advice
-
హిందువులపై దాడులు..బంగ్లాదేశ్కు అమెరికా కీలక సూచన
వాషింగ్టన్:బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆందోళకర పరిణామాలపై అగ్రదేశం అమెరికా స్పందించింది. పౌరుల ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అమెరికా సూచించింది. బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో దేశంలో మత,ప్రాథమిక,మానవ హక్కులను గౌరవించాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని అమెరికా కోరింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మంగళవారం(డిసెంబర్4) మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలన్నీ చట్టాలను గౌరవించాల్సిందేనన్నారు. నిర్బంధంలో ఉన్నవారికి కూడా ప్రాథమిక స్వేచ్ఛనిస్తూ వారి మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలని పటేల్ కోరారు.కాగా, బంగ్లాదేశ్లో షేక్హసీనా ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు మొదలైన విషయం తెలిసిందే. ఇటీవల హిందు మతానికి చెందిన చిన్మయ్ కృష్ణదాస్ను కూడా అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. చిన్మయ్ తరపున కేసు వాదించేందుకు వచ్చిన న్యాయవాదిపైనా దాడి జరగడం బంగ్లాదేశ్లో దిగజారిన పరిస్థితులను తెలియజేస్తోంది. -
ఆందోళనని హ్యాండిల్ చేయడంపై హీరో విక్కీ కౌశల్ సలహాలు!
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ అత్యంత ప్రతిభావంతమైన హీరోల్లో ఒకరు. `యూరి` లాంటి సంచలన మూవీతో ఒక్కసారిగా అతడి పేరు మారుమ్రోగిపోయింది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి వారి మనుసులను గెలుచుకున్నాడు. నిజానికి విక్కీ ఓవర్నైట్లో స్టార్డమ్ని సంపాదించుకోలేదు. అతను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా కష్టాలు పడ్డాడు. ఆ క్రమంలో ఆందోళన(యాంగ్జయిటీ), అభద్రతభావానికి గురయ్యేవాడనని చెప్పుకొచ్చాడు విక్కీ. అయితే దాన్ని ఏవిధంగా హ్యాండిల్ చేయాలో ఓ సీనియర్ నటుడు తనకు మంచి సలహ ఇచ్చారని అన్నారు. ఇంతకీ ఏంటా సలహా అంటే..నటన, డ్యాన్స్ పరంగా విక్కీ కౌశల్ చాలా టాలెంటెడ్ హీరో. ఏ పని అయినా చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. కెరీర్లో హీరోగా ఎదుగుతున్న సమయంలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో తాను ఆందోళనకు గురయ్యేవాడనని అన్నారు. అయితే దాన్ని హ్యాండిల్ చేయడంపై ఓ సీనియర్ నటుడు ఇచ్చిన సలహను తూచాతప్పకుండా పాటిస్తానని అన్నారు. అదేంటంటే..ఆందోళనను ఎలా మ్యానేజ్ చేయాలంటే..మనకు ఆందోళన లేదా యాంగ్జయిటీని ఫేస్ చేస్తున్నప్పుడూ దానని మంచి స్నేహితుడిగా మార్చుకుండి. మీరు ఏ విషయమై ఆందోళన చెందుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆందోళన అనేది ఎప్పుడు కలుగుతుందంటే.. ఒక పనిలో సరైన టాలెంట్ లేకపోవడం లేదా ఏదైన బలహీనత కారణంగా ఎదురవ్వుతుంది. కాబట్టి ముందుగా అందులో మంచి నైపుణ్యం సాధించండి ఆటోమేటిగ్గా ఆందోళన మీకు దాసోహం అవుతుందని చెబుతున్నాడు నటుడు విక్కీ. అంతేగాదు ఆందోళనను అధిగమించాలంటే ముందుగా మన బలహీనతల్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలి, దాంట్లో ప్రావీణ్యం సాధించే యత్నం చేయాలి. అప్పుడు ఆందోళన, ఒత్తిడి వంటివి మన దరిచేరవని అన్నారు . ఇలా మానసిక ఆరోగ్యం గురించి విక్కీ మాట్లాడటం తొలిసారి కాదు. గతంలో ఓ టీవీ షోలో కాలేజ్ టైంలో తాను ఎలా ఆత్యనూన్యతతో బాధపడ్డాడో షేర్ చేసుకున్నారు. అంతేగాదు తన ఫిజికల్ అపీరియన్స్ పట్ల ఎలా ఆందోళన చెందిందే, అవన్నీ తన మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేశాయో వివరించడమే గాక తన అభిమానులకు మానసిక ఆరోగ్యంపై స్ప్రుహ కలిగిస్తున్నాడు. (చదవండి: అమితాబ్ బచ్చన్ 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్'!) -
'వర్క్ లైఫ్ బ్యాలెన్స్'పై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి అమూల్యమైన సలహాలు.!
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు, మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో అజయ్ బంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఛాలెంజ్పై అమూల్యమైన సలహాలు సూచనలందించారు. నిజానికి వర్క్లైఫ్ బ్యాలెన్స్ అనేది పూర్తిగా వ్యక్తిగతానికి సంబంధించిందని అన్నారు. ఎందుకంటే ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి గణనీయంగా మారుతుంది. కొంతమంది వ్యక్తులు ప్రతిరోజూ సుమారు 12 నుంచి 18 గంటలు సమతుల్యంగా పనిచేయగా, మరికొందరూ ఆరుగంటలకు పైగా కష్టపడతారు. కాబట్టి ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది పూర్తిగా వ్యక్తిగతం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ తమకు తాముగా నిర్వర్తించాల్సిన బాధ్యత అని నొక్కి చెప్పారు. అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించడం అనేది రెండు కీలక అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. అవేంటంటే....పనిని ప్రేమించడం, ప్రియమైన వారి కోసం సమయాన్ని కేటాయించడం. దీని అర్థం పనిని ఆస్వాదించినట్లయితే కష్టపడి పనిచేయడం అనేది సాధ్యమవుతుంది. లేదంటే అదోక జర్నీలా సాగుతుంది అంతే. లేదా ఆ పని నచ్చనట్లయితే మీకు నచ్చిన పనిని చేసేందుకు ప్రయత్నించండి అప్పుడూ పని-జీవితంపై బ్యాలెన్స్ సాధించగలుగుతారని చెబుతున్నారు బంగా. దీంతోపాటు కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో మీ వంతు పాత్ర పోషించేలా పాలుపంచుకోవడం, వాళ్లతో గడిపేలా కొంత సమయం కేటాయించడం వంటివి చేయడం కూడా అత్యంత ముఖ్యం. మనవాళ్లకు అవసరమైనప్పుడూ పక్కనే మనం లేనప్పుడూ ఏవిధంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించగలుగుతారు. అందరూ కూడా మొబైల్ పరికరాలకి ప్రాధాన్యత ఇవ్వకండి, దానితోనే అందరితోనూ టచ్లో ఉన్నామని అస్సులు భావించొద్దు". అని సూచిస్తున్నారు బంగా. వ్యక్తిగతంగా మీ వాళ్లతో స్పెండ్ చేయండి లేదా వ్యక్తిగత చర్యలకి ప్రాధాన్యత ఇవ్వండని చెబుతున్నారు. ఇక్కడ సాంకేతికత మనుషుల మధ్య ఉన్న కనెక్షన్లను దూరం చేస్తుందనేది గ్రహించండి. ఇది మీ వ్యక్తిగత జీవితంలోకి చొరబడకుండా జాగ్రత్త పడండి. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సాధించాలంటే కొన్ని సరిహద్దుల అవసరాన్ని నొక్కి చెబుతూ.. హెచ్చరించారు బంగా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Former Mastercard CEO, Ajay Banga on work-life balance: pic.twitter.com/Hi3liSr5of— Business Nerd 🧠 (@BusinessNerd_) October 13, 2024 (చదవండి: 50 గంటల్లో 16 వేల కేలరీల ఫాస్ట్ ఫుడ్ ఛాలెంజ్..కట్చేస్తే..!) -
నేను మీలా అవ్వాలంటే?: ఇన్ఫీ నారాయణ మూర్తి సమాధానం
ఇన్ఫోసిస్ కంపెనీ గురించి తెలిసిన అందరికీ.. ఎన్ఆర్ నారాయణ మూర్తి గురించి కూడా తప్పకుండా తెలిసే ఉంటుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రముఖ్ టెక్ దిగ్గజంగా ఎదిగారు అంటే, దాని వెనుక ఆయన అపారమైన కృషి, పట్టుదలే కారణం. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని నేడు ప్రముఖుల జాబితాలో ఒకరుగా ఉన్న నారాయణమూర్తి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ.. సూచనలు, సలహాలు ఇస్తుంటారు.ఇటీవల నారాయణ మూర్తి టీచ్ ఫర్ ఇండియా లీడర్స్ వీక్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 12ఏళ్ల విద్యార్ధి ''నేను మీలా అవ్వాలంటే?.. ఏమి చేయాలి'' అని ప్రశ్నించారు. దానికి మూర్తి బదులిస్తూ.. ''మీరు నాలాగా మారడం నాకు ఇష్టం లేదు. దేశ శ్రేయస్సు కోసం మీరు నా కంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.మీ సొంత మార్గాన్ని ఏర్పరచుకోండి.. కొత్త విధానాలకు శ్రీకారం చుట్టండి. జీవితం అంటే ఒకరి అడుగుజాడల్లో నడవడం కాదని నారాయణ మూర్తి వెల్లడించారు. క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ.. మా నాన్న నాకు టైమ్టేబుల్ ద్వారా సమయాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పించారు. అదే నన్ను స్టేట్ ఎస్ఎస్ఎల్సీ పరీక్షలో నాల్గవ ర్యాంక్ సాధించేలా చేసిందని వెల్లడించారు.ఇదీ చదవండి: 'అలాంటివేం లేదు.. అదంతా తప్పుడు ప్రచారం': ఆనంద్ మహీంద్రాప్యారిస్లో ఇంజనీర్గా ఉన్నప్పుడు, ఒక ప్రోగ్రామ్ను పరీక్షించే సమయంలో అనుకోకుండా మొత్తం కంప్యూటర్ సిస్టమ్ మెమరీని తొలగింతొలగించాను. సిస్టమ్ని పునరుద్ధరించడానికి అప్పటి మా బాస్ కోలిన్తో కలిసి 22 గంటలు పంచేసాను. కాబట్టి అనుకోను తప్పులు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలని ఆయన అన్నారు. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని ఆయన అన్నారు. -
ఎఫ్అండ్వో చర్చాపత్రంపై సెబీకి భారీగా ఫీడ్బ్యాక్
ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్వో) ట్రేడింగ్కి సంబంధించి విడుదల చేసిన చర్చాపత్రంపై దాదాపు 6,000కు పైగా పరిశ్రమవర్గాల నుంచి సలహాలు, సూచనలు వచ్చాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవి పురి బచ్ తెలిపారు. ఆ ఫీడ్బ్యాక్ మొత్తాన్ని టెక్నాలజీ ద్వారా వేగవంతంగా ప్రాసెస్ చేసినట్లు ఆమె చెప్పారు. నిఘా, ప్రాసెసింగ్ను మెరుగుపర్చేందుకు పలు కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత సాంకేతికతలపై సెబీ పని చేస్తోందని మాధవి వివరించారు. ఎఫ్అండ్వో ట్రేడింగ్కి సంబంధించి ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, డెరివేటివ్ మార్కెట్లలో స్థిరత్వం తెచ్చేందుకు తీసుకోతగిన చర్యలపై జూలైలో సెబీ చర్చాపత్రాన్ని విడుదల చేసింది. కనీస కాంట్రాక్టు సైజును పెంచడం, పొజిషన్ లిమిట్స్ను ఇంట్రా–డేలో పర్యవేక్షించడం, స్ట్రైక్ ప్రైస్లను క్రమబదీ్ధకరించడం, నియర్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ మార్జిన్ను పెంచడం తదితర ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా: '3 ఇడియట్స్' సీన్తో..
ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యుగంలో భారతీయ ఇంజనీర్లకు సలహాలు ఇచ్చారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ (FAANG) వంటి సంస్థల్లో ఇంటర్వ్యూల్లో ఎలా విజయం సాధించాలో వివరిస్తూ.. రోట్ లెర్నింగ్ గురించి వివరించారు. ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా.. బట్టీ పడితే ఉపయోగం లేదని అన్నారు. కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ తప్పకుండా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని అన్నారు.దీనికి ఉదాహరణగా 3 ఇడియట్స్ సినిమా గురించి వివరించారు. ఈ సినిమాలో మోటార్ ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్నకు ఓ విద్యార్ధి బట్టీ పట్టిన సమాధానం చెబుతాడు. ఆ పద్దతి సరైనది కాదని వివరించారు. ఒక వ్యక్తి ఎంత స్మార్ట్ అయినప్పటికీ.. ఫండమెంటల్స్పై దృష్టి పెట్టడంలో విఫలమవుతున్నారని ఆయన అన్నారు. -
ఆ వ్యక్తుల హెల్త్ సీక్రెట్స్తో యూస్ ఉండదట!
మంచి ఆరోగ్యంగా ఫిట్గా ఉండే వారిని అడిగి మరీ హెల్త్ సీక్రెట్స్ తెలుసుకుంటాం. మనం కూడా వాటిని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తాం. సర్వసాధారణం. ఇలానే వందేళ్లకు పైగా జీవించిన వృద్ధుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య సలహలు తీసుకునే యత్నం చేస్తాం. ఇలా అస్సలు చేయడదట. ఎందుకంటే అందుకు చాలా కారణాలు ఉంటాయని, అందరికీ ఒకేలాంటి పరిస్థితులు ఎదరవ్వవని నిపుణులు అంటున్నారు. పైగా అర్థరహితమైన ప్రశ్నగా కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే..?సుదీర్ఘకాలం ఎలా జీవించారో తెలుసుకుని వారి నుంచి ఆరోగ్య సలహాలు తీసుకోవడం వంటి చేయకూడదు. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణుల చెబుతున్నారు. పైగా దీన్ని సర్వైవర్షిప్ బయాస్గా చెబుతున్నారు. ఏంటీ సర్వైవర్షిప్ బయాస్ అంటే..రెండో ప్రపంచయుద్ధంలో మిత్రరాజ్యల నిపుణులు యుద్ధ నష్టాన్ని అంచనా వేసేందుకు తిరిగొచ్చిన యుద్ధ విమానాలను లెక్కించేది. మరీ తిరిగి రానీ విమానాల సంగతేంటన్నది ఆలోచించేవారు కాదు. ఈ డ్యామేజ్ అయిన విమానాకు రక్షణ కవచాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపేవారు. ఇది సరైయనది కాదని, తప్పుదారి పట్టించే గణన అని చెబతున్నారు. దీన్నే సర్వైవర్షిప్ బయాస్ అని పిలుస్తారు. కేవలం చుట్టూ ఉన్నవాటినే లెక్కించి, మనుగడ లేని వాటిని విస్మరించడాన్ని సర్వైవర్షిప్ బయాస్ అంటారు. అలాగే ఓ వందమంది సముహం తీసుకుందాం. వారంతా జీవితమంతా పొగతాగితే..వారిలో కొందరు ఊపిరితిత్తుల వ్యాధి లేదా గుండె జబ్బులతో ముందుగానే చనిపోతారు. ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వాటన్నింటిని తప్పించుకుని సుదీర్ఘకాలం జీవిస్తారు. వారిని ఇంటర్యూస్తే..అతడు రోజు ఒక ప్యాకెట్ దమ్ము పీల్చడం అంటే అంగీస్తారా?. నిజానికి ఇది అందరి విషయంలోనే సరైయినది కాదు కదా. కష్టాలు ఎదురై విజయం సాధించిన నటులు లేదా వ్యాపారవేత్త విజయగాథలే వింటాం. అందుకోలేకపోయిన వాళ్ల సంగతి గురించి ఆలోచించం. ఎన్నడూ ప్రయత్నం చేయని వాళ్ల గురించి కూడా విని ఉండం. అందువల్ల ఓన్లీ విజయ పరంపరనే లెక్కలోకి తీసుకుని సక్సెస్ అనొద్దు మీగతా వాళ్లు కూడా అంతే కష్టపడవచ్చు అందుకోలేకపోవడానికి ఏదో కచ్చితమైన కారణాలు కూడా ఉంటాయి. అలాగే కొందరూ వృద్ధులు మంచి వ్యాయామాలతో 60లో కూడా మంచి ఫిట్గా ఆరోగ్యంగా ఉంటారు. మరికొందరూ భయానక వ్యాధుల బారిన పడినా కూడా సేఫ్గా బయటపడతారు. వీళ్లు కూడా సుదీర్ఘకాలం జీవించినా..ఆయా వ్యక్తుల్లా వృధాప్యంలో చురుకుగా ఉండకపోవచ్చు. ఇక్కడ వ్యక్తి మంచి ఆరోగ్యం వ్యాయామంతో ముడిపడి ఉన్నా..కొంరిలో అందుకు మరో కారణం కూడా ఉంటుందని అంటున్నారు నిపుణులు. దీనిపై ఇప్పటి వరకు సరైన స్పష్టత లేదని అంటున్నారు. మాములుగా సుదీర్ఘకాల జీవనానికి మంచి అలవాట్ల జాబితా చాలా ఉన్పప్పటికీ.. దీంతోపాటు సానుకూల దృక్పథం, మంచి సంబంధబాంధవ్యాలు వంటివి కూడా ఉంటాయని అంటున్నారు నిపుణులు.(చదవండి: మథర్స్ డే వెనకాల మనసును కథలించే కథ!) -
PM Narendra Modi: భారీ ప్లాన్ అనగానే భయపడొద్దు
న్యూఢిల్లీ: భారత్ కోసం బృహత్ ప్రణాళికలు ప్రకటించిన ప్రతిసారీ భయపడాల్సిన పనిలేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన క్షణాన దేశవ్యాప్తంగా జనంలో ఒకింత ఆందోళన, పాత నోట్ల మార్పిడిపై భయాలు నెలకొన్న ఘటనను ప్రధాని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. ఏఎన్ఐ వార్తాసంస్థతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రధాని మోదీ పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘ పెద్ద ప్రణాళిక ఉంది అన్నంతమాత్రాన ఎవరూ భయపడాల్సిన పని లేదు. ఎవరినీ ఆందోళనకు గురిచేసేలా నా నిర్ణయాలు ఉండవు. దేశ సమగ్రాభివృద్దే లక్ష్యంగా నా నిర్ణయాలుంటాయి. సాధారణంగా ప్రజా సంక్షేమం కోసం అంతా చేశామని ప్రభుత్వాలు ప్రకటించుకుంటాయి. అంతా నేనే చేశానంటే నమ్మను. సవ్యపథంలో ప్రజాసంక్షేమానికి శాయశక్తులా కృషిచేస్తా. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నా దేశం సాధించాల్సింది ఇంకా ఉంది. ప్రతి కుటుంబం కలను నెరవేర్చేది ఎలాగ అనేదే నా ఆలోచన. అందుకే గత పదేళ్లలో చేసింది ట్రైలర్ మాత్రమే అంటున్నా’’ అని మోదీ చెప్పారు. 100 రోజుల ప్లాన్ ముందే సిద్ధం ‘‘ నా ధ్యాసంతా 2047 విజన్ మీదే. గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలుగా పనిచేసిన అనభవం ఉంది. ఆ రోజుల్లో ఎన్నికలొచ్చినపుడు ఓ 40 మంది సీనియర్ ఉన్నతాధికారులు ఎన్నికల పర్యవేక్షక విధుల్లోకి వెళ్లిపోయేవారు. అలా దాదాపు 50 రోజులు కీలక అధికారులు లేకుండా రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలి అనేదే సమస్యగా ఉండేది. తరచూ ఎన్నికలు జరిగే దేశంలో ఇలాంటి సమస్యలు అనివార్యం. వాళ్లు లేని ఆ 50 రోజులు నాకు విరామం ఇచ్చినట్లు కాదని నిర్ణయించుకున్నా. పూర్తిచేయాల్సిన పనులను ముందే వాళ్లకు పురమాయించేవాడిని. రాబోయే ప్రభుత్వం కోసమే ఈ పనులు చేయండని ఆదేశించేవాడిని. అలా 100 రోజుల ముందస్తు ప్రణాళిక పద్ధతి ఆనాడే అలవాటైంది నాకు. అదే మాదిరి ఇప్పుడూ మూడోసారి ప్రధాని అయితే తొలి 100 రోజుల్లో చేయాల్సిన పనులు, ప్రణాళికలను ముందే సిద్ధంచేసి పెట్టుకున్నా. 2047 వికసిత భారత్ కోసం చేయాల్సిన పనులపై గత రెండు సంవత్సరాలుగా కస రత్తు చేస్తున్నాం’’ అని మోదీ వెల్లడించారు. విఫల కాంగ్రెస్కు, సఫల కమలానికి పోటీ ‘‘ వైఫల్యాల కాంగ్రెస్ విధానానికి, అభివృద్ధిని సాకారం చేసిన బీజేపీ విధానాలకు మధ్య పోటీ ఈ ఎన్నికలు. కాంగ్రెస్ ఐదారు దశాబ్దాలు పాలించింది. మాకు ఈ పదేళ్లే పనిచేసే అవకాశమొచ్చింది. అందులోనూ కోవిడ్ వల్ల రెండేళ్లకాలాన్ని కోల్పోయాం. ఈ ఎనిమిదేళ్లలో దేశంలో కనిపిస్తున్న అభివృద్ధిని, నాటి కాంగ్రెస్, నేటి ఎన్డీఏ పాలనతో పోల్చి చూడండి. అభివృద్ది విస్తృతి, వేగాన్ని లెక్కలోకి తీసుకుని ఓటరు ఎటువైపు నిలబడాలో తేల్చుకోవాల్సిన తరుణమిది. వచ్చే ఐదేళ్లకాలంలో అభివృద్ధిని పరుగుపెట్టిస్తాం. దేశాన్ని పాలించే బాధ్యతలు మనకు అప్పగించినప్పుడు ఒక్కటే లక్ష్యం కళ్ల ముందు కదలాడుతుంది. అదే దేశ ప్రజల అభ్యున్నతి’’ అని మోదీ అన్నారు. గాంధీల కుటుంబంపై మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ ఒక్క కుటుంబ ప్రయోజనాలే పరమావధిగా నాడు రాజకీయ సంస్కృతి కొనసాగింది. కుటుంబ పునాదులు కదలకుండా అంతా కాపుగాశారు. దేశ పునాదులను పటిష్టపరిచే సదుద్దేశంతో పనిచేస్తున్నా. నిజాయితీతో మేం చేసిన పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయి’’ అని అన్నారు. తొలి 100 రోజుల్లో చేసినవే అవి.. ‘‘2019 లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందే 100 రోజుల ప్లాన్ సిద్దంచేశాం. గెలిచి రాగానే ఒక్క నిమిషం కూడా వృథాచేయకుండా వాటి అమ లుపై దృష్టిపెట్టా. 2019లో గెలిచిన 100 రోజుల్లోపే ఆర్టికల్ 370ని రద్దుచేశా. ట్రిపుల్ తలాఖ్ను రద్దుచే యడంతో ముస్లిం సోదరీమణులకు స్వేచ్ఛ లభించింది. ఇది కూడా తొలి 100 రోజుల్లోనే అమలుచేశా. విశ్వాసమనేది కొండంత బలాన్ని ఇస్తుంది. భారతీయులు నా మీద పెట్టుకున్న నమ్మకం నాపై వాళ్లు ఉంచిన బాధ్యతగా భావిస్తా. భరతమాత ముద్దుబిడ్డగా నేను చేస్తున్న సేవ ఇది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. 20 లక్షల మంది నుంచి సలహాలు ‘వచ్చే పాతికేళ్లలో దేశం ఎలాంటి అభివృద్ధి దిశలో పయనిస్తే బాగుంటుందో చెప్పాలని లక్షలాది మందిని సలహాలు అడిగా. వారి నుంచి సూచనలు స్వీకరించా. విశ్వవిద్యాలయాలు, వేర్వేరు రంగాల ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు ఇలా దాదాపు 15–20 లక్షల మంది నుంచి సలహాలు తీసుకున్నా. కృత్రిమ మేథ సాయంతో సలహాలను రంగాలవారీగా విభజించా. ప్రతి మంత్రిత్వశాఖ, డిపార్ట్మెంట్లో అంకితభావంతో పనిచేసే అధికారులకు ఈ పని అప్పగించా. ఈసారి ఐదేళ్ల ఎన్డీఏ హయాంలో చేయగలిగిన అభివృద్ధి ఎంత అని బేరీజువేసుకున్నా. 2047నాటికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తవుతుంది. ఇలాంటి మైలురాయిని చేరుకున్నపుడు గ్రామమైనా, దేశమైనా కొత్త సంకల్పంతో ముందడుగు వేయాలి. నా గ్రామనికి నేనే పెద్ద అయినపుడు 2047కల్లా సొంతూరుకు ఏదైనా మంచి చేయాలని అనుకుంటాను కదా. దేశవ్యాప్తంగా ఇలాంటి స్ఫూర్తి రగలాలి. వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు అనేవి ప్రతి ఒక్కరికీ గొప్ప స్ఫూర్తినిస్తాయి’’ అని మోదీ అన్నారు. -
ఆ స్టార్ హీరో సలహాతో బ్లాక్బస్టర్ కొట్టిన చిరంజీవి (ఫోటోలు)
-
ఐఫోన్ నీళ్లలో పడిందా.. ఈ ఒక్కటి చేయండి - యాపిల్ సలహా
మనం రోజు ఉపయోగించే స్మార్ట్ఫోన్ నీటిలో పడినప్పుడు చాలామంది చేసేపని దాన్ని తీసి వెంటనే తుడిచి ఓ బియ్యం సంచిలోనో లేక డబ్బాలోనో ఉంచి, కొంత సమయం వేచి ఉన్న తరువాత దానికి మళ్ళీ ఛార్జింగ్ పెడతారు. అయితే ఈ విధానం 'ఐఫోన్'ల విషయంలో అమలు చేయకూడదని యాపిల్ కంపెనీ పేర్కొంది. ఐఫోన్ నీళ్లలో పడితే దాన్ని బియ్యం సంచిలో ఉంచకూడదని, అలా చేస్తే బియ్యంలో ఉండే సూక్ష్మ రేణువులు ఫోన్లోకి చేసే అవకాశం ఉంది, తద్వారా ఫోన్ పాడయ్యే అవకాశం ఉంటుందని యాపిల్ కంపెనీ పేర్కొంది. నీళ్లలో ఐఫోన్ పడితే దాన్ని దానిలోకి చేరిన నీటిని మెల్లగా బయటకు తీయడానికి కిందివైపు ఉన్న డివైజును నెమ్మదిగా/సున్నితంగా కొట్టాలి. ఆ తరువాత గాలి వీచే ప్రదేశంలో ఉంచాలి. ఓ అరగంట తరువాత కేబుల్తో ఛార్జ్ చేయాలి. ఇదీ చదవండి: కంటెంట్ క్రియేటర్ల కోసం బెస్ట్ ల్యాప్టాప్స్ ఇవే! ధరలు ఎలా ఉన్నాయంటే? నిజానికి ఫోన్లోకి చేరిన నీరు బయటకు రావడానికి ఒక రోజు సమయం కూడా పట్టొచ్చు. దీనిని లిక్విడ్ డిటెక్షన్ అలర్ట్ సాయంతో ఫోన్ పరిస్థితిని తెలుసుకోవచ్చు. ఇంకా ఏదైనా అనుమానం ఉంటే దాన్ని యాపిల్ అధీకృత సర్వీస్ ప్రొవైడర్ వద్దకు తీసుకెళ్లాలని సంస్థ సూచించింది. -
భారత్లోకి టెస్లా.. పేరు మార్చుకుంటేనే పనవుతుంది! వైరల్ ట్వీట్
ఎలాన్ మస్క్ ( Elon Musk ) నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ( Tesla ) భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. ఈ క్రమంలో నథింగ్ ఫోన్ ( Nothing Phone ) సీఈఓ కార్ల్ పీ ( Carl Pei ).. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్కి ఓ ఫన్నీ సలహా ఇచ్చారు. భారత్లో ఫ్యాక్టరీని ఎలా తెరవాలో చమత్కారంగా సూచించారు. భారతదేశంలో టెస్లా ఫ్యాక్టరీని ప్రారంభించాలంటే ముందుగా ‘ఎక్స్’ (ట్విటర్) ప్లాట్ఫారమ్లో తన యూజర్ నేమ్ను "ఎలాన్ భాయ్"గా మార్చుకోవాలని కార్ల్ పీ సూచించారు. ఈయన కూడా స్వయంగా తన ‘ఎక్స్’ యూజర్ నేమ్ను 'కార్ల్ భాయ్'గా మార్చుకున్నారు. "ఎలాన్ మస్క్.. మీ యూజర్ నేమ్ను ఎలాన్ భాయ్గా మార్చకుండా భారత్లో టెస్లా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొచ్చనుకుంటున్నారా?" ఎలాన్ మస్క్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్గా మారింది. 6.7 లక్షల వీవ్స్, వందల కొద్దీ కామెంట్లు వచ్చాయి. ఈ ట్వీట్కు యూజర్లు సైతం అంతే ఫన్నీగా స్పందించారు. "మీరు భాయ్, అతను (మస్క్) మామూ అవుతాడు" అని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. "ప్రాంతాన్ని బట్టి పేరు ఆధారపడి ఉంటుంది. గుజరాత్ అయితే ఎలాన్ భాయ్, మహారాష్ట్ర అయితే ఎలాన్ భావ్, తెలంగాణ అయితే ఎలాన్ గారు, హర్యానా అయితే ఎలోన్ టౌ, పంజాబ్ అయితే ఎలాన్ పాజీ, తమిళనాడు అయితే ఎలాన్ అన్నా, అలాగే పశ్చిమ బెంగాల్ అయితే ఎలాన్ దాదా" అని మరొక యూజర్ పేర్కొన్నారు. "ఎలాన్ దాదా బాగా సరిపోతుంది!" ఇంకొక యూజర్ చమత్కరించారు. ఇంకా రకరకాల పేర్లను యూజర్లు సూచించారు. .@elonmusk did you really think you could build a Tesla factory in India without changing your username to Elon Bhai? — Carl Bhai (@getpeid) February 18, 2024 ది ఎకనామిక్ టైమ్స్ తాజా నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించే అంచున ఉంది. ఎలక్ట్రిక్ కార్లపై రూ.30 లక్షలకు మించిన రాయితీ దిగుమతి సుంకాలను 2-3 సంవత్సరాల పాటు పొడిగించే విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తోంది. ప్రస్తుతం భారత్ రూ.33 లక్షల కంటే ఎక్కువ విలువ కలిగిన కార్లపై 100 శాతం దిగుమతి సుంకాన్ని, ఆ శ్రేణి కంటే తక్కువ ఉన్న కార్లపై 60 శాతం విధిస్తోంది. కార్యకలాపాల ప్రారంభ సంవత్సరాల్లో విదేశీ ఈవీలపై ప్రభుత్వం 15 శాతం దిగుమతి సుంకాన్ని తగ్గించినట్లయితే భారత్లో 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి టెస్లా సుముఖతను వ్యక్తం చేసింది. -
Pariksha Pe Charcha 2024: అర నిమిషంలో నిద్రపోతా
న్యూఢిల్లీ: అధిక సమయం స్క్రీన్లకు అతుక్కుపోతే అది మీ నిద్రపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని విద్యార్థులను ప్రధాని మోదీ సున్నితంగా హెచ్చరించారు. దేశవ్యాప్తంగా పరీక్షల వేళ విద్యార్థుల ఒత్తిడిని పోగొట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ఏడో విడత ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం సోమవారం ఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. వర్చువల్గా పాల్గొన్న కోట్లాది మంది విద్యార్థులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. మోదీ విద్యార్థులకు చేసిన పలు సూచనలు, సలహాలు ఆయన మాటల్లోనే.. అవసరం మేరకే ఫోన్ వాడతా ‘ జీవనశైలి సక్రమంగా ఉండాలంటే ఏదీ అతిగా ఉండొద్దు. అతి స్క్రీన్ టైమ్, రీల్స్ చూడటం మీ నిద్రాకాలాన్ని మింగేస్తుంది. ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం నిద్ర అనేది అత్యంత కీలకం. అలాంటి నిద్ర తక్కువకాకుండా చూసుకోండి. నేనైతే అవసరమైన మేరకే ఫోన్ వాడతా. నిద్రకు ఉపక్రమించిన కేవలం 30 సెకన్లలోనే గాఢ నిద్రలోకి జారుకుంటా. రోజూ కొద్దిసేపు ఎండలో గడపండి. ఫోన్కు చార్జింగ్ లాగే పిల్లలకు పౌష్టికాహారం ముఖ్యం. ఎక్సర్సైజ్ చేసి ఫిట్గా ఉండండి. అప్పుడే చక్కగా చదవగలరు’’ అని అన్నారు. అలాంటి వారితో స్నేహం చేయండి ‘‘ చదువుల్లో బాగా కష్టపడుతూ, తెలివితేటలు ఉన్న తోటి విద్యార్థులతో స్నేహం చేయండి. అప్పుడే వారి నుంచి స్ఫూర్తి పొందగలరు. పేరెంట్స్కు నాదో సూచన. పిల్లల ప్రోగ్రెస్ కార్డ్ మీకు విజిటింగ్ కార్డ్ కాదు. మీరు వెళ్లినచోట మీ పిల్లల చదువుసంధ్యల గురించి అతిగా మాట్లాడకండి. ఎప్పుడూ ఇతర పిల్లలతో పోల్చి చూపకండి. ఇది మంచి పద్ధతి కాదు. పూజ చేసి కొత్త యూనిఫాం, స్టేషనరీ కొని పరీక్ష రోజును ప్రత్యేకమైన దినంగా మార్చేయకండి’’ అని చెప్పారు. చిన్న లక్ష్యాలతో మొదలెట్టండి ‘‘పిల్లలను మూడు ఒత్తిళ్లు ఇబ్బందిపెడతాయి. ఏకాగ్రత, తల్లిదండ్రుల ఒత్తిడి, ఆత్మవిశ్వాస లేమి. పరీక్షలకు ముందు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధిస్తూ మీ లక్ష్యాలను పెంచుకుంటూ పొండి. పరీక్షలు వచ్చేటప్పటికి సంసిద్ధమౌపోతారు. టీచర్–స్టూడెంట్ బంధం సిలబస్ పాఠాలకు అతీతమైనది. సిలబస్ చెబుతూనే సబ్జెక్ట్ పట్ల వారిలో భయాన్ని పొగొట్టండి. పిల్లలు బెరుకులేకుండా సందేహాలు అడిగేలా సౌమ్యంగా మెలగండి. బోధనను ఒక వృత్తిగా కాకుండా విద్యార్థుల భవతను తీర్చిదిద్దే యజ్ఞంగా భావించండి’’ అని అన్నారు. నాక్కూడా పరీక్ష లాంటిది ‘‘పరీక్ష పే చర్చా నాకూ ఓ పరీక్ష. ఎందుకంటే నేటితరం విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు ఎక్కువయ్యాయి. వినూత్నంగా ప్రధాని ఈసారి ఏం చెప్తారా? అనుకునే విద్యార్థులకు తగ్గట్లు నేనూ ఈ కార్యక్రమానికి సిద్ధమయ్యే రావాలికదా’’ అన్నారు. ఇంట్లో నో గాడ్జెట్ జోన్ ‘‘ తల్లిదండ్రులకు నాదో సలహా. టెక్నాలజీ నుంచి దూరం జరగలేం. అలాగని అతక్కుపోవడమూ సబబు కాదు. భోజనం చేసేటపుడు గాడ్జెట్ వాడొద్దనే నియమం పెట్టండి. ఏ యాప్ వాడినా స్క్రీన్ టైమ్ పెట్టుకోండి’’ అని సలహా ఇచ్చారు. ఈ ఏడాది 2.26 కోట్ల మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి రిజిస్ట్రర్ చేసుకోవడం విశేషం. -
Lok Sabha elections 2024: మేనిఫెస్టో కోసం సూచనలు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజల నుంచి పొందిన సలహాలు, సూచనలకు అనుగుణంగా ఈసారి లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధంచేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇందుకోసం వారు పంపాల్సిన ఈమెయిల్, వెబ్సైట్లను బుధవారం ఆవిష్కరించింది. awaazbharatki.in వెబ్సైట్కు ఓటర్లు తమ సూచనలను పంపొచ్చు. awaazbharatki@inc.in. మెయిల్ ఐడీకి సైతం దేశ ప్రజలు తమ సలహాలు, సూచనలను పంపొచ్చు. కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ఛైర్మన్గా ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీ ఇలా సామాన్య ప్రజలు, వివిధ వర్గాలు, సమూహాలు, సంస్థల నుంచి సలహాలు సూచనలను కోరుతోంది. ‘ప్రజాభీష్టానికి అనుగుణంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపుదిద్దుకుంటుంది’’ అని బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం, కన్వీనర్ టీఎస్ సింగ్ దేవ్ స్పష్టంచేశారు. -
జమిలి ఎన్నికలు... కోవింద్ కమిటీకి 5,000 సూచనలు
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో ఏర్పాటైన ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ కమిటీకి ప్రజల నుంచి ఇప్పటిదాకా 5,000 పై చిలుకు సలహాలు, సూచనలు అందినట్టు సమాచారం. కమిటీ దీనిపై గతవారం సలహాలను ఆహా్వనించడం తెలిసిందే. జనవరి 15 దాకా అందే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. గత సెపె్టంబర్లో ఏర్పాటైన కోవింద్ కమిటీ ఇప్పటిదాకా రెండుసార్లు సమావేశమైంది. జమిలి ఎన్నికలపై సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ ఆరు జాతీయ, 33 గుర్తింపు పొందిన పారీ్టలకు లేఖలు రాసింది. లా కమిషన్తో సమావేశమై అభిప్రాయాలను తెలుసుకుంది. జమిలి ప్రతిపాదనను, కోవింద్ కమిటీ ఏర్పాటును కాంగ్రెస్, పలు ఇతర విపక్షాలు ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. -
అది ఏ వయసు వారికి?
సర్విక్స్ క్యాన్సర్ రాకుండా టీకా ఉంది అంటున్నారు కదా.. దాన్ని ఏ వయసువారైనా తీసుకోవచ్చా? – ఎన్. విజయలక్ష్మి, హిందూపూర్ సర్విక్స్ క్యాన్సర్ అనేది చాలావరకు 65 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా కనపడుతుంది. కానీ కొన్నిసార్లు చిన్న వయసులోనే అంటే 25 ఏళ్లకి కూడా రావచ్చు. చాలా అధ్యయనాల తరువాత టీనేజ్లోనే అమ్మాయిలకు వ్యాక్సీన్ ఇస్తే భవిష్యత్లో సర్విక్స్ క్యాన్సర్ని నివారించవచ్చు అని రుజువు అయింది. హ్యూమన్ పాపిలోమా వైరస్ టైప్స్ 16, 18 ద్వారా సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి అది రాకుండా చిన్న వయసులోనే వ్యాక్సీన్ ఇస్తున్నారు. 9 ఏళ్ల నుంచి ఈ వ్యాక్సీన్ ఇవ్వొచ్చు. పిల్లల డాక్టర్, గైనకాలజిస్ట్లను సంప్రదిస్తే ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో సూచిస్తారు. 11–12 ఏళ్ల వయసులో కనీసం మొదటి డోస్ వ్యాక్సీన్ ఇస్తే మంచిది. ఈ వ్యాక్సీన్ మూడు డోసుల్లో ఉంటుంది. నెలకి, 6 నెలలకి రెండవ, మూడవ డోసులను ఇస్తారు. ఈ వ్యాక్సీన్తో చాలావరకు.. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 9 ఏళ్ల నుంచి 26 ఏళ్ల లోపు వ్యాక్సీన్ తీసుకున్నవారిలో వ్యాక్సీన్ బాగా పనిచేస్తుంది. కొంతమందికి అంటే క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారికి మాత్రం 27–45 ఏళ్లకి కూడా ఇస్తున్నారు. కానీ ఇది డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. హ్యూమన్ పాపిలోమా వైరస్ ఎక్కువగా లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. అందుకే పెళ్లికి ముందే వ్యాక్సీన్ ఇవ్వటం మంచిది. చిన్న వయసులో ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది కాబట్టి ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువకాలం ఉంటుంది. ఇప్పుడు Gardasil 9 అనే సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సీన్ను ఇస్తున్నారు. యీస్ట్ అలెర్జీ ఉన్నా.. ఫస్ట్ డోస్ హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సీన్కి అలెర్జీ వచ్చినా తరువాత డోస్లను తీసుకోకూడదు. 25 ఏళ్లు దాటిన వారికి పాప్ స్మియర్ టెస్ట్ చేసి.. సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సీన్ను ఇస్తారు. నాకిప్పుడు పాతికేళ్లు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ని. రోజుకి పది గంటలు వర్క్ చేస్తాను. కొన్నాళ్లుగా నడుము కింది భాగమంతా నొప్పిగా ఉంటోంది. అది కాళ్ల దాకా లాగుతోంది. ఈ నొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడొచ్చా? మెడికల్ షాప్లో అడిగి కొనుక్కోవచ్చా? – పేరు రాయలేదు, హైదరాబాద్ నడుము కింది భాగంలో నొప్పి అంటే నడుము నొప్పి, సోర్నెస్, స్టిఫ్గా ఉండి సయాటికా పెయిన్ అంటే నొప్పి వెనుక నుంచి రెండు కాళ్లల్లోకి రావడం. కొంతమందికి తిమ్మిర్లు కూడా వస్తాయి. సయాటికా నర్వ్ అనేది బ్యాక్ నుంచి నడుము, కాళ్లు, పాదాల్లోకి వెళ్తుంది. ఈ నర్వ్ ఒత్తిడికి గురైనా.. ఇరిటేట్ అయినా నొప్పి వస్తుంది. మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే.. ఈ పెయిన్ ఏమైనా బోన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిందా లేక వెంట్రుక మందం ఫ్రాక్చర్ ఏమైనా ఉందా లేదా అరుదుగా బోన్ క్యాన్సర్ ఏమైనా కావచ్చా అని మొదటగా రూల్ అవుట్ చేస్తారు. చేసి.. ఫిజియోథెరపిస్ట్, పెయిన్ స్పెషలిస్ట్ టీమ్కి రిఫర్ చేసి.. ఆ నొప్పికి కారణమేంటో కనిపెడతారు. ఎక్స్రే లేదా ఎమ్ఆర్ఐ తీస్తారు. మీ రోజూవారీ పనికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అలాగే ఏ మందులు వాడాలో సూచిస్తారు. కొంతమందిలో మందుల్లేకుండానే కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా లో బ్యాక్ పెయిన్ని మేనేజ్ చేయవచ్చు. బెల్టులు, corsets, ఫుట్ సపోర్ట్ షూస్ వంటివేమీ నొప్పిని తగ్గించడంలో సహాయపడవు. అలాగే ఆక్యూపంక్చర్,ట్రాక్షన్, ఎలక్ట్రోథెరపీ లాంటివీ చాలామందికి పనిచేయవు. వీటివల్ల కొన్నిసార్లు ఇబ్బంది ఎక్కువయ్యే ప్రమాదమూ ఉంటుంది. డాక్టర్ మిమ్మల్ని పరీక్షించి.. మీ వయసు, మీ వృత్తిని బట్టి మీకు ఏ విధమైన చికిత్స సరిపోతుందో ఆ చికిత్సను సూచిస్తారు. NSAIDs(పెయిన్ కిల్లర్స్)ని సాధారణంగా మొదటి దశలో నొప్పి నుంచి ఉపశమనానికి వాడొచ్చు. కానీ వీటివల్ల కడుపులో నొప్పి, అల్సర్లు కావచ్చు. అందుకే యాంటాసిడ్స్ కూడా తీసుకోవాలి. opioids అనేవి చాలా బాగా రిలీఫ్నిస్తాయి. అయితే వీటిని తక్కువ మోతాదులో.. చాలా తక్కువ రోజులు మాత్రమే వాడాలి. ఇవేవీ పనిచేయనప్పుడు ఆపరేషన్ గురించి ఆలోచించవచ్చు. అంటే ఈ బ్యాక్ పెయిన్కి కారణమవుతున్న నర్వ్ని బ్లాక్ చేయడం, లోకల్ ఎనస్తీషియా లేదా స్పైన్లోకి స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, బ్యాక్ సర్జరీతో నర్వ్ మీద ఒత్తిడి తగ్గించడం లాంటి పరిష్కారాలన్నమాట. స్ట్రెయిన్, స్లిప్డ్ డిస్క్ లాంటివి మందులతో తగ్గుతాయి. మీ జీవనశైలిని కొంత మారిస్తే కూడా బ్యాక్ పెయిన్ తగ్గవచ్చు. బరువు పెరగకుండా చూసుకోవడం, యాక్టివ్గా ఉండడం, రోజూవారీ ఇంటి పనులను మీరే చేసుకోవడం, కాల్షియం సప్లిమెంట్స్ని తీసుకోవడం, Ibuprofen, పారాసిటమాల్ లాంటి మాత్రలను తక్కువ మోతాదులో వాడటం, ఐస్ ప్యాక్తో బ్యాక్ పెయిన్కి కాపడం పెట్టుకోవడం, హాట్ ప్యాక్తో జాయింట్స్ దగ్గర స్టిఫ్నెస్ను, మజిల్స్ స్పాజమ్ని తగ్గించడం, క్రమం తప్పకుండా బ్యాక్ స్ట్రెచెస్ చెయ్యడం లాంటివాటితో నొప్పిని తగ్గించే వీలుంది. ఎక్కువ సమయం బెడ్ రెస్ట్ తీసుకోకూడదు. సైకలాజికల్ థెరపీస్ అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ అప్రోచ్తో కూడా బ్యాక్ పెయిన్ను మేనేజ్ చేయొచ్చు. చాలామందికి ఇది పనిచేస్తుంది. మందులను మాత్రం డాక్టర్లు తక్కువ మోతాదులో.. అదీ అతి తక్కువ రోజులకు మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. నొప్పి తీవ్రత తగ్గాక.. స్ట్రెచింగ్, మసాజ్లు, కొన్ని రకాల ఎక్సర్సైజ్లను సూచిస్తారు. మూడు నెలల కంటే తక్కువ రోజులు బ్యాక్ పెయిన్ ఉంటే దాన్ని అక్యూట్ పెయిన్ అంటారు. ఆ నొప్పికి పెయిన్ రిలీఫ్ మందులు పనిచేస్తాయి. మూడు నెలల కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని క్రానిక్ పెయిన్ అంటారు. దీని చికిత్సకు టీమ్ అప్రోచ్ అవసరం. డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్,హైదరాబాద్ -
ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. అధిక ప్రయోజనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటికే మార్కెట్లు కొంత మేర ర్యాలీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధి వరకూ మార్కెట్లలో ఇన్వెస్టర్లు విడతలవారీగా, కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించవచ్చని ఎడెల్వీజ్ మ్యుచువల్ ఫండ్ సీఐవో (ఈక్విటీస్) త్రిదీప్ భట్టాచార్య సూచించారు. పడినప్పుడల్లా కొనుగోలు చేసే విధానాన్ని పాటించవచ్చన్నారు. గత కొద్ది నెలలుగా ర్యాలీ చేసిన కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్పై అసంబద్ధ మైన స్థాయిలో ఆసక్తి నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివిధ స్థాయుల క్యాపిటలైజేషన్ గల స్టాక్స్లో మదుపు చేసే మల్టీక్యాప్ ఫండ్స్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక ప్రయోజనాలు పొందేందుకు ఆస్కారం ఉంటుందని భట్టాచార్య చెప్పారు. కొత్తగా ఎడెల్వీజ్ మల్టీక్యాప్ ఫండ్ ఎన్ఎఫ్వో బుధవారం (సెప్టెంబర్ 4) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. అక్టోబర్ 18 వరకు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వచ్చే 3-4 ఏళ్లు ప్రధానంగా అయిదు థీమ్స్ మార్కెట్లకు దన్నుగా నిల్చే అవకాశం ఉందని భట్టాచార్య తెలిపారు. తయారీ రంగం, ఆర్థిక సేవలకు సంబంధించి రుణాల విభాగం, డిఫెన్స్, రియల్ ఎస్టేట్ మొదలైనవి వీటిలో ఉంటాయని భట్టాచార్య పేర్కొన్నారు. ఆదాయాల్లో విదేశీ మార్కెట్ల వాటా ఎక్కువగా ఉన్న రంగాల సంస్థలపై అండర్వెయిట్గా ఉన్నామని ఆయన చెప్పారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
టీడీపీని, చంద్రబాబును పవన్ ఎన్నోసార్లు తిట్టాడు
-
లైక్ కొడితే రూ.50...కామెంట్ పెడితే రూ.100
కూర్చున్నచోటే రోజుకు రూ.వేల సంపాదన మీ సొంతం.. మీరు చేయాల్సిందల్లా మేం పంపే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఓపెన్ చేసి వాటిలోని వీడియోలు, ఫొటోలకు లైక్ కొట్టడమే.. అలా లైక్ కొట్టిన స్క్రీన్షాట్ మాకు పంపితే ఒక్కో అకౌంట్ స్క్రీన్షాట్కు రూ.100 చొప్పున మీ ఖాతాలో జమ చేస్తాం... మేం చెప్పిన యూట్యూబ్ వీడియోకు లైక్ కొడితే రూ.50... మేం చెప్పిన సినిమా రివ్యూకు ఐదు పాయింట్లు ఇస్తే.. మీ ఖాతాల్లో రూ.150 వేస్తాం.... ఏంటి ఇదంతా నిజం అనుకుంటున్నారా..? ఇదో సరికొత్త సైబర్ మోసం.. టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న ఈ తరహా మోసాలు ఇప్పుడు పెరిగాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాస్క్బేస్డ్ స్కాం అంటే.. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతూనే ఉన్నారు. టెలిగ్రామ్ యూజర్లను టార్గెట్ చేసుకుని టాస్క్బేస్డ్ స్కాంలు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. టెలిగ్రామ్ యూజర్లకు సైబర్ నేరగాళ్లు కొన్ని మెసేజ్లు పంపుతూ అందులో పేర్కొన్న టాస్క్పూర్తి చేస్తే డబ్బులు మీ ఖాతాలో వేస్తామని చెప్పే మోసాన్నే టాస్క్బేస్డ్ స్కాంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్బేస్డ్ మోసాలు చూస్తే... ఈ ఖాతాలు ఫాలోకండి.. టెలిగ్రామ్ యూజర్లకు పంపే మెసేజ్లలో మేం పంపే లింక్ ఓపెన్ చేసి ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతా లను ఫాలో అవుతూ, వాటిని ఓపెన్ చేసి స్క్రీన్షాట్ తీసి పంపితే డబ్బులు పంపుతామంటారు. రోజుకు 30 నుంచి 50 ఖాతాలు ఫాలో కావాలని చెబుతారు. యూ ట్యూబ్ వీడియోలకు లైక్లు..: సైబర్ మోసగాళ్లు పంపే మెసేజ్లలో కొన్ని యూట్యూబ్ వీడియోల లింక్లు పెడతారు. వాటిని ఓపెన్ చేసి ఆ వీడియోకు కాసేపు వాచ్ చేయడంతోపాటు లైక్ కొడితే మీ ఖాతాలో డబ్బులు వేస్తామని నమ్మబలుకుతారు. హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ పేరిట..: ఫలానా హోటల్, లేదంటే ఒక ఏరియాలోని రెస్టారెంట్లో సదుపాయాలు చాలా బాగున్నాయని, ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయని, ఆఫర్లు బాగున్నాయని..ఇలాంటి రివ్యూలు, రేటింగ్ ఇచ్చినందుకు డబ్బులు ఇస్తామని చెబుతుంటారు. సినిమా రివ్యూలకు రేటింగ్.. మేం పంపే లింక్ ఓపెన్ చేసి అందులోని వెబ్సైట్లో ఉన్న సినిమా రివ్యూలకు రేటింగ్ ఇవ్వాలని టాస్క్ ఇస్తారు..ఇలా ఒక్కో రివ్యూకు రేటింగ్ ఇస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని టాస్క్ ఇస్తారు. మోసానికి తెరతీస్తారు ఇలా.. ముందుగా ఇచ్చిన టాస్క్పూర్తి చేసిన తర్వాత, మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామంటూ పేరు, వయస్సు, వృత్తి, వాట్సాప్ నంబర్, ఏ ప్రాంతంలో ఉంటారు..విద్యార్హతలు, బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఇలా పూర్తి వివరాలు సేకరిస్తారు. మొదట ఒకటి రెండు సార్లు మన బ్యాంకు ఖాతాలోకి చిన్నచిన్న మొత్తాలు జమ చేసి నమ్మకాన్ని పెంచుతారు. ఆ తర్వాత మన బ్యాంకు ఖాతాలోంచి ఆన్లైన్లో డబ్బులు కొల్లగొట్టే మోసానికి తెరతీస్తారు. మన పూర్తి వివరాలతోపాటు, మన ఫోన్, కంప్యూటర్ను వారి అ«దీనంలోకి తీసుకుని ఓటీపీలను సైతం తెలుసుకుని, మన బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఇలాంటి మెసేజ్లు చూస్తే అనుమానించాల్సిందే.. ఆన్లైన్లో సైబర్ మోసాలు పెరుగుతున్నందున వీలైనంత వరకు అనుమానాస్పద మెసేజ్లలోని లింక్లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. అడ్డగోలు లాభాలు ఇస్తామని ఊదరగొడుతున్నారంటే అది కచ్చితంగా సైబర్ మోసమని గ్రహించాలి. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతున్నట్టు గమనిస్తే జాగ్రత్తపడాలి. అపరిచిత వ్యక్తులు ఆన్లైన్లో మనకు పంపే మెసేజ్లను నమ్మవద్దు. -
పెట్టుబడి సలహాలపట్ల ఇన్వెస్టర్లు జాగ్రత్త: ఎన్ఎస్ఈ
ముంబై: ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి సలహాలపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని దిగ్గజ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ తాజాగా పేర్కొంది. ఏంజెల్వన్ ఆల్గో సంస్థ పేరుతో శ్రేయా మిశ్రా అనే వ్యక్తి సెక్యూరిటీల మార్కెట్ సలహాలు(టిప్స్) ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలియజేసింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై లాభాల హామీతో 8347070395 మొబైల్ నంబరుతో ట్రేడింగ్కు సలహాలు ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ సంస్థతో తమకెలాంటి సంబంధంలేదని ఎక్సే్ఛంజీలో ట్రేడింగ్ సభ్యులుగా రిజిస్టరైన ఏంజెల్ వన్ లిమిటెడ్ తాజాగా ఎన్ఎస్ఈకి స్పష్టం చేసినట్లు తెలియజేసింది. చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ టిప్స్ ఇస్తున్న ఇలాంటి సంస్థలు లేదా వ్యక్తులపట్ల ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాల్సిందిగా ఒక ప్రకటనలో సూచించింది. ఎన్ఎస్ఈ వెబ్సైట్ నుంచి ''https:// www.nseindia.com/ invest/ find& a& stock& broker'' లింక్ ద్వారా మీ స్టాక్ బ్రోకర్ గురించి తెలుసుకునేందుకు వీలు కల్పించినట్లు వివరించింది. -
ఫైనాన్షియల్ మీడియా పోస్టులకు చెక్
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ద్వారా ఆర్థికపరమైన(ఫైనాన్షియల్) సలహాలిచ్చేవారిపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ దృష్టి పెట్టింది. ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లుగా పిలిచే వ్యక్తులు లేదా సంస్థల నియంత్రణకు తాజాగా చర్యలు చేపట్టింది. ఒక్కో పోస్టుకు రూ. 10,000 నుంచి రూ. 7.5 లక్షలవరకూ చార్జ్చేసే సలహాదారులు ఇటీవల అధికమైన నేపథ్యంలో సెబీ తాజా చర్యలకు తెరతీసింది. తద్వారా ఇన్వెస్టర్లకు కచి్చతమైన, నిష్పక్షపాత సమాచారం లభించేందుకు వీలు కలి్పంచనుంది. అదీకృత సలహాలకు అవకాశంతోపాటు.. మోసాలను తగ్గించేందుకు సెబీ చర్యలు తోడ్పడనున్నట్లు ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ పేర్కొన్నారు. సెబీ తాజా ప్రతిపాదనల ప్రకారం ఆర్థిక సలహాదారులు(ఫిన్ఫ్లుయెన్సర్లు) సెబీ వద్ద రిజిస్టర్కావలసి ఉంటుంది. అంతేకాకుండా వీటికి సంబంధించిన మార్గదర్శకాలను పాటించవలసి ఉంటుంది. రిజిస్టర్కానివారు ప్రమోషనల్ కార్యక్రమాల కోసం మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకర్లతో జట్టు కట్టేందుకు అనుమతించరు. ఇకపై సెబీ వద్ద రిజిస్టర్కావడంతోపాటు, నిబంధనలు పాటించవలసిరావడంతో ఫిన్ఫ్లుయెన్సర్లు జవాబుదారీతనం(అకౌంటబిలిటీ) పెరుగుతుందని, ప్రమాణాలు, నైపుణ్యాలు మెరుగుపడతాయని రైట్ రీసెర్చ్, పీఎంఎస్ వ్యవస్థాపకుడు, ఫండ్ మేనేజర్ సోనమ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. ఫిన్ఫ్లుయెన్సెర్ల పాత్రకు జవాబుదారీతనం పెంచడం ద్వారా సెబీ ఇన్వెస్టర్లకు రక్షణను పెంచుతున్నదని అజీజ్ పేర్కొన్నారు. దీంతోపాటు పరిశ్రమలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నదని తెలియజేశారు. సెబీ లేదా స్టాక్ ఎక్సే్ఛంజీ లేదా మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ) వద్ద రిజిస్టరైన ఫిన్ఫ్లుయెన్సెర్లు తమ రిజి్రస్టేషన్ నంబర్, కాంటాక్ట్ వివరాలు తదితరాలను పొందుపరచవలసి ఉంటుంది. -
మన ఇల్లే... ఒక పాఠశాల ప్రయోగశాల
ఒక వైపు వృత్తి నిర్వహణలో బిజీగా ఉన్నప్పటికీ స్కూల్ పిల్లలకు అవసరమైన సలహాలు, టిప్స్ను సోషల్ మీడియా ద్వారా అందిస్తోంది ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్. తాజాగా ఫన్ అండ్ ఇంటరాక్టివ్ మార్గంలో సైన్స్ సూత్రాలను అర్థం చేయించే టిప్స్ను షేర్ చేసింది. పిల్లలకు భూభ్రమణం గురించి వివరించడానికి హ్యూమన్ సన్డయల్ ఎలా తయారు చేయాలి, ‘సింక్ అండ్ ఫ్లోట్ ఎక్స్పెరిమెంట్’ను వివరించడానికి నారింజలు, నీళ్లను ఎలా ఉపయోగించాలి... అనేవి ఇందులో ఉన్నాయి. ‘ఐఐటీ దిల్లీలో ఇంజినీరింగ్ చదువుకున్నాను. డిగ్రీ కంటే శాస్త్రీయ దృష్టి, విశ్లేషణ ముఖ్యం’ అంటుంది దివ్య మిట్టల్. ‘సూపర్ కలెక్షన్. ఫన్–టు–డూ. మీ పిల్లలు అదృష్టవంతులు. మీరు ఇచ్చిన టిప్స్ను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలి’ అని ఒక యూజర్ స్పందించాడు. -
అవరోధాన్ని ఏనుగులా దాటండి.. ఆనంద్ మహీంద్రా వీడియో వైరల్..
ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ తన ఫాలోవర్స్ను ఆలోచింపజేస్తూనే ఉంటారు. స్పూర్తిదాయకమైన పోస్టులతో తన అనుచరులను ఆలోచింపజేస్తుంటారు. వ్యాపారలావాదేవీలతో బీజీగా గడుపుతున్నప్పటికీ ఏదో ఒక విధంగా మంచి పోస్టులతో నెటిజన్లను మేల్కొలుపుతారు. తాజాగా ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఏనుగును చూసి ప్రతికూలతలను అధిగమించడం ఎలాగో నేర్చుకోండి అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ ఏనుగు కంచెను దాటుతుంది. ఫెన్సింగ్ను దాటడానికి అది అనుసరించిన విధానం అందరికీ ఆదర్శం అంటూ ఆనంద్ మహీంద్రా తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. ఆ ఏనుగు ఫెన్సింగ్ చాల చాకచక్యంగా దాటుతుంది. కంచెను కూలదోయడానికి అది అనసరించిన విధానం ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తుంది. ఫెన్సింగ్ బలంగా ఎక్కడుందో చూస్తుంది. బలహీనంగా ఎక్కడ ఉందో కూడా చెక్ చేసుకుంటుంది. అనంతరం ఫెన్సింగ్ వీక్గా ఉన్న ప్రదేశంలో కాలుతో కూలదోసి దర్జాగా వెళ్లిపోతుంది. A masterclass from a pachyderm on how to overcome obstacles: 1) Carefully test how strong the challenge really is & where it might have least resistance. 2) Slowly apply pressure at the point of greatest leverage of your own strength. 3) Walk confidently through… 😊 pic.twitter.com/SmYm8iRWKH — anand mahindra (@anandmahindra) August 4, 2023 ఈ వీడియోను పంచుకున్న ఆనంద్ మహీంద్రా.. ప్రతికూలతను దాటడానికి ముందు అది ఏ స్థాయిలో బలాన్ని కలిగి ఉందో ఏనుగులాగే చెక్ చేసుకోవాలి. అనంతరం బలాన్ని, బలహీనతల్ని గుర్తించాలి. సరైన బలంతో తక్కువ ప్రతికూలత ఉన్న ప్రదేశం నుంచి పనిచేయడం ప్రారంభించాలి. అనంతరం ధైర్యంగా నడుచుకుంటూ వెళ్లాలి అని రాసుకొచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెట్టారు. కేవలం నాలుగు గంటల్లోనే లక్షా ఇరవై నాలుగు వేల మంది వ్యూస్ వచ్చాయి. only legends like anand mahindra derive lessons from all walks of life 🙂 do you agree? (as always thank you sir for taking the time to share 🙏) — Swaroop D (@swaroopspaces) August 4, 2023 ఇదీ చదవండి: Viral Video: ఇదేం విచిత్రం! ఆవు, పాము రెండు అలా.. -
పిల్లల్ని ఎప్పుడు కనాలి? సైంటిస్టులు తేల్చేశారు.. అదే సరైన సమయమట
30ఏళ్లు దాటినా పెళ్లి ఊసెత్తని వాళ్లు చాలామందే ఉన్నారు. పెళ్లెప్పుడు అని అడిగితే.. అప్పుడేనా? ఏమిటంత తొందర అన్నట్లు సమాధానమిస్తుంటారు. ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతీది ప్లానింగ్ చేసుకోక తప్పదు. పెళ్లి దగ్గర్నుంచి చివరకు పిల్లల విషయంలో కూడా ప్లానింగ్తోనే ఉంటున్నారు ఈ కాలం దంపతులు. పిల్లల్ని ఎప్పుడు కనాలో కూడా వాళ్ల దగ్గర ఓ థియరీ ఉంటుంది. కానీ వయసైపోయాక పిల్లల్ని కనాలంటే డెలీవరీకి ఇబ్బందులుంటాయని, దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. తాజాగా ఓ అధ్యయనం ప్రకారం.. పిల్లల్ని కనేందుకు సరైన వయసు ఏంటన్నది నిర్థారించారు. ఈ జనరేషన్లో భార్యభర్తలిద్దరూ రెండుచేతులా సంపాదించడానికి పెట్టిన శ్రద్ధ ఫ్యామిలీ ప్లానింగ్పై పెట్టడం లేదు. లైఫ్లో సెటిల్ అయ్యాక తీరిగ్గా పిల్లల్ని కనవచ్చులే అని లైట్ తీసుకుంటారని వైద్యులు తెలియజేస్తున్నారు. వాస్తవానికి ఏ వయసులోపు కనాలి అనే విషయంపై చాలా మంది దంపతుల్లో క్లారిటీ ఉండదు. ఇప్పుడే ఏం తొందర వచ్చిందిలే అని అనుకుంటారు. కానీ పిల్లల్ని కనేందుకు మహిళలకు 23 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వయసు సరైన సమయం అని సైంటిస్టులు వెల్లడించారు. ఈ వయసులో బిడ్డలకు జన్మనిస్తే అసాధారణ పిండాలు లాంటి నాన్క్రోమోజోమల్ వంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపారు. 32 ఏళ్ల తర్వాత మహిళలు పిల్లల్ని కనే సామర్థ్యాన్ని రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. ఆలస్యంగా పిల్లల్ని కనడం వల్ల పుట్టే పిల్లల్లో డౌన్ సిండ్రోమ్, నెలలు నిండక ముందే పిల్లలు పుట్టడం, జెస్టేషనల్ డయాబెటిస్, ప్రీ ఎక్లాంప్సియా వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. 32 దాటాక పిల్లల్ని కంటే డెలీవరీ సమయంలో నాడీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు 20 శాతం ఎక్కువని హంగేరి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
రోజుకు 17 గంటలు పని చేస్తున్న ఉద్యోగికి డాక్టర్ సలహా..
కార్పొరేట్ ఉద్యోగాలంటే రూ.లక్షల్లో జీతాలు, విలాసవంతమైన జీవనశైలి ఉంటాయనేది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు వారి పని గంటలు, పడుతున్న ఒత్తిడి గురించి తెలుసుకుంటే ఇవేం ఉద్యోగాలురా నాయనా.. అనిపిస్తుంది. కార్పొరేట్ ఉద్యోగుల పని గంటలు, ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటాయనేది ఈ వార్త చదివితే తెలుస్తుంది. కార్పొరేట్ సంస్థలో పనిచేసే ఓ 37 ఏళ్ల వ్యక్తి తాను రోజుకు 17 గంటలు పనిచేస్తున్నానని, ఇటీవల తన రక్తపోటు స్థాయిల్లో మార్పుల గురించి ఆందోళన చెందుతూ ట్విటర్లో వైద్యుడిని సంప్రదించాడు. ఆ డాక్టర్ మొదటి సిఫార్సు ఏమిటంటే.. ట్విటర్లో హర్షల్ (@HarshalSal67) అనే వ్యక్తి తన ఆరోగ్య సమస్యపై హైదరాబాద్కు చెందిన డాక్టర్ను ట్విటర్లో సంప్రదించాడు. ‘హాయ్ డాక్టర్, నాకు 37 ఏళ్లు, కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నాను. గత 6 నెలల నుంచి రోజుకు 16 నుంచి 17 గంటలు పని చేస్తున్నాను. ఇటీవల బీపీ చెక్ చేసుకోగా 150 /90 వచ్చింది. ఇప్పుడేం చేయమంటారు?’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్స్కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ స్పందిస్తూ ‘పని గంటలను 50 శాతం తగ్గించండి. మరో నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే అవకాశం కల్పించండి. అంటే మీ ఉద్యోగంతో పాటు మీరు మరొకరి ఉద్యోగం చేస్తున్నారు’ అని సలహా ఇచ్చారు. దీంతో డాక్టర్కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ఉద్యోగం మానేస్తున్నట్లు సదరు వ్యక్తి ప్రకటించారు. దీనికి మంచి నిర్ణయం తీసుకున్నారని డాక్టర్ సుధీర్ అభినందించారు. పలువురు ట్విటర్ యూజర్లు అతని పరిస్థితిపై సానుభూతి వ్యక్తం చేశారు. 1. Reduce working hours by 50%, and ensure an unemployed person gets a job (whose job you are doing in addition to yours) (+follow other advice from the pinned post on my timeline) https://t.co/wThD7cEvMt — Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) June 10, 2023 ఇదీ చదవండి: కార్మిక శాఖను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు.. ఎందుకంటే.. -
పతిరణకు నేను ఉన్న అంటున్న ధోని..
-
ఆరోజు చెప్పిన వినలేదు..
-
Karnataka assembly elections 2023: మోదీ, రాహుల్ను చూసి నేర్చుకోండి!
జంఖాండి: కాంగ్రెస్ నేతలు తనను 91 సార్లు దూషించారన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పందించారు. ‘‘వాటన్నింటినీ కలిపినా ఒక పేజీ అవుతాయేమో. కానీ మీరూ, బీజేపీ నేతలూ మా కుటుంబాన్ని తిట్టిన తిట్లన్నీ రాస్తే పుస్తకాలే కూడా చాలవు! ఆమె ఆదివారం కర్ణాటకలోని బాగల్కోటె జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడారు. దేశం కోసం తూటాలకు ఎదురొడ్డటానికి సిద్ధంగా ఉన్న తన సోదరుడు రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలని మోదీకి సలహా ఇచ్చారు. ‘‘ప్రజాజీవితంలో ఉన్నవారు విమర్శలకు సిద్ధపడాలి. కాంగ్రెస్ తరఫున ప్రధానులుగా ఉన్న ఇందిరా గాంధీ, రాజీవ్గాంధీ దేశం కోసం తూటాలు తిన్నారు. కానీ ప్రజల కష్టాలను వినడానికి బదులు వారికి సొంత బాధలు చెప్పుకుంటూ సానుభూతి కోసం పాకులాడుతున్న మొట్టమొదటి ప్రధాని మోదీయే’’ అంటూ ఎద్దేవా చేశారు. -
ఏం చెప్పారు సార్.. అల్లుడికి అంబానీ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం గురించి పరిచయం అక్కర్లేదు. దేశంలోనే సంపన్న కుటుంబం కావడంతో ఆ కుటుంబం గురించిన ప్రతి విషయంపైనా అందరికీ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా సతీమణి నీతా అంబానీ, కుమారులు, కుమార్తె, అల్లుడు ఇలా ఎవరో ఒకరు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తన అల్లుడు, కుమార్తె ఇషా అంబానీ భర్త అయిన ఆనంద్ పిరమల్కు ముఖేష్ అంబానీ ఇచ్చిన సలహా వెలుగులోకి వచ్చింది. (అది ఆఫర్ లెటర్ కాదు.. ఫ్రెషర్లకు షాకిచ్చిన క్యాప్జెమినీ! కాస్త ఓపిక పట్టండి..) ఆనంద్ పిరమల్ భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన అజయ్ పిరమల్ కుమారుడు. తన తండ్రి నిర్మించిన ఫార్మారంగ వ్యాపార సామ్రాజ్యాన్ని సోదరి నందిని పిరమల్తో కలిసి నడుపుతున్నాడు. ప్రస్తుతం వారి కుటుంబ నికర ఆస్తి విలువ దాదాపు రూ.24 వేల కోట్లు. ఆనంద్ పిరమల్ ముఖేష్ అంబానీకి అల్లుడు. ఇషా అంబానీని వివాహం చేసుకున్నాడు. అయితే ముఖేష్ అంబానీకి ఆనంద్ పిరమల్ ముందు నుంచే తెలుసు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ సలహాలను ఆనంద్ తీసుకునేవాడు. (ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్: ఐఫోన్13పై రూ.10 వేలు డిస్కౌంట్!) ఆనంద్ పిరమల్, ఇషా అంబానీల వివాహం 2018లో జరిగింది. వారికి కవలలు జన్మించారు. వారి పేర్లు కృష్ణ, ఆదియా. పెళ్లికి ముందే వీరి కుటుంబాలు ఒకరికొకరు తెలుసు. ఆనంద్ పిరమల్ ముఖేష్ అంబానీతో చాలా సన్నిహితంగా ఉంటాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కెరియర్కు సంబంధించి ముఖేష్ అంబానీ తనకు ఏం సలహా ఇచ్చారో ఆనంద్ పిరమల్ బయటపెట్టాడు. క్రికెట్ను ముడిపెడుతూ అంబానీ ఇచ్చిన సలహా ఆసక్తికరంగా ఉంది. (తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే!) తాను కన్సల్టింగ్ లేదా బ్యాంకింగ్ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు ఆనంద్ ఒకసారి అంబానీకి చెప్పాడు. దానిపై అతని సలహా కోరాడు. దీనికి అంబానీ క్రికెట్ను ముడిపెడుతూ చక్కని సలహా ఇచ్చాడు. కన్సల్టెంట్గా ఉండటం అనేది క్రికెట్ చూడటం లేదా క్రికెట్ గురించి వ్యాఖ్యానించడం లాంటిదని, అదే పారిశ్రామికవేత్త కావడం అనేది క్రికెట్ ఆడటం లాంటిదని అంబానీ తనకు సలహా ఇచ్చారని పిరమల్ చెప్పారు. ఇది తనకు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చెప్పాల్సిందని, 25 ఏళ్ల వయసులో కాదని తాను అంబానీతో చమత్కరించిన్లు పేర్కొన్నారు. ఎవరీ ఆనంద్ పిరమల్? పిరమిల్ గ్రూప్ ఆర్థిక సేవలకు ఆనంద్ పిరమల్ నాయకత్వం వహిస్తున్నారు. అతని కంపెనీ గృహ రుణాలు, ఎస్ఎంఈ లోన్లు, నిర్మాణ ఫైనాన్స్ మొదలైనవాటిని అందిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ విభాగానికి కూడా ఆయన నాయకత్వం వహిస్తున్నారు. పిరమల్ ఈ-స్వస్థ్య అనే ఆనంద్ స్థాపించారు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే ఈ కంపెనీలో దాదాపు 2300 మంది ఉద్యోగులు, 140 మంది వైద్యులు ఉన్నారు. ఆనంద్ పిరమల్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ చేశారు. 100 ఏళ్ల ఇండియన్ మర్చంట్ ఛాంబర్స్ యువజన విభాగానికి ఆనంద్ అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడు. (ఈషా అంబానీకి సరికొత్త వెపన్ దొరికిందా?) -
మోదీజీ.. పరిస్థితి చెయ్యి దాటిపోయింది!
ముంబై: సొసైటీలో సినిమాల ప్రభావం ఎలా ఉన్నా.. ప్రస్తుతం సినిమాల చుట్టూరానే రాజకీయాలు కచ్ఛితంగా నడుస్తున్నాయి. తాజాగా.. సోమవారం జరిగిన బీజేపీ కీలక సమావేశంలో ప్రధాని మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల మీద కామెంట్లు చేయడం, అతిగా స్పందించడం మానుకోవాలని ప్రధాని మోదీ.. కార్యకర్తలకు సూచించారాయన. అయితే.. ప్రధాని సలహాపై తాజాగా ప్రముఖ దర్శకుడు, బాలీవుడ్ ఫిల్మ్మేకర్ అనురాగ్ కశ్యప్ స్పందించారు. పరిస్థితి ఎప్పుడో చెయ్యి దాటిపోయిందనన్నారు ఆయన. ముంబైలో తన తాజా చిత్రం ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్ చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మోదీ తన పార్టీ కార్యకర్తలకు చేసిన సూచనపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. ‘‘ప్రధాని మోదీ నాలుగేళ్ల కిందట ఈ సలహా ఇచ్చి ఉంటే బాగుండేది. పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతుందని అనుకోవడం లేదు. పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో.. జనాలు వాళ్లంతట వాళ్లే కంట్రోల్లో ఉండాల్సిందే తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఎవరు ఎవరికీ వింటారని అనుకోవడం లేద’’ని కశ్యప్ అభిప్రాయపడ్డారు. మరోవైపు చిత్ర నిర్మాత షరీఖ్ పటేల్ మాత్రం ప్రధాని సూచనపై సానుకూలంగా స్పందించారు. ఇకనైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని, ఇండస్ట్రీలో ఏర్పడిన నెగటివిటీ కనుమరుగు అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారాయన. ఇదిలా ఉంటే.. బాలీవుడ్లో ఉత్త పుణ్యానికే బాయ్కాట్ ట్రెండ్ తెర మీదకు వస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్కు ఈ ట్రెండ్కు అడ్డుకట్ట పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో రెండు వారాల తర్వాత పార్టీ కీలక సమావేశంలో ప్రధాని మోదీ సలహా ఇవ్వడం విశేషం. కిందటి ఏడాది బాయ్కాట్ ట్రెండ్ను చాలానే ఎదుర్కొన్నాయి. లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్, దొబారా, లైగర్, బ్రహ్మస్త్ర: పార్ట్ వన్-శివ బాయ్కాట్ ట్రెండ్లో అల్లలాడిపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలో షారూక్ ఖాన్ పథాన్ చిత్రం బాయ్కాట్ట్రెండ్ను ఎదుర్కొంటోంది. -
ఫోన్పే, గూగుల్పే నుంచి పొరపాటున వేరే ఖాతాకు.. ఇలా చేస్తే మీ పైసలు వెనక్కి!
గతంలో నగదు చెల్లింపులు జరపాలంటే బ్యాంకులకు వెళ్లడమో లేదా ఇంటర్నెట్ బ్యాంకులు వంటివి ఉపయోగించాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పుణ్యమా అని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) రావడంతో ప్రజలు అటువైపు మొగ్గుచూపుతున్నారు. ఇది నగదు చెల్లింపుల విధానంలో ఓ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయనే చెప్పాలి. ఎంతో సులువుగా అవతలి వాళ్లకు డబ్బులను ఈ విధానాన్ని ఉపయోగించి చిటికెలో పంపతున్నాం. అయితే ప్రజలకు కొన్ని సందర్భాల్లో నగదు పొరపాటున తాము అనుకున్న ఖాతాకు కాకుండా వేరు వారికి బదిలీ చేసిన ఘటనలు బోలెడు ఉన్నాయి. అటువంటి పరిస్థితి మీకు ఎదురైతే ఆ సమస్యకు పరిష్యారం గురించి ఇక్కడ తెలుసుకుందాం. యూపీఐ పేమెంట్స్ను ఉపయోగించి సెకనులో డబ్బులను అవతలి వాళ్ల బ్యాంక్ అకౌంట్కు పంపవచ్చు. ఈ విధానం సులువుగా ఉండడంతో మొదట్లో యూపీఐని ఉపయోగించే వారి సంఖ్య వేల నుంచి ప్రస్తుతం కోట్లకు చేరింది. అలా ప్రస్తుతం ఇది మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ మాత్రమే కాదు రోడ్సైడ్ వెండర్ల నుంచి రిటైల్ షాపుల వరకు ఎక్కడ చూసిన ఇదే కనిపిస్తుంది. ఇది సురక్షితమైన చెల్లింపు వ్యవస్థ అయినప్పటికీ కొన్ని సార్లు అనుకోకుండా చేసే పొరపాటు మీ ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. వేరే ఖాతాకు నగదు బదిలీ.. వెనక్కి రావాలంటే ఇలా చేయండి యూపీఐ ఐడీని తప్పుగా నమోదు చేయడం లేదా పొరపాటుగా వేరొకరి బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపడం లాంటివి జరుగుతుంటాయి. మనకో లేదా మనకు తెలిసిన వాళ్లకు ఈ పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. ఆ సమయంలో మీరు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ సమస్యకు పరిష్కారం చూపింది. ఆర్బీఐ ప్రకారం, మీరు సరైన చర్యలు తీసుకోవడం ద్వారా బదిలీ చేసిన మొత్తం నగదు తిరిగి పొందవచ్చు. డిజిటల్ సేవల ద్వారా అనుకోకుండా లావాదేవీలు జరిగితే, బాధిత వ్యక్తి మొదట ఉపయోగించిన చెల్లింపు వ్యవస్థతో ఫిర్యాదు చేయాలని పేర్కొంది. మీరు పేటీఎం (Paytm), గూగుల్ పే (Google Pay), ఫోన్పే (PhonePe) వంటి అప్లికేషన్ల కస్టమర్ సర్వీస్ నుంచి సహాయం పొందవచ్చు. వారి ద్వారా నగదు వాపసు కోసం అభ్యర్థించవచ్చు. చెల్లింపు వ్యవస్థ సమస్యను పరిష్కరించలేపోతే, డిజిటల్ లావాదేవీల కోసం ఆర్బీఐ ఏర్పాటు చేసిన అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చని తెలపింది. చదవండి: అయ్యో! ఎంత కష్టం, ఆఫీసుకు టాయిలెట్ పేపర్లు తెస్తున్న ట్విటర్ ఉద్యోగులు -
న్యూ ఇయర్ అలర్ట్: ఆధార్ కార్డ్ని ఇలా ఉపయోగించండి!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాటి వల్ల మంచితో పాటు చెడు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల వ్యక్తిగత వివరాలు( మొబైల్ నంబర్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ , డెబిట్ కార్డ్, పిన్ నంబర్) తెలుసుకుని సైబర్ నేరగాళ్లు మన జేబులకు చిల్లు పెడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సమస్యపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాయి. తాజాగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) కొత్త సంవత్సరం రానున్న సందర్భంగా ఆధార్ వినియోగంపై కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆధార్ వినియోగం ఎలా అంటే.. ఇటీవల ఆధార్ కేవలం గుర్తింపు కార్డ్లానే కాకుండా పలు సంక్షేమ పథకాలు, బ్యాంక్, పాన్ వంటి వాటితో జత చేయడంతో చాలా క్రీయాశీలకంగా మారింది. దీంతో సైబర్ కేటుగాళ్ల కళ్లు ఆధార్ నెంబర్పై పడింది. ఈ నేపథ్యంలో .. మోసాల బారిన పడకుండా యూఐడీఏఐ పలు సూచనలు చేసింది. ఇంత వరకు బ్యాంక్ ఖాతా నంబర్లు, పాన్, పాస్పోర్ట్లతో సహా ఇతర డ్యాకుమెంట్లు మాదిరిగానే ప్రజలు ఆధార్ విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. సోషల్ మీడియాతో పాటు ఇతర ప్లాట్ఫాంలతో సహా పబ్లిక్ డొమైన్లో ఆధార్ కార్డ్లను ఎప్పుడూ షేర్ చేయవద్దని సూచించింది. ఏ పరిస్థితిల్లోనూ ఇతరులతో ఆధార్ ఓటీపీ (OTP)ని పంచుకోకూడదని తెలిపింది. ఒక వేళ ఏదైనా విశ్వసనీయ సంస్థతో ఆధార్ను పంచుకునేటప్పుడు, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా పాస్పోర్ట్, ఓటర్ ఐడి, పాన్, రేషన్ కార్డ్ వంటి ఏదైనా ఇతర గుర్తింపు పత్రాన్ని పంచుకునే సమయంలో అదే స్థాయి జాగ్రత్తలు పాటించాలని UIDAI సూచనలు చేసింది. చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: ఈ స్మార్ట్ఫోన్పై రూ.14,000 తగ్గింపు.. త్వరపడాలి, అప్పటివరకే! -
జీ–20పై నేడు అఖిలపక్షం
న్యూఢిల్లీ: భారత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది సెప్టెంబర్లో జరగనున్న జీ–20 సదస్సులో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సమావేశానికి దాదాపుగా 40 రాజకీయ పార్టీలకు చెందిన అధినేతల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తదితరులు హాజరుకానున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జీ–20 శిఖరాగ్ర సదస్సుకి ముందు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 200కిపైగా సమావేశాలు నిర్వహించనున్నారు. మరోవైపు జీ–20 మొట్టమొదటి ప్రతినిధుల సదస్సు రాజస్థాన్లోని ఉదయపూర్లో ఆదివారం జరిగింది. సమ్మిళిత అభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలు, ఆరోగ్యరంగంలో సదుపాయాలు, నాణ్యమైన జీవనం వంటివాటిపై భారత్ ప్రతినిధి అమితాబ్ కాంత్ మాట్లాడారు. -
కేఆర్ఐపై సెబీ కొరడా
న్యూఢిల్లీ: అనధికార పెట్టుబడి సలహాలు ఇస్తున్న కారణంగా నాలెడ్జ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(కేఆర్ఐ)తోపాటు సంస్థ యజమాని ఆయుష్ ఝవార్పై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కన్నెర్ర చేసింది. ఆరు నెలలపాటు సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. కేఆర్ఐ, ఆయుష్లకు సెబీ 2021 జులైలో షోకాజ్ నోటీసులను జారీ చేసింది. తదుపరి తాజా ఆదేశాలు జారీ చేసింది. సెబీ నుంచి సర్టిఫికెట్ పొందకుండానే కేఆర్ఐ, ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజరీ సర్వీసులను అందించడం ద్వారా అడ్వయిజరీ నిబంధనలను అతిక్రమించాయి. దీంతో సెబీ తాజా చర్యలను చేపట్టింది. సలహాల ద్వారా ఫీజు రూపేణా ఆర్జించిన రూ. 27.57 లక్షలను 3 నెలల్లోగా వాపస్ చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. -
రిస్క్.. రాబడుల సమతుల్యం!
ఇన్వెస్టర్లు అందరూ అధిక రిస్్కకు అనుకూలం కాదు. కొందరు తక్కువ రిస్క్, మోస్తరుకే పరిమితం అవుతుంటారు. అటువంటి వారు ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ను పరిశీలించొచ్చు. తమవద్దనున్న మిగులు నిల్వలను ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మెరుగైన రాబడులు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇది అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఈక్విటీ పథకం. అంటే 65 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించి, మిగిలిన 35 శాతాన్ని డెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీనివల్ల ఈక్విటీ పెట్టుబడులపై అధిక రాబడులు, డెట్ పెట్టుబడుల రూపంలో రిస్్కను తగ్గించే విధంగా ఈ పథకం పనిచేస్తుంది. రాబడులు ఈ పథకం రాబడులు అన్ని సమయాల్లోనూ ఈక్విటీ హైబ్రిడ్ విభాగం సగటు రాబడుల కంటే అధికంగానే ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో 1.58 శాతం నష్టాలను ఇచి్చంది. కానీ, గడిచిన ఏడాది కాలంలో వ్చూర్కెట్లు కూడా రాబడులు ఇవ్వని విషయాన్ని గమనించాలి. మూడేళ్ల కాలంలో వార్షిక రాబడి 13 శాతంగా ఉంది. ఐదేళ్లలో 11 శాతం, ఏడేళ్లలోనూ 11.30 శాతం, పదేళ్లలో 14.42 శాతం చొప్పున రాబడులను ఇచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈక్విటీల్లోనూ రిస్క్ తక్కువగా ఉండేందుకు లార్జ్క్యాప్ స్టాక్స్ను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. ముఖ్యంగా కొత్తగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు, రిస్క్ మధ్యస్థంగా ఉండాల ని భావించే వారికి ఈ పథకం అనుకూలం. పోర్ట్ఫోలియో, పెట్టుబడుల విధానం ఈక్విటీ, డెట్ కలయికతో ఉన్నందున భిన్న మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు పోర్ట్ఫోలియోను మార్చుకోవడం ఈ పథకం పనితీరులో భాగం. గత ఐదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఈ పథకం మేనేజర్లు ఈక్విటీల కేటాయింపులను కనిష్టంగా 64 శాతం, గరిష్టంగా 72 శాతం మధ్య నిర్వహించారు. అస్థిరతల సమయాల్లో ఈక్విటీల్లో పెట్టుబడులను తగ్గించుకుని 10 శాతం వరకు నగదు నిల్వలను ఉంచుకునే వ్యూహాన్ని ఈ పథకం పాటిస్తుంది. ఇప్పుడు కూడా నగదు నిల్వలు 12.45 శాతంగా ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడుల విషయంలో మల్టీక్యాప్ విధానాన్ని పథకం మేనేజర్లు అనుసరిస్తారు. సెపె్టంబర్ 30 నాటికి ఈ పథకం నిర్వహణలో రూ.55,325 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. అంటే ఎంత పెద్ద పథకమో అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తంలో ఈక్విటీలకు 68.45 శాతం, డెట్కు 19.1 శాతం చొప్పున కేటాయింపులు చేసి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లో 76 శాతాన్ని లార్జ్క్యాప్నకు కేటాయించింది. అంటే రిస్క్ చాలా తక్కువే ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. మిడ్క్యాప్నకు 23 శాతం కేటాయించగా, అస్థిరతలు ఎక్కువగా ఉండే స్మాల్క్యాప్ కేటాయింపులు నిండా ఒక్క శాతం కూడా లేవు. అలాగే, పోర్ట్ఫోలియోలో 38 స్టాక్స్ ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడుల్లో 22 శాతం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు కేటాయించగా, హెల్త్కేర్ కంపెనీలకు 8.86 శాతం, సేవల రంగ కంపెనీలకు 6 శాతం చొప్పున కేటాయించింది. డెట్లో 78 సెక్యూరిటీల్లో పెట్టుబడులు ఉన్నాయి. దాదాపు 90 శాతం మెరుగైన రేటింగ్ కలిగిన సాధనాలే ఉన్నాయి. ఈ పథకంలో కనీసం రూ.500 నుంచి సిప్ చేసుకోవచ్చు. -
కెరీర్లో మనం చేసే అతిపెద్ద తప్పులు ఇవే .. హర్ష గోయెంకా పాఠాలు
తప్పులు చేయడం.. ఆ తప్పుల నుంచి గుణ పాఠాలు నేర్చుకోవడం కామన్. అందుకే తప్పులు చేయండి. వాటి నుంచి అవకాశాల్ని సృష్టించుకోండి’ అని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా పాఠాలు చెబుతున్నారు. చేసిన తప్పుల నుంచి జ్ఞానాన్ని సంపాదించడం గొప్ప అవకాశం. ఇది మీ నైపుణ్యాలను మెరుగుపరచడంలో, మీకున్న అపారమైన తెలివితేటల్ని విస్తరించేందుకు సహాయ పడుతుందని హర్ష్ గోయెంకా ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతుండగా.. మీరు తప్పు చేసి.. ఆ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోంటే అది తప్పు కాదని అన్నారు. Always learn from your mistakes: - See what went wrong - See what could have been done better - See what was not necessary - See what took most of your energy - See what knowledge you lacked If you learn from a mistake, a mistake isn't a mistake anymore! — Harsh Goenka (@hvgoenka) October 18, 2022 ఇక ముఖ్యంగా కెరీర్లో చేసే తప్పుల్ని ఈ సందర్భంగా హర్ష గోయెంకా హైలెట్ చేశారు. అందులో ఒకటి అన్నీ తమకు తెలుసని అనుకోవడం, రెండోది సరైన పరిచయాలు లేకపోవడం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మూలధన లాభాలు బేసిక్ లిమిట్ దాటకుంటే
ప్రశ్న: నేను రిటైర్ అయ్యాను.పెన్షన్ లేదు. కానీ ఇతర ఆదాయాలు నికరంగా రూ. 5,50,000. మా ఆవిడకు ఎటువంటి ఆదాయంలేదు. ఇద్దరికి చెరొక ప్లాటు .. అంటే జాగా ఉంది. ఇద్దరం ఒకేసారి ఒకే ధరకి అమ్ముతున్నాం. మిత్రులు లెక్కలు వేసి ఇద్దరికి మూలధన లాభాలు చెరొక రూ. 3,00,000 వస్తాయని తేల్చారు. మా ఆవిడ విషయంలో పన్ను భారం ఉండదు, కానీ నేను మాత్రం పన్ను కట్టాలి అంటున్నారు. దీనిలో అంతరార్థం ఏమిటి? మీ శ్రీమతి వయస్సు 60 సంవత్సరాలు దాటి ఉంటుంది అనుకుంటున్నాం. మీ మిత్రులు వేసిన లెక్కలు .. చెప్పిన మాటలు కరెక్టే. నిజానికి మీ ప్రశ్నలోనే జవాబు ఉంది. ముందుగా మీ విషయం తీసుకుందాం. మూలధన లాభాలతో నిమిత్తంలేకుండా మీ నికర ఆదాయం రూ. 5,50,000 అంటున్నారు. సేవింగ్స్, డిడక్షన్లు పోనూ రూ.5,50,000 ఉంటే మీరు పన్ను పరిధిలో ఉన్నట్లే. పన్ను చెల్లించాలి. టీడీఎస్ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోండి .. లేదా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి లేదా సెల్ఫ్ అసెస్మెంట్ చలాన్ ద్వారా చెల్లించి రిటర్న్ వేయండి. మీకు కూడా 60 సంవత్సరాలు దాటిందనే అనుకుంటున్నాం. 60 సంవత్సరాలు దాటిన వారికి బేసిక్ లిమిట్ రూ. 3,00,000. మీ నికర ఆదాయం లెక్కింపులో బేసిక్ లిమిట్ దాటిన మొత్తానికి పన్ను లెక్కిస్తారు. మీరు ఇప్పటికి బేసిక్ లిమిట్ని వినియోగించుకున్నట్లే. ఒక వ్యక్తికి ప్రతి శీర్షిక కింద బేసిక్ లిమిట్ ఉండదు. జీతం, ఇంటద్దె, వ్యాపారం మీద ఆదాయం, మూలధన లాభాలు.. ఇతర ఆదాయం ఈ ఐదింటిని కలిపిన తర్వాత ఒకసారే బేసిక్ లిమిట్ని వినియోగించుకోవాలి. మీ విషయంలో బేసిక్ లిమిట్ వినియోగించుకున్నారు కాబట్టి ఇక మూలధన లాభాల మీద ఇవ్వరు. ఇక మీ శ్రీమతి గారి విషయం. ఆవిడకు ఎటువంటి ఆదాయం లేదు. అంటే జీరో ఇన్కం. కాబట్టి ఆవిడకు బేసిక్ లిమిట్ దాకా పన్ను భారం లేకుండా అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మూలధన లాభాలు రూ. 3,00,000 దాటకపోతే బేసిక్ లిమిట్ కంపల్సరీగా అమలుపర్చాలి కాబట్టిఆ సదుపాయం లేదా బేసిక్ లిమిట్ ఇస్తారు. మూలధన లాభాలు ఇద్దరివి ఒకే మొత్తం, సమానం అయినప్పటికీ ఇతర విషయాల్లో ఎంతో తేడా ఉంది. ► మీకు ఇదివరకే ఇతర ఆదాయాల మీద పన్ను భారం ఉంది. ► మీ శ్రీమతి గారికి పన్నుకి గురయ్యే ఆదాయం జీరో. ► బేసిక్ లిమిట్ మీకు మూలధన లాభాల మీద వర్తించదు. ► మేడంగారికి మూలధన ఆదాయం ఒక్కటే ఉన్నా ఇతరత్రా ఏ ఆదాయం లేదు కాబట్టి బేసిక్ లిమిట్ వర్తిస్తుంది. కాబట్టి పన్ను భారం లేదు.ఇదే దీనిలోని అంతరార్థం. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
వైరల్: 30 ఏళ్లు వచ్చే దాకా తొందరపడొద్దు.. టీనేజర్కు జో బైడెన్ సలహా
అమెరికా అధ్యక్షుడు.. 80 ఏళ్ల జో బైడెన్ ఓ టీనేజ్ అమ్మాయికి ఇచ్చిన సలహా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జీవితంలో 30 ఏళ్లు వచ్చే దాకా తొందరపడవద్దని ఓ టీనేజర్కు సహజీవనం విషయంపై బైడెన్ సలహా ఇచ్చారు. కాలిఫోర్నియాలోని ఇర్విన్ వ్యాలీ కాలేజ్ ఈవెంట్లో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత మీట్ అండ్ గ్రీట్ సెక్షన్లో భాగంగా బైడెన్ క్యాంపస్ విద్యార్థులతో కలిసి ఫోటో దిగారు. ఆ సమయంలో తన ముందు నిల్చున్న టీనేజర్ భుజంపై చేయి వేసి ‘నేను నా కూతురు, మనవరాలితో చెప్పిన ఓ ముఖ్యమైన విషయం ఇప్పుడు చెబుతున్నాను. 30 ఏళ్లు వచ్చే దాకా డేటింగ్ వంటి వాటి కోసం తొందరపడవద్దు’ అని చెప్పాడు. ఆమెకు సరిగా అర్థం కాకపోవడంతో మరోసారి బైడెన్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అధ్యక్షుడి వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన సదరు అమ్మాయి తేరుకొని.. సరే ఇది నేను మనుసులో పెట్టుకుంటానని చెబుతూ నవ్వుతుంది President Joe Biden grabs a young girl by the shoulder and tells her “no serious guys till your 30” as she looks back appearing uncomfortable, secret service appears to try to stop me from filming it after Biden spoke @ Irvine Valley Community College | @TPUSA @FrontlinesShow pic.twitter.com/BemRybWdBI — Kalen D’Almeida (@fromkalen) October 15, 2022 దీన్నంతటిని మరో యువకుడు వీడియో తీస్తుండగా.. అధ్యక్షుడి భద్రతా సిబ్బంది వద్దని అతన్ని వారించారు. ఈ వీడియో ట్విటర్లో షేర్ చేయగా.. వైరల్గా మారింది. ఇప్పటి వరకు 5 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. బైడెన్ ప్రవర్తనతో యువతి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయిందని కొంతమంది అంటుంటే.. ‘అధ్యక్షుడు యువతిని పట్టుకోవడం వల్ల ఆమె ఆనందంతో ఆశ్చర్యపోయింది. తాత వయసున్న వ్యక్తి యువతితో సరదాగా మాట్లాడుతుంటే.. ఎగతాళి చేయడానికి సిగ్గుగా లేదా అంటూ మరికొంతమంది ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. This is being blown out of proportion. Any young adult gets embarrassed/awkward when talking about things like dating. He’s from an older generation, I don’t see the problem w/ a hand on a shoulder. — Doombot_Tatertot (@TatertotDoombot) October 15, 2022 He's not "grabbing" he's touching her shoulder. She isn't "uncomfortable" she's surprised and delighted. How creepy can you all be about a grandfather figure kidding around with a youngster? Shame on you all. — Alan Eggleston (@AlanEggleston) October 15, 2022 -
మా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలట
సితాబ్ దియారా: తమ జేడీ(యూ) పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చాడని జేడీ(యూ) చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. సామాజికవేత్త జయప్రకాశ్ నారాయణ్ జన్మస్థలి సితాబ్ దియారాలో పర్యటించిన నితీశ్ శనివారం అక్కడి మీడియాతో మాట్లాడారు. ‘ రెండు వారాల క్రితం ప్రశాంత్ కిశోర్ నా వద్దకు వచ్చారు. నేనేం అతడిని పిలవలేదు. జేడీయూను కాంగ్రెస్లో కలిపేస్తే మంచిదని నాలుగైదేళ్ల క్రితమే నాకు సలహా ఇచ్చాడు. ఇప్పడేమో చాలాసేపు ఏవోవో అంశాలు మాట్లాడుతున్నాడు. నాకప్పుడే అర్థమైంది ప్రశాంత్ బీజేపీ తరఫున పనిచేస్తున్నాడని ’ అని నితీశ్ చెప్పారు. ‘10–15 రోజుల క్రితం నితీశే నన్ను పిలిచారు. తన జేడీయూ పార్టీకి సారథ్యం వహించాలని కోరారు. నేను తిరస్కరించా. మళ్లీ జేడీయూలో చేరలేనని చెప్పా’ అని మంగళవారం ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించిన నాలుగు రోజులకే నితీశ్ స్పందించడం గమనార్హం. ఐ–ప్యాక్కు సారథ్యం వహిస్తూ 2018లో జేడీయూలో చేరిన ప్రశాంత్కు జాతీయ పౌరసత్వం సవరణ చట్టంపై నితీశ్తో అభిప్రాయ భేదాలొచ్చాయి. దీంతో పార్టీ నుంచి ప్రశాంత్ను బహిష్కరించారు. -
అమ్మ మాట విని కోటీశ్వరురాలైన కూతురు
వాషింగ్టన్: అమ్మ చెప్పిన సలహాను పాటించి రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది ఓ మహిళ. లాటరీలో రూ.2 కోట్లు తగిలి ఆనందంలో తేలిపోయింది. అంతడబ్బు తన వద్ద ఉంటుందని కలలో కూడా ఉహించలేదని సంబరపడిపోతోంది. ఈ సంతోషంలో రాత్రి నిద్ర కూడా పట్టలేదని చెబుతోంది. లాటరీ గెలుచుకున్న 55 ఏళ్ల ఈ మహిళ పేరు గినా డిల్లార్డ్. అమెరికాలోని నార్త్ కరోలినాలో నివాసముంటోంది. తల్లితో కలిసి గ్రాసరీ షాప్కు వెళ్లింది. అయితే సరదా ఫాస్ట్ ప్లే గేమ్ ఆడమని డిల్లార్డ్కు ఆమె తల్లి సూచించింది. అంతకుముందు ఎప్పుడూ డిల్లార్డ్ ఆ ఆట ఆడలేదు. కానీ తల్లి చెప్పింది కదా అని సరదాగా 5 డాలర్లు పెట్టి టికెట్ కొనుగోలు చేసింది. ఆట ఆడాక అదృష్టవశాత్తు ఆమే గెలిచింది. 2,54,926 డాలర్ల జాక్పాట్ కొట్టింది. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ రూ.2కోట్లకు పైమాటే. తాను లాటరీ గెలుస్తానని అనుకోలేదని డిల్లార్డ్ చెప్పింది. తన తల్లి సలహా వల్లే ఇది జరిగిందని పేర్కొంది. గెలిచిన డబ్బుతో హోం లోన్, కారు లోన్ కట్టేస్తానని, మిగతా మొత్తాన్ని దాచుకుంటానని తెలిపింది. చదవండి: శ్రీలంకకు జిన్పింగ్ ఆఫర్.. -
నిద్రలేమి సమస్య.. కోవిడ్తో పాటు అది కూడా కారణమే!
మన దేశ నగర జనాభాలో సగం మంది సరైన నిద్రపోవడం లేదు. నిద్రలేమి తెచ్చే ఆరోగ్య సమస్యలపై నగర వాసుల్లో అవగాహన ఉన్నా... అప్రమత్తత మాత్రం కొరవడింది. రెస్మెడ్ సంస్థ తాజా సర్వే కోసం మన నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో వేలాది మందిని ప్రశ్నించిన ఈ సర్వేలో ఇలాంటి పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కరోనా నేపధ్యంలో గత రెండేళ్లలో నిద్రలేమి స్థాయిలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. మన దేశంలో నిద్ర నాణ్యత లేమి అనుభవిస్తున్న వ్యక్తులలో 57% పెరుగుదల నమోదైంది. ఈ పరిస్థితికి మహమ్మారితో పాటు వచ్చిపడిన వృత్తిపరమైన ఆందోళన ప్రధాన కారణం. మన నిద్ర వీక్...మాన‘సిక్’... సర్వేలో పాల్గొన్న వారిలో 81 శాతం మంది నిద్రిందచే శైలి తమ జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుందని అంగీకరించారు.. అలాగే 72 శాతం మంది సరిగా నిద్ర వేళలు పాటించకపోవడమే తమ పేలవమైన మానసిక పరిస్థితికి కారణమని చెప్పారు. నిద్రకు ఉపక్రమించిన తర్వాత నిద్రపోవడానికి సగటున సుమారు 90 నిమిషాలు తీసుకుంటున్నామన్నారు. పడుకునే ముందు ఒత్తిడి, నిద్రపోయే ముందు స్క్రీన్ వీక్షించిన సమయం వంటి ఇతర కారణాల బట్టి ఈ వ్యవధి ఆధారపడి ఉంటోంది. కేవలం 53 శాతం మంది మాత్రమే వారికి సహాయపడే పరికరాలను ఉపయోగించి వారి నిద్ర సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించారు. విశేషం ఏమిటంటే... గురకను మంచి రాత్రి నిద్రకు చిహ్నంగా భావించారు. నిద్రలేమి సమస్యలపై అవగాహన లేమి... సర్వేలో పాల్గొన్న వారిలో 59 శాతం మంది గురకను మంచి నిద్రకు చిహ్నంగా భావించడం అంటే.. నిద్రలేమి సమస్యలపై అవగాహనకు అది అద్దం పడుతుంది. నిద్రలేమి నుంచి పుట్టే ప్రధాన సమస్య స్లీప్ అప్నియా. గొంతు కండరాలు సడలించడం, ఊపిరి పీల్చుకున్నప్పుడు వాయుమార్గం ఇరుకైన లేదా మూసుకుపోయే స్థితిని అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు. దీని సాధారణ లక్షణాలు బిగ్గరగా గురక, నిద్రలో గాలి పీల్చడం, ఉదయం తలనొప్పి, ఇది సాధారణ శ్వాసను తాత్కాలికంగా నిరోధిస్తుంది. నిస్సారమైన శ్వాస, బిగ్గరగా గురకను పుట్టిస్తుంది. అంతేకాక ఆకస్మిక పగటి నిద్రపోవడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ నిద్ర లేమితో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల టైప్2 డయాబెటిస్కు దారి తీస్తుంది... అయితే ఈ అన్ని సమస్యలపైనా నగరవాసుల్లో అవగాహన కొరవడిందని సర్వే తేల్చింది. ఈ నేపధ్యంలో నిద్రలేమి తద్వారా తలెత్తే సమస్యలపై అవగాహన పెంచుకోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. చదవండి: పిల్లలు ఫోన్కు అడిక్ట్ అయ్యారా? టైమ్ లేదని తప్పించుకోకుండా ఇలా చేయండి! -
రివిజన్తో విన్!
పట్టుదలతో చదివితే లక్ష్యాన్ని చేరవచ్చు. ఆశయసాధనలో అలుపెరగక ముందుకు సాగితే విజయం సాగిలపడుతుంది. నిరంతర శ్రమతో.. అకుంఠిత దీక్షతో అహరహం తపిస్తే గెలుపు బాట తథ్యం అంటున్నారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్. సర్కారీ కొలువుల నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో గ్రూప్స్ అభ్యర్థులకు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ముచ్చటించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ముందు సిలబస్పై అభ్యర్థులకు అవగాహన అవసరమన్నారు. దానికి అనుగుణంగా మెటీరియల్ను సమకూర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా సంబంధిత సబ్జెక్టులపై పట్టు సాధించాలని, జనరల్ నాలెడ్జి పెంచుకోవాలన్నారు. పరీక్షల్లో తొలి మెట్టుకు ఈ రెండు అంశాలు దోహదపడతాయని శర్మన్ స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏం సూచించారంటే.. – సాక్షి, హైదరాబాద్ ఎంత అర్థమైందన్నదే పాయింట్ చదవడంతో పాటు నిరంతరం సమీక్షించు కోవాలి. గంటలకొద్దీ పుస్తకాలతో కుస్తీ పట్టడం కాదు.. ఎంత వరకు అర్థమైందనేది ప్రధానం. ఇష్టంగా అర్థం చేసుకుంటూ చదవాలి. పరీక్షకు హాజరయ్యే లోపు కనీసం రెండుసార్లయినా రివిజన్ చేస్తేనే çపట్టు వస్తుంది. ఒకేసారి సిద్ధం కావాలి గ్రూప్స్ అభ్యర్థులకు ప్రిలిమ్స్ తర్వాత మెయి న్స్ పరీక్షకు లభించే కాల వ్యవధి సరిపోదు. దీంతో ప్రిలిమ్స్తో పాటు మెయిన్కు ఒకేసారి సిద్ధం కావడం ప్రారంభించాలి. లాంగ్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే పరీక్ష విధానం అర్థమవుతుంది. జవాబు ఎంత వరకు రాయాలో తెలుస్తుంది. ప్రతి దానిని సూక్ష్మంగా గమనించి దానికి అనుగుణంగా సిద్ధమయ్యేందుకు ప్రయత్నించాలి. ఆప్షనల్ సబ్జెక్టులు కీలకం గ్రూప్ మెయిన్స్ కోసం ఆప్షన్లు నిర్ణయించు కోవడం కీలకం. ఆసక్తిని బట్టి ఆప్షన్లు నిర్ణయిం చుకోవాలి. సంబంధిత సబ్జెక్టుల్లో గట్టి పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే పరీక్ష సునాయాసంగా రాసేందుకు వీలుంటుంది. మెయిన్స్ ఇంటర్వ్యూలో సైతం ఆప్షన్స్పై అధిక ప్రశ్నలు అడుగుతారు.. అవసరం లేని సమాచారం వద్దు రెండు దశాబ్దాల క్రితం వరకు పోటీ పరీక్షలకు సమాచారం సేకరణ కష్టంగా ఉండేది. ప్రస్తుతం గూగుల్ సమాచార గనిగా మారింది. అనవసరమైన సమాచారం సేకరించకుండా సిలబస్కు అనుగుణంగా సమాచారం మాత్రమే సేకరించి వాటిపై దృష్టి సారించాలి. సమాధానాలతో సంతృప్తి పర్చాలి ఇంటర్వ్యూల్లో బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలతో సంతృప్తి పర్చగలగాలి. బోర్డు సభ్యుల దగ్గర అభ్యర్థి పూర్తి వివరాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్న వేస్తారు. అందులో వ్యక్తిగత, నేటివిటీ, రాష్ట్రీయ, జాతీయ, సున్నితమైన, ఉద్యోగం సంబంధించి తదితర ప్రశ్నాలు సంధిస్తారు. వాటికి ఎలాంటి టెన్షన్ లేకుండా సునా యసంగా జవాబు ఇవ్వాలి. తెలియకుంటే తెలియదని స్పష్టంగా చెప్పాలి. తెలియకున్నా.. చెప్పడానికి ప్రయత్నించవద్దు. సమయపాలన ప్రధానం పోటీ పరీక్షల్లో సమయ పాలన కూడా ప్రధానం. సమయం వృథా చేయకుండా సంబంధిత సబ్టెక్టులపై పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలి. పరీక్ష రాసేటప్పుడు కూడా ముందుగానే ప్రశ్నలకు సమయం కేటాయించుకొని పూర్తి చేసే విధంగా ప్రయత్నించాలి. -
డాక్టర్లు సూచించారని స్విమ్ చేశాడు... అదే అతనికి మృత్యువైంది
హైదరాబాద్: ఆస్ట్రేలియాలో స్విమ్మింగ్ పూల్లో పడి నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. రెజిమెంటల్బజార్కు చెందిన శ్రీనివాస్, అరుణ దంపతుల కుమారుడు సాయిసూర్యతేజ 2019లో ఎంఎస్ చేసేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లాడు. చదువు పూర్తి కావడంతో రెండు నెలల క్రితం సివిల్ ఇంజినీర్గా ఉద్యోగంలో చేరాడు. ఈ నెల 7న ఆస్ట్రేలియా బ్రిస్బన్ లోని తాను నివాసం ఉంటున్న గోల్డెన్ కాస్ట్ రిసార్ట్లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందాడు. డాక్టర్ సూచనలతో.. 2020లో సాయి సూర్యతేజ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడి కాలు ప్రాక్చర్ కావడంతో శస్త్ర చికిత్స జరిగింది. వచ్చే నెలలో మరో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. శస్త్ర చికిత్స చేయాలంటే స్విమ్మింగ్ చేస్తే బాగుంటుందని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న తన అపార్ట్మెంట్ కింద ఉన్న పూల్కు వెళ్లిన అతను ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు సిద్ధపడుతుండగా.. వచ్చే నెలలో సాయి సూర్యకు శస్త్ర చికిత్స జరుగనుండటంతో తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్దం అయ్యారు. ఏప్రిల్ 2న ప్రయాణానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అంతలో కుమారుడు మృతి చెందినట్లు సమాచారం అందడంతో వారు బోరున విలపిస్తున్నారు. మృతుడి స్నేహితు లు సాయి మృతదేహాన్ని నగరానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో మృతదేహం నగరానికి చేరుకోవచ్చునని కుటుంబ సభ్యులు తెలిపారు. (చదవండి: క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.కోటి ఖాళీ) -
తలనొప్పి వేధిస్తోందా?..నివారించవచ్చు ఇలా..
వెర్రి వేయి విధాలు అన్నట్లు తలనొప్పుల్లో 200కి పైగా రకాలున్నాయట. వీటిలో వెంటనే తగ్గిపోయే సాధారణ తలనొప్పులతోబాటు కొన్ని ప్రాణాంతకమైన తలనొప్పులూ ఉన్నాయి. తల, మెడ భాగాల్లోని తొమ్మిది సున్నితమైన ప్రాంతాలు లేదా తలలోని రక్త నాళాలు ఒత్తిడికి లోనుకావడం లేదా వాపు వల్ల తలనొప్పి వస్తుందని వైద్యులు చెబుతారు. అయితే, తరచు తలనొప్పి వస్తున్నట్లయితే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే.. తలనొప్పి ఎన్నో రకాల సమస్యలతో ముడిపడి ఉంటుంది కాబట్టి. ఏ తలనొప్పో ఎలా గుర్తించాలి..? ∙తలనొప్పి ఓ వైపు మాత్రమే ఉంటే అది ‘మైగ్రేన్’. ఎక్కువ ఎండలో నిల్చున్నా లేదా పెద్ద శబ్దం విన్నా ఈ తరహా తల నొప్పి ఎక్కువ అవుతుంది. ∙తల లోపల ఎక్కువ ఒత్తిడి అనిపించినా, తల చుట్టూ ఏదో చుట్టేసినట్టుగా అనిపించినా అది మానసిక ఒత్తిడి వల్ల వచ్చినట్టే. సహజంగా ఇది ప్రమాదకరమైన తలనొప్పి కాదని భావించవచ్చు. ∙నుదుటి వెనుక, కళ్ల మధ్య, కంటి దిగువన, తల వెనుక నొప్పి వస్తే అది సైనస్ తల నొప్పి. సాధారణంగా సైనస్ తల నొప్పులు దీర్ఘకాలంగా ఉంటాయి. ∙తలనొప్పితోపాటు కళ్లు ఎర్రబడడం, వాయడం, కళ్ల నుంచి నీళ్లు రావడం వంటివి జరిగితే అది ‘క్లస్టర్ తల నొప్పి’. ∙కొన్నిరకాల ఆహార పదార్థాలు తీసుకున్నా లేదా కొన్ని రకాల వాసనలు పీల్చినా తలనొప్పి వస్తే అది ‘అలెర్జీ తల నొప్పి’. ∙జెనెటిక్ కారణాలతోపాటు, పరిసరాలూ వాతావరణ పరిస్థితులూ కూడా తలనొప్పికి కారణం కావచ్చు. వయసు, జాతి, వర్గ, వర్ణ లింగ భేదం లేకుండా అందరినీ పట్టి పీడించే అతి సాధారణ సమస్య తలనొప్పి. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో దీనిబారిన పడకుండా వుండరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ప్రపంచ జనాభాలో సగం మంది కనీసం సంవత్సరానికొకసారయినా తలనొప్పితో బాధపడుతూ వుంటారంటే, తలనొప్పి ఎంత సాధారణ సమస్యో అర్థం అవుతుంది. అలాగని కేవలం సాధారణ సమస్యగా కూడా దీనిని తీసిపారేయడానికి వీలు లేదు. తలనొప్పికి సాధారణమైన, ప్రమాదంలేని కారణాలతోబాటు అసాధారణమైన, ప్రమాదకరమైన జబ్బులు కూడా కారణం కావచ్చు. తలనొప్పి రకరకాల కారణాల వల్ల వస్తుంది. ముందు కారణాలు తెలుసుకోవాలి. తర్వాత అది సాధారణ సమస్యా, అసాధారణ సమస్యా అన్నది నిర్ధారించుకుంటే, దాని నివారణోపాయాలు తెలుసుకోవచ్చు. తలనొప్పి గురించి, దానికి ఉపశమన చర్యల గురించి చెప్పుకుందాం... సాధారణ తలనొప్పుల నుంచి ఉపశమనం కోసం... ∙ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది. ∙గోరు వెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పి నివారణిగా పనిచేస్తుందట. ∙తలనొప్పిని తగ్గించడంలో యూకలిప్టస్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ∙కప్పు పాలలో కొద్దిగా రాతి ఉప్పును కలిపి ఆ పాలు తాగితే తలనొప్పి తగ్గుతుంది. ∙మంచి గంధపు చెక్క ఉంటే, దానిని సాన మీద అరగతీసి నుదుటి మీద పట్టు వేసుకుంటే కొద్దిసేపటిలోనే తలనొప్పి మాయమవుతుంది. గంధపు చెక్క, సాన లేకపోతే ఇంటిలో రెడీగా ఉన్న చందనం పొడిని పేస్టులా చేసుకుని నుదుటికి, కణతల మీద పట్టు వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ∙చిన్న అల్లం ముక్క, యాలకులు దంచి వేసిన టీ లేదా కొద్దిగా స్ట్రాంగ్ కాఫీని తాగడం ∙చిన్న అల్లం ముక్కను పై పొట్టు తీసి దానిని మెల్లగా నమిలినా తలనొప్పి తగ్గుతుంది. ∙డార్క్ చాకొలేట్ లేదా మామూలు చాకొలేట్ చప్పరించినా తలనొప్పి ఉపశమిస్తుంది. ∙వెలుతురు తక్కువగా... ఏకాంతంగా ఉండే గదిలో కాసేపు విశ్రాంతి తీసుకోవడం కూడా సత్ఫలితాలనిస్తుంది. ∙కొద్దిగా వెల్లుల్లిని తీసుకుని నీటితో కలిపి పేస్టులా చేయండి. ఆ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలు తలనొప్పి తగ్గుతుంది. ∙తలనొప్పిని తగ్గించడంలో కొబ్బరి నూనె చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని కాస్త మాడు మీద వేసుకుని మర్దనా చేసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ∙విటమిన్–ఇ, ఈ, బి 12, కాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పిగా ఉన్నప్పుడు మసాలా ఫుడ్ను అస్సలు తీసుకోవద్దు. ∙మంచి నిద్ర, వ్యాయామం తలనొప్పిని దరిచేరకుండా చూడడంలో కీలకపాత్ర వహిస్తాయి. తలనొప్పి తెప్పించే ఆహారం... ∙కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల తల నొప్పి రావడమో లేదా తల నొప్పి ఎక్కువవడమో జరగొచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా.. కొంతమందికి ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్, చాక్లెట్స్, కెఫిన్, ఫ్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, ఐస్ క్రీమ్స్ వంటివి కొంత మందిలో తల నొప్పికి కారణమవుతుంటాయి. తలనొప్పి తగ్గించే ఆహారం... ∙జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులు వంటివి పెయిన్ కిల్లర్స్గా పని చేస్తాయి. తల నొప్పిని తగ్గిస్తాయి. ∙మైగ్రేన్తో బాధపడేవారు క్రమం తప్పకుండా పుదీనా తీసుకుంటే మంచిది. అల్లంలో కూడా మైగ్రేన్ తల నొప్పిని తగ్గించే లక్షణం ఉంది.∙చెర్రీస్ తింటే తల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది పనిభారం ఎక్కువ కావడం వల్ల వచ్చే తలనొప్పి విషయంలో బాగా పని చేస్తుంది. ∙కొన్నిసార్లు డీహైడ్రేషన్ వల్ల కూడా తల నొప్పులు వస్తాయి. అందుకే నీటి శాతం ఎక్కువగా ఉండే కీరా దోస వంటివి ఆహారంలో చేర్చుకుంటే మంచిది. ∙అరటి పండ్లు, కొద్ది మొత్తంలో కాఫీ, బ్రకోలీ, పాలకూర వంటివి తలనొప్పిని నివారిస్తాయి. కొన్ని రకాల ఆసనాల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా తల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ∙ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే సంరక్షణగా క్యాప్ పెట్టుకుంటే మంచిది. ∙తల స్నానం చేసిన వెంటనే పూర్తిగా ఆరబెట్టకపోతే తల నొప్పి వచ్చే అవకాశాలెక్కువ. అందుకే స్నానం చేసిన తర్వాత కచ్చితంగా హెయిర్ డ్రైర్తో లేదా ఫ్యాన్ కింద కూర్చుని కురులను ఆరబెట్టుకోవాలి. ∙కంప్యూటర్ను చూస్తూ వర్క్ చేసే వారికి తరచూ తల నొప్పి వస్తుంటుంది. అందుకే మధ్య మధ్యలో పనికి విరామం ఇవ్వాలి. స్క్రీన్ బ్రైట్నెస్ని తక్కువగా పెట్టుకోవాలి. ∙కంటి నిండా నిద్ర లేకపోతే తల నొప్పి ఖాయం. అందుకే.. రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండాలి. ఇతర సమస్యల వల్ల వచ్చే తలనొప్పి ∙నేత్ర వ్యాధుల వల్ల దృష్టి దోషాలూ, ట్యూమర్లూ, అక్యూట్ కంజెస్టివ్ గ్లాకోమా ∙చెవిలో గుల్లలూ, వాపులూ, చీముగడ్డలు ∙‘సైనసైటిస్ ‘లో వచ్చే ‘సైనస్ హెడేక్’ నుదురు దగ్గర,ముక్కు మొదట, దవడ ఎముకల దగ్గర నొప్పి అనిపిస్తుంది, ముందుకు వంగినా దగ్గినా తుమ్మినా ఎక్కువ అవుతుంది. ∙జీర్ణాశయ సమస్య లు, వాంతులు, విరేచనాలు, హై బీపీ. ∙బ్రెయిన్ ట్యూమర్, ఇతర కాన్సర్లలో తలనొప్పినే ప్రధాన లక్షణంగా గుర్తిస్తారు. ∙చిన్న పిల్లలలో అంటే 10–20 మధ్య వయసు వారిలో మెదడు లో చేరిన పురుగుల గుడ్లు తలనొప్పికీ, ఫిట్స్కీ కారణం కావచ్చు. ∙మెనింజైటిస్, ఎన్ సెఫలైటిస్ వీటిలో తీవ్రమైన తలనొప్పి వుంటుంది. -
IPL 2022: ఆ దేశం నుంచి తొలి క్రికెటర్.. ధోని విలువైన సూచనలు
Mikya Dorgi 1st Bhutan Player Register For IPL Mega Auction 2022.. ఐపీఎల్ అంటేనే క్యాచ్రిచ్ లీగ్ అని ముద్ర పడిపోయింది. ఒక్కసారి ఐపీఎల్లో పాల్గొంటే చాలు కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లే. మరి ఇంత మంచి అవకాశాన్ని ఏ ఆటగాడైనా ఎందుకు వదులుకుంటాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆడితే రాని గుర్తింపు ఐపీఎల్ ద్వారా తొందరగా వస్తుందని చాలా మంది అభిప్రాయం. అందుకే ఎక్కడున్నా సరే ఐపీఎల్లో ఒక్కసారైనా ఆడాలని ప్రతీ ఆటగాడు కోరుకుంటాడు. తాజాగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఐపీఎల్ మెగావేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి వేలంలో దాదాపు 1214 మంది ఆటగాళ్లు తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. అందులో భుటాన్కు చెందిన ఆల్రౌండర్ మిక్యో డోర్జీ కూడా ఉన్నాడు,. భుటాన్ నుంచి ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న తొలి క్రికెటర్గా నిలవనున్నాడు. వచ్చే నెలలో జరగనున్న వేలంలో మిక్యా డోర్జీ పేరు వినపడనుంది. మరి అతన్ని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలంటే అప్పటివరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే డోర్జీ.. తన ఆరాధ్య క్రికెటర్.. సీఎస్కేను నాలుగుసార్లు విజేత గా నిలిపిన ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనితో కలిసి దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ధోని సంతకం చేసిన జెర్సీని అతని చేతుల మీదుగా అందుకున్న డోర్జీ దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. వీడియోలో ధోని మాట్లాడుతూ.. ఈ విషయాన్ని సింపుల్గానే ఉంచు. నీ ఆటపైనే దృష్టి పెట్టు.. రిజల్ట్ గురించి ఆలోచించొద్దు. నీ ప్రక్రియను సరిగ్గా నెరవేర్చు.. ఫలితాలు వెతుక్కంటూ వస్తాయి. ఆటను బాగా ఎంజాయ్ చెయ్.. ఒత్తిడిని దరిచేరనీయకు అంటూ ధోని డోర్జీకి విలువైన సూచనలు ఇచ్చాడు. ఎవరీ మిక్యా డోర్జీ.. మెగా వేలానికి తమ పేరు నమోదు చేసుకున్న 318 మంది విదేశీ ఆటగాళ్లలో భుటాన్కు చెందిన 22 ఏళ్ల ఆల్ రౌండర్ దోర్జీ కూడా ఉన్నాడు. నేపాల్లో ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్ పేరుతో జరిగిన టోర్నీలో లలిత్పూర్ పేట్రియాట్స్కు డోర్జీ ప్రాతినిధ్యం వహించాడు. 2018లో మలేషియాపై అరంగేట్రం చేసిన దోర్జీ మంచి ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా తన ఆటను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలన్న కారణంతో తన పేరును ఐపీఎల్ మెగావేలంలో నమోదు చేసుకున్నాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్య్వూలో డోర్జీ మాట్లాడుతూ.. ''ఐపీఎల్లో ఆడాలనేది నా కల. వేలం జాబితాలో భూటాన్కు చెందిన ఒక ఆటగాడిని మాత్రమే చూడబోతున్నారు. ఇది ఆరంభం మాత్రమే.. భవిష్యత్తులో మా దేశం నుంచి మరిన్ని పేర్లు వస్తాయి. ఐపీఎల్లో పేరు నమోదు చేసుకోవడం నాకు చాలా పెద్ద విషయం'' అని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Ranjung mikyo dorji (@mikyo_dorji) -
స్క్రీన్ కష్టాలు.. చెక్ పెట్టండిలా!
కంప్యూటర్ ముందు పని చేసే ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. ఎక్కువ సమయం తదేకంగా స్క్రీన్ను చూడడం ఆరోగ్యానికి హానికరం. కన్ను, మెడ సమస్యలు ఎదురవుతాయి. అందుకే త్రీ ట్వంటీస్ (20–20–20) రూల్ ఒక మంచి ఆలోచన. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి పనిలో బ్రేక్ తీసుకుని కంప్యూటర్ స్క్రీన్ మీద నుంచి దృష్టి మరల్చి 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువుని 20 సెకన్ల పాటు చూడాలి. ఇదే 20–20–20 రూల్. పక్కన ఉన్న ఫొటోను గమనించండి. ∙కంప్యూటర్ బాధితులకు మరో సూచన... కంప్యూటర్ స్క్రీన్ నుండి వచ్చే లైట్ వలన కంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే యాంటీ గ్లేర్ గ్లాసెస్ ధరించాలి. అలాగే మరో సంగతి... కంప్యూటర్ ముందు పని చేసే వ్యక్తి కంప్యూటర్ నుంచి వెలువడే కాంతి కంటే ఎక్కువ కాంతిలో ఉండాలి. అప్పుడు కంప్యూటర్ నుంచి వెలువడే కిరణాల దుష్ప్రభావం తీవ్రత తగ్గుతుంది. ఈ స్క్రీన్ కష్టాల్లో కొన్ని ఉద్యోగ, వృత్తుల రీత్యా తప్పని సరి అవుతుంటే మరికొన్ని మనకు మనంగా తెచ్చుకుంటున్న కష్టాలూ ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి స్మార్ట్ ఫోన్తో కొనితెచ్చుకునే ఇక్కట్లు. ∙నిద్రపోయే ముందు గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా స్మార్ట్ ఫోన్ చూస్తుంటారు. నిద్ర వచ్చే వరకు మాత్రమే అనుకుంటూ చాటింగ్, గేమ్స్, వీడియోలు చూడడం మొదలుపెడతారు. అది అరగంటకు పైగా సాగుతూనే ఉంటుంది. గేమ్ ఆడుతున్నంత సేపూ మెదడు చురుగ్గా ఉంటుంది. ఇక నిద్ర ఎలా వస్తుంది? -
కిక్కులేకుంటే రోడ్డెక్కలేరా.. గాడితప్పుతున్న జీవితాలు
సాక్షి,హైదరాబాద్: మద్యం మత్తు... అతి వేగం విలువైన జీవితాలను చిత్తు చేస్తోంది. మద్యం సేవించి అతి వేగంగా వాహనాలు నడుపుతూ తమతో పాటు పక్క వారిని కూడా బలి తీసుకుంటున్నారు. అర్ధ రాత్రి చేస్తున్న జాయ్ రైడ్లు బాధితుల కుటుంబాలకు తీరని క్షోభను మిగుల్చుతున్నాయి. ఐటీ కారిడార్ పరిధిలో వీకెండ్లలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మృతుల్లో ఎక్కువగా యువతే ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నా ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విషాదం మిగిల్చిన ఘటనలివే.. ► మధురానగర్కు చెందిన పి.ప్రియాంక (20) జార్జియాలో మెడిసన్ మూడవ సంవత్సరం చదువుతోంది. సెలవుల్లో నగరానికి వచ్చిన ఆమె 2020 నవంబర్ 9న స్నేహితులతో కలిసి జూబ్లిహిల్స్లోని ఎయిర్ లైఫ్ పబ్కు వెళ్లింది. మద్యం సేవించిన స్నేహితుడు మిత్తి మోడీతో కలిసి కారులో జాయ్ రైడ్కు వెళ్లింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో వోల్వో కారును అతి వేగంగా నడుపుతూ చెట్టును ఢీ కొట్టాడు. దీంతో సీటు బెల్డ్ పెట్టుకోని ప్రియాంక తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మిత్తి మోడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ► కాంట్రగడ్డ సంతోష్ (24), స్నేహితులైన రోషన్ (23) చింతా మనోహర్ (23). పప్పు భరద్వాజ్ (20), పవన్ కుమార్ (24)లు కలిసి వీకెండ్ కావడంతో అంతా కలిసి మద్యం సేవించారు. గత డిసెంబర్ 12న తెల్లవారు జామున 2.48 గంటల సమయంలో డీఎల్ఎఫ్ నుంచి స్వీఫ్ట్ కారులో బయలు దేరారు. విప్రో జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ పడ్డా లెక్క చేయకుండా ముందుకు వెళ్లడంతో టిప్పర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జు కావడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ► గోవాలో ఎంఎస్ చదువుతున్న వాకిటి సుజీత్ రెడ్డి గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్లోని స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. గత జూన్ 27న ఉదయం 5.30 గంటలకు ఆడి కారులో వెళుతూ ఆటోను ఢీ కొట్టారు. ఆటో వెనక సీట్లో కూర్చున్న పబ్లో పని చేసే వై.ఉమేష్ కుమార్(37) ఫుట్పాత్పై ఎగిరి పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు సుజీత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ► తెల్లాపూర్ బోన్సాయ్ అపార్ట్మెంట్లో నివాసముండే డి.అశ్రిత (23) కెనడాలో ఎంటెక్ పూర్తి చేసింది. ఉద్యోగంలో చేరేందుకు సమయం ఉండడంతో నగరానికి వచ్చింది. స్నేహితులు తరుణి, సాయి ప్రకాష్, అభిషేక్లతో కలిసి మాదాపూర్లోని స్నార్ట్ పబ్కు వెళ్లింది. గత ఆగస్టు ఒకటిన రాత్రి 11.30 గంటల సమయంలో మద్యం సేవించిన అభిషేక్తో స్కోడా కారులో వెళ్లింది. ► అతి వేగంగా కారు నడుపుతూ కొండాపూర్ మై హోం మంగళ వద్ద కారు అదుపుతప్పి నాలుగు ఫల్టీలు కొట్టడంతో అశ్రిత అక్కడికక్కడే మృతి చెందింది. అభిషేక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దు మద్యం సేవించి వాహనాలను నడపడం చట్ట రీత్యా నేరం. వీకెండ్ పార్టీలలో ఎంజాయ్ చేస్తున్న యువత మద్యం సేవించిన మైకంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మద్యం సేవించిన వ్యక్తిని డ్రైవింగ్ చేయకుండా అడ్డు కోవాల్సిన బాధ్యత బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్ల నిర్వాహకులపై ఉంది. మద్యం తాగిన వారికి వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్పై యువతలో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉంది. మద్యం తాగి వాహనం నడిపివే వారు తమపై ఆధారపడిన కుటుంబం ఉందనే మిషయాన్ని మరువరాదు. – ఎన్.వెంకటేశ్వర్లు, డీసీపీ, మాదాపూర్ చదవండి: Hyderabad: సెక్స్వర్కర్లతో ఒప్పందం.. సోదరుడి ఇంట్లోనే.. -
తన మార్కు చూపించేలా సీఎం ప్లాన్.. 8 మంది మంత్రులు ఇంటికేనా?
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): తనదైన మార్కు చూపించేలా మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని సీఎం బసవరాజ బొమ్మై భావిస్తున్నారు. ఆయన సీఎం పీఠమెక్కి నాలుగు నెలలైంది. కేబినెట్లో సుమారు 8 మంది పనితీరు బాగాలేదని బొమ్మై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అటువంటివారిని సాగనంపి కొత్తవారిని తీసుకోవాలని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా ఈ మార్పులు ఉండాలని అనుకుంటున్నారు. పరిషత్ ఎన్నికల ముగియగానే ఈనెల 10వ తేదీన స్థానిక సంస్థల కోటాలో 25 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వాటి ఫలితాలు 14న వెల్లడిస్తారు. ఆ వెంటనే కేబినెట్లో మార్పులు చేర్పులు చేపట్టే అవకాశముంది. మొన్నటి సీఎం ఢిల్లీ పర్యటనలోనూ మంత్రుల మార్పు గురించి హైకమాండ్తో చర్చించారు. ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలనేదానిపై నాయకత్వం నుంచి సూచనలు రాగానే పని ప్రారంభిస్తారు. పార్టీలో బలమైన నేతగా ఉన్న బీఎస్ యడియూరప్పను బుజ్జగించేలా ఆయన తనయుడు బీవై విజయేంద్రకు మంత్రివర్గంలో స్థానం కల్పించే ఆలోచన ఉంది. చదవండి: ‘సినిమాలు తప్ప బాలకృష్ణకు ప్రజా సమస్యలపై ధ్యాసేలేదు.. ఆరు నెలలకోసారైనా..’ -
స్పైన్ బాగుంటేనే విన్...
ఇటీవలి కాలంలో బ్యాక్ ప్రాబ్లెమ్స్ లేదా వెన్నెముక సంబంధ సమస్యలు బాగా పెరిగాయి. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో లాక్డవున్ కారణంగా అత్యధిక సమయం ఇంట్లోనే ఉండడం, టీవీ లేదా కంప్యూటర్ల ముందు అధిక సమయం గడపడం వంటివి వెన్నుముక సమస్యలను మరింతగా పెంచాయి. అప్పటికే శారీరక శ్రమ లేక స్పైన్ బాధితులు పెరుగుతున్న క్రమంలో కరోనా తర్వాత వయసులకు అతీతంగా ఈ సమస్య విజృంభిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో డా.రావ్స్ హాస్పిటల్(గుంటూరు)కు చెందిన న్యూరోసర్జన్ డా.మోహనరావు పాటిబండ్ల దీనికి సంబంధించి పలు విశేషాలను, సూచనలను అందించారు. ►స్పైన్ లేదా వెన్నెముక అనేది మన శరీరపు భంగిమకు, అవయవాల సమన్వయానికి మన రోజువారీ కార్యకలాపాలకు అత్యవసరమైన మద్ధతును అందిస్తుంది. చాలా వరకూ వెన్నెముక సంబంధ సమస్యలు పెరిగితే అవి కదలికల్ని నిరోధిస్తూ రోజువారీ కార్యకలాపాలను క్లిష్టతరం చేస్తాయి. కాబట్టి... వెన్నెముక ఆరోగ్యం సవ్యంగా ఉండేలా చేసే ఆరోగ్యకరమైన అలవాట్లు పై అవగాహన పెంచుకుంటూ జాగ్రత్తపడాలి. ►ఆరోగ్యకరమైన బరువు కొనసాగించడం, శారీరక చురుకుదనం లోపించకుండా చూసుకోవడం, వ్యాయామాలు, శరీరాన్ని సాగదీసే స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు, సరైన విధంగా వంగిలేచే మెళకువలు, బరువులు ఎత్తడం... వీటన్నింటితో పాటు తగినంత విశ్రాంతి కూడా తప్పనిసరి. ►గత 2–3 దశాబ్ధాల క్రితం ఎటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలూ, పరికరాలూ అందుబాటులో లేవు. అందువల్ల అప్పట్లో శస్త్ర చికిత్సల నుంచి సరైన ఫలితాలు రాలేదు. ►అయితే ఇప్పటికీ స్పైన్ సంబంధ వ్యాధులపైనా చికిత్సలపైనా ముఖ్యంగా శస్త్ర చికిత్సలపై కూడా రోగుల్లో చాలా అపోహలున్నాయి. వాటిని ముందుగా తొలగించుకోవాలి. ►ఇప్పుడు వెన్నెముక సంబంధ సమస్యల గురించి వైద్యరంగం మరింత చక్కగా అర్ధం చేసుకోవడం జరిగింది. తద్వారా మరింత చక్కని చికిత్స వీలవుతుంది. ►సంప్రదాయ పద్ధతిలో కొన్నింటికి చికిత్స సరిపోతుంటే కొన్నింటికి మాత్రం తప్పనిసరిగా శస్త్ర చికిత్స చేయవలసి రావచ్చునని గుర్తించాలి. ►వెన్నెముక చికిత్సల్లో అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ►మినిమల్లీ ఇన్వాసివ్ స్పైన్ సర్జరీ (ఎమ్ఐఎస్ఎస్)... అనేది ఈ రంగంలో ఒక కీలక మైలురాయి. ఈ శస్త్ర చికిత్సలో ఒక ట్యూబ్యులర్ రిట్రాక్టర్ సహాయంతో స్పైన్లోని సమస్యాత్మక ప్రాంతాన్ని చేరుకుంటారు. మైక్రోస్కోప్, ఎండోస్కోప్ వంటివి ఉపయోగిస్తారు. ల్యూంబర్ డిసెక్టమీ, ల్యామినెక్టొమీ, స్పైనల్ ఫ్యూజన్ వంటి కొన్ని రకాల వెన్నుముక చికిత్సల్లో దీన్ని ఉపయోగించవచ్చు ►ఇందులో చర్మాన్ని అతి స్వల్పంగా మాత్రమే కోత పెట్టడం ద్వారా శస్త్ర చికిత్స చేయడం జరగుతుంది. అంతేకాకుండా అతి తక్కువ రోజులు మాత్రమే ఆసుపత్రిలో ఉండేందుకు, చికిత్సానంతరం తక్కువ నొప్పి, గాయం త్వరగా మానడం... వంటివి సాధ్యమవుతాయి. –డా.మోహన్రావు పాటిబండ్ల, న్యూరో సర్జన్ డా.రావ్స్ హాస్పిటల్ -
పారా హుషార్.. మూత్రాశయ కేన్సర్..
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధన ప్రకారం...దాదాపు 45000 మంది మగవాళ్లు, 17వేల మంది మహిళలు ఏటేటా మూత్రాశయ కేన్సర్కు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో మూత్రాశయ కేన్సర్ గురించి విషయాలు, జాగ్రత్తలను అపోలో స్పెక్ట్రా కు చెందిన యూరాలజిస్ట్ డా.ప్రియాంక్ సలేచా వివరించారు. అదృష్టవశాత్తూ చాలా వరకూ మూత్రాశయ కేన్సర్లు ముందస్తుగానే గుర్తించవచ్చు. తద్వారా చక్కని చికిత్స అందించడం సాధ్యమవుతుంది. విజయవంతంగా చికిత్స అందించిన తర్వాత కూడా నిరంతర పర్యవేక్షణ, సంప్రదింపులు అవసరం అవుతాయి. మూత్రాశయంలోని యూరోథెలియల్ నాళాలపై ప్రభావం చూపే సాధారణ తరహా కేన్సర్ ఇది. దిగువ పొత్తికడుపులో మూత్రాన్ని నిల్వచేసేందుకు సహకరించే బోలుగా ఉండే కండర రూప అవయవం ఇది. ఖచ్చితంగా ఇదీ అనే కారణాన్ని మూత్రాశయ కేన్సర్కి చెప్పలేం. అయితే నియంత్రణ లేని విధంగా అసాధారణ వృద్ధితో కణజాలం పెరగడం జరుగుతుంది. అవి ఇతర టిష్యూలను కూడా ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. గుర్తించడం ఎలా... యూరోథెలియల్ కార్సినోమా, స్వే్కమస్ సెల్ కార్సిమోనా, అడెనోకార్సినోమా, స్కేమస్సెల్ కార్సినోమా, అడెనో కార్సినోమా పేరిట 3 రకాల మూత్రాశయ కేన్సర్లు ఉన్నాయి. రోగుల్లో యూరోథెలియల్ కార్సినోమా లేదా ట్రాన్సిషనల్ సెల్ కార్సినోమాలు ఎక్కువగా కనిపించే రకాలు. పేరుకు తగ్గట్టే ఈ కేన్సర్ మూత్రాశయంలోని అంతర్గత పొరకు చెందిన ట్రాన్సిషనల్ సెల్స్లో మొదలవుతుంది. మూత్రాశయ కేన్సర్లతో బాధపడుతున్న ప్రజలు పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఇవి చాలా సార్లు ఇతర వ్యాధులుగా పొరపాటు పడేందుకు కారణమవుతాయి. అలసట, ఆకస్మికంగా బరువు తగ్గడం, ఎముకలు సున్నితంగా మారడం, మూత్ర విసర్జన సమయంలో బాధ, తరచు వేగంగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం రావడం, పొత్తికడుపు భాగంలో లేదా వెన్నెముక దిగువ భాగంలో నొప్పి... వంటివి ప్రత్యేకంగా దీనికి సంబంధించిన లక్షణాలుగా పేర్కొనవచ్చు. నివారణ... కొన్ని మార్పు చేర్పుల ద్వారా మూత్రాశయ కేన్సర్ను నివారించవచ్చు. –థూమపానం చేసినప్పుడు హానికారక రసాయనాలు ఉత్పత్తి అయి చివరగా మూత్రాశయానికి చేరి, అక్కడి లైనింగ్ని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి పొగ తాగడం మానేయాలి. –దాహార్తి అనే పరిస్థితికి చేరకుండా చూసుకోవడం కూడా మూత్రాశయ కేన్సర్ను నివారిస్తుంది. రోజులో వీలైనంత నీరు తాగడం వల్ల అది టాక్సిన్స్ను తోసివేసేందుకు మూత్రాశయం దెబ్బతినకుండా ఉండేందుకు సహకరిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ తగినంత నీటిని తాగుతూఉండాలి. –రబ్బర్, లెదర్, డైస్, టెక్స్టైల్స్, పాలిన్ ఉత్పత్తుల తయారీలో వాడే కొన్ని రసాయనాల్లో కొన్ని మూత్రాశయ కేన్సర్కు దారి తీసేవి కూడా ఉంటాయి. ఇలాంటి హనికారక రసాయనాలను ఫిల్టర్ చేసే ప్రక్రియలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీలైనంత వరకూ ఈ తరహా రసాయనాలను శరీరంలోకి చేరకుండా చూసుకోవాలి. –కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మూత్రాశయ కేన్సర్తో బాధపతుండడం జరిగి ఉంటే. ఇతరులు కూడా ఆ వ్యాధికి గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి, అలాంటి ప్రమాదం సంభవించే అవకాశం ఉంటే ముందస్తుగానే ఆరోగ్యకర జీవనశైలి అలవరచుకోవడం, వైద్యులను తరచు సంప్రదిస్తుండడం అవసరం. ఉపసంహారం... ఆరోగ్యకరమైన జీవనశైలి, నిద్ర... ఈ వ్యాధి నిరోధకాలుగా పనిచేస్తాయి. అలాగే సిస్టెక్టొమీ అనే సర్జికల్ ప్రొసీజర్ ద్వారా కూడా ఏ వయసులో సోకిన కేన్సర్నైనా విజయవంతంగా చికిత్స చేయవచ్చు. డా.ప్రియాంక్ సలేచా, యూరాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి చదవండి: నిద్ర రావడం కోసం అద్భుత చిట్కాలు -
తస్మాత్ జాగ్రత్త.. చిన్న పిల్లల్లో ఆ వ్యాధులు పెరుగుతున్నాయ్
చెన్నై: ప్రస్తుత కాలంలో ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్, మొబైల్ ఫోన్ ముందు గడపడం వల్ల చిన్న పిల్లలలో కంటి వ్యాధులు పెరుగుతున్నట్లు చెన్నైలోని డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి సీనియర్ పీడియాట్రిక్ ఆప్తల్మాలజిస్ట్ డాక్టర్ మంజులా జయకుమార్ తెలిపారు. గత ఐదేళ్లలో ఈ వ్యాధులు రోజు రోజుకు అధికమవుతున్నాయని ఆమె వెల్లడించారు. బుధవారం ఉదయం జరిగిన ప్రెస్మీట్లో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్–19 కారణంగా పిల్లలు ఆన్లైన్ తరగతులకు పరిమితం కావడం, ఎక్కువసేపు కంప్యూటర్ గేమ్స్కు అలవాటు పడుతున్నారన్నారు. దీంతో కంటి రెప్పలు తరచుగా మూతపడడం జరుగుతోందన్నారు. అంతేకాకుండా సూర్యరశ్మికి దూరం కావడం, తగిన వ్యాయామం లేకుండా పోవటం వల్ల కంటి వ్యాధులు పెరుగుతున్నాయని చెప్పారు. నేత్ర సంరక్షణ అవగాహన మాసంగా ఆగస్టు నెలను పాటిస్తున్నట్లు వెల్లడించారు. తగిన సమయంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందితే కంటి వ్యాధుల నుంచి దూరం కావచ్చునని అన్నారు. తల్లిదండ్రులు తగిన రీతిలో ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తూ చిన్న పిల్లల కంటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని ఆమె హితవు పలికారు. -
‘భుజ’బలం... కాపాడుకుందాం...
సాక్షి, వెబ్డెస్క్: లాక్డౌన్ కారణంగా వ్యాయామ ప్రియులు అనేకమంది అలవాటు లేని కొత్త రకం వర్కవుట్స్ని ప్రయత్నించారు. వీటిలో ఆటలు కూడా ఉన్నాయి. ఖాళీ సమయం దొరికిందనే ఆలోచనతో.. టెన్నిస్, వాలీబాల్, స్విమ్మింగ్, క్రికెట్... వంటి ఆటలు సరదాగా ఆడిన వారిలో అనేక మంది భుజాల నొప్పులు, వాపులు..వంటి సమస్యలతో వైద్యుల్ని సంప్రదిస్తున్నారు. ఈ నేపధ్యంలో భుజాల నొప్పులకు కారణాలు, పరిష్కారాలను వివరిస్తున్నారు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ వైద్యులు ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జన్ డా.వీరేందర్. కారణాలెన్నో... ఒకటే తరహాలో భుజాలను పదే పదే రొటేట్ చేయడం వల్ల అది లిగ్మెంట్స్ వదులుగా మారడానికి, భుజాలు జారిపడే ప్రమాదాన్ని పెంచడానికి కారణమైంది. ఆటలు ఆడేటప్పుడు గానీ వ్యాయామ సమయంలో గానీ భుజాల వద్ద ఎటువంటి అనుభూతి కలుగుతుందో నిశితంగా గమనిస్తుండాలి. భుజాల కదలికల్లో అపసవ్యత గానీ, నొప్పి లేదా జారినట్టు అనిపించడం వంటివి ఉంటే వెంటనే ఫిజియో థెరపిస్ట్ని సంప్రదించాలి. అలవాటు లేని, ఫిజియో థెరపిస్ట్ పర్యవేక్షణ లేకుండా ఆటలు ఆడేవాళ్లలో ప్రమాదంగా పరిణమించే కొన్ని సమస్యలు... –టెండెనిటైస్: ఈ సమస్య టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడేవాళ్లు తరచుగా ఎదుర్కుంటారు. భుజాల నొప్పితో ప్రారంభమై ఇది మరింత తీవ్రమైన సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. –ఇంపింగ్మెంట్: స్విమ్మింగ్ చేసేవాళ్లు, టెన్నిస్, గోల్ఫ్ ఆడేవాళ్లలో ఇది కనిపిస్తుంటుంది. వెంట వెంటనే భుజాన్ని రొటేట్ చేసే వాళ్లలో ఈ పరిస్థితి వస్తుంది. భుజాల దగ్గర అసౌకర్యంగా ఉండడం, నొప్పి ఉంటాయి. కొన్ని సార్లు భుజాలపై ఏ మాత్రం ఒత్తిడి తగిలినా నిద్రను కూడా దూరం చేస్తుంది. –ల్యాబ్రల్ టియర్: ఇది భుజాలు పట్టు తప్పడం వల్ల, లేదా భుజంపై ఆకస్మికంగా ఒత్తిడి పడడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. భుజాలను కదిలిస్తున్నప్పుడు అందలోని అపసవ్యత, కొన్ని గంటల పాటు నొప్పి గమనించవచ్చు. –రొటేటర్ కఫ్ టియర్స్: భుజాన్ని విపరీతంగా ఉపయోగించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా చేయి బలంగా తిప్పాల్సిన అవసరం ఉండే ఆటలు ఆడేవారికి ఈ సమస్య ఎక్కువ. టెన్నిస్, క్రికెట్, త్రోబాల్..వంటివి. ఇది తీవ్రమైన నొప్పి కలిగించే సమస్య. –క్వాడ్రైలేటరల్ సిండ్రోమ్: ఇది భుజంలోని నరాలకు సంబంధించింది. భుజాల నొప్పితో పాటు చేతులు తిమ్మిరిగా ఉండడం, జలదరింపు... వంటివి కలుగుతాయి. ఈ రకమైన ఆటలు ఆడినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... భుజ కండరాలను అతిగా వాడినప్పుడు పలు రకాల గాయాలు, సమస్యలు వస్తాయని. కాబట్టి, కఠినమైన ఆటలు ఆడే సందర్భంలో వీలున్నంతగా కండరాలకు విశ్రాంతిని కూడా ఇవ్వాలి. భుజాల నొప్పులు రెండు రోజులకు పైగా కొనసాగితే ఫిజికల్ థెరపిస్ట్, లేదా వైద్యుల్ని సంప్రదించాలి. అదే విధంగా ఆటలు ఆడే ముందుగా.. భుజాల సమస్యలు రాకుండా... గోడకు చేతిని ఆనించి చేసే వాల్ స్ట్రెచెస్, చేతుల్ని నేలవైపు వేలాడేసి, భుజంలోని కండరాలు రిలాక్స్ అయేలా చేసే పెండ్యులమ్ మూమెంట్ వంటి స్ట్రెచ్ వ్యాయామాలు ఉపకరిస్తాయి. –డా.వీరేందర్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జన్ అపోలో స్పెక్రా ఆసుపత్రులు -
కోవిడ్ నుంచి కోలుకున్నాక మన గుండె పరిస్థితి ఏంటి?
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వచ్చి తగ్గిన మొత్తం బాధితుల్లో దాదాపు నాలుగోవంతు మందికి గుండె సమస్యలు వస్తుంటే... వారిలోనూ నాలుగో వంతు మందిలో అవి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తున్నాయి. ‘జామా కార్డియాలజీ’లో ప్రచురితమైన అధ్యయన వివరాల ప్రకారం... అంతకు ముందు అస్సలు గుండె సమస్యలు లేనివారు సైతం... కోవిడ్ తర్వాత గుండెజబ్బుల బారినపడి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నారని తేలింది. కరోనా నుంచి బయటపడ్డాక కూడా గుండె సమస్యలు ఎందుకొస్తున్నాయి ? గుండె కణాల్లో యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్–2 (ఏసీఈ–2) అనే రిసెప్టార్లు ఎక్కువ. వీటికి అంటుకునే కరోనా మన దేహంలోకి చొరబడుతుంది. ఇలా ఈ రిసెప్టార్ల వల్లనే వ్యాప్తి చెందుంతుంది కాబట్టి గుండెకు సంబంధించిన కండరాలు ప్రభావితమయ్యే అవకాశాలూ ఎక్కువ. ఆ తర్వాతి క్రమంలో మన వ్యాధి నిరోధక వ్యవస్థ... వైరస్తో పోరాడే సమయంలో అక్కడ (గుండెలోని కణాల్లో) జరిగే ప్రతిక్రియల వల్ల గుండె కణాలూ, కండరాలు దెబ్బతింటాయి. అలాగే గుండెలోపలా, పైనా ఉండే రక్తనాళాలూ (ధమనులూ, సిరలు) ప్రభావితమవుతాయి. మరీ ముఖ్యంగా ఈ ధమనులూ, సిరల్లోనూ లోపలి పొరలో (లైనింగ్లో) ఉండే ‘ఎండోథీలియల్’ కణాలు దెబ్బతింటాయి. ఇలా రక్తనాళాల్లోని కణాలూ దెబ్బతినడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ కూడా ప్రభావిమవుతుంది. అది మళ్లీ గుండెపైనే ప్రభావం చూపుతుంది. ప్రధానమైనది ‘పాట్స్’ కరోనా సోకి కోలుకుంటున్న కొందరిలో పాట్స్ అనే సమస్య కనిపించవచ్చు. ‘పోష్చురల్ ఆర్థోస్టాటిక్ టాకికార్డియా సిండ్రోమ్’ అనే వైద్య సమస్య (కండిషన్)కు సంక్షిప్త రూపమే ఈ ‘పాట్స్’. ప్రస్తుతం ఈ పాట్స్కూ... కోవిడ్కు ఎంతవరకు సంబంధం ఉందనే అంశంపై పరిశోధనలు చాలా చురుగ్గా, విస్తృతంగా జరుగుతున్నాయి. ఇది కొంత ‘గుండె’కు సంబంధించిన, మరికొంత ‘నాడీ వ్యవస్థ’కు సంబంధించిన సమస్య. గుండె స్పందనలను నియంత్రించే నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యతో పాటు గుండె కూడా ప్రభావితం కావడం వల్ల గుండె సంస్పందనలు ప్రభావితమవుతాయి. దాని కారణంగానే చాలామందిలో కోవిడ్ అనంతర పరిణామంగా చెప్పుకుంటున్న అయోమయ పరిస్థితి (బ్రెయిన్ ఫాగ్), తీవ్రమైన నిస్సత్తువ (ఫెటీగ్), గుండెదడ (పాల్పిటేషన్స్), తల అంతా తేలికైపోయినట్లుగా గాల్లో తేలిపోతున్నట్లుగా అనిపించే లైట్హెడెడ్నెస్ వంటి లక్షణాలూ కనిపిస్తున్నాయి. సాధారణ లక్షణాలివే.. గుండెపై కరోనా అనంతర ప్రభావాల వల్ల కనిపించే లక్షణాలు చాలా ఉన్నాయి. తీవ్రమైన నిస్సత్తువ అందులో ఒకటి. కరోనా వల్ల రక్తనాళాలల్లో రక్తం గడ్డకట్టడం, రక్తసరఫరా తగ్గడం వంటివి సంభవిస్తాయని చెప్పుకున్నాం కదా. దాంతో రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుంది. ఫలితంగా తీవ్రమైన అలసట కనిపిస్తుంటుంది. దాంతో వారాల తరబడి పడకకే పరిమితమవుతారు. కొన్నిసార్లు ఊపిరి అందకపోవడం, త్వరత్వరగా ఊపిరిపీలుస్తూ ఉండటం, ఆయాసం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఒక్కోసారి కొందరిలో ఛాతీనొప్పి, గుండెదడ వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వీటిలో కొన్ని గుండెకు సంబంధించిన లక్షణాలూ అయి ఉండవచ్చు. అందుకే ఊపిరి అందకపోవడం, ఆయాసం, నిస్సత్తువ, నీరసం వంటి లక్షణాలు కనిపించనప్పుడు అది ఊపిరితిత్తులకు సంబంధించినవి కావచ్చు అని అనుకోకుండా ఒకసారి గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. గుండెదడ అయితే అది గుండెకు సంబంధించిన సమస్యే అని తెలిసిపోతుంది కాబట్టి నిర్ద్వంద్వంగా గుండె డాక్టర్ను సంప్రదించాలి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత... కోవిడ్ నుంచి కోలుకున్నవారూ కనీసం మూడు నెలల పాటు అందరిలాగే మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం / శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరాలు పాటించడం వంటి కోవిడ్ నియమనిబంధనలు తప్పక పాటించాలి. ∙అంతకు ముందు తాము తమ వైద్య సమస్యల కారణంగా వాడుతున్న మందులనూ / చికిత్సనూ ఆపకుండా కొనసాగించాలి. ఛాతీలో నొప్పి / అసౌకర్యం, చెమటలు పెట్టడం, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం డాక్టర్ను సంప్రదించాలి.మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. అలాంటి ఒత్తిళ్లు, యాంగై్జటీ గుండెకు కీడు చేస్తాయని గుర్తుంచుకోవాలి. ∙కోవిడ్–19 నుంచి కోలుకున్న చాలామందిలో గుండె స్పందనల రేటు నిమిషానికి 100 – 120 ఉండటం కూడా వైద్యనిపుణులు గుర్తించారు. కాబట్టి గుండెదడగా అనిపించినప్పుడు అది పల్మునరీ ఎంబాలిజమ్ (రక్తప్రవాహంలో గాలి బుడగ రావడం), మయోకార్డయిటిస్ (గుండె కండరానికి ఇన్ఫెక్షన్ / ఇన్ఫ్లమేషన్ రావడం), హైపాక్సియా (రక్తంలో తగినంత ఆక్సిజన్ లోపించడం) వంటి సమస్యలా లేక సాధారణ సమస్యలా అన్నది నిర్ధారణ చేయడానికి తక్షణం హృద్రోగ నిపుణులను సంప్రదించాలి. చాలామంది యువకులు నెగెటివ్ రిపోర్టు రాగానే వ్యాయామం మొదలుపెడుతున్నారు. అలా చేయడం సరికాదు. ఊపిరితిత్తులు తగినంత బలం పుంజుకునేంతవరకు కొంత వ్యవధి ఇవ్వడమే మేలు. మరీ ముఖ్యంగా లంగ్ నిమోనియా / సీటీ స్కాన్ కౌంట్ 9 లేదా 10 ఉన్నవారు వ్యాయాయం మొదలుపెట్టడానికి ముందర తప్పనిసరిగా తగినంత సమయం తీసుకోవాలి. ∙మంచి పోషకాహారం తీసుకుంటూ, తగినంతగా నీళ్లు తాగుతూ (హైడ్రేటెడ్గా ఉంటూ), బాగా విశ్రాంతి తీసుకుంటూ, గుండెకు సంబంధించిన మందులు లేదా ఇతరత్రా మందులను కొనసాగిస్తూ... ఆందోళన కంటే అవగాహన పెంచుకుని నిశ్చింతగా ఉండటం మంచిది. ఇది గుండెతోపాటు వారి సాధారణ ఆరోగ్య మెరుగుదలకూ దోహదపడుతుందన్నది నిపుణుల మాట. గుండె స్పందనల్లో మార్పులు... కోవిడ్ తర్వాత చాలామందిలో గుండె స్పందనల వేగం పెరిగి గుండెదడగా అనిపించడం చాలామందిలో కనిపించే సమస్య. ఇలాంటివారు తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించి తీరాలి. ఈ గుండెదడకు ఒక్కోసారి చాలా చిన్న చిన్న కారణాలూ ఉండవచ్చు. ఉదాహరణకు దేహానికి సరిపడా నీరు అందనప్పుడూ గుండెదడ వస్తుంది. అంటే బాగా నీళ్లు తాగడం, తగినంతగా ద్రవాహారం తీసుకోవడం వల్ల గుండెదడ దానంతట అదే తగ్గుతుంది. ఇలాంటివే మరికొన్ని చిన్నా, పెద్దా కారణాల వల్ల కూడా గుండెదడ రావచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో... నిజంగా అది ‘డీ హైడ్రేషన్’ కారణంగా వస్తున్న గుండెదడా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అన్నది డాక్టర్ నిర్ణయించడమే మంచిది. అందుకే గుండె లయ (రిథమ్) తప్పడం, తలతిరుగుతున్నట్లు అనిపించడం (డిజ్జీనెస్), ఛాతీలో అసౌకర్యం (చెస్ట్ డిస్కంఫర్ట్) వంటివి కనిపించినప్పుడు తప్పనిసరిగా గుండెవైద్య నిపుణులను సంప్రదించాలి. ఈ లక్షణాలు ఉన్నాయా... అప్రమత్తం కండి... ► త్వరత్వరగా గాలి పీలుస్తూ ఉండాల్సి రావడం, పడుకున్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండటం, దాంతోపాటు తీవ్రమైన అలసట / నీరసం / నిస్సత్తువ (ఫెటీగ్ / టైర్డ్నెస్) ఉంటూ... ఆక్సీమీటర్ పెట్టినప్పుడు రక్తంలో ఆక్సిజన్ శాతం 92% కంటే తగ్గడం. ► ఛాతీనొప్పి, ఛాతీ బరువుగా అనిపించడం, ఆయాసం, ఒళ్లంతా చెమటలు పట్టడం, తలతిరిగినట్లుగా ఉండటం, బాగా విశ్రాంతిగా ఉన్నప్పుడు లక్షణాలు తగ్గినట్లుగా అనిపించడం. గుండెపై ప్రభావం తాత్కాలికమా... శాశ్వతమా? ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ‘గుండెపై ఉన్న ఈ ప్రభావం తాత్కాలికమా? లేక శాశ్వతంగా ఉంటుందా?’ అనే సందేహం ప్రతి ఒక్కరికీ వస్తుంది. తాము నేరుగా కోవిడ్ బారిన పడకపోయినా... తమ ఇంట్లోని కుటుంబసభ్యులెరిలోనైనా ఈ లక్షణాలు కనిపించినా ఇవే సందేహాలు ముప్పిరిగొంటాయి. అయితే గుండె కండరం ఏ మేరకు దెబ్బతింది, ఎంత మేరకు ప్రభావితమైంది అనే అంశాల ఆధారంగానే అది శాశ్వతమా, తాత్కాలికమా అన్నది ఆధారపడుతుంది. ఈ అంశంపై ఇంకా పరిశోధనలూ, అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంచి ఫిట్నెస్తో ఉండి, బాగా ఆటలాడే ప్రొఫెషనల్ క్రీడాకారుల్లో సైతం కోవిడ్ తర్వాత వారి గుండె కండరం మీద గాటు / గీత (స్కార్) రావడం చాలామందిలో కనిపించింది. ఇలాంటివారిని ఏ తరుణంలో మళ్లీ క్రీడలకు అనుమతించాలనే అంశంపై నిపుణులు తగిన ప్రోటోకాల్ నిర్ణయించే పనిలో ఉన్నారు. మరికొన్ని అనర్థాలు... మరికొందరిలో గుండె పంపింగ్ తీరు దెబ్బతినడం, అది రక్తాన్ని సరిగా పంప్ చేయలేకపోవడం వంటి సమస్యలనూ గమనించారు. కొందరు అథ్లెట్లలో కోవిడ్ తర్వాత మునుపటి ఫిట్నెస్ దానంతట అదే రాకపోవడంతో... ఫిజియోథెరపీ అవసరం కావడం, బ్రీతింగ్ వ్యాయామాలతో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచాల్సి వస్తోంది. -
శరీరంలో అలర్జీలు.. నివారణల కోసం అవగాహన అవసరం
ప్రాణమున్న ప్రతిజీవికి ఏదో ఒక అంశం అలర్జీ కలిగించక మానదు. మనిషిలో తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, పీల్చే గాలి వల్ల కావచ్చు లేదా మనం వాడే మందుల వల్ల అయినా కావచ్చు... మన రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించి అలర్జీకి దారి తీస్తుంది. అలర్జీపై అలసత్వం కూడదని, కొన్ని అలర్జీలు ప్రాణాంతకం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం కామన్గా ఎదుర్కొనే రకరకాల అలర్జీలు, కారణాలు, నివారణలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఫుడ్ అలర్జీ: మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు ఫుడ్ అలర్జీలకు దారితీస్తాయి. సాధారణంగా ఫుడ్ అలర్జీలు గుడ్లు, పాలు, వేరుశెనగ, చేపలు, రొయ్యలు, పీతలు, సోయా, కొన్ని రకాల నట్స్(ఆక్రోట్స్, బాదం, బ్రెజిల్ నట్స్), గోధుమ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వస్తాయి. శరీరానికి ఈ పదార్థాలు సరిపడకపోతే దురద, చర్మంపై దద్దుర్లు, వాంతులు లేదా కడుపు తిమ్మిర్లు, శ్వాస తీసుకోలేకపోవటం, గురక, దగ్గు, గొంతునొప్పి, పల్స్ పడిపోవడం, చర్మం నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఫుడ్ అలర్జీల నిర్ధారణకు చర్మ పరీక్షతో పాటు రక్త పరీక్షలు(ఐజీఈ యాంటీబాడీస్) కూడా చేయాల్సి ఉంటుంది. డస్ట్ అలర్జీ: సాధారణంగా డస్ట్ అలర్జీ అనేది దుమ్ము, ధూళి వల్ల, వాటిలోని సూక్ష్మజీవుల వల్ల సంభవిస్తుంది. వీటిని డస్ట్ మైట్స్ అంటారు. ఈ డస్ట్ మైట్స్ మనుషుల నుంచి రాలిన చర్మ మృతకణాలను తింటూ ఇంట్లో దుమ్ము, ధూళికి కారణమవుతాయి. ఇవి శ్వాస తీసుకునే క్రమంలో శరీరంలోకి ప్రవేశించి శ్వాసనాళాల వాపుకు కారణమవుతాయి. దీనివల్ల తుమ్ములు, ముక్కు కారడం, కంటిలో దురద, కళ్ళలో నుంచి జిగట నీరు, ఒళ్లంతా దురద, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. మన ఇళ్లలో ఉండే తేమ పరిస్థితులు ఈ డస్ట్ మైట్స్కు ఆవాసాలు. కాబట్టి ఇళ్లలో ఉండే దుప్పట్లు, దిండు కవర్లు, టవల్లు, తివాచీలు, ఇతర సామాన్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. డస్ట్ అలర్జీ కారకాలను గుర్తించడానికి చర్మ గాటు పరీక్ష(స్కిన్ ప్రిక్ టెస్ట్)ను నిర్వహించాల్సి ఉంటుంది. డస్ట్ అలర్జీతో బాధపడేవారు 80 శాతం మంది ఆస్తమా రోగులుగా మారుతున్నారు. అరుదైన సందర్భా లలో డస్ట్ అలర్జీలు అనాఫిలాక్సిస్ షాక్కు దారి తీస్తాయి. కంటి అలర్జీ: సాధారణంగా కంటి అలర్జీలు పుప్పొడి, డస్ట్మైట్స్, పెంపుడు జంతువుల చర్మ కణాలు వంటి వాటి వల్ల సంభవిస్తాయి. వీటివల్ల కళ్లలో దురద, వాపు, మంట, జిగట నీరు కారడం, ఎరుపెక్కడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రకమైన అలర్జీలు అంటువ్యాధులు కావు. కంటి అలర్జీలకు ప్రత్యేకమైన నిర్ధారణ పరీక్షలు ఏవీ ఉండవు. పైన పేర్కొన్న కారకాల్లో ఏవి అలర్జీకి కారణం అవుతున్నాయో పరిశీలించి వాటికి దూరంగా ఉండటమే నివారణ. ఈ నాలుగే కాక కొంతమందిలో తేనేటీగలు, కందిరీగలు (ఇన్సెక్ట్ అలర్జీ), రబ్బరుతో తయారయ్యే వస్తువులు (బెలూన్, చేతి తొడుగులు, కాండమ్స్), కొన్ని రకాల మందులు(డ్రగ్ అలర్జీ), ఫంగస్(మోల్డ్ అలర్జీ) లాంటివి కూడా కనిపిస్తుంటాయి. ఏం చేయాలి? శరీరంలో అలర్జీ లక్షణాలు కనిపించిన వెంటనే అలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం. డాక్టర్తో మీ ఫ్యామిలీ హిస్టరీ, జీవనశైలి, ఇతర జబ్బులకు వాడుతున్న మందులు తదితర వివరాలను తెలియజేస్తే, దానికి తగిన నిర్ధారణ పరీక్షలను సూచిస్తారు. ముందుగా ఊపిరితిత్తుల సామర్ధ్య పరీక్ష, ఎక్స్రే వంటి పరీక్షలు నిర్వహించి ఆతరువాత మీ అలర్జీ కారకాలను గుర్తించడానికి చర్మ పరీక్షలు, ప్యాచ్ లేదా రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల నివేదికల ఆధారంగా మీరు ఏరకమైన అలర్జీలతో బాధపడుతున్నారో నిర్ధారించుకొని తగిన చికిత్సను సిఫార్సు చేస్తారు. అలర్జీలకు సరైన చికిత్సను నిర్ధారణ పరీక్షల ఆధారంగానే కాకుండా బాధితుడి మెడికల్ హిస్టరీ, లక్షణాల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని అందిస్తారు. ఈ రుగ్మతకు శాశ్వత పరిష్కారం లేదు. దీన్ని ఏదో ఒక చికిత్సా విధానం ద్వారా అదుపులో మాత్రమే ఉంచుకోవచ్చు. స్కిన్ అలర్జీ: ఈ రకమైన అలర్జీ సంభవించటానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. రోగనిరోధక వ్యవస్థలో లోపాలు, మందులు, అంటువ్యాధులు వంటి పలు కారణాల చేత ఇవి సంభవిస్తాయి. పెంపుడు జంతువులు, రసాయనాలు, సబ్బులు, నూతన వస్త్రాలు, చర్మ పరిరక్షక క్రీమ్లు వంటివి చర్మ అలర్జీలకు ప్రధాన కారకాలు. స్కిన్ అలర్జీ అంటే కేవలం చర్మ సంబంధిత అలర్జీ అనే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే ఈ రకమైన అలర్జీకి ముఖ్య కారణం రోగనిరోధక వ్యవస్థలోని లోపాలే అన్న విషయం వారికి తెలీదు. స్కిన్ అలర్జీతో బాధపడే వారిలో విపరీతమైన దురద, చర్మంపై దద్దుర్లు, పొడి చర్మం, మంట, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామందిలో ఈ అలర్జీల కారకాలను పరీక్షల ద్వారా నిర్ధారించడం సాధ్యం కాదు. అయితే సాధారణ రక్త పరీక్ష (తెల్ల రక్త కణాల పరీక్ష) ద్వారా బాధితుడి లక్షణాలను కొద్దిమేరకు గుర్తించే ప్రయత్నం చేయవచ్చు. మన చర్మం దేనికి ప్రతిస్పందిస్తుందో జాగ్రత్తగా పరిశీలించి వాటికి దూరంగా ఉండటమే దీనికి నివారణ. చదవండి: కరోనా కాలంలో... కంటి సమస్యలు -
కరోనా కాలంలో... కంటి సమస్యలు
హైదరాబాద్: మారిన పరిస్థితుల్లో కంప్యూటర్ మనకి మరింత దగ్గర చుట్టం అయిపోయింది. ల్యాప్ టాప్ కావచ్చు, స్మార్ట్ ఫోన్, ట్యాబ్... ఇలా పేరేదైనా మనకు ఆత్మీయ నేస్తాల్లా మారిపోయాయి. స్క్రీన్స్ను తదేకంగా చూస్తుండడం అనేది ఇటీవలి కాలంలో మరింత పెరిగింది. వర్క్ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ స్కూల్స్, ఆన్లైన్ బిజినెస్, జూమ్ మీటింగ్స్, ఓటీటీ సినిమాలూ, ... ఇలా ప్రతీదానికీ స్క్రీన్ వ్యూ సర్వసాధారణంగా మారింది. రోజులో అత్యధిక సమయం కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ గడపడం అనేది అనేక మందిలో తీవ్రమైన కంటి సమస్యలకు దారి తీస్తోంది. అలాగే ఇంటి పట్టున ఉండడం పెరగడంతో నిర్విరామంగా టీవీ చానెళ్లను వీక్షించడం ఎక్కవైంది. దీంతో ఇది కంటి మీద తీవ్రమైన భారంగా మారింది. అప్పటికే కంటి సమస్యలున్నవారు కరోనా అనంతరం మరింత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇలాంటి వారు తాత్కాలిక పరిష్కారాలుగా కళ్లోజోడు, కాంటాక్ట్లెన్స్లు ఎంచుకోవడం కన్నా శాశ్వత పరిష్కారమైన లేజర్ సర్జరీకి ఓటేయడమే మేలంటున్నారు. డా. అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ ఆప్తమాలజిస్ట్, ఆల్పా అతుల్ పూరాబియా, ఈ నేపధ్యంలో సర్జరీలపై ఉన్న అపోహలను భయాలను తొలగించుకోవాలని ఆమె సూచిస్తున్నారు. కాంటాక్ట్ లెన్స్తో డ్రై నెస్... దృష్టి లోపాన్ని సరిదిద్దడానికి కళ్లజోళ్లు, కాంటాక్ట్ లెన్స్లు సులభ పరిష్కారం మాత్రమే, మరోవైపు క్రీడాకారులకు ఇది సరైన పరిష్కారం కాబోదు. స్క్రీన్ వీక్షణం కోసం పరిమితంగా కొన్ని గంటల కాలమే అయినా కాంటాక్ట్ లెన్స్ వినియోగం కూడా కళ్లలో డ్రైనెస్ను పెంచుతోంది. కాబట్టి స్మైల్, లాసిక్, పిఆర్కె వంటి రిఫ్రాక్టివ్ లేజర్ ఐ సర్జరీలు కంటి సంబంధ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఎవరు చేయించుకోవచ్చు? లాంగ్, షార్ట్ సైట్లకు రిఫ్రాక్టివ్ లేజర్ ఐ సర్జరీ అనేది అత్యంత ఖచ్చితమైన పరిష్కారాల్లో ఒకటి. గత 12 నెలలుగా కళ్లజోడు వాడుతూ ఇతరత్రా ఆరోగ్య సమస్యలేమీ లేకుండా ఉన్న 21 సంవత్సరాలు దాటిన ఎవరైనా ఈ సర్జరీని ఎంచుకోవచ్చు. అయితే బాగా పల్చని కార్నియా ఉన్నా, కార్నియా పైన అపసవ్యతలేవైనా ఉన్నా దీర్ఘకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సర్జరీ చేయించుకోవడానికి వీలు ఉండదు. దీన్ని నిర్ధారించుకోవడానికి ముందుగా కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరం. అలాగే ఈ సర్జరీ విషయంలో కొందరికి పలు రకాల అపోహలు కూడా ఉన్నాయి. ►శస్త్రచికిత్స విధానం బాధాకరంగా ఉంటుందని కొందరు అపోహ పడుతున్నారు. అయితే అది నిజం కాదు. సర్జరీ విషయంలో వైద్యులు తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. నొప్పిని వీలున్నంత తక్కువ స్థాయిలో ఉంచేందుకు కంటి డ్రాప్స్ వంటివి వాడతారు. అలాగే శస్త్ర చికిత్స అనంతరం పూర్తిగా కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని కూడా సందేహిస్తుంటారు. ఇదీ నిజం కాదు. సర్జరీ పూర్తయిన తర్వాత కేవలం 2 నుంచి 6 రోజుల వ్యవధిలోనే సాధారణ జీవితానికి తిరిగి వెళ్లవచ్చు. ►శాశ్వత దృష్టిలోపానికి దారి తీసే ప్రమాదం ఉందని మరికొందరి అపోహ. అయితే కంటిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఏర్పడితే తప్ప ఈ సర్జరీ కారణంగా శాశ్వత దృష్టి లోపం కలగడం జరగదు. ఇది చాలా అరుదైన విషయం. స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పటికీ అవన్నీ సులభంగా పరిష్కరించుకోగలిగినవే. ►సర్జరీ అయిన తర్వాత రెగ్యులర్ ఐ చెకప్స్ అక్కరలేదనేది కూడా అపోహే. లేజర్ కంటి శస్త్ర చికిత్స అనేది జీవితకాలం కంటి ఆరోగ్యానికి హామీ కాదు. వయసుతో పాటు వచ్చే మార్పుల ప్రభావం కంటి ఆరోగ్యం మీద ఉండొచ్చు. కాబట్టి సర్జరీ తర్వాత కూడా క్రమబద్ధమైన పద్ధతిలో కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరమే. ►సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా ఉంటాయని కొందరు భయపడుతుంటారు. స్వల్పంగా అసౌకర్యం అనిపించడం సహజమే.అయితే వీటిని పెయిన్ కిల్లర్స్ ద్వారా సులభంగా చికిత్స చేయవచ్చు. అలాగే కళ్లు పొడిబాచటం కూడా మరో సైడ్ ఎఫెక్ట్. చాలా మంది పేషెంట్స్ సర్జరీ అయిన కొన్ని వారాల్లోనే అన్నింటి నుంచి విజయవంతంగా కోలుకుంటారు. ఆటలు క్రీడల్లో రాణించాలనుకున్నవారికి ఇది చక్కని ఉపయుక్తం. –డా. ఆల్పా అతుల్ పూరాబియా, ఆప్తమాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, హైదరాబాద్. చదవండి: నిద్ర రావడం కోసం అద్భుత చిట్కాలు -
ఆక్సీజన్ లెవల్స్: ప్రోనింగ్ టెక్నిక్ అంటే తెలుసా?
రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. చాలా మంది బాధితులు ఇళ్లలోనే ఐసోలేషన్లో ఉంటున్నారు. ఇలాంటి కొందరిలో ఆరోగ్య పరిస్థితి మరీ సీరియస్గా లేకపోయినా.. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతుండటం కనిపిస్తోంది. అలాంటి వారి రక్తంలో ఆక్సిజన్ స్థాయులను సహజంగా పెంచుకునేలా ‘ప్రోనింగ్’ అనే టెక్నిక్ ఉపయోగపడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. స్వల్పంగా శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నవారిలో.. ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోకుండా ఉండేందుకు, వీలైతే స్థాయులు పెరిగేందుకు ఈ పద్ధతి తోడ్పడుతుందని సూచించింది. అసలు ఈ ప్రోనింగ్ టెక్నిక్ ఏమిటి? ఎలా చేయాలి? శ్వాస సమస్యను ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.. ప్రోనింగ్ టెక్నిక్ అంటే? ఊపిరి సరిగా అందని సమయంలో బోర్లా పడుకోవడం, పక్కలకు తిరగడం, వాలుగా కూర్చోవడం వంటివి చేయడమే ప్రోనింగ్. కరోనా సోకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నవారికి ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆవశ్యకత ఏంటి? ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నవారు రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆక్సిజన్ లెవల్స్ పడిపోతే పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదం ఉంటుంది. ప్రోనింగ్ టెక్నిక్ ద్వారా గాలి పీల్చుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. వాయుకోశాలు తెరుచుకోవడం ద్వారా శ్వాస తీసుకోవడం సులువు అవుతుంది. ఆక్సిజన్ లెవల్స్ 94 కన్నా తగ్గితే ప్రోనింగ్ ద్వారా ప్రాణాలు కాపాడొచ్చు. ప్రోనింగ్కు ఏమేం కావాలి? ప్రోనింగ్కు కావాల్సిందల్లా 4 నుంచి 5 దిండ్లు. బోర్లా పడుకుని ఒక దిండు తల కింద పెట్టుకోవాలి. 1 లేదా 2 దిండ్లు ఛాతీ నుంచి తొడల వరకు నిలువుగా ఉంచుకోవాలి. రెండు దిండ్లు మోకాళ్ల కింద నిలువుగా ఉంచుకోవాలి. ఏ పొజిషన్లో కూడా ఎక్కువ సేపు పడుకోవద్దు. 30 నిమిషాలకోసారి పడుకునే పొజిషన్లను మారుస్తూ ఉండాలి. సొంతంగా కదలగలిగితే పేషెంట్ స్వయంగా దీనిని అనుసరించవచ్చు. పేషెంట్ సొంతంగా కదిలే పరిస్థితి లేకుంటే కొందరి సాయంతో ప్రోనింగ్ చేయాల్సి ఉంటుంది. సొంతంగా ఎలా చేయాలి..? ప్రతి పొజిషన్ కూడా 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉండొచ్చు. రెండు గంటలకు మించి మాత్రం ఒకే పొజిషన్లో ఉండొద్దు. పొజిషన్–1: బోర్లా పడుకోవాలి. పొజిషన్–2: కుడివైపు తిరిగి పడుకోవాలి. పొజిషన్–3: వాలుగా కూర్చోవాలి. పొజిషన్–4: ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. పొజిషన్–5: తిరిగి మొదటి పొజిషన్లో పడుకోవాలి. అంటే బోర్లా పడుకోవాలి. ఎవరు ప్రోనింగ్ చేయొద్దు? ► గర్భంతో ఉన్న వారు ప్రోనింగ్ చేయొద్దు ► సిరల్లో రక్తం గడ్డ కట్టుకుపోయిన వారు (వీనస్ త్రాంబోసిస్) (48 గంటలలోపు చికిత్స తీసుకున్నవారు) ► తీవ్రమైన గుండె సమస్యలు ఉన్న వారు ► వెన్నెముక, తొడ ఎముక, కంటి ఎముకలకు తీవ్రంగా గాయాలైన వారు ఈ జాగ్రత్తలు తప్పనిసరి ► ఆహారం తీసుకున్న గంట వరకు ప్రోనింగ్ చేయొద్దు. ► ఏ పొజిషన్లో అయినా భరించగలిగినంత సేపు మాత్రమే పడుకోవాలి. ► శరీర భాగాలపై ఒత్తిడి తగ్గించేందుకు దిండ్లను మార్చుకుంటూ ఉండొచ్చు. ► ఎక్కడైనా నొప్పి కానీ, బొబ్బలు కానీ వస్తున్నాయో గమనించాలి. ► పెద్దగా ఇబ్బందేమీ లేకుంటే ప్రోనింగ్ను రోజుకు 16 గంటల వరకు దశలు దశలుగా చేయొచ్చు. కదలలేని పేషెంట్లకు ప్రోనింగ్ ఎలా? ► పలుచటి బెడ్షీట్ ఉపయోగించి రోగిని బెడ్పై ఒక పక్కకు జరపాలి. ► పేషెంట్ను ఒక పక్కకు తిప్పి మరో బెడ్షీట్ను పరచాలి. తర్వాత పేషెంట్ను మరోవైపునకు తిప్పి ఆ బెడ్షీట్ను రెండోవైపు లాగాలి. ► ఆ బెడ్షీట్లను పైకి లాగుతూ.. పేషెంట్ బోర్లా పడుకునేలా తిప్పాలి. అదే సమయంలో దిండ్లను ఛాతీ కింద, మోకాళ్ల దిగువన ఏర్పాటు చేయాలి. ► తర్వాత రోగిపై బెడ్షీట్ను తొలగించాలి. ► ఇదే తరహాలో బెడ్షీట్లను ఉపయోగిస్తూ పేషెంట్ను పక్కలకు తిప్పాలి. (చదవండి: టీకా వేసుకున్నా కరోనా వస్తుందా? వస్తే రెండో డోసు పరిస్థితి ఏమిటి? ) -
నకిలీలతో జాగ్రత్త.. మందులు కొనేముందు ‘6 పీ’ సరి చూసుకోండి
సాక్షి, సిటీబ్యూరో: సెకండ్ వేవ్లో కరోనా రోజు రోజుకూ పెరుగుతోందని కొత్వాల్ అంజనీకుమార్ అన్నారు. ఈ నేపథ్యంలోనే రెమిడెసివర్ వంటి ఔషధాలకు డిమాండ్ పెరగడంతో కొందరు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేరం చేస్తున్న 40 మందికి పైగా నిందితుల్ని ఇప్పటి వరకు అరెస్టు చేశామని తెలిపారు. ఈ చీకటి దందాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తక్షణం పోలీసులకు తెలియజేయండని కోరారు. ఈ పరిస్థితుల్లో నకిలీ మందులు కూడా మార్కెట్లోకి వస్తాయన్నారు. వీటి నుంచి తప్పించుకోవడానికి అంతర్జాతీయంగా అమలులో ఉన్న ’6 పీ’ లను తెలుసుకోవాలి... వాటిని అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. అందులోని వీడియోలో ఆయన పేర్కొన్న అంశాలివి.. ‘ ’ ► పీ1: ప్లేస్... దీని ప్రకారం అపరిచిత వెబ్సైట్ల నుంచి మందుల్ని ఖరీదు చేయకూడదు.అధీకృత మెడికల్ షాపు, ఫార్మాసిస్టు నుంచే ఖరీదు చేయాలి. ► పీ2: ప్రిస్క్రిప్షన్...రిజిస్టర్డ్ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే మందులు కొనండి. ► పీ3: ప్రామిసెస్... కొందరు వైద్యులు, మందుల దుకాణం యజమానులు ఈ మందు చాలా పవర్ఫుల్ అంటూ హామీలు ఇచ్చేస్తుంటారు. ఆ మాయలో పడకుండా వాడాల్సిన మందుల్నే ఖరీదు చేయాలి. ► పీ4: ప్రైస్... ఆయా మందులపై ముద్రించిన ఎమ్మార్పీ మొత్తాన్నే చెల్లించాలి. అంతకు మించి ఎవరైనా డిమాండ్ చేస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ► పీ5: ప్రైవసీ... మీకు ఇంటర్నెట్లో ఏదైనా ఔషధం తదితరాలు ఖరీదు చేస్తుంటే ఎక్కడా మీ క్రెడిట్/డెబిట్ కార్డులకు సంబంధించిన రహస్య సమాచారం పొందుపర్చొద్దు. అది సైబర్ నేరాలకు దోహదం అవుతుంది. ► పీ6: ప్రొడక్ట్...ఏదైనా వస్తువును ఆన్లైన్లో ఖరీదు చేసే ముందు మీకు తెలిసిన వారిలో అప్పటికే దాన్ని ఖరీదు చేసిన వాళ్లు ఎవరైనా ఉంటే వారి సలహాలు, సూచనలు తీసుకోండి. Follow 6 Ps and be safe . Buy medicine at authorized place only. Your safety is most important for us. pic.twitter.com/AjcdezPjh1 — Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) April 28, 2021 ( చదవండి: స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఆక్సిజన్ సిలిండర్ల దందా ) -
కరోనా లక్షణాలు ఉండి నెగెటివ్ వస్తే ఏ టెస్టు ఉత్తమం?
లక్షణాలు లేకపోయినా టెస్టు చేయించుకోవచ్చా? కరోనా లక్షణాలు లేకపోయినా తమకు వైరస్ సోకిందో లేదో నిర్ధారణ చేసుకునేందుకు టెస్టు చేయించుకోవచ్చు. దీనికి ఆర్టీపీసీఆర్ టెస్టే ఉత్తమం. అలాగే లక్షణాలు లేనప్పటికీ ఎవరైనా కరోనా పేషెంట్లతో క్లోజ్ కాంటాక్ట్లోకి వెళ్లామనుకున్నప్పుడు కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకుంటే మంచిది. లక్షణాలుండి ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ వస్తే వారు సీటీ స్కాన్ తో నిర్ధారణ చేసుకోవాలి. వందలో 30 మంది వరకు ఇలా జరగొచ్చు. లక్షణాలు ఏమీ లేకపోతే స్కానింగ్ అవసరం ఉండదు. - వీవీ రమణప్రసాద్, పల్మనాలజీ,స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్, కిమ్స్ ఆసుపత్రి, హైదరాబాద్ ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగెటివ్ అంటే ఏమిటి? ఫాల్స్ పాజిటివ్ అంటే మనలో ఇన్ఫెక్షన్ లేకపోయినా నమూనాలో పాజిటివ్ రావడం. ఫాల్స్ నెగెటివ్ అంటే కరోనా సోకిఉన్నప్పటికీ టెస్టులో నెగెటివ్ రావడం. దీనికి ప్రధాన కారణాలు.. గొంతులో నుంచి తీసిన ద్రవాలను సరిగా గుర్తించలేకపోవడం, వైరస్ మ్యుటేషన్ కావడం, నమూనా సరిగా సేకరించకపోవడం, నమూనాల రవాణాలో జాప్యం, కొన్నిసార్లు ఆర్టీపీసీఆర్ టెస్ట్ మిక్సింగ్లో ఎర్రర్స్ రావడం, ఒక్కోసారి మనం ఇంట్లో యాంటీ బయోటిక్స్ వాడుతూ నమూనాలు ఇచ్చినప్పుడు వైరస్ సరిగా డిటెక్ట్ కాకపోవడం, వీటన్నిటితో పాటు టెక్నీషియన్ నైపుణ్యత ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. దీనివల్ల బాధితుడికి నష్టం జరగవచ్చు. అందుకే లక్షణాలు ఉండి నెగెటివ్ వచ్చినప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్టు, లేదా సీటీ స్కాన్ చేయించుకుంటే మంచిది. - డా.జి.ప్రవీణ్ కుమార్, మైక్రోబయాలజిస్ట్ ఔషధ నియంత్రణ శాఖ ల్యాబొరేటరీ చదవండి: ఏ వ్యాక్సిన్ మంచిది? గర్భిణులు టీకా తీసుకోవచ్చా? ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో తేడా ఏంటి ? డోసుల మధ్య ఎంత విరామం అవసరం? తేడా వస్తే ? -
పిల్లల గొంతుల్లో ఏదైనా ఇరుక్కుంటే...
చిన్నపిల్లలు ఏదైనా తినేటప్పుడు ఒక్కోసారి అకస్మాత్తుగా ఆహారపదార్థాలు గొంతులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ కింది సూచనలు పాటించండి. పిల్లల్ల గొంతులో ఏదైనా ఆహార పదార్థం ఇరుక్కుంటే మనం కుర్చీలో కూర్చుని పిల్లలను కాళ్లపై బోర్లా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టినప్పుడు తల కిందికి ఉండేలా చూడాలి. వీపుపై అకస్మాత్తుగా ఒత్తిడి తేవాలి. మన కాళ్ల ఒత్తిడి పిల్లల పొట్ట మీద పడి... అది పైకి ఎగబాకి, అడ్డుపడ్డ పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇలా పడుకోబెట్టి అకస్మాత్తుగా ఒత్తిడి కలిగించేప్పుడు ఆ కదలికలను పై వైపునకు... అంటే నడుము నుంచి రెండు భుజాల మధ్యగా పై వైపునకు కదిలిస్తే, గొంతులో ఇరుకున్న పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ సూచనలు ఫలించకపోతే చిన్నారులను వెంటనే ఆసుపత్రికి తరలించాలి. అక్కడ కొన్ని లారింగోస్కోపీ అనే పరికరం ద్వారా గొంతును పరీక్ష చేసి, అక్కడ ఇరుక్కున్న పదార్థాన్ని తొలగిస్తారు. -
ఇవి పాటిస్తే కీళ్ళనొప్పులుండవు!
కేవలం ఆహార నియమాలతోనే మనం ఆర్థరైటిస్ను తగ్గించలేము. తీసుకునే ఆహారంతోనే అరిగిపోయిన కార్టిలేజ్ను పునరుద్ధరించలేము. అయితే శరీరం బరువు పెరగకుండా ఉండటానికి స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు ఆహారనియమాలు ఉపయోగపడతాయి. అలాగే ఆర్థరైటిస్ రాకముందే పాలు, తగినంత క్యాల్షియమ్ ఉండే ఆహారం వల్ల దీర్ఘకాలం పాటు దాని నివారణ సాధ్యం కావచ్చు. ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆర్థరైటిస్ను చాలావరకు నివారించవచ్చు. అలాగే రోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా కూడా ఆర్థరైటిస్ దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. మన జీవనశైలి వల్ల మన కీళ్లపై చాలా ప్రభావం పడుతుంది. ఉదాహరణకు మన శరీరంలో తగినన్ని కదలికలు ఉండటం వల్ల మన కార్టిలేజ్, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే అవి మరీ ఎక్కువగా అరిగిపోయేలా మన కదలికలు ఉండదకూడదు. అంటే... కదలికలు మరీ తక్కువగా ఉండటం, మరీ ఎక్కువగా ఉండటం... ఇవి రెండూ ప్రమాదకరమే అని గుర్తించాలి. చదవండి: ఆహ్లాదానికి... ఆరోగ్యానికి మల్లె -
సిజేరియన్ తర్వాత మహిళల ప్రధాన సమస్య ఇదే!
సాధారణంగా సిజేరియన్ తర్వాత మహిళలు బరువు పెరుగుతారనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. నిజానికి సిజేరియన్కూ, బరువు పెరగడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఏమాత్రం శారీరక శ్రమలేకపోవడం వల్ల లేదా మరికొన్ని ఇతరత్ర అంశాల వల్లనూ కావచ్చు. సిజేరియన్ తర్వాత బరువు పెరగకుండా ఉండేందుకు... డాక్టర్లు ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకోవాలని సూచించిన మహిళలు తప్ప... మిగతావారంతా సిజేరియన్ అయిన పదిహేను రోజుల తర్వాత నుంచే నడక లేదా శరీరంపై భారం, అలసట వంటివి పడకుండా తేలికపాటి వ్యాయామాలు చేయాలి.నడక మొదలు పెట్టినప్పుడు రోజుకు కేవలం పదినిమిషాలు మాత్రమే నడవాలి. అలా నడుస్తూ మెల్లగా తాము నడిచే కాలవ్యవధిని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఇలా చేస్తూ పోతే మూడు నెలల నుంచి మహిళలు ఆరోగ్యకరంగా మారి ఎనిమిది నెలల తర్వాత నుంచి తమ అదనపు కొవ్వు కోల్పోవడం జరుగుతుంది. పిల్లలకు చనుబాలు ఇవ్వడం వల్ల కూడా బరువు పెరగకుండా ఉంటారు. చదవండి: ఒబెసిటీ.. అధిక బరువే కాదు అంతకు మించి -
దూసుకుపోవడమే.. అనుమతి అడగొద్దు..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్ష రేసులో దూసుకుపోతున్న, కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ (55) మహిళ సాధికారితపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సాధించాలనుకున్నపుడు, ఇతరుల మాటలను పట్టించుకోకుండా..గమ్యంవైపు సాగిపోవాలని సూచించారు. ఇన్స్టాగ్రామ్ యూజర్లతో ముచ్చటించిన ఆమెను మహిళలకు ఏం సలహా ఇస్తారని ప్రశ్నించినపుడు ఈ సూచన చేశారు. (హోరాహోరీ పోరులో ‘పెద్దన్న’ ఎవరో?!) ‘మీరు ఏదైనా సాధించాలని ప్రయత్నించినపుడు, ప్రతికూలంగా వచ్చే సలహాలను, నిరుత్సాహ పరిచేమాటలను పట్టించుకోకండి.. నాయకత్వ స్థానంలో ఉండాలని భావిస్తే.. దూసుకు పోవడమే.. దానికి ఎవరినీ అనుమతి అడగవలసిన అవసరం లేదు’ అని కమలా హ్యారిస్ సలహా ఇచ్చారు. తన కెరియర్లో కూడా అది నీ పనికాదు, ఇది సమయం కాదు లాంటి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయనీ, కానీ అవన్నీ తాను పట్టించుకోలేదన్నారు. అలాంటి వాటికి నో చెప్పడమే తన అల్పాహారమని, అదే తన బలమని చెప్పుకొచ్చారు. తన అభిమాన భారతీయ వంటకాలు ఏమిటని ప్రశ్నించినపుడు దక్షిణ భారతదేశానికి సంబంధించి మంచి సాంబారు ఇడ్లీ ఇష్టమని ఆమె చెప్పారు. అదే నార్త్ ఇండియన్ అయితే టిక్కా ఇష్టమని చెప్పారు. ప్రచారంలో తన మానసిక ఆరోగ్యం కోసం ప్రతీరోజు ఉదయం వ్యాయామం చేస్తూ.. పిల్లలతో సమయాన్ని గడుపుతానన్నారు. అలాగే వంట చేయడాన్ని కూడా ఇష్టపడతానన్నారు. దీంతోపాటు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఉద్యోగాలు కల్పన తదితర అంశాలపైకూడా ఆమె సమాధానాలిచ్చారు. కాగా ప్రస్తుత ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించినట్లయితే ఉపాధ్యక్ష పదవిని అలంకరించే తొలి మహిళగా, తొలి శ్వేత జాతీయేతర మహిళగా కమలా హారిస్ నూతన అధ్యాయం లిఖించే అవకాశం ఉంది. రేపు (నవంబర్ 3 న) జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (74), ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్(77), ఉపాధ్యక్ష పదవికి హ్యారిస్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. You asked, I answered. pic.twitter.com/KQgSxB58Ch — Kamala Harris (@KamalaHarris) November 2, 2020 -
కరోనా సంక్షోభం : కేంద్రానికి మాజీ ప్రధాని సలహాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం, పౌరుల జీవనోపాధిపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రమైన దీర్ఘకాలిక ఆర్థిక మందగమనం అనివార్యమని మన్మోహన్ వ్యాఖ్యానించారు. కానీ ఈ అంశాన్ని ఆర్థిక గణాంకాలకంటే సమాజం దృష్టికోణం నుంచి చూడటం చాలా ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల జీవనోపాధిని కాపాడాలని, వ్యాపారాలకు రుణ హామీ ఇవ్వాలని ప్రధాని మోదీకి సూచించారు. ఆర్థిక మందగమనాన్ని "మానవతా సంక్షోభం"గా అభివర్ణించిన ఆయన ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు గణనీయమైన ప్రత్యక్ష నగదు సహాయాలను అందించాలన్నారు. "ప్రభుత్వ మద్దతుగల క్రెడిట్ హామీ కార్యక్రమాల" ద్వారా వ్యాపారాలకు తగిన మూలధనాన్ని అందుబాటులో ఉంచాలి, సంస్థాగత స్వయం ప్రతిపత్తి ద్వారా ఆర్థిక రంగాన్ని రక్షించాలంటూ మూడు కీలక సూచనలు చేశారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ అవసరమే అయినప్పటికీ కేంద్రం సరిగ్గా వ్యవహరంచలేదని ఆయన విమర్శించారు. అకస్మాత్తుగా, ఆలోచనా రహితంగా, ముందస్తు ప్రణాళిక లేకుండా విధించిన లాక్ డౌన్, కఠిన ఆంక్షలు ప్రజలు తీవ్రంగా బాధించాయని మన్మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి నిర్వహణను స్థానిక సంస్థలకు అప్పగించే బావుండేదని పేర్కొన్నారు. కేంద్ర విస్తృత మార్గదర్శకాలతో, స్థానిక పరిపాలనా సంస్థలు కోవిడ్-19 నివారణలో ఇంకా ఉత్తమంగా పనిచేసే ఉండేవని మాజీ ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో "అధిక రుణాలు" అవసరమే అని చెప్పిన ఆయన సైనిక, ఆరోగ్యం, ఆర్ధిక సవాళ్ల అవసరాలకు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో అదనంగా 10 శాతం ఖర్చు చేయవలసి వచ్చినా, అది తప్పదన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి, సరిహద్దు రక్షణ, జీవనోపాధి పునరుద్ధరణ, ఆర్థిక వృద్ధికి అధిక రుణాలు అవసరమని చెప్పారు. కాగా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో కూరుకుపోయాయి. జీడీపీ గణనీయంగా తగ్గుదలను నమోదు చేస్తున్నాయి. దేశీయంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 5 శాతానికి క్షీణిస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఈ నెలలో వెల్లడికానున్నాయి -
ఇలా చేస్తే అన్నీ మాయం!
ఇలా చేయండి బాధలు, భయాలు అన్ని మటుమాయమవుతాయి అని చెప్పుకొచ్చింది నటి ఇలియానా. ఇంతకుముందు తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికగా ఓహో అంటూ వెలిగిపోయిన విషయం తెలిసిందే. కాగా తమిళంలో ఆదిలోనే కేడీ చిత్రం ద్వారా పరిచయమైన ఈ అమ్మడిని ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. దీంతో తెలుగు చిత్రాలకే పరిమితమైపోయింది. అలాంటిది చాలా కాలం తర్వాత నటుడు విజయ్కు జంటగా. శంకర్ దర్శత్వంలో నంబన్ చిత్రంతో కోలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది. అంతే ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇక్కడ కనిపించలేదు. అలాగని తెలుగు చిత్రాలను కాదనుకుని బాలీవుడ్పై దృష్టి పెట్టింది. అయితే అక్కడ ఆశించిన ఆదరణ లభించలేదు. ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాల ప్రయత్నాల్లో ఉంది. కాగా ఈ కరోనా కాలంలో అందరూ నటీమణుల మాదిరిగానే ఇలియానా కూడా మీడియాతో భేటీలు అభిమానంతో ముచ్చట్లు అంటూ కాలం గడుపుతోంది. అదేవిధంగా ఇంట్లోనే ఉంటూ వ్యాయామాలు వంటి కసరత్తులు చేస్తూ అందాలను పదిల పరుచుకుంటోంది. అలా ఇటీవల ఇలియానా ఒక భేటీలో పేర్కొంటూ కొన్ని సమయాల్లో మనసు తట్టుకోలేనంత బాధ, భయం కలుగుతాయి అని చెప్పింది. అలాంటి సమయాల్లో తాను వ్యాయామాలు చేస్తానని చెప్పింది. అప్పుడు భయం, బాధలు అన్ని మటుమాయం అయిపోతాయి అని చెప్పింది. కాబట్టి అందరూ ఈ సూత్రాన్ని పాటించండి అని పేర్కొంది. వ్యాయామం చేస్తున్నప్పుడు లక్ష్యాన్ని చేరుకుంటున్న భావన కలుగుతుందని చెప్పింది. ( నాలో మంచి కుక్ ఉందని తెలుసుకున్నా! ) ఆ మధ్య కాస్త బరువు పెరిగానని దీంతో కొందరు రకరకాలుగా విమర్శలు చేశారని తెలిపింది. దీంతో తీవ్రంగా కసరత్తులు చేసి ఇప్పుడు మళ్లీ స్లిమ్గా యథాస్థితికి మారినట్లు తెలిపింది. తాను నిత్యం వ్యాయామం చేస్తారని తెలిపింది. ఆన్లైన్లో చూసి రకరకాల వ్యాయామాలు చేస్తానని చెప్పింది. ఇంత సమయం అని పరిమితులు ఉండదని ఒకసారి 75 నిమిషాలు చేస్తే, మరోసారి రెండు గంటల వరకు చేస్తారని చెప్పింది. ఇలా అందరూ వ్యాయామం చేసి అందరూ మంచి ఆరోగ్యంతోపాటు శరీరాన్ని బలంగా ఉంచుకోవాలని ఇలియానా సలహా ఇచ్చింది. ఒక్కసారి వ్యాయామం చేసి చూడండి దాని ఫలితం మీకే అర్థం అవుతుంది అని ఈ బ్యూటీ పేర్కొంది. -
ఆ భవనాలు ఉపయోగించుకోండి
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీపీఎం ప్రకటించింది. రాష్ట్రస్థాయి మొదలు గ్రామస్థాయి వరకు తమ కార్యకర్తలను ప్రభుత్వ సహాయక చర్యల్లో భాగస్వాముల ను చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్తో సహా రాష్ట్రంలో ఉన్న తమ విజ్ఞాన కేంద్రాలు, పార్టీ ఆఫీసులను ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అవసరాలకు పూర్తిగా ఉపయోగించుకోవచ్చునని సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బాగ్ లింగంపల్లి, గచ్చిబౌలిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రాలు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని పార్టీ కార్యాలయాలు, సిటీ ఆఫీసు కార్యాలయం, జిల్లాల్లోని పార్టీ, ప్రజాసంఘాల ఆఫీసులను ప్రభుత్వం అవసరం మేరకు ఉపయోగించుకోవాలని కోరారు. బాగ్ లింగంపల్లిలోని విజ్ఞాన కేంద్రంలోని మెడికల్ క్లినిక్, హైదరాబాద్తో సహా అన్ని జిల్లా ల్లో జనరిక్ మెడికల్ షాపులున్నాయని వాటిని కూడా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా విస్తరించకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని, ఈ వైరస్ నివారణకు గ్రామస్థాయి వరకు ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు సీపీఎం మద్దతిస్తున్నదని తమ్మినేని తెలియజేశారు. -
మహా సంకీర్ణానికి చిదంబరం సలహా
ముంబై : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో దాదాపు 100 రోజుల నుంచి తిహార్ జైలులో గడుపుతున్న కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం మహారాష్ట్రలో కొలువుతీరనున్న సంకీర్ణ సర్కార్కు కీలక సూచన చేశారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన సంకీర్ణ సర్కార్ ప్రజా ఆకాంక్షలకు అద్దం పట్టాలని కోరారు. పార్టీల వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి రైతు సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి, సామాజిక న్యాయం, మహిళా శిశుసంక్షేమం వంటి ప్రజా ప్రయోజనాలపై మూడు పార్టీలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ , ప్రియాంక గాంధీలు జైలులో తనను కలిసిన కొద్దిసేపటి తర్వాత చిదంబరం ఈ మేరకు ట్వీట్ చేశారు. -
‘పాక్ కోచ్గా మారినప్పుడు చెబుతా’
మాంచెస్టర్: భారత ఆటగాడిగా తాను చేసే ప్రతీ సెంచరీ ప్రత్యేకమైనదేనని, ఏది అత్యుత్తమమని అడిగితే చెప్పలేనని ఓపెనర్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఆదివారం మ్యాచ్లో పాక్ పేసర్లు ఎక్కువగా షార్ట్ పిచ్ బంతులు వేశారని, అదే తన బలం కాబట్టి చెలరేగిపోయానని అతను విశ్లే షించాడు. ఇంగ్లండ్ మైదానాల్లో ఒకసారి నిలదొక్కుకుంటే బ్యాట్స్మెన్ను నిరోధించడం చాలా కష్టమని... అందుకే తనను ఆపడంలో ప్రత్యర్థి విఫలమైందని రోహిత్ అన్నాడు. మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న పాక్కు మీరు ఎలాంటి సలహా ఇస్తారు అని ప్రశ్నించగా...‘నేను పాకిస్తాన్ జట్టుకు కోచ్గా మారినప్పుడు దీనికి సమాధానం చెబుతా’ అని గడుసుగా జవాబిచ్చాడు. అది అసలైన టెస్టు బంతి... మ్యాచ్లో బాబర్ను బౌల్డ్ చేసిన బంతి పట్ల తాను గర్వపడుతున్నట్లు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెప్పాడు. ‘బాబర్ను దుబాయ్లో కూడా ఒకసారి ఔట్ చేశాను. అది స్ఫూర్తిగా తీసుకున్నా. మ్యాచ్లో అప్పటికే నేను బంతిని బాగా టర్న్ చేస్తున్నాను. అది నా ప్రధాన బలం. ఆ బంతి కూడా చాలా బాగా పడింది. దీనిని చూసి నేనే కాదు ప్రతీ స్పిన్నర్ గర్వపడతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే టెస్టుల్లోనూ ఇలాంటి బంతి మనకు కనిపిస్తుంది’ అని కుల్దీప్ విశ్లేషించాడు. మరోవైపు తామిద్దరి బౌలింగ్ ఎండ్లు మార్చమని చహల్ చెప్పిన తర్వాతే కుల్దీప్ ఆ వికెట్ పడగొట్టాడని...చహల్ వ్యూహం కోహ్లితో చర్చించి అమలు చేశామని రోహిత్ వెల్లడించాడు. -
రషీద్.. జంబో సలహాలు తీసుకో
భారత్-అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన చారిత్రక టెస్టులో మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ పైనే అందరి దృష్టి ఉంది. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ చెత్త ప్రదర్శన చేశాడు. టీ20 బౌలర్ల జాబితాలో ఆగ్రస్థానంలో ఉన్న రషీద్ టెస్టుల్లో విఫలమవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. టెస్టుల్లో రాణించగల నైపుణ్యం రషీద్కు లేదని కొందరు మాజీలు విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రషీద్కు బాసటగా నిలిచారు. రషీద్ బౌలింగ్లో మెరుగుపడాలంటే టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ అనిల్ కుంబ్లే సలహాలు తీసుకోవాల్సిందిగా సూచించారు. తరుచూ కుంబ్లేను కలిసి అలోచనలు పంచుకుంటే మరిన్ని మెళుకువలు నేర్చుకోవచ్చని ఈ మాజీ కెప్టెన్ సలహా ఇచ్చారు. ‘రషీద్ క్రికెట్లో మరింత మెరుగ్గా రాణించాలంటే మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేతో టచ్లో ఉండాలి. అతని నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి. అన్ని ఫార్మట్లలో రాణించగల సత్తా రషీద్కు ఉంది’ అంటూ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు రాసిస కాలమ్లో గంగూలీ పేర్కొన్నారు. -
ఐపీఎల్ వేలం కాదు.. ఆటపై దృష్టి పెట్టండి
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా మాజీ కెప్టెన్, అండర్ 19 వరల్డ్ కప్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ వేలం సంగతి పక్కన పెట్టి.. ముందు ఆటపై దృష్టిసారించాలని యువ ఆటగాళ్లకు ఆయన హితబోధ చేస్తున్నారు. ఐపీఎల్ వేలం కొనసాగుతున్న నేపథ్యంలో ద్రావిడ్ వ్యాఖ్యలను ఈఎస్పీన్ క్రిక్ఇన్ఫో ప్రముఖంగా ప్రచురించింది. ‘‘సందేహామే లేదు. ఐపీఎల్లో తమను కొనుగోలు చేస్తారో? లేదో? అన్న ఆత్రుత యువ ఆటగాళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, వాళ్లు ముందు ఆలోచించాల్సింది తమ ముందు ఉన్న లక్ష్యం గురించి. ఐపీఎల్ అనేది ప్రతీ ఏడాది ఉంటుంది. ఒకటి రెండు అవకాశాలు చేజారిన పెద్దగా బాధపడనక్కర్లేదు. అదేం మీ సుదీర్ఘ కెరీర్ మీద ప్రభావం చూపదు. కానీ, వరల్డ్కప్ ఆడే అదృష్టం మీకు పదే పదే మీకు దక్కకపోవచ్చు. కాబట్టి ఆలోచనలను ఆట మీద పెట్టండి’’ అని ది వాల్ యువ ఆటగాళ్లకు సూచించారు. సెమీఫైనల్లో పాకిస్తాన్తో భారత్ తలపడనున్న విషయం తెలిసిందే. అయితే బంగ్లాతో క్వార్టర్ ఫైనల్స్ కంటే ముందే ద్రవిడ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అండర్-19 ఆటగాళ్లలో కెప్టెన్ పృథ్వీషాతోపాటు శుభమన్ గిల్, హిమాన్షు రానా, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, కమలేష్ నా, హర్విక్ దేశాయ్ల పేర్లు ఐపీఎల్ వేలంలో పరిశీలనలో ఉన్నాయి. -
మోదీకి సలహా ఇచ్చిన హీరోయిన్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే చర్చ నడుస్తోంది. మోదీ తీసుకున్న నిర్ణయంతో ఇన్నాళ్లు బీరువాలకే పరిమితమైన నల్లధనం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అదే పెద్ద ఎత్తున ఈ నల్లధనం వేస్ట్ అవుతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్రమంగా డబ్బు దాచిపెట్టుకున్న చాలా మంది ఆ డబ్బు మార్చుకునే పరిస్థితి లేకపోవటంతో కాల్చేయటం పారేయటం లాంటివి చేస్తున్నారు. అయితే పరిణామాలపై ప్రధాని మోదీకి సలహా ఇచ్చింది, హీరోయిన్ పూజా హెగ్డే. '2017 మార్చి వరకు పాత 500, 1000 రూపాయల నోట్లను హాల్సిటల్స్ లో డొనేషన్ గా ఇచ్చే అవకాశం కల్పించారు. అలా చేస్తే నల్లధనం ఓ మంచి పనికి ఉపయోగించే అవకాశం కలుగుతుంది. ఎలాంటి ఉపయోగం లేకుండా పడేయటం కన్నా.. ప్రజలు దానం చేయోచ్చు. ఆర్యోగ భద్రత పెరుగుతుంది'. అంటూ ట్వీట్ చేసింది. ఇప్పటికే పెద్ద ఎత్తున నల్లడబ్బు తగులబెడుతున్న వార్తలు, చెత్త కుండీల దగ్గర పడేస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పూజ సలహాకు మంచి స్పందన వస్తోంది..@Narendramodi If Govt hospitals can take donations of 500 & 1000 notes up till March 2017, at least the black money gets put to good use— Pooja Hegde (@hegdepooja) 11 November 2016Instead of money getting wasted,ppl might donate,healthcare will improve.Just a suggestion @narendramodi.. https://t.co/SHMcWoWQqZ— Pooja Hegde (@hegdepooja) 11 November 2016 -
అఖిలేష్కు నితీష్ సక్సెస్ మంత్రా..
పట్నా : "బాబూ అఖిలేష్.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ గెలిచి..తిరిగి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావా? అయితే నేను చెప్పినది పాటించు.."అంటూ జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్కు అద్బుతమైన సలహా ఇచ్చారు. బిహార్ మాదిరిగానే ఉత్తరప్రదేశ్లోనూ మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తే, ఎన్నికల్లో విజయం వెతుకుంటూ వస్తుందని, తన సక్సెస్ మంత్రకూడా అదేనని నితీష్ పేర్కొన్నారు. గతేడాది నవంబర్ లో హోరాహోరీగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ గెలుపునకు ప్రధాన కారణం సంపూర్ణ మద్య నిషేధ హామీనేనని నితీష్.. అఖిలేష్ కు చెప్పారు. అదే మంత్రాన్ని ఇప్పుడు యూపీలోనూ అమలుచేయాలని సూచించారు. ఇప్పటికే సమాజ్వాద్ పార్టీ అంతర్గత కుమ్ములాటలో సీఎం అఖిలేష్, తన తండ్రి ములాయం సింగ్, బాబాయి శివపాల్ యాదవ్ ల నుంచే మద్దతు కోల్పోతున్నారు. అఖిలేష్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో తన ప్రీతిపాత్రుడైన సోదరుడు శివపాల్ యాదవ్ను ఆ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ నియమించారు. అంతేకాక వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాద్ పార్టీ అభ్యర్థి ఎవరన్నది కూడా ములాయం సింగ్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో అఖిలేష్కు నితీష్ నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది. యూపీలో మద్య నిషేధం అమలు చేపడితే, ఎన్నికల్లో గెలవడానికి ఎవరి సపోర్టు అక్కర్లేదని నితీష్ పేర్కొన్నారు. మహిళా ఓటర్ల మద్దతు పొందవచ్చని, దీంతో తన ఖాతాల్లో ఓట్ల సంఖ్యను పెంచుకోవచ్చని అఖిలేష్కు నితీష్ చెప్పారు. రిస్క్ లేకుండా దేన్ని సాధించలేవని, దేనినైనా నీవు ధైర్యంగా ఎదుర్కోలేనప్పుడు, పెద్ద పెద్ద రాజకీయ లక్ష్యాలను సాధించలేవని నితీష్ హెచ్చరించారు. -
వెంకయ్య సన్మానానికి అందరినీ అరెస్ట్ చేయాలా ?
-
మీ బలహీనతను దాచేయండి: సచిన్
న్యూఢిల్లీ:ఏ మనిషికైనా బలం, బలహీనత ఉండటం సాధారణం. అయితే ప్రధానంగా ఆటగాళ్లు తమ బలహీనతల్ని కనబడనీయకుండా చేసినప్పుడే వారు విజయవంతం అవుతారని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. దాంతో పాటు సవాళ్లను, కష్ట నష్టాలను ఎదుర్కొనడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయొద్దని యువ క్రికెటర్లకు సచిన్ సూచించాడు. ఫిబ్రవరి 26వ తేదీన నిర్వహించే న్యూఢిల్లీ మారథాన్ ఆరంభ కార్యక్రమానికి విచ్చేసిన సచిన్.. వర్ధమాను క్రికెటర్లకు పలు సూచనలు చేశాడు. 'ఎప్పుడూ మీ బలహీనతను బయటకు కనబడనీయకండి. ఒకసారి ప్రత్యర్థులకు మనం ఎక్కడ దొరికిపోతాయో తెలిసిందటే మళ్లీ మీరు తిరిగి పుంజుకోవడం కష్టమవుతుంది. ఒకసారి నా విషయంలో ఇదే జరిగింది. ఒకానొక సందర్భంలో నా పక్కటెములకు బంతి బలంగా తాకింది. అదే ఆయుధంగా బౌలర్ బంతుల్ని వేయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో నాకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. అక్కడ తీవ్ర గాయమైంది నాకు తెలుసు. కానీ ఆ విషయాన్ని బయటకు కనబడనీయలేదు. ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొనడం అలవాటు చేసుకోండి. ఒకసారి కష్టం వచ్చిందని ముందుకు ధైర్యంగా వెళ్లడం ఆపకండి' అని సచిన్ సూచించాడు. తన ఫిట్ నెస్ లో పరుగు అనేది కీలక పాత్ర పోషించిందని సచిన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. -
ఇక మోదీ వద్దకు ఇరోమ్ షర్మిల పయనం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసిన తర్వాత మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అవ్వాలనుకుంటుంది. ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఇరోమ్ భావిస్తోంది. ఈసారి జరగబోయే మణిపూర్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆమె మేజర్ పొలిటికల్ పార్టీలను ఎలా ఓడించాలనే అంశంపై కొన్ని సలహాలు తీసుకునేందుకు గత నెల (సెప్టెంబర్ 26)న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను కలిసింది. 'మంచి సలహాలు అనేవి ఎప్పటికీ స్వీకరించాల్సిన అంశాలు. అది స్నేహితుడైనా, శత్రువైనా అతడి వద్ద కొన్ని మంచి ఆలోచనలు ఉండి వాటిని నాతో పంచుకోవాలనుకుంటే తప్పకుండా స్వీకరిస్తాను' అని ఆమె ఓ వార్తా సంస్థతో చెప్పారు. గతంలోనే తాను మోదీని కలుస్తానన్న షర్మిల త్వరలోనే ఆయనను కలవాలని అనుకుంటోంది. గతంలో కూడా మణిపూర్ లో ఉన్న ప్రత్యేక ఆయుధాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను తీసేయాలని తాను ప్రధాని విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. -
ఆర్థిక సంవత్సరం మార్పుపై సలహాలకు ఆహ్వానం
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలోని పలు కంపెనీలు ప్రస్తుతం తమ ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1-మార్చి 31గా పాటిస్తున్నాయి. అయితే బడ్జెటరీ ప్రక్రియ మెరుగుకు, తగిన నగదు నిర్వహణకు ఈ కాలం మార్పు అవసరమని పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా సంబంధిత వర్గాల నుంచి సలహాలనూ, సూచనలను ఆహ్వానించింది. ఇందుకు సెప్టెంబర్ 30 వరకూ గడువు పెట్టింది. ఇప్పటికే ఈ అంశంపై మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు శంకర అచార్య నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ డిసెంబర్ చివరినాటికి తన నివేదికను సమర్పించే వీలుంది. 1985లో ఎల్కే ఝా కమిటీ ఈ అంశంపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ ప్రభుత్వాలు ఆర్థిక సంవత్సరాన్ని పాటించాలని ఈ కమిటీ చేసిన సిఫారసును అప్పటి ప్రభుత్వం అంగీకరించలేదు. -
రాహుల్గాంధీకి స్వామి సంచలన సలహా
వడోదర: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడికి తనదైన శైలిలో ఓ సలహా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకోసం రాహుల్ రాజకీయాలనుంచి వైదొలగాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ద్వేషపూరిత మరియు విభజించే అజెండాపై తన పోరాటం కొనసాగుతుందని రాహుల్ ట్విట్ చేసిన మరుసటి రోజే స్వామి ఇలా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు ఆ ట్విట్ కూడా రాహుల్ చేసిన ఉండరని కార్యాలయంలో మరెవరో చేసి వుంటారనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. జాతీయ ప్రాముఖ్యత కీలక అంశాలపై `యు-టర్న్' తీసుకోవడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని స్వామి ఘాటుగా విమర్శించారు. ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేదని.. అతిపురాతన కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను కాపాడాలంటే రాహుల్ రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సిందేనన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కారణమన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ సుప్రీం కోర్టులో పరువునష్టం దావా వేసింది. మరో రాష్ట్రంలో కూడా ఆర్ఎస్ఎస్ కేసు పెట్టింది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా .. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ ను అవమానించలేదని కపిల్ సిబాల్ సుప్రీం కోర్టులో చెప్పారు. అనంతరం ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని ట్విట్ చేయడంపై బీజీపీ వర్గాలు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. -
'జుకర్ బర్గ్ వారసుడి'తో డేటింగ్..!
షకీరాలాంటి గొంతు, షరపోవాలా ఆటతీరు, కనీసం చదువులో రాణింపు.. ఇవేవీ లేకుండా ఓ టీనేజ్ అమ్మాయి గొప్ప ధనవంతురాలు కావాలంటే ఏం చెయ్యాలి? ఈ ప్రశ్న తనకుతానే వేసుకుని, తన మనుమరాలికి ఓ బామ్మ ఇచ్చిన సలహా, ఆ సలహాకు ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 'డియర్ జుకర్ బర్గ్.. ఎవరైనా ఓ నెర్డీ(ఎప్పుడూ టెక్నాలజీతో కుస్తీపడే వ్యక్తి) ఫెలోతో డేటింగ్ చెయ్యమని నా మనుమరాలికి సలహా ఇచ్చా. సాధారణ దుస్తులు, భూతద్దాలంటి కళ్లద్దాలు పెట్టుకుని ఎప్పుడూ సిస్టమ్ మీద పనిచేసుకుంటూ.. సాధారణ వ్యక్తిలా కనిపించే అలాంటి వాళ్లే భవిష్యత్ లో మీలా గొప్ప కార్యాలు సాధిస్తారు. కోటానుకోట్లు సంపాదిస్తారు. అందుకే నా మనుమరాల్ని నెర్డీతో డేట్ కు వెళ్లమని ప్రోత్సహిస్తున్నా' అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది డార్లిన్ లొరెటా అనే బామ్మ. అందుకు ప్రతిగా 'నెర్డీ ఫెలోతో డేటింగ్ చెయ్యడం కంటే స్వయంగా అలా తయారవ్వటమే ఉత్తమం. మీ తరఫున మీ మనుమరాలికి నేనిచ్చే సలహా ఇదే' అని జుకర్ బర్గ్ బదులిచ్చారు. ఏ ఆధారం లేకున్నా తమ కాళ్లపై తాము నిలబడేలా అమ్మాయిలను తయారుచేయాలని తాను గతంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశాడు. జుకర్ బర్గ్ ప్రతిస్పందన అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు లైక్స్ వర్షం కురిపించారు. ఇంతకు ముందు చెప్పినట్లే తన కంపెనీలో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు ఫేస్ బుక్ వ్యవస్థాపక సీఈవో జుకర్ బర్గ్. ప్రస్తుతం ఆ కంపెనీ సాధారణ ఉద్యోగుల్లో కేవలం 16 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అదే ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో 23 శాతం మహిళలున్నారు. మిగిలిన టెక్నాలజీ కంపెనీల్లోనూ మహిళా ఉద్యోగుల సంఖ్య అంతంతమాత్రమే! -
సలహా
సలహాను తిరగేస్తే .. హాలస అవుతుంది! సమయం, సందర్భం ఎరగక ఇచ్చే సలహాకూడా ఎదుటివారి జీవితాన్ని ఇలాగే తారుమారు చేస్తుంది! అందుకే సలహాలివ్వబోయేముందు కాస్త జాగ్రత్త అని చెప్పే ప్రయత్నమే ఇది. అవసరమైన సలహా స్వీకరించు, అనవసరమైన వాటిని తిరస్కరించు. అలాగే నీలోని ప్రత్యేకతను దానికి జోడించు -బ్రూస్లీ నాకు తెలిసి నీ మనసు విరిగినప్పుడు మాత్రం ఎవరూ నీకు సలహాలు ఇవ్వరు -బ్రిట్నీ స్పియర్స్ సలహా ఇచ్చేందుకు రానివారందరికీ కృతజ్ఞతలు, ఎందుకంటే వారి వల్లనే నేను స్వంతంగా పని చేయడం నేర్చుకోగలిగాను -ఐన్స్టీన్ మానవుడికి కవలసోదరి సలహా! కానీ ఎక్కువసార్లు ఈ ఇద్దరి మధ్య వైరం చోటు చేసుకుంటుంది. చాలా తక్కువసార్లు స్నేహం కుదురుతుంది. అవసరమున్నా లేకున్నా.. అడిగినా అడగకపోయినా నేనున్నానంటూ వస్తుందని అని సోదర మానవుడు విసుక్కుంటుంటాడు. ఖ్యాతి కన్నా ఇది మూటగట్టుకున్న అపఖ్యాతే ఎక్కువని అతని ఉద్దేశం. ఆదేశం, ఆజ్ఞ, ఉద్బోధ, సూచన... ఇలా సందర్భాన్ని బట్టి సలహా తన పేరు మార్చుకుంటూ ఉంటుంది. చాలా సార్లు ఉచితంగానే వినిపిస్తుంది. కొండొకచో కాస్ట్ చేస్తుంది. ఏమైనా తను లేకుండా మనిషి మనలేడనే చరిత్రను సృష్టించింది. రామాయణం పురాణాల్లోనూ.. సలహాది ముఖ్య భూమికే. రామాయణంలో కొంచెం నెగటివ్ షేడ్ దీనిది. కైకకు మంధర సలహా ఇవ్వకపోతే రామాయణ రచన జరిగేది కాదేమో! ఒకవేళ జరిగినా ఇంకోరకంగా ఉండేదేమో! సవతి తల్లి విలన్గా మిగిలేది కాదు! రాముడు అడవులకు వెళ్లకుండానే.. సీతను అడవుల పాలు చేయకుండానే.. రావణుడి కీర్తి తగ్గకుండానే రామాయణానికి ఎండ్ కార్డ్ పడేదేమో! అంతెందుకు.. అన్నతో పాటు అడవులకు బయలుదేరిన లక్ష్మణుడు.. భార్య ఊర్మిళకు తను వచ్చేవరకు నిద్రపొమ్మనే సలహా ఇచ్చి ఉండకపోతే రామాయణంలో ఊర్మిళ పాత్రా ఇంకేదన్నా స్ఫూర్తిని పంచేదేమో! పోనీ.. సీతను అలా బంధించడం నీకు.. ఈ లంకారాజ్యానికీ శుభం కాదు, పట్టు వీడండి అన్న విభీషణుడి సలహాను రావణుడు విన్నా కథ ఇంకో మలుపు తిరిగేది. భారతం భారతం విషయానికి వచ్చినా సలహాది చాంతాడంత నిడివే. కాకపోతే మంచిచెడ్డలను కలబోసుకుంది. ‘రాజ్యంలో పాండవులకూ పాలు ఉంది.. సగరాజ్యం ఇవ్వండి’ అంటూ పెద్దలు ఇచ్చిన సలహాను కౌరవులు పెడచెవిన పెట్టబట్టే దాయాదుల పోరు గురించి ప్రపంచానికి తెలిసిందనుకోవచ్చు. శకుని సలహాలు దర్యోధనుడు పాటించకపోతే అతని పేరూ ధర్మరాజుపేరుతో పోటీపడి ఉండేది. ‘కర్ణుడు శూద్రుడు.. వాడితో స్నేహమేంటి?’ అన్న సలహాకు సుయోధనుడు ప్రాధాన్యమిచ్చి ఉంటే లోకంలో స్నేహానికి విలువే ఉండేది కాదు. ఇలా భారతంలో తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలానే ప్రయత్నించినా.. ‘సలహా’ అనేది చివరకు అపప్రథనే మోసింది! భాగవతంలో రెండు రకాల ప్రభావాన్ని చూపింది. తండ్రీకొడుకుల మధ్య తంపులు తెచ్చింది... స్నేహితుల చెలిమికి స్వచ్ఛతను అద్దింది. నారాయణ నామస్మరణ చేస్తున్న తనను ఎద్దేవా చేయడం మంచిది కాదు నాన్నా అంటున్నా హిరణ్యకశిపుడు వినిపించుకోలేదు. తప్పు నాన్నా.. ఆ విష్ణువు శరణువేడుకోమని ప్రహ్లాదుడు తండ్రికి సలహా ఇచ్చినా అహకారంతో వినిపించుకోక చివరకు ఆ హరి చేతిలోనే హరీమన్నాడు. కటికదరిద్రం అనుభవించిన కుచేలుడికి సకలసంపదలను చేకూర్చింది ఈ సలహానే. భార్య సలహామేరకే చిన్ననాటి స్నేహితుడైన కృష్ణుడికి అటుకులను పెడ్తాడు కుచేలుడు ప్రేమగా. స్నేహితుడి చెలిమికి కరిగిపోయిన కృష్ణుడు సిరిని కానుకగా ఇస్తాడు. ఇలా ‘సలహా’ పురాణాలలో, ఇతిహాసాలలో పెద్ద పాత్రనే పోషించింది. అనేకానేక మలుపులకు కారణం అయింది. చరిత్ర చాణక్యుడి సలహా చంద్రగుప్త మౌర్యుడిని చక్రవర్తిని చేసింది. అలాగే మూర్ఖుల మెదళ్లను ప్రభావితం చేసి రక్తపాతాన్నీ సృష్టించింది. హిట్లర్ నియంతృత్వ నైజాన్ని పెంచడంలో ఇది పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయాలనే గోబెల్స్ సలహాను విని ఆ రకమైన ప్రాపగాండకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు హిట్లర్. ఇక్కడితో ఆగితే బాగుండు.. కనీసం చరిత్రలో ఎక్కడైనా మంచిగా కనిపించేవాడు. సలహా కనుక దుష్టరూపంలోకి వస్తే వీసమంత మంచికీ చాన్స్ ఇవ్వదు కదా! యూదులంటే హిట్లర్కున్న ద్వేషాన్ని తెలుసుకున్న అతని సలహాదారుడు ఆల్ఫ్రెడ్ రోజెన్బర్గ్... ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నాడు. యూదుల మీద తనకున్న పగను హిట్లర్ ద్వారా తీర్చుకోవాలనుకున్నాడు. అందుకే యూదుల ఊచకోత అనే వికృత సలహా ఇచ్చి రెండో ప్రపంచ యుద్ధానికే ఘంటికలు మోగించాడు. చరిత్రను తవ్వితే... ఇలాంటివెన్నో! ప్రతి ఆక్రమణ వెనక... ప్రతి దాడి ముందు ఉన్నది సలహానే! కొందరికి ఇది విజయాలను పంచిపెడితే కొందరికి ఓటమిని తేల్చింది! రాజకీయాలు దైనందిన జీవితంలో దీన్ని ఎవరూ అడగకపోయినా.. దీని జాడనే సహించకపోయినా.. రాజకీయాల్లో మాత్రం దీని ప్రమేయం అనివార్యమైంది. అయితే మామూలు జీవితాల్లో ఇది కంచిగరుడ సేవ చేస్తే.. పాలిటిక్స్లో మాత్రం దీని సర్వీస్ పాష్గానే ఉంటుంది. ఆంతరంగిక సలహాదారు, ప్రభుత్వ సలహాదారు..అనే హోదాలున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రధానిగా ఢిల్లీ పీటమెక్కిన నరేంద్ర మోదీ విజయానికి అమిత్షా సలహానే కారణమైంది. కానీ తర్వాత కాలంలో ఆ అమిత్షా సలహాలే సెల్ఫీల పిచ్చోడిగా.. కోట్లు (ధరించేవి) మార్చే వెర్రోడిగా మోదీలోని కొత్త కోణాన్ని పరిచయం చేశాయి. మతోన్మాది ముద్రనూ వేశాయి. అరవింద్ కేజ్రివాల్నూ ఈ సలహాలు నానా ప్రాంతాలను ఊడిపించాయి.. ఆఖరకు ఏడిపించాయి. సామాన్యుడి జీవితంలో... సలహా ఒక రొద.. వ్యధ. ఖర్చయ్యేది కాదుకదా.. అని విసిరిపారేసే ఓ వల. వద్దన్నా చిక్కుకు పోతాడు మనిషి. విననూ అంటూ దూరంగా పారిపోతుంటే వెంటాడి వేటాడి మరీ చెవిలో దూరుతుంది. నడక నేర్చిన దగ్గర్నుంచి మొదలవుతాయి ఈ కవల సోదరి పెట్టే కష్టాలు. అటు వెళ్లకు.. ఇటు రాకు.. అది చూడకు.. ఇది విను.. అది తినకు.. ఇది తీసుకో అంటూ! కాస్త పెద్దయితే ఇది చదువు.. ఈ పని చెయ్ అని. పెళ్లీడు వచ్చిందంటే.. ప్రేమించమని ఓ సలహా.. వద్దని ఇంకో సలహా. కట్నం తీసుకో అని ఒకరి సలహా. పెళ్లయ్యాకైతే భార్య రూపంలో భర్తకు.. భర్త రూపంలో భార్యకు ఈ సలహా శాశ్వతతోడుగా మారిపోతుంది. సొంత వ్యక్తిత్వం ఎదగనివ్వకుండా అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. పైగా సొంత వ్యక్తిత్వం లేదనే తెగడ్తనూ ఇస్తుందిదే! ఒకవేళ సలహాసొదను వినకుండా సొంతంగా ఆలోచించి అడుగులేసి పొరపాటున కిందపడితే మూతి మూర జాపి నవ్వేదీ అదే! ఎప్పుడు మంచిది? పీపుల్ డోంట్ అల్వేస్ నీడ్ అడ్వయిజ్.. సమ్టైమ్స్ ఆల్ దె రియల్లీ నీడ్ ఈజ్ ఎ హ్యాండ్ టు హోల్డ్.. యాన్ ఇయర్ టు లిజన్... అండ్ ఎ హార్ట్ టు అండర్స్టాండ్ దెమ్! అంటే సలహా అవసరాన్ని బట్టి తన ఆకారాన్ని మార్చుకుంటే అందరి మన్ననలనూ పొందుతుంది. ప్రతి విజేత తన సక్సెస్ క్రెడిట్ను సలహాకే సొంతం చేస్తాడు. సలహాలు అందరూ ఇస్తారు.. కానీ సరైన సమయంలో ఇచ్చినవారే శ్రేయోభిలాషులుగా మిగులుతారు. ఆ సలహాకీ ఆ మంచితనం అంటుతుంది. ఈ కోవలోకి రాని సలహాలకు ఉచితం అనే బరువైన ట్యాగ్ పడేదందుకే! పాండవాగ్రజుడు ధర్మరాజుని ఎవరో అడిగారట.. మనిషి చేయగల చాలా సులువైన పని ఏంటీ అని. దానికి ఆయన.. ‘‘సలహా’’ ఇవ్వడం’ అని చెప్పాడట. అలా కష్టపడకుండా ఎదుటివారికి సలహాలివ్వడమంటే సలహాకున్న విలువ తగ్గించడమన్నట్టే! - సరస్వతి రమ -
'కశ్మీర్ కాదు.. కాలువలు శుభ్రం చేయండి'
ముంబై: పాకిస్థాన్తో మళ్లీ చర్చల ప్రతిపాదనను నిద్వంద్వంగా తిరస్కరించిన తమ మిత్రపక్షం శివసేనకు బీజేపీ ఘాటైన సమాధానం ఇచ్చింది. పాకిస్థాన్ పట్ల శివసేన తన వైఖరి మార్చుకుంటే బాగుంటుందని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు చురకలంటించింది. రష్యాలో మోదీ.. నవాజ్ ను కలుసుకోవడంపై శివసేన పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన దరిమిలా ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 'ఇండో- పాక్, కశ్మీర్ సమస్యలపై ప్రతిఒక్కరికీ సొంత అభిప్రాయాలు ఉంటాయి. అయితే వాటిపట్ల ఇంతకు ముందున్న దృక్ఫథాన్ని మార్చుకుంటే తప్ప పరిష్కారం దొరకదు. అయినా ఇది జాతీయ ప్రధాన్యతాంశాల్లో ఒకటి. శివసేన స్థాయి సమస్యకాదు. ఒకవేళ వాళ్లు (శివసేన) ఏదైనా పరిష్కారం చేయాలనుకుంటే ముందు ముంబైలో ఇప్పుడిప్పుడే విజృంభిస్తోన్న మెదడువ్యాపు వ్యాధిని అరికట్టాలి. లేదంటే కాలువలు శుభ్రం చేసే కాంట్రాక్టర్ల పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలి' అని ఎద్దేవాచేశారు. -
లక్ష్మణ రేఖను దాటొద్దు...
న్యూఢిల్లీ : ప్రతిపక్షాలతో సహా ఎవ్వరూ వేలెత్తి చూపేలా వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బిజెపి ఎంపీలకు సలహా ఇచ్చారు. ఎంపీలు లక్ష్మణరేఖను దాటవద్దని ఆయన సూచించినట్లు సమాచారం. బిజెపి ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివాదాలకు దూరంగా ఉండాలన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించాలని మోదీ చెప్పారు. అభివృద్ధికి సంబంధించి కలవాలనుకునేవారికి తాను ఎప్పుడూ అందుబాబులో ఉంటానని చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలతో బిజెపి ఎంపీలు కలకలం రేపిన తరుణంలో ప్రధాని వ్యాఖ్యలకు ప్రాధాన్యత పెరిగింది. -
విజయానికి అతి దగ్గర దారి...
మై ఫిలాసఫీ విజయానికి దగ్గరి దారులు ఎన్నో ఉండవచ్చు. అతి దగ్గరి దారి మాత్రం... అంకితభావం, అమితంగా కష్టపడడం. ‘చాలా పోటీ ఉంది. ఇలాంటి ఎత్తులు వేస్తే మనం నిలదొక్కుకుంటాం’ అని కొందరు సలహాలు ఇస్తుంటారు. మనం నిలదొక్కుకోవడానికి కావల్సింది ‘పని’ తప్ప ‘ఎత్తుగడ’ కాదు. ఎత్తుగడల ద్వారా నిలదొక్కుకున్నా... ఆ పునాది బలహీనంగా ఉంటుంది. రెండో ప్రయత్నం అనేది ఎప్పుడూ మంచిదే. చిన్నప్పుడు లెక్కల టీచర్ అనేవారు ‘‘ఒక్కసారి కాకుంటే వందసార్లు ప్రయత్నించు’’ అని! దీన్ని జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. ఓటమి బరువు... బాధ్యతను పెంచుతుంది. బాధ్యత విజయాన్ని ప్రేరేపిస్తుంది. విజయం మరిన్ని విజయాలకు చుక్కాని అవుతుంది. కష్టపడే తత్వాన్ని పెంపొందిస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిదే కానీ, భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తే... వర్తమానంలో మనం చేసే పని దెబ్బతింటుంది. ఫలితం గురించి దీర్ఘంగా ఆలోచించకుండా...నిర్ణయం గురించి లోతుగా ఆలోచిస్తాను. దీని వల్ల నిర్ణయం తీసుకోవడం కాస్త ఆలస్యమైనా అది సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రొఫెషన్ డిమాండ్ చేసినట్లు మనం ఉండాలిగానీ, మనం డిమాండ్ చేసినట్లు ప్రొఫెషన్ ఉండదు. ఇది తెలుసుకుంటే ఏ వృత్తిలో అయినా మన ప్రయాణం సజావుగా సాగుతుంది. క్షమించడం, మరచిపోవడం అనేవి నా వరకు అత్యున్నత లక్షణాలు. ఎవరో మనకు ఏదో అపకారం చేశారని కక్ష పెట్టుకుంటే మనసు పాడై పోతుంది. కాబట్టి క్షమించడమే కరెక్ట్. ఎప్పుడో ఏదో జరిగిందని దాన్ని తలుచుకొని కుమిలి పోతే కొత్తగా ఏమీ చేయలేం. కాబట్టి ఆ దుఃఖాన్ని మరిచిపోవడమే మంచిది. - జాక్వెలిన్ ఫెర్నాండెజ్, హీరోయిన్