తెనాలి: తమిళనాడు ‘అమ్మ’ గ్రైండర్లు మన రాష్ట్రంలో అమ్మకానికి వచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ రాష్ర్ట ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసిన మిక్సీలు, మినీ వెట్ గ్రైండర్లు గుంటూరు జిల్లా తెనాలిలో దర్శనమిచ్చాయి. ఆంధ్రాప్యారిస్ తెనాలి చెంచుపేట సమీపంలోని పెట్రోలు బంకు వద్ద శుక్రవారం ఈ వస్తువులు అమ్మకానికి పెట్టారు. మార్కెట్ ధర కంటే తక్కువకే అమ్ముతుండడంతో ప్రజలు కొనుగోలు చేసేందుకు ఎగబాడుతున్నారు. రెండు నెలల కిందట కూడా నరసరావుపేటలో అమ్మ గ్రైండర్లు అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే.
ఆంధ్రాప్యారిస్లో 'అమ్మ'కానికి గ్రైండర్లు
Published Sat, Apr 23 2016 12:03 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement