారు. నిర్మాణం పూర్తయ్యాక చినజీయర్ స్వామితో కలసి ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకుందామని సీఎం వివరించారు. ఈ సందర్భంగా వారిని పేరుపేరున పలకరించడంతో పాటు దుబ్బాకలో తన చిన్ననాటి మిత్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు వడ్లకొండ సుభద్ర శ్రీధర్, చింత రాజు, రొట్టె రాజమౌళి, మధు, కూర వేణుగోపాల్, శ్రీనివాస్ తదితరులున్నారు. -
చిన్నమ్మకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లు
సాక్షి,చెన్నై: చిన్నమ్మ శశికళ రాక కోసం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాల్లో ఎదురుచూపులు పెరిగాయి. ఆమెకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. కోర్టు విధించిన రూ.10 కోట్ల 10 లక్షల జరిమానాను చిన్నమ్మ తరఫు న్యాయవాదులు చెల్లించిన విషయం తెలిసిందే. ఈ చెల్లింపునకు తగ్గ రశీదులు, చిన్నమ్మ జైలు జీవితం, విడుదలకు తగ్గ విజ్ఞప్తితో కూడిన ఓ పిటిషన్ను ఆమె తరఫు న్యాయవాదులు గురువారం బెంగళూరు పరప్పన అగ్రహార జైలు వర్గాలకు సమర్పించారు. దీంతో చిన్నమ్మ ఒకటి రెండు రోజుల్లో జైలు నుంచి బయటకు రావచ్చన్న ఎదురుచూపుల్లో న్యాయవాదులు ఉన్నారు. ముందుగానే చిన్నమ్మ వచ్చేస్తున్నారని ఆమె న్యాయవాది రాజాచెందూర్ పాండియన్ చెబుతుండడంతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాల్లో ఎదురు చూపులు పెరిగాయి. చిన్నమ్మకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. కళగం ముఖ్యనేతలు మాత్రమే బెంగళూరుకు పయనం కావడం, మిగిలిన నేతలందరూ తమిళనాడు– కర్ణాటక సరిహద్దుల్లో ఉండి, చిన్నమ్మకు ఆహ్వానం పలికేందుకు తగ్గట్టుగా కార్యాచరణ సిద్ధం చేసి ఉండడం గమనార్హం. హొసూరు నుంచి చెన్నై వరకు జాతీయరహదారిలోని కొన్ని ఎంపిక చేసిన పట్టణ ప్రవేశ ద్వారాల వద్ద చిన్నమ్మకు ఆహ్వానం పలికేందుకు తగ్గట్టుగా పార్టీ వర్గాలు ఏకమయ్యేందుకు నిర్ణయించారు. 60 చోట్ల బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై అమ్మ శిబిరం పరుగులు తీస్తుండడం చూస్తే, మరికొద్ది రోజుల్లో చిన్నమ్మ బయటకు వచ్చేస్తారేమో అన్న ఎదురుచూపులు పెరిగాయి. (కొత్త పార్టీ స్థాపన దిశగా అళగిరి) -
సీఎం జగన్ను కలిసిన కాణిపాకం అర్చకులు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కాణిపాకం ఆలయ అర్చకులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వినాయకచవితి పురస్కరించుకొని కాణిపాకంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సావాలకు హాజరు కావాలని సీఎం జగన్కు ఆహ్వనపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు జగన్కు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎంఎస్ బాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
మా పెళ్లికి రండి : కేసీఆర్కు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: యంగ్ హీరో నితిన్ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తన వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆహ్వానం పలికారు. ప్రగతి భవన్లో కేసీఆర్కు స్వయంగా శుభలేఖను అందజేసి వివాహానికి హాజరై ఆశీర్వదించాలని నితిన్ కోరారు. నితిన్తోపాటు ఆయన తండ్రి సుధాకర్రెడ్డి కూడా సీఎం కేసీఆర్ను కలిశారు. కాగా, ఈనెల 26న తన ప్రేయసి షాలినితో నితిన్ మనువాడబోతున్నారు. ఫిబ్రవరి15న నితిన్ షాలినిల నిశ్చితార్థం చేసుకోగా ఇక ఏప్రిల్ 16న మోగాల్సిన పెళ్లి బాజాలు కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత సన్నిహితులు సమక్షంలో తన ప్రేయసి మెడలో మూడుముళ్లు వేయనున్నారు నితిన్. -
ప్రతిభకు పట్టం కడదాం
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఏదైనా పట్టం కడదాం... రంగం ఏదైనా ప్రతిభే కొలమానం... ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ‘సాక్షి’ఎక్సలెన్స్ అవార్డ్స్ 6వ ఎడిషన్కు ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. త్యాగం, నైపుణ్యం, ప్రతిభ, కళ ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వెలికితీస్తోంది. సమాజహితం కోరే ముఖ్యులతో ఏర్పాటైన ‘జ్యూరీ’సాక్షికి లభించిన ఎంట్రీల నుంచి విజేతలను నిర్ణయించి ప్రకటిస్తోంది. ఈ ఏడాది 6వ ఎడిషన్ అవార్డుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 31వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీలను అందజేయవచ్చు. ఈసారి ఎంట్రీలను ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయవచ్చు. ప్రతిభను గుర్తెరిగిన ఇతరులెవరైనా ఆయా వ్యక్తులు, సంస్థల తరఫున కూడా ఎంట్రీలను పంపించవచ్చు. కొన్ని అంశాల్లో యువతరానికి, ప్రవాస భారతీయులకు కూడా అవార్డులు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ‘జ్యూరీ ప్రత్యేక ప్రశంస’కూడా లభించవచ్చు. నైపుణ్యాలను ప్రశంసించడం, సేవల్ని కొనియాడటం, సాధనను అభినందించడం ఎవరైనా చేయదగినదే. ఈ భావన కలిగిన వారంతా తమ ఎరుకలో ఉన్న ఇటువంటి ప్రతిభామూర్తుల్ని గుర్తించి వారి పేర్లను ప్రతిపాదిస్తూ అవార్డుల కోసం ఎంట్రీలను పంపుతారని ‘సాక్షి’అభిలషిస్తోంది. సాక్షి చేస్తున్న ఈ కృషికి అందరూ చేయూతనివ్వండి. నామినేషన్ల ఎంట్రీలను నేరుగా అప్లికేషన్ ఫామ్లో ఇచ్చిన చిరునామాకు పంపించవచ్చు లేదా ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు www. sakshiexcellence awards. com వెబ్సైట్కు లాగిన్ కావచ్చు. పూర్తి వివరాల కోసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు (వర్కింగ్ డేస్లో) 040–23322330 ఫోన్ నంబర్ లేదా sakshiexcellence awards2019 @sakshi. com ఈ–మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. -
టోక్యో పిలుపు కోసం...
భువనేశ్వర్: భారత పురుషుల, మహిళల హాకీ జట్లు టోక్యో వెళ్లే దారిలో పడ్డాయి. ఒలింపిక్స్ బెర్తులే లక్ష్యంగా ఇరు జట్లు పోటీలకు సిద్ధమయ్యాయి. ఎఫ్ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్లో శుక్రవారం పురుషుల జట్టుకు తమకంటే దిగువ ర్యాంకులో ఉన్న రష్యా ఎదురవగా... మహిళల జట్టుకు మాత్రం అమెరికా రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురైంది. ఒలింపిక్స్ పయనంలో భారత జట్లు కేవలం రెండే విజయాల దూరంలో ఉన్నాయి. ఐదో ర్యాంక్లో ఉన్న భారత పురుషుల జట్టు 22వ ర్యాంకర్ రష్యాపై గెలవడం ఏమంత కష్టం కాకపోవచ్చు. కానీ భారత కోచ్ గ్రాహం రీడ్ మాత్రం ప్రత్యర్థి అంత సులువని తాము అంచనా వేయబోమని చెప్పారు. ‘మనది కాని రోజంటూ ఉంటే ఒలింపిక్స్ కలలు నీరుగారతాయని మాకు తెలుసు. అందుకే నిర్లక్ష్యానికి, అలసత్వానికి ఏమాత్రం తావివ్వం. ఈ రెండు మ్యాచ్లు మాకు కీలకం’ అని అన్నాడు. రీడ్ కోచింగ్లో భారత రక్షణ శ్రేణి మెరుగైంది. గత 12 నెలల కాలంలో సురేందర్ కుమార్, హర్మన్ప్రీత్ సింగ్లతో భారత డిఫెన్స్ పటిష్టమైంది. డ్రాగ్ఫ్లికర్లు రూపిందర్ పాల్ సింగ్, బీరేంద్ర లక్రాలు ఫామ్లో ఉన్నారు. మైదానంలో పాదరసంలా కదులుతూ ప్రత్యర్థి గోల్పోస్ట్వైపు దూసుకెళుతున్నారు. మిడ్ఫీల్డ్లో కెప్టెన్ మన్ప్రీత్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, వివేక్సాగర్ ప్రసాద్లు ఆశించిన స్థాయిలో రాణిస్తే రష్యాపై భారత్ సులభంగానే గోల్స్ సాధిస్తుంది. అలాగే అనుభవజ్ఞుడైన గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ రష్యా దాడుల్ని సమర్థంగా నిరోధించగలడు. అమెరికాతో ఎలాగబ్బా! పురుషుల జట్టుకైతే సులువైన ప్రత్యర్థే! కానీ మహిళల జట్టుకే మింగుడుపడని ప్రత్యర్థి అమెరికా ఎదురైంది. ప్రపంచ 13వ ర్యాంకర్ అమెరికాతో భారత్కు 4–22తో పేలవమైన రికార్డు ఉంది. 22 సార్లు ప్రత్యర్థి చేతిలో ఓడిన మహిళల జట్టు ఈ మ్యాచ్లో ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందో చూడాలి. కెప్టెన్ రాణి రాంపాల్, డ్రాగ్ఫ్లికర్ గుర్జీత్ కౌర్, యువ ఫార్వర్డ్ ప్లేయర్ లాల్రెమ్సియామి, గోల్కీపర్ సవితలపై జట్టు ఆశలు పెట్టుకుంది. కోచ్ జోయెర్డ్ మరీనే మాట్లాడుతూ అమెరికాపై భారత్ గెలుస్తుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఈ మ్యాచ్ల కోసమే గత ఏడాది కాలంగా నిరీక్షిస్తున్నామని, గెలిచే సత్తా అమ్మాయిల్లో ఉందని చెప్పారు. కెప్టెన్ రాణి రాంపాల్ మాట్లాడుతూ ‘ఆసియా గేమ్స్తోనే టోక్యో బెర్తు సాధించాలనుకున్నాం. దురదృష్టవశాత్తు అనుకున్న ఫలితం రాలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం ఒలింపిక్స్ బెర్తు సాధించే తీరతాం’ అని చెప్పింది. -
కేసీఆర్కు మమతాబెనర్జీ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రతిపక్ష పార్టీలతో కలిసి నిర్వహించే ఈ ర్యాలీకి రావాలని తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావును ఆమె ఆహ్వానించారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ర్యాలీకి హాజరవుతుండటంతో ఆయనతో వేదిక పంచుకోవడం సరికాదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో కోల్కతా ర్యాలీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. -
‘పాక్ ఆహ్వానానికి ధన్యవాదాలు.. కానీ..’
న్యూఢిల్లీ: దాయాది పాకిస్తాన్ భూభాగంలో జరిగే కర్తార్పూర్ కారిడార్ శంకుస్థాపన ఆహ్వానంపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఈ నెల 28న జరగనున్న ఈ కార్యక్రమానికి పాక్ ప్రభుత్వం శనివారం సుష్మా స్వరాజ్ని ఆహ్వానించింది. దీనిపై సుష్మా ట్విటర్లో స్పందిస్తూ.. కర్తార్పూర్ కారిడార్ శంకుస్థాపనకు తనను ఆహ్వానించినందుకు ఆ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషికి ధన్యవాదాలు తెలిపారు. కానీ, నిర్ణయించిన షెడ్యూల్ రోజున ఆ కార్యాక్రమానికి తాను హాజరు కాలేకపోతున్నానని పేర్కొన్నారు. భారత్ తరఫున కేంద్ర మంత్రులు హర్ సిమ్రత్ కౌర్, హర్దీప్ సింగ్ పూరీలు ఆ కార్యక్రమానికి హాజరు కానున్నట్టు ప్రకటించారు. పాక్ ప్రభుత్వం కర్తార్పూర్ కారిడార్ నిర్మాణం వేగంగా చేపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా వీలైనంత తొందరగా భారతీయులు గురుద్వార్ కర్తార్పూర్ సాహిబ్లో ప్రార్థనలు చేసేందుకు ఈ కారిడార్ను ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికుల సౌకర్యం కోసం గుర్దాస్పూర్ నుంచి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవల భారత ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి స్పందనగా పాక్ కూడా సరిహద్దు నుంచి గురుద్వారా వరకు తామూ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించింది. కాగా, భారత భూభాగంలో జరిగే రహదారి నిర్మాణానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. -
ఆరెస్సెస్ వేదికపై రాహుల్!
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఆధ్వర్యంలో వచ్చే నెలలో ఢిల్లీలో జరగనున్న కార్యక్రమకానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ఆహ్వానించే అవకాశాలు కనబడుతున్నాయి. సెప్టెంబర్ 17–19 వరకు మూడ్రోజుల పాటు ‘భవిష్యత్ భారత్: ఆరెస్సెస్ దృక్పథం’ పేరుతో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆరెస్సెస్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ వేదిక ద్వారా భారతదేశంలో ప్రస్తుతం చర్చకు వస్తున్న అంశాలపై సంఘ్ అభిప్రాయాలను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ పంచుకుంటారు. దీంతోపాటుగా రాజకీయాలతోపాటు వివిధ రంగాల మేధావులతో విస్తృతమైన అంశాలపై చర్చించనున్నారు. అయితే ఇటీవల కొంతకాలంగా ఆరెస్సెస్పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీని కూడా ఈ కార్యక్రమానికి పిలవాలని ఆరెస్సెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ రాడికల్ గ్రూప్ అయిన ముస్లిం బ్రదర్ హుడ్తో ఆరెస్సెస్ను పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్ను సమావేశానికి ఆహ్వానించి.. ఆయనకు సంఘ్ గురించి అవగాహన కల్పించాలని ఆరెస్సెస్ భావిస్తోంది. ‘వివిధ రంగాల్లోని మేధావులు, ప్రముఖులతో భాగవత్ చర్చిస్తారు. జాతీయ ప్రాధాన్యమున్న అంశాల్లో సంఘ్ దృక్పథాన్ని వారితో పంచుకుంటారు’ అని సంఘ్ ప్రచార ప్రముఖ్ అరుణ్ కుమార్ వెల్లడించారు. రాహుల్కు భారత్ గురించి తెలియదు గతవారం లండన్ పర్యటనలో భాగంగా ఆరెస్సెస్పై రాహుల్ తీవ్రవ్యాఖ్యలు చేయడంపై అరుణ్ కుమార్ మండిపడ్డారు. ‘భారత్ గురించి అర్థం చేసుకోనన్ని రోజులు ఆరెస్సెస్ గురించి రాహుల్కు అర్థం కాదు. భారత్, భారత సంస్కృతి, వసుధైక కుటుంబకం అన్న గొప్ప ఆలోచన గురించి రాహుల్కు కనీస అవగాహన కూడా లేదు. ఇస్లామిక్ ఛాందసవాదం కారణంగా యావత్ప్రపంచం సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ విషయం రాహుల్కు అర్థం కాదు. క్షేత్రస్థాయి పరిస్థితులేంటో ఆయనకు తెలియదు’ అని విమర్శించారు. -
రాహుల్కు ఆహ్వానం పంపనున్న ఆరెస్సెస్!
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నాగ్పూర్లో జరిగిన ఆరెస్సెస్ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఐతే మరోసారి ఆరెస్సెస్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారుతోంది. సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు ఢిల్లీలో ఆరెస్సెస్ నిర్వహించనున్న కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నట్టు సమాచారం. అంతేకాకుండా సీపీఎంకు చెందిన సీతారాం ఏచూరితో పాటు మరికొందరు నాయకులను కూడా ఈ కార్యక్రమానికి పిలవనున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ఆరెస్సెస్ అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. సెప్టెంబర్లో జరిగే సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానించనున్నట్టు తెలిపారు. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా పేరుతో జరిగే ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అధ్యక్షత వహించనున్నారు. నాగపూర్లో ఆర్స్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీ హాజరవ్వడంపై రాహుల్ గాంధీ అధికారికంగా స్పందించలేదు. కానీ పలువురు కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రణబ్ ఆరెస్సెస్ కార్యక్రమానికి వెళ్లడంపై సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని తెలియజేశారు. అయితే ఆ కార్యక్రమంలో ప్రణబ్ చేసిన ప్రసంగాన్ని పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. ఆరెస్సెస్పై ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. యూరప్ పర్యటనలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ ఆరెస్సెస్ను అరబ్ దేశాల్లోని రాడికల్ ఇస్లామిస్టు గ్రూపు ముస్లిం బ్రదర్హుడ్తో పోల్చారు. చదవండి: ముస్లిం బ్రదర్హుడ్, ఆరెస్సెస్ ఒక్కటే -
ఈ గృహాలు కొందరికే!
ఇల్లు కొనేముందు! ప్రాజెక్ట్ ఎక్కడుందో వెళ్లి కళ్లారా చూస్తాం. స్కూల్, ఆసుపత్రి, నిత్యావసరాలకు దగ్గరగా ఉంటే ఓకే అనుకొని ధర విషయంలో బేరమాడతాం. అదీ పూర్తయ్యాక.. నిర్మాణంలో నాణ్యత, గృహ ప్రవేశం గురించి ఆరా తీస్తాం! కానీ, బై ఇన్విటేషన్ ఓన్లీ (బీఐఓ)– అల్ట్రా లగ్జరీ గృహాల విషయంలో ఇవేవీ ఉండవు. ఈ గృహాలను కొనడం సంగతి తర్వాత కనీసం ప్రాజెక్ట్ చూడాలంటేనే ఆహ్వాన పత్రం ఉండాల్సిందే! సాక్షి, హైదరాబాద్: బీఐఓ ప్రాజెక్ట్ల ప్రత్యేకత కేవలం అంతర్జాతీయ వసతులే కాదండోయ్.. కస్టమైజేషన్! అంటే కొనుగోలుదారులకు అభిరుచికి తగ్గట్టుగా గృహ నిర్మాణం ఉండటమే. ఫ్లోర్ లే అవుట్, ఇంటీరియర్ డిజైన్స్, ఫ్లోరింగ్, సీలింగ్ ఇంట్లో వాడే ప్రతి వస్తువూ మనకు నచ్చినట్టుగా.. బ్రాండెడ్గా ఉం టుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బీఐఓ ప్రాజెక్ట్లకు డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేదు. మన దేశంలో ముంబై, చెన్నై, పుణె, కోల్కతా నగరాల్లో బీఐఓ ప్రాజెక్ట్లున్నాయి. వాస్తవానికి, దేశంలోని అన్ని మెట్రో నగరాల్లోనూ లగ్జరీ ప్రాజెక్ట్ల కోసం ప్రత్యేకంగా ఏరియాలున్నాయి. ప్రధాన నగరంలో స్థలం కొరత ఉంటుంది. అందుకే డెవలపర్లు కొద్దిపాటి స్థలంలో లేదా రీ–డెవలప్మెంట్ సైట్లలో బీఐఓ ప్రాజెక్ట్లను నిర్మిస్తుంటారు. అందుకే కొన్ని బీఐఓ ప్రాజెక్ట్ల్లో స్థల పరిమితులు కారణంగా బొటిక్ స్టయిల్లో యూనిట్లుంటాయి. ఇందులో ఆశించిన స్థాయిలో వసతులు కల్పించకపోవచ్చు కూడా. కొనుగోలు శక్తి బట్టి గృహాలు.. ఎంపిక చేసిన కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని బీఐఓ నిర్మాణాలను చేపట్టాలి. ప్రత్యేకమైన మతాలు, ఆహారపు అలవాట్లను లక్ష్యంగా చేసుకుని బీఐఓ ప్రాజెక్ట్లను నిర్మించే డెవలపర్లకు మార్కెట్లో ప్రతికూలత ఏర్పడుతుంది. కస్టమర్ల సామాజిక సంబంధాల మీద కాకుండా కొనుగోలు శక్తి ఆధారపడి బీఐఓ ప్రాజెక్ట్లను చేపట్టాలి. హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రవాసులు, బిజినెస్ టైకూన్స్, సెలబ్రిటీలు బీఐఓ కస్టమర్లుగా ఉంటారు. ఆయా కస్టమర్ల వివరాలు, ఫైనాన్షియల్స్ను డెవలపర్లు గోప్యంగా ఉంచుతారని.. అందుకే వీటిని ట్రాక్ చేయడం కష్టమని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పురి తెలిపారు. బీఐఓ ప్రాజెక్ట్ చేసే నిర్మాణ సంస్థలకు అంతర్గతంగా ఎంపిక చేసిన కస్టమర్లు, బ్రోకర్లు ఉంటారు. ఆయా కస్టమర్ల ఆర్థిక స్థితిగతులు, జీవన శైలి, ఇతరత్రా ఆసక్తులను అంచనా వేస్తారు. అప్పటికే ఆయా డెవలపర్లకు ఉన్న కస్టమర్లలో లగ్జరీ అవసరాలను కోరుకునే వారికి ప్రాజెక్ట్కు సంబం ధించిన సమాచారాన్ని ఫోన్, ఈ–మెయిల్, ఇతరత్రా సామాజిక మాధ్యమాల ద్వారా ఆహ్వానం పంపిస్తారు. అంతర్జాతీయ వసతులు.. బీఐఓ ప్రాజెక్ట్ల వసతులన్నీ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. హెలిప్యాడ్, ఇన్–సూట్ లేదా రూఫ్టాప్ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ ఎలివేటర్స్, ఇంట్లోనే రెస్టారెంట్, ప్రతి అపార్ట్మెంట్కు ప్రత్యేకంగా మల్టిపుల్ పార్కింగ్ సదుపాయం, బారిక్యూ పిట్స్, సన్ డెక్స్, అల్ట్రా హైటెక్ సెక్యూరిటీ సేవలు వంటివి ఉంటాయి. నిర్మాణంలో వాడే ప్రతి ముడి సరుకూ బ్రాండెడ్ ఉంటుంది. ఇంధన సామర్థ్యం ఎల్ఈడీ లైట్లు, వర్టికల్, రూఫ్ గార్డెన్స్, సెంట్రలైజ్ వాక్యూమ్ సిస్టమ్, హై ఎండ్ మాడ్యులర్ కిచెన్, ఇటాలియన్ మార్బుల్, సెంట్రలైజ్ ఏసీ సిస్టమ్, డిజిటల్ లాక్స్ అండ్ డోర్స్, ఆటోమేటిక్ కర్టెన్స్ అండ్ డెకరేటివ్స్ వంటి ఏర్పాట్లుంటాయి. ఏటా 10–15 ఫ్లాట్ల విక్రయం దేశ జనాభాలో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ (ఎంఐజీ), ఆపైన తరగతి కేవలం 4 శాతం వరకుంటుంది. ఇందులో అల్ట్రా లగ్జరీ విభాగం 1 శాతం ఉంటుంది. దేశంలోని మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్లో బీఐఓ మార్కెట్ వాటా 5–6 శాతం ఉంటుంది. ఏటా దేశంలో 10–15 బీఐఓ గృహాలు మాత్రమే అమ్ముడవుతాయి. ఎంపిక చేసిన కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని బీఐఓ ప్రాజెక్ట్లను నిర్మిస్తుంటారు. అందుకే నగరాలను బట్టి వీటి ధరలు మారుతుంటాయి. బిల్డర్ బ్రాండింగ్, ప్రాజెక్ట్ ప్రాంతం, వసతులను బట్టి వీటి ప్రారంభ ధర రూ.3 కోట్ల నుంచి రూ.75 కోట్ల వరకుంటాయి. -
ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి మోదీ!
కరాచీ/లాహోర్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ఖాన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి భారత ప్రధాని మోదీని ఆహ్వానించాలని పాకిస్తాన్ తెహ్రీక్–ఇన్సాఫ్ (పీటీఐ) యోచిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ఖాన్ సారథ్యంలోని పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. మిగతా పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈనెల 11న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ సహా సార్క్ దేశాధినేతలను ఆహ్వానించాలని ఇమ్రాన్ భావిస్తున్నట్లు పీటీఐ వర్గాలు తెలిపాయి. కశ్మీర్ అంశంతోపాటు ఇటీవల చోటు చేసుకున్న పలు పరిణామాలు భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. అయినప్పటికీ, ఎన్నికల్లో విజయం సాధించిన ఇమ్రాన్ఖాన్కు నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు విభేదాలను పరిష్కరించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. -
అమెరికాకు రండి
వాషింగ్టన్: అమెరికా, రష్యాల మధ్య సానుకూల వాతావరణం నెలకొనే దిశగా అడుగులు పడుతున్నాయి. మొన్నటికి మొన్న ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో జరిగిన వ్యక్తిగత భేటీలో పలు అంశాలపై ఇరుదేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్లు చర్చించుకున్న విషయం తెలిసిందే. హెల్సింకీలో సంతృప్తికర చర్చ జరగలేదంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అగ్రదేశాల సంబంధాలను మరో అడుగు ముందుకు తీసుకెళ్లేందుకు ట్రంప్ నిర్ణయించారు. ఈ ఏడాది చివర్లో అమెరికాలో జరిగే రెండో విడత వ్యక్తిగత చర్చలకు రావాలంటూ పుతిన్కు ఆహ్వానం పంపించారు. ‘హెల్సింకీలో జరిగిన భేటీలో చర్చించిన అంశాలను అమలుచేసేందుకు మరోసారి పుతిన్తో సమావేశం అవుతాం. ఇందుకోసం పుతిన్ను అమెరికాకు ఆహ్వానిస్తున్నాం’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ మరో ట్వీట్ చేశారు. ‘హెల్సింకీలో జరిగిన భేటీలో.. ఇరుదేశాల ఉన్నత స్థాయి భద్రతాధికారుల సమావేశం జరగాలని ట్రంప్ సూచించారు. దీనికి పుతిన్ అంగీకరించారు. ఈ నేపథ్యంలో రష్యా జాతీయ భద్రతాసలహాదారుతో ఇప్పటికే జరుగుతున్న సమావేశాలను మరింత వేగవంతం చేయాలని అమెరికా ఎన్ఎస్ఏను ట్రంప్ ఆదేశించారు. వచ్చే శీతాకాలంలో అమెరికాలో చర్చల కోసం రావాలని పుతిన్ను ఆహ్వానించారు’ అని శాండర్స్ పేర్కొన్నారు. -
రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ట్రంప్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి అమెరికా నుంచి బదులు రాలేదు, కానీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. గతేడాది జూన్లో వాషింగ్టన్లో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా భారత్లో పర్యటించాలని మోదీ ట్రంప్ను కోరారు. 2019 గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనాలని ట్రంప్కు తాజాగా ఆహ్వానం పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
ఆ పెళ్లికి ట్రంప్ను ఆహ్వానించలేదు...
లండన్ : బ్రిట్రీష్ యువరాజు, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ప్రిన్స్ హారీ వివాహానికి బ్రిటన్ ప్రెసిడెంట్ థెరిసా మేకు, అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్కు ఆహ్వానం అందలేదు. కారణమేంటంటే ప్రిన్స్ హారీ - మేఘన్ మార్కెల్ల వివాహానికి కేవలం రాజవంశం, మేఘనల కుటుంబాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారిని మాత్రమే ఆహ్వానించాలనుకుంటున్నట్లు రాజ ప్రసాదం వారు ప్రకటించారు. రాజకీయ నాయకులేవరిని ఈ వివాహ వేడుకకు ఆహ్వానించలేదని తెలిపారు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు బ్రిటన్ రాజ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికి ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను ఆహ్వానించకుండా ఒబామాను ఆహ్వానించడం బాగుండదనే ఉద్ధేశంతో ఒబామాను కూడా ఆహ్వానించలేదు. ఎందుకంటే బ్రిటన్ రాజ్యంగం చాలా సున్నితమైనది. దాని ప్రకారం బ్రిటన్ ప్రభుత్వం చేసే కార్యకలపాలు బ్రిటన్ రాజ్యంగ సమతౌల్యాన్నీ కాపాడుతూ విదేశీ వ్యవహరాలను సమీక్షించుకోవాలని బ్రిటన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అందువల్లే ఈ వివాహ వేడుకను కేవలం బంధువలు, సన్నిహితుల సమక్షంలోనే నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఒక వేళ బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మేను ఆహ్వానించినా ఆమె వస్తుందని నమ్మకం లేదని బ్రిటీష్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.హారీ సోదరుడు కేట్ మిడిల్టన్ వివాహం 2011లె వెస్ట్ మినిస్టర్ అబేలో జరిగింది. ఆ వేడుకకు చాలా మంది ప్రభుత్వ పెద్దలు హజరయ్యారు. అయితే ప్రస్తుతం హారీ వివాహ వేడుక విండ్సర్ కాస్టెల్ జరగనుంది. వైశాల్యంలో వెస్ట్ మినిస్టర్ అబేతో పోల్చితే విండ్సర్ కాస్టెల్ చాలా చిన్నది. హారీ - మేఘనల వివాహం మే 19న జరగనున్న సంగతి తెలిసిందే. -
మా ద్వీపంలో విహరించండి
కొలంబో: విరాట్ కోహ్లి, అనుష్క శర్మ... అందరినీ ఆకర్షించిన ‘ఫైవ్స్టార్’ సెలబ్రిటీ జోడీ. వారి ప్రేమ నుంచి పెళ్లి దాకా... పుకార్లు, షికార్లు అన్నీ ఇన్నీ కావు. ఏదేమైనా ఓ షాంపూ యాడ్తో ఒక్కటైన ఈ జోడీ గతేడాది ఇటలీలో ఏడడుగులు వేసింది. తమ పెళ్లి పుస్తకంలోని తొలి పేజీ ‘హనీమూన్’ను స్విట్జర్లాండ్లో జరుపుకుంది. కోహ్లి ఏ మాత్రం తీరిక దొరికినా తన ప్రియసఖితో గడిపేందుకే సమయం కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు టి20 సిరీస్ నుంచి కోహ్లి తప్పుకున్నాడు. ఇది సింహళ దేశంలోని కోహ్లి అభిమానులను బహుశా బాధించిందేమో! దీంతో ఆటలోని లోటును విహారంతో భర్తీ చేయాలని సాక్షాత్తూ ఆ దేశ క్రీడల మంత్రే స్వయంగా ఆహ్వానించారు. తమ దేశ అతిథిగా తమ ద్వీపంలో గడపాలని మంత్రి దయసిరి జయశేఖర ఆహ్వానం పలికారు. ‘కోహ్లిని ఆడేందుకు పిలవట్లేదు. వివాహం తర్వాత ఇక్కడ పర్యటించని కోహ్లి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి విహరించాలని ఆహ్వానిస్తున్నా. లంక ద్వీపంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి. వాటిని చూస్తూ సేదతీరొచ్చు’ అని జయశేఖర పేర్కొనట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. ప్రస్తుతం విరుష్క జంట ముంబైలోని ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ ఫ్లాట్లో కాపురం పెట్టింది. దీని అద్దె నెలకు రూ. 15 లక్షలు. రెండేళ్లు ఉండే విధంగా అగ్రిమెంట్ చేసుకొని రూ. కోటి 50 లక్షలు చెల్లించినట్లు సమాచారం. అయితే ఆటతో పాటు బ్రాండింగ్తో కోట్లకు పడగలెత్తిన కోహ్లికి కిరాయి ఇంట్లో ఉండే ఖర్మేమిటనే సందేహం కలుగక మానదు. నిజమే! కానీ అతను 2016లోనే ముంబైలోని ఖరీదైన ప్రాంతం వర్లీలో ఓ ఫ్లాట్ కొన్నాడు. 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో ప్రస్తుతానికి అద్దె ఇంట్లో ఉంటోంది ఈ జంట. -
రాజమౌళిపై కన్నడిగుల ఆగ్రహం!
సాక్షి, బెంగళూర్ : అగ్రదర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిపై కన్నడిగులు ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా బెంగళూర్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి హాజరుకావాల్సిందిగా కర్ణాటక చలన చిత్ర అకాడమీ రాజమౌళికి ఆహ్వానం పంపింది. అయితే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించటంపై వారు మండిపడుతున్నారు. ‘ఈ కార్యక్రమానికి హాజరుకావాలని చాలా మంది నటీనటులకు, మేకర్లకు ఆహ్వానం పంపాం. కానీ, చాలా వరకు హాజరుకాలేదు. దర్శకుడు రాజమౌళికి కూడా ప్రత్యేక ఆహ్వానం పంపాం. కానీ, రాలేనని నేరుగా చెప్పేశారు. ఇది కన్నడ ప్రజలను, ముఖ్యమంత్రి(సిద్ధరామయ్య)ని అవమానించటమే. వారంపాటు జరిగే ఈ కార్యక్రమం కోసం కాస్తైనా సమయం కేటాయించాల్సింది’ అని కర్ణాటక చలనచిత్ర అకాడమీ చైర్మన్ ఎస్వీ రాజేంద్ర సింగ్ బాబు అభిప్రాయపడ్డారు. కాగా, బాహుబలి వివాద సమయంలో(సత్యరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు) తాను రాయ్చూర్ మూలాలు ఉన్నవాడినంటూ సినిమా విడుదలను అడ్డుకోవద్దని రాజమౌళి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ఇంత పెద్ద ఎత్తున్న నిర్వహించిన కార్యక్రమానికి రావటానికి ఆయనకొచ్చిన సమస్యేంటని? కన్నడిగులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అయితే ముందుగా ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాల వల్లనే తాను రాలేకపోతున్నానని రాజమౌళి వారితో చెప్పినట్లు తెలుస్తోంది. -
ఖలిస్తాన్ ఉగ్రవాదికి ఆహ్వానం
న్యూఢిల్లీ: ఖలిస్తాన్ వేర్పాటువాదులకు మద్ద తు ఇవ్వబోమని హామీ ఇచ్చి ఒక్కరోజు గడవకముందే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. దేశరాజధానిలో గురువారం ట్రూడో గౌరవార్థం కెనడా హైకమిషనర్ నాదిర్ పటేల్ నిర్వహించనున్న విందుకు ఆ దేశ అధికారులు సాక్షాత్తూ ఓ ఉగ్రవాదికి ఆహ్వానం పంపారు. ప్రధాని మోదీని ట్రూడో కలుసుకోవడానికి కేవలం ఒక్కరోజు ముందే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ట్రూడో.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1986లో కెనడా పర్యటనకు వెళ్లిన పంజాబ్ మంత్రి మల్కియాత్ సింగ్ సిద్ధూపై వాంకోవర్లో హత్యాయత్నం చేసిన ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ సభ్యుడు జస్పాల్ అత్వాల్కు కెనడా అధికారులు గురువారం విందుకు ఆహ్వానం పంపారు. మంత్రిపై దాడి చేసినందుకు అప్పట్లో జస్పాల్కు కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ట్రూడో గౌరవార్థం అంతకుముందు ముంబైలో నిర్వహించిన కార్యక్రమానికి కూడా హాజరైన జస్పాల్, ఏకంగా కెనడా ప్రధాని భార్య సోఫీ, మంత్రి అమర్జిత్ సోహీలతో ఫొటోలు కూడా దిగాడు. ఈ ఫొటోల్లో ఉన్న జస్పాల్ను కెనడియన్ మీడియా గుర్తించడంతో ఆ దేశ అధికారుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన కెనడా హైకమిషన్.. జస్పాల్కు పంపిన ఆహ్వానాన్ని రద్దుచేసింది. తన సిఫార్సుతోనే కెనడా హైకమిషన్ సిబ్బంది జస్పాల్ను విందుకు ఆహ్వానించారని కెనడా ఎంపీ రణ్దీప్ సురాయ్ అంగీ కరించారు. జస్పాల్ భారత్కు వచ్చేందుకు వీసా ఎలా లభించిందన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ చెప్పింది. -
మా దేశానికి రండి.. మూన్కు కిమ్ ఆహ్వానం
గ్యాంగ్నెయుంగ్: దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానించారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో జరగబోయే సదస్సుకు హాజరు కావాలని మూన్ను కోరారు. ఉత్తర కొరియా విదేశాంగ మంత్రితో కలసి కిమ్ సోదరి యో జోంగ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కిమ్ పంపిన ఆహ్వాన లేఖను మూన్కు అందించారు. సదస్సుకు వెళ్తారా లేదా అనే దానిపై మూన్ స్పందించలేదు. అయితే గతేడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కిమ్లు వ్యక్తిగత దూషణలకు సైతం దిగడం తెల్సిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు మిత్రదేశమైన దక్షిణ కొరియా అధ్యక్షుడు ఉ.కొరియాకు వెళ్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వెళితే మూన్ ట్రంప్ ఆగ్రహానికి గురికావాల్సి రావొచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. -
ఏదీ ఆహ్వానం..?
కడప ఎడ్యుకేషన్: జిల్లా ప్రథమ పౌరుడు, క్యాబినెట్ ర్యాంకు హోదా కలిగిన జిల్లా పరిషత్ చైర్మన్కు జిల్లాలో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా పిలుపులేకుండా పోతోంది. తాజాగా జిల్లాలో జరుగుతున్న జన్మభూమితో పాటు నేడు పులివెందులకు వస్తున్న సీఎం సభకు కూడా ఆహ్వానం అందలేదు. కనీసం ప్రోటోకాల్ కోసమైనా ఆహ్వాన పత్రికలను పంపాల్సి ఉన్నా దాని గురించి పట్టించుకునే వారే లేరు. ఇటీవల ఉపరాష్ట్రపతి కార్యక్రమానికి కూడా.. ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన ఓ పాఠశాల ఉత్సవాల కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వచ్చారు. ఈయన కార్యక్రమానికి కూడా జెడ్పీ చైర్మన్కు పిలుపులేదు. ∙గతంలో జిల్లా పరిషత్తు కార్యాలయ ఆవరణంలో నిర్మించిన డీఆర్సీ భవన్ శంకుస్థాపనకు మంత్రి గంటా వచ్చారు. ఆ రోజు కూడా ఆహ్వానం లేదు. మంత్రి వచ్చే ముందు ఫార్మాలిటీకి ఆధికారులు వచ్చి కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. దీంతో జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమ కార్యాలయం ఆవరణంలో కార్యక్రమం జరుగుతున్నా ఆహ్వానం లేకపోవడంపై మండిపడ్టారు. జెడ్పీ చైర్మన్ దళితుడని అధికారులకు చిన్నచూపేమోనని పలు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా అవమానం తాను దళితుడినని జిల్లా అధికారులు అడుగడుగునా అవమానానికి గురి చేస్తున్నారని జెడ్పీ చైర్మన్ గూడూరు రవి సాక్షితో ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే చైర్మన్ పదవిలో అగ్రవర్ణాలకు చెందిన వారు ఉండి ఉంటే ఇలా చేశేవారా అని ప్రశ్నించారు. జిల్లాలో ఏ అధికారిక కార్యక్రమం జరి గినా కనీసం ఆహ్వాన పత్రికను కూడా పంపరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందంతా జిల్లా అధికారులే చేస్తున్నారా లేక అ«ధికార పార్టీవారు చెప్పి చేయిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. -
మేడారం జాతరకు రండి
న్యూఢిల్లీ: మేడారం జాతరకు రావాల్సిందిగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడిని తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆహ్వానించారు. ఢిల్లీలో ఉప రాష్ట్రపతిని ఈ ఉదయం కలిసిన ఆయన జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరగనున్నఈ మహా జాతరకు రావాల్సిందిగా కోరారు. ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కూడా విజ్ఞప్తి చేశారు. మంత్రితోపాటు రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, పలువురు ఎంపీలు ఉన్నారు. -
'చంద్రబాబును ఆహ్వానించరా..?'
సాక్షి,సిటీబ్యూరో:ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడిని ప్రతిష్టాత్మకమైన జీఈఎస్ సదస్సుకు ఆహ్వానించకపోవడం దారుణమని టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెన్ శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకొని పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్తో సహా దేశ,విదేశీ ప్రతినిధులు హాజరవుతున్న సదస్సుకు ఆయనున్న పిలవక పోవడం.. తెంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రజలపై ఎంత ద్వేషముం దో వెల్లడవుతోందన్నారు. అంతకుముందు కార్యక్రమంలో పార్టీ నాయకులు వనం రమేశ్, బద్రినాథ్ యాదవ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి పూలమాల వేస్తున్న టీడీపీ నేతలు -
సీఎం చంద్రబాబుకు శివాని ఆహ్వానం
విజయవాడ స్పోర్ట్స్ : విలువిద్యలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, ఏషియా బుక్ ఆఫ్ రికార్డు, వరల్డ్ రికార్డు నెలకొల్పేందుకు ఈ నెల 10వ తేదీ చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీలో తాను నిర్వహించే ప్రదర్శనకు ఆర్చరీ కిడ్ డాలీ శివాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించింది. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో తన తల్లిదండ్రులతో కలసి సీఎం చంద్రబాబును కలిసింది. డాలీ శివాని ప్రదర్శించబోయే ఈవెంట్లను తండ్రి చెరుకూరి సత్యనారాయణ సీఎంకు వివరించారు. ఆసక్తిగా విన్న చంద్రబాబు సమయాన్ని బట్టి తాను కూడా కార్యక్రమానికి వచ్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాలీ శివానికి ఆల్ ది బెస్ట్ చెప్పి రికార్డులు సృష్టించాలని ఆశీర్వదించారు. శివానికి అవసరమైన సహకారం అందజేయమని సీఎం అదనపు కార్యదర్శి రాజమౌళికి సూచిం చారు. సీఎంను కలసినవారిలో శివాని తండ్రి చెరుకూరి సత్యనారాయణ, తల్లి కృష్ణకుమారి, ఆర్చరీ అసోసియేషన్ ప్రతినిధి జి.ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక దినోత్సవ పోటీలకు ఆహ్వానం
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్టు ఏయూ సమన్వయకర్త ఆచార్య ఎన్.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపా రు. పోస్టర్ పెయింటింగ్, పేపర్ ప్రెజెంటేషన్, క్విజ్, టూరిజం ఫొటోగ్రఫీ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ► సుస్థిర పర్యాటకం–అభివృద్ధికి ఒక సాధనం అంశంపై పోస్టర్ పెయింటింగ్ పోటీ ఉంటుంది. ఈ అంశం ఆధారంగా స్పాట్ పెయింటంగ్ చేయాల్సి ఉంటుంది. ► పేపర్ ప్రెజెంటేషన్లో టూరిజం–ఏన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఫినామినా, అర్బన్ టూరిజం అండ్ కల్చరల్ హెరిటేజ్, హాస్పిటాలిటీ, టూరిజం మేనేజ్మెంట్ మార్కెటింగ్, టూరిజం అండ్ ఎన్విరాన్మెంట్, ఎంటర్ప్యూనర్షిప్ ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలిటి, సస్టైనబుల్ టూరిజం–ఏ టూల్ ఫర్ డెవలప్మెంట్, జీఐఎస్ అప్లికేషన్ ఇన్ టూరిజం, డెస్టినేషన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్, టూరిజం ప్లానింగ్ రీజినల్ డెవలప్మెంట్, న్యూ టైప్స్ ఆఫ్ టూరిజం అంశాలపై వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధికి ఉపకరించే అంశాలను దీనిలో ప్రస్తావించి, వివరించాలి. నాలుగు వేల పదాలకు మించకుండా వ్యాసం ఉండాలి. ► క్విజ్ పోటీల్లో 60 శాతం ప్రశ్నలు ఏపీ పర్యాటకంపైన మిగిలిన 40 శాతం ప్రశ్నలు వర్తమాన అంశాలపై ఉంటాయి. ఒక్కో బృందంలో ఇద్దరు విద్యార్థులు ఉండాలి. ► ఏపీ పర్యాటక ముఖచిత్రాన్ని ప్రతిబింబించే విధంగా ఫొటోలు ఉండాలి. ఒక్కో విద్యార్థి గరిష్టంగా మూడు ఫొటోలను పోటీకి పంపవచ్చును. 2.5 మెగా పిక్సిల్స్కు తగ్గకుండా నాలు గు వేల మెగా పిక్సిల్స్కు మించని క్వాలిటీ కలిగి ఉండాలి. ఒక ఒరిజినల్ ప్రింట్, సాఫ్ట్ కాపీలను విద్యార్థి తమ స్వీయ లేఖను జరపరచి అందించాలి. డిజిటల్ సాంకేతిక సహకారంతో తీర్చిదిద్దిన ఫొటోలను పరిగణనలోకి తీసుకోం. జేపీఈజీ ఫార్మాట్లో 4 ఎంబీల కంటే తక్కువ నిడివితో ఫొటోలను పంపాల్సి ఉంటుంది. ► పోస్టర్ పెయింటింగ్, క్విజ్ పోటీలను జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తారు. విశాఖపట్నంలో వచ్చేనెల 6న ఉదయం 10 గంటలకు ఎంబీఏ అనెక్స్ భవనం(ఏయూ అవుట్గేట్ వద్ద), శ్రీకాకుళంలో వచ్చేనెల 7న, విజయనగరం ఎంఆర్ పీజీ కళాశాలలో వచ్చే నెల 8న పోటీలు జరుగుతాయి. ఇతర సమాచారం కోసం ఏయూ వెబ్సైట్ www. andhrauniversity.edu.in, ఏయూ సమన్వయకర్త ఆచార్య ఎన్. సాంబశివరావు(9848170274)ను సంప్రదించవచ్చును. విజేతలకు వచ్చేనెల 27న పర్యాటక శాఖ నిర్వహించే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తారు. -
స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
బుక్కపట్నం : స్థానిక డైట్ కళాశాలలో ఫిలాసఫీ, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించి డెప్యూటేషన్పై పనిచేయుటకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు సోమవారం లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జనార్దన్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయలు పీజీ చేసి ఆయా సబ్జెక్టుల్లో ఎం.ఈడీ చేసి ఉండాలన్నారు. -
అదే నిజమైన క్రైస్తవం!
సువార్త ప్రత్యుపకారం చేసే స్తోమత లేని దీనులకు చేసే సాయమే విశ్వాసికి అత్యంత ఆశీర్వాదకరమని యేసు ఇలా బోధించాడు. ఒక ధనవంతుడు గొప్ప విందు ఏర్పాటు చేసి పుర ప్రముఖులనందరినీ ఆహ్వానించాడు. అయితే వాళ్లంతా ఏవేవో సాకులు చెప్పి విందుకు రాలేమన్నారు. దాంతో నిరుపేదలు, వికలాంగులనందరినీ విందుకు తోడుకొని రమ్మని తన దాసుని పురమాయించగా, వాళ్లెంతో ఆనందంగా విందుకొచ్చారు. రాజవీధుల్లోని భిక్షగాళ్లను, కంచెల్లో పని చేసే కూలీలను కూడా పిలవమన్నాడతను. అలా కొత్త ఆహ్వానితులతో విందుశాల, అనుకోని ఆహ్వానంతో నిరుపేదల జీవితాలు నిండాయి. ధనికుని హృదయమూ ఆనందంతో నిండిపోయింది (లూకా 14:12–24). గొప్ప వాళ్లంతా అహకారంతో తృణీకరించగా, ఆ అవకాశాన్నే అత్యానందంతో పేదలు, నిర్భాగ్యులు, అణగారిన వారికిచ్చిన దేవుని అద్భుతమైన ప్రేమను వర్ణించిన ఉపమానమిది. విందులో అగ్రస్థానాల్లో కూర్చుని ఆరగించవలసిన వాళ్లు తమ ఆధిక్యతను పోగొట్టుకుంటే, అదే విందులో చివర్న అంట్లు కడిగి, బల్లలు శుభ్రపరచి, అంతా ఊడ్చిపెట్టే అధములను హెచ్చించి, అవే అగ్రస్థానాల్లో కూర్చోబెట్టి విందు చేసిన దేవుని అసమానమైన ప్రేమను వర్ణించే మాటలే లేవు (యాకోబు 4:6). నేల మీద కూర్చోవలసిన వారు ధనికునితో సమానంగా కూర్చొని విందారగించే ఈ సన్నివేశం దేవుని రాజ్యంలో మాత్రమే సాధ్యం. సోషలిజం, కమ్యూనిజంలాంటి వ్యవస్థలు సిద్ధాంతాల్లో మాత్రమే ప్రతిపాదించిన సర్వసమానవత్వాన్ని కేవలం బోధించడమే కాదు, ఆచరించి చూపించిన నిజమైన సమానత్వవాది యేసుక్రీస్తు. దేవుడే మానవధారిౖయె యేసుక్రీస్తుగా దిగివచ్చి, తన పాదధూళితో సమానమైన మానవాళితో సహవసించడం, వారిని అక్కున చేర్చుకోవడం అనూహ్యమైన అంశం. అదే ప్రేమను ప్రతి విశ్వాసీ అలవరచుకోవాలి. విశ్వాసలు ప్రతి చర్యా, మాటల్లో అది ప్రతిబింబించాలి. గొప్ప వారికి గౌరవాన్నిచ్చి అగ్రహోదాలివ్వడం, పేదవారిని ఛీకొట్టడం లోక సంస్కృతి. దీనులు, పేదలు, అణగారిన వారిని అక్కున చేర్చుకోవడం దైవిక నియమం. సమాజంలో గొప్పవాళ్లకు సలాములు చేస్తూ, గులాములుగా బతికే నీచ సంస్కృతికి విశ్వాసులు, ముఖ్యంగా దైవసేవకులు ముందుగా స్వస్తి చెప్పాలి. దేవుని చిరునామాను నిరుపేదల్లో వెదికి, ఆయన గుండెచప్పుడును విలాసాల్లో తేలియాడే ధనికుల జీవితాల్లో గాక మురికివాడల్లో బతికే బడుగువాళ్ల జీవితాల్లో వినడం ప్రతి విశ్వాసీ అలవరచుకున్నప్పుడు ఈ లోకమే పరలోకమవుతుంది.ఈ లెంట్డేస్ (శ్రమదినాలు)లోమనం ఆకలితో ఉన్న పేదవాళ్లకు అన్నం పెడదాం, అభాగ్యుల ఆకలి తీర్చుదాం. నీళ్లు తోడి చెరువులో పోయడం అవివేకం, నిష్ఫలమైన కార్యం. నీళ్లు చెట్టుకు పోయాలి, చేనుకు తోడాలి, నీటితో దీనుల దాహం తీర్చాలి. అదే దేవుడు మెచ్చే నిజ క్రైస్తవం!! – రెవ.డాక్టర్.టి.ఎ. ప్రభుకిరణ్ -
కేటీఆర్కు స్టాన్ఫోర్డ్ నుంచి ఆహ్వానం
-
కేటీఆర్కు స్టాన్ఫోర్డ్ నుంచి ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీæ శాఖ మంత్రి కేటీఆర్కు అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. ఈ ఏడాది మే 18, 19 తేదీల్లో జరిగే స్టాన్ఫోర్డ్ వర్సిటీ వార్షిక సదస్సులో ఉపాధి–ఉద్యోగాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ అంశాలపై ప్రసంగించాల్సిందిగా వర్సిటీ కోరింది. ఐటీ రంగంలో గత రెండున్నరేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి, టెక్నాలజీ ద్వారా ఉద్యోగాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించేందుకున్న అవకాశాలపై మాట్లాడాలని విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశానికి వివిధ దేశాల నుంచి పరిశ్రమల ప్రతినిధులు హాజరవుతారని, వీరికి తెలంగాణ సాధించిన ప్రగతి ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుందని మంత్రికి పంపిన లేఖలో స్టాన్ఫోర్డ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్ అంజిని కొచ్చర్ పేర్కొన్నారు. గతేడాది కూడా ఆహ్వానం వచ్చిందని, వరుసగా రెండో ఏడాది తనకు ఆహ్వానం రావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. -
‘గణతంత్ర అతిథి’కి ఘన స్వాగతం
► నేడు అబుదాబి ప్రిన్స్తో భేటీ ► డజను ఒప్పందాలు న్యూఢిల్లీ: భారత్ పర్యటనలో భాగంగా అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్– నహ్యన్ మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఢిల్లీ ఎయిర్పోర్టుకు వెళ్లి నహ్యన్ కు ఘనస్వాగతం పలికారు. ప్రధానితోపాటు పలువురు ఉన్నతాధికారులు నహ్యన్ కు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ గురువారం జరగనున్న 68వ గణతంత్ర వేడుకల్లో అబుదాబి యువరాజు నహ్యన్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ఆయనకు భారత్ ఆహ్వానం పంపింది. 2006లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు (అరబ్ దేశాల నుంచి) సౌదీ రాజు అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ముఖ్య అతిథిగా పాల్గొనగా.. 2016 గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ హాజరయ్యారు. నేడు మోదీ, అబుదాబి ప్రిన్స్ నహ్యన్ భేటీ భారత్, యూఏఈ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదరనుంది. ప్రధాని మోదీ, అబుదాబి యువరాజు నహ్యన్ బుధవారం సమావేశం కానున్నారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చలు జరిపిన అనంతరం ఈ ఒప్పందం కుదుర్చుకుంటారు. యూఏఈ భారత్లో 75 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 5 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టే అంశంతోపాటు డజనుకు పైగా ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. -
‘ముజీ’ స్టోర్ ఏర్పాటు చేయండి..
జపనీస్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ఆహ్వానం జైకా, జెట్రోలతోనూ సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రిటైల్ స్టోర్ ఏర్పాటు చేయాలని జపనీస్ రిటైల్ మార్కెట్ రంగ దిగ్గజం ముజీ కంపెనీని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు ఆహ్వానించారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం అక్కడ ముజీ కంపెనీ డైరెక్టర్, జనరల్ మేనేజర్ సటోషీ షిముజుతో సమావేశమై చర్చలు జరిపారు. హైదరాబాద్ నగరంలో వాల్మార్ట్ తరహా రిటైల్ కంపెనీలు తమ స్టోర్స్ను ఏర్పాటు చేశాయని మంత్రి వివరిం చారు. స్థానిక ఉత్పత్తులను ఎలాంటి బ్రాండ్ లేకుండా విక్రయించడం ముజీ ప్రత్యేకతని, ఇలాంటి సంస్థ రాష్ట్రానికి వస్తే స్థానిక ఉత్పత్తులను విక్రయించే అవకాశం లభిస్తుం దన్నారు. అనంతరం జైకా సీనియర్ ఉపాధ్య క్షుడు హిడెటోషి ఇరిగాకి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. జైకా రుణ సహకారం తో రాష్ట్రంలో అవుటర్ రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులు నిర్మించారని మంత్రి గుర్తు చేశా రు. ప్రాజెక్టుల వారీగా ప్రతిపాదనలు అం దించాలని, రాష్ట్రానికి మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జైకా అధికారులు మంత్రికి తెలియ జేశారు. -
ఎంఎస్ఎంఈ అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం
హైదరాబాద్: ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచి (మినిస్టరీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్) ఎంఎస్ఎంఈ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏపీ, తెలంగాణలోని సంస్థలు ఈ నెల 16లోపుదరఖాస్తులు పంపవల్సిందిగా ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ కోరుతోంది. అవుట్స్టాండింగ్ ఎంట్రప్రెన్యూర్, ప్రొడక్ట్/ప్రొసెస్ ఇన్నోవేషన్, లీన్ మాన్యూఫ్యాక్చరింగ్ టెక్నిక్స్, క్వాలిటీ ప్రోడక్ట్స్ ఫర్ సెలక్టడ్ ప్రొడక్ట్స్, ఎక్స్పోర్ట్ విభాగాల్లో జాతీయ స్థాయిఅవార్డులను ఇవ్వనుంది. నాలుగేళ్లు ఎంఎస్ఎంఈ రంగంలో ఉండి... ఉద్యోగ్ ఆధార్ మెమోరండం (యూఏఎం), ఎంఎస్ఎంఈ డేటాబేస్లో ఉన్నవారిని కనీస అర్హులుగా పరిగణిస్తోంది. మొదటి బహుమతి పొందిన వారికి రూ.లక్ష బహుమతిఉంటుందని ప్రకటించింది. పూర్తి వివరాలు ఠీఠీఠీ. ఛీఛిఝటఝ్ఛ. జౌఠి. జీn వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. -
జెడ్పీ చైర్మన్ అంటే లెక్క లేదా?
- స్పోర్ట్స్ మీట్ నిర్వహించిన అధికారులపై చర్యలు తీసుకోండి - డీఈఓను కోరిన చైర్మన్ మల్లెల రాజశేఖర్ కర్నూలు(అర్బన్): నందవరం మండల కేంద్రంలో 28 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ ఆహ్వాన పత్రికల్లో తన పేరును విస్మరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ కోరారు. ఈ నెల 30వ తేదిన ' సాక్షి ' దినపత్రికలో ప్రచురితమైన ' జెడ్పీ స్కూల్ స్పోర్ట్స్ మీట్లో చైర్మన్కు దక్కని గౌరవం ' అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కార్యాలయ పని నిమిత్తం తన వద్దకు వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథరెడ్డికి తనకు అందిన ఆహ్వాన పత్రికను చూపిస్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జెడ్పీ వైస్ చైర్మన్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకుల పేర్లను ఆహ్వాన పత్రికలో ముద్రించి తనను విస్మరించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై డీఈఓ మాట్లాడుతూ అక్కడ స్కూల్ ప్రధానోపాధ్యాయుడే ఇన్చార్జీ ఎంఈఓగా వ్యవహరిస్తున్నారని, ఎందుకు ఇలా జరిగిందో విచారిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ డీఈఓనుకోరారు. -
పెళ్లిపత్రిక చూపించినా డబ్బులివ్వట్లేదు..
-
ట్రంప్ కు రాణి ఆహ్వానం?
లండన్: అమెరికాతో సంబంధాలను బలపరుచుకోవాలని భావిస్తున్న బ్రిటన్ ప్రభుత్వం రాణి ఎలిజబెత్ 2 ను ఆయుధంగా వినియోగించుకోబోతోందా?. యూకే పత్రికలు ఈ విషయాన్నే చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ను 2017 ప్రథమార్ధంలో ఎలిజబెత్ 2 ద్వారా బకింగ్ హామ్ పాలెస్ కు ఆహ్వానించాలని బ్రిటన్ యోచినట్లు అక్కడి పత్రికలు పేర్కొన్నాయి. ప్యాలెస్ లోని విన్డ్స్ ర్ క్యాసిల్ లో ట్రంప్ దంపతులకు ఆతిథ్యం ఇవ్వాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఆహ్వానానికి సంబంధించిన పూర్తి వివరాలను రహస్యంగా ఉంచారు. వచ్చే వారం థెరిస్సా మే, యూఎస్ ప్రస్తుత అధ్యక్షుడు ఒబామాను కలవనుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ విషయంపై బకింహామ్ ప్యాలెస్ అధికార ప్రతినిధిని సంప్రదించగా ప్రభుత్వం నిర్ణయం మేరకే ప్యాలెస్ లో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. -
పెళ్లిపత్రిక చూపించినా డబ్బులివ్వట్లేదు..
= అమలుకాని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు =గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు జూపాడుబంగ్లా(కర్నూలు): ‘సార్.. కొడుకు పెళ్లిపెట్టుకున్నాను. బ్యాంకులో జమ చేసుకున్న డబ్బులను మంజూరు చేయడండి’ అని మొరపెట్టుకున్నా బ్యాంకు అధికారులు కరుణించలేదని షేక్హమీద్బాషా(గౌండ) ఆవేదన వ్యక్తం చేశాడు. జూపాడుబంగ్లా గ్రామానికి చెందిన ఈయన తన కొడుకు ఖాదర్బాషా వివాహం ఈనెల 27న జరపనున్నాడు. అందుకుగాను ధాన్యం విక్రయించగా వ్యాపారి రూ.80వేల పాతనోట్లను ఇచ్చాడు. దీంతో నోట్లను మార్చుకునేందుకు ఈనెల 10వ తేదీన జూపాడుబంగ్లా ఆంధ్రప్రగతిగ్రామీణ బ్యాంకులోని రెండు ఖాతాల్లో నగదును జమ చేశాడు. అప్పటి నుంచి బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఇప్పటిదాకా కేవలం రూ.9వేలు ఇచ్చారు. పెళ్లిసమయం సమీపిస్తుండటంతో శుక్రవారం పెళ్లిపత్రికను తీసుకొని బ్యాంకు మేనేజర్కు చూపించి తన ఆవేదనను వెలిబుచ్చాడు. అయినా బ్యాంకు మేనేజర్ అనంతయ్య కనుకరించకపోగా తమకు పైనుంచి డబ్బులు అందలేదని ఒట్టిచేతులతో తిప్పిపంపాడని హమీద్బాషా ఆరోపించారు. సరుకులు తీసుకొన్న వారి ఖాతా నెంబర్లు సేకరిస్తే వారికి తమ బ్యాంకు నుంచి డబ్బులను జమ చేస్తామని మేనేజర్ సలహా ఇచ్చినట్లు బాధితుడు తెలిపారు. -
సింగపూర్లో పండుగ చేస్కోండి
సింగపూర్ టూరిజం బోర్డ్ ఆహ్వానం ముంబై: సింగపూర్లో పండుగలు జరుపుకోవాలంటూ దేశీయ పర్యాటకులకు సింగపూర్ టూరిజం బోర్డ్, సింగపూర్ ఎరుుర్లైన్స ఆహ్వానం పలికారుు. అక్టోబర్ నుంచి నుంచి డిసెంబర్ చివరి వరకు సింగపూర్లో పర్యటించేందుకు వీలుగా సింగపూర్ ఎరుుర్లైన్సలో టికెట్ బుక్ చేసుకునే వారికి ‘సింగపూర్ 241 పాస్పోర్ట్’ యాప్ ద్వారా ఉచిత ప్రయోజనాలు అందుకోవచ్చని ఈ సంస్థలు ఓ ప్రకటనలో తెలిపారుు. సింగపూర్లోని 24 భాగస్వామ్య ఔట్లెట్లలో, రెస్టారెంట్లలో రూ.48వేల విలువ మేరకు ప్రయోజనాలు అందుకోవచ్చని పేర్కొన్నారుు. -
ఉత్తమ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
పోచమ్మమైదాన్ :జిల్లాలో సమాజ సేవ చేస్తున్న యువత, మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు 2015–2016 సంవత్సరానికి గాను జిల్లా ఉత్తమ యువజన సంఘం అవార్డుల ఎంపికకు దరఖాస్తు లు ఆహ్వానిస్తున్నట్లు నెహ్రూ యువ కేం ద్ర జిల్లా కోఆర్డినేటర్ మనోరంజన్ తెలి పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన చేశారు. నెహ్రూ యువకేంద్రంలో అఫిలియేషన్ పొందిన వారే అవార్డులకు అర్హులని పేర్కొన్నారు. రిజి స్ట్రేషన్ అయి మూడేళ్లు కావాలని, సభ్యు లు 14 – 29 మధ్య వయసు వారై ఉండాలని సూచించారు. మూడేళ్ల ప్రగతి నివేదిక, ఆడిట్ రిపోర్టు, కార్యక్రమాల ఫొటో లు, పేపర్ కటింగ్ జిరాక్స్లను దరఖాస్తుతో జతచేసి, ఈనెల 25 లోగా హన్మకొండ లోని ఎన్వైకే కార్యాలయంలో అం దజేయాలని సూచించారు. వివరాలకు 0870–2578776 నంబర్లో సంప్రదిం చాలని కోరారు.