Tamilanadu
-
ఇళయరాజా మ్యూజికల్ జర్నీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన
తరాలు మారుతున్నా ఇళయరాజా సంగీతంపై అభిమానం ఏంతమాత్రం తగ్గదు. గత 50 ఏళ్లుగా కోట్లమందికి తన సంగీతంతో ఆయన దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఇళయరాజా 50 ఏళ్ల మ్యూజికల్ జర్నీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ప్రస్థానాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తాజాగా తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు.తమిళనాడు తేని జిల్లాలో మారుమూల కుగ్రామంలో రాజయ్యగా పుట్టి, రాజాగా ఆయన మారారు. అప్పటికే చిత్ర పరిశ్రమలో మన ఏ.ఎం.రాజా ఉండటం వల్ల ‘ఇళయ’ చేర్చుకుని ఇళయరాజాగా ఆయన పరిచయం అయ్యారు. అలా ‘అన్నాకిళి’ (1976)తో మొదటి చిత్రం చేశారు. ఏ ముహూర్తాన సంగీత దర్శకుడిగా జన్మించాడోగాని ఇంతకాలం తర్వాత, 1,500 సినిమాలకు 8,500 పాటలు చేశాక, 81 ఏళ్లకు చేరుకున్నాక కూడా ఆకర్షణ కోల్పోలేదు. భారతీయ సంగీత ప్రతిభను ప్రపంచానికి చాటడానికి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో అత్యంత క్లిష్టమైన ‘సింఫనీ’ రాసి, దానికి ‘వేలియంట్’ అని నామకరణం చేసి, మార్చి 8న లండన్ లో 85 మంది సభ్యుల ప్రతిష్ఠాత్మక రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ప్రదర్శన ఇచ్చారు. ప్రపంచ దేశాల నుంచి రాజా అభిమానులు ఈ సింఫనీకి హాజరయ్యారు. 45 నిమిషాల నాలుగు అంచెల సింఫనీని విని స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇలా వెస్ట్రన్ క్లాసికల్లో సింఫనీ రాసి, లండన్ (London)లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి భారతీయుడిగా రాజా చరిత్ర సృష్టించారు. -
2025 నుంచి 2050 టర్మ్లో సినిమాను ఏలేది ఇదే: ఆర్కే.సెల్వమణి
కాలం మారుతోంది. దానితో పాటు సినిమాను రూపాంతరం చెందుతోంది. సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి చెందుతోంది. మ్యాన్ పవర్ తగ్గుతోందని కూడా చెప్పవచ్పు. ఇప్పుడు ఇండియన్ సినిమా హాలీవుడ్ సినిమాలకు దీటుగా ఎదుగుతోంది. ఇది సినీ విజ్ఞులు చెబుతున్న మాట. ప్రముఖ సినీ దర్శకుడు, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి ఇదే చెబుతున్నారు. ఈయన సినిమా రంగంలో 24 క్రాఫ్ట్లతో కూడిన దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ)కి అధ్యక్షుడు అన్న విషయం తెలిసిందే. కాగా ఈ 24 క్రాఫ్ట్ల సంఘంలో మరో క్రాఫ్ట్ చేరనుంది. అదే దివా( డిజిటల్ ఇంటర్ మీడియట్ విజువల్ ఎఫెక్ట్స్ అసోసియేషన్). దీంతో ఫెఫ్సీ ఇప్పుడు 25 క్రాఫ్ట్స్ కలిసిన సమాఖ్య కానుంది. దివా నిర్వాహకులు చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్కే.సెల్వమణి, దర్శకుడు రవికుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సెల్వమణి మాట్లాడుతూ ఇంతకుముందు తాను సినిమాను రూపొందించినప్పుడు అనుకున్నది ముందుగానే చూడడానికి కఠిన శారీరక శ్రమ, డబ్బు ఖర్చు అవసరం అయ్యేదన్నారు. అయినా రిజల్ట్ 40 శాతమే వచ్చేదన్నారు. అలాంటిది ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఆ రిజల్ట్ 100 శాతంగా మారిందన్నారు. కె.బాలచందర్, భారతీరాజా, శ్రీధర్ వంటి దర్శకుల కాలంలో సినిమా సాంకేతిక నిపుణుల ఆధీనంలోకి వచ్చిందన్నారు. ఆ తరువాత రజనీకాంత్, కమలహాసన్ వంటి నటుల ఆధీనంలోకి వచ్చిందన్నారు. 2025 నుంచి 2050 వరకూ సినిమాను ఏలేది ఏఐ, వీఎఫ్ఎక్స్, సీజీ వంటి సాంకేతిక పరిజ్ఞానమేనని అన్నారు. అలాంటి దానికి ఒక సంఘం అన్నది స్వాగతించాల్సిన విషయమేనన్నారు. మీ సంఘాన్ని ఫెఫ్సీలో చేర్చుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని సెల్వమణి పేర్కొన్నారు. అయితే వీఎఫ్ఎక్స్, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాతలకు భారం కాకుండా, వారితో కలిసి నడుచుకోవాలని ఆయన అన్నారు. దివా త్వరలో ఒడిసీ అవార్డుల పేరుతో భారీ ఎత్తున చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
విజయ్తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష
సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలో సంచలనాలకు చిరునామా నటి త్రిష(Trisha Krishnan) అంటారు. ముఖ్యంగా కోలీవుడ్లో ఆమెకు సంబంధించి ఏ వార్త వచ్చినా నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. 41 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు పోటీ పడుతూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటూ భారీ హిట్లు కొడుతుంది. నటిగా 22 ఏళ్ల కెరీర్లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ మొదలగు ఐదు భాషల్లో కథానాయకిగా సత్తా చాటుతుంది. ఇప్పటికీ అజిత్, చిరంజీవి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ అగ్ర కథానాయకిగానే కొనసాగుతుంది. ఇన్ని అర్హతలు కలిగిన ఈ చైన్నె సుందరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఈమె గురించి వదంతులు చాలా కాలంగానే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల నటుడు విజయ్తో (Vijay) కలుపుతూ రకరకాల ప్రచారం కూడా జరిగింది. ఈమె మాత్రం విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ పలు వేదికల మీద తెలిపింది. అయితే, త్రిష త్వరలో రాజకీయ రంగ ప్రవేశం(Political Entry) చేయబోతున్నట్లు ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదేవిధంగా ఈమె చాలా కాలం క్రితమే తనకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ ఉందని పేర్కొంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. అదే విధంగా నటుడు విజయ్ పార్టీలో చేరనున్నారు అనే ప్రచారం బలంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష తన అభిమానులకు త్వరలో ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతుందని వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికీ అగ్ర కథానాయకిగా నటిస్తూ బిజీగా ఉన్న త్రిష నటనకు స్వస్తి చెబుతారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే తనకు మంచి మిత్రుడు అని చెప్పుకునే నటుడు విజయ్ కూడా కెరీర్ పరంగా మంచి పీక్లో ఉండగానే నటనకు స్వస్తి చెబుతూ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాగా త్రిష ఇప్పుడు నటనకు స్వస్తి చెప్పబోతున్నారనే వార్త ఎంతవరకు నిజం అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ విషయంలో ఆమె ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే, త్రిష పాలిటిక్స్లోకి తప్పకుండా ఎంట్రీ ఇస్తుందని తమిళనాడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
చాలా బాధగా ఉంది.. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నా: ఆషికా రంగనాథ్
దక్షిణాది చిత్ర పరిశ్రమను చుట్టేస్తున్న వారిలో మలయాళం, కన్నడ బ్యూటీలే ఎక్కువగా ఉంటున్నారన్నది వాస్తవం. ముఖ్యంగా శాండిల్ ఫుడ్ భామలు అనుష్క,కృతి శెట్టి,అనుపమ పరమేశ్వరన్, రాశీఖన్నా, వంటివారు తెలుగు, తమిళం భాషల్లో రాణించారు. ప్రస్తుతం నటి రష్మిక మందన్న ఇండియన్ క్రష్గా వెలిగిపోతున్నారు. తాజాగా ఆషిక రంగనాథ్ అదే బాటలో పయనిస్తున్నారని చెప్పవచ్చు. తన మాతృభాష కన్నడలో 'క్రేజీ బాయ్' అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో నాగార్జునకు జంటగా నా సామిరంగ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆషికా రంగనాథ్కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. దీంతో కోలీవుడ్ దృష్టి పడింది. ఇక్కడ నటుడు అధర్వకు జంటగా పట్టత్తు అరసన్ చిత్రంతో రంగ ప్రవేశం చేశారు. కాగా తాజాగా నటుడు సిద్ధార్థ్ కథానాయకుడిగా నటించిన 'మిస్ యూ' చిత్రంలో నాయకిగా నటించారు. దీంతోపాటు కార్తీ సరసన సర్ధార్ 2, మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర' వంటి భారీ చిత్రంలోనూ నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. కాగా మిస్ యూ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని నవంబర్ 29న విడుదల కావాల్సింది. అయితే ఇక్కడ తుపాన్ వంటి అననుకూల పరిస్థితులు కారణంగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. దీనిపై నటి ఆషీక రంగనాథ్ స్పందిస్తూ మిస్ యూ చిత్రం విడుదల వాయిదా పడటం తనకు బాధ కలిగించిందన్నారు. అయితే అంతా బాగానే జరుగుతుందని నమ్ముతున్నానన్నారు. ఇంతకుముందు నిర్ణయించిన విడుదల తేదీ కంటే ఇంకా మంచి తేదీ లభిస్తుందని భావిస్తున్నానన్నారు. అది చిత్రాన్ని అత్యధిక ప్రేక్షకుల మధ్యకు తీసుకెళ్లడానికి ఉపకరిస్తుందని, ఈ విషయాన్ని గమనిస్తే మిస్ యూ చిత్రం విడుదల వాయిదా అనే నిర్ణయం సరైనదేనని నమ్ముతున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
ఎస్జే సూర్యకు గౌరవ డాక్టరేట్.. కారణం ఇదే
కోలీవుడ్ నటుడు, దర్శకుడు ఎస్జే సూర్యకు చెన్నైలోని 'వేల్స్ విశ్వవిద్యాలయం' గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. దీంతో ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. చెన్నైలోని పల్లవరంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ వేల్స్ 15వ స్నాతకోత్సవ వేడుక ఈరోజు (డిసెంబర్ 1) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఇందులో సుమారు 5 వేల మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పరిశోధక విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.దర్శకుడు, నటుడు, నిర్మాత, గీత రచయిత, గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎస్.జె.సూర్యను గౌరవ డాక్టరేట్తో 'వేల్స్ విశ్వవిద్యాలయం' సత్కరించింది. 25 ఏళ్లుగా సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గానూ గుర్తిస్తూ ఈ గౌరవాన్ని కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది. అలాగే బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధులను ఒలింపిక్ క్రీడల్లో ప్రపంచ వేదికపై విజయం సాధించేలా మార్గనిర్దేశం చేసిన కోచ్ పుల్లెల గోపీచంద్కు కూడా గౌరవ డాక్టరేట్ లభించింది. వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గతేడాదిలో రామ్ చరణ్ డాక్టరేట్ను పొందిన విషయం తెలిసిందే.దర్శకుడిగా కాస్త విరామం తీసుకున్న ఎస్జే సూర్య తమిళ, తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గేమ్ ఛేంజర్లో నటిస్తున్నారు. పవన్ కల్యాణ్ కెరీర్లోనే బిగ్ హిట్గా నిలిచిన 'ఖుషి' చిత్రానికి ఆయన డైరెక్షన్ చేశారు. ఒక రకంగా ఈ సినిమాతోనే పవన్కు మంచి గుర్తింపు వచ్చింది. 2001లో విడుదలైన ఈ సినిమా టేకింగ్ చేసిన తీరుకు ఎస్జే సూర్య పట్ల చాలామంది ఫిదా అయిపోయారు. -
నటి కస్తూరికి బెయిల్
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టు అయిన సినీ నటికస్తూరికి ఎగ్మూర్ కోర్టు బుధవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో శనివారం హైదరాబాద్లో అరెస్టయిన కస్తూరిని చైన్నె పుళల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమెకు ఈనెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఈ పరిస్థితులలో తనకు బెయిల్మంజూరు చేయాలని కోరుతూ ఎగ్మూర్ కోర్టులో కస్తూరి దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. తాను సింగిల్ మదర్ అని, తనకు స్పెషల్చైల్డ్ ఉందని, ఆమెను తానే చూసుకోవాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. దీంతో నిబంధనలతో కూడిన బెయిల్ను ఆమెకు మంజూరు చేస్తూ న్యాయమూర్తి దయాళన్ ఆదేశించారు.ఈ కారణం వల్లే అరెస్ట్నవంబరు 3న చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన కస్తూరి.. తెలుగువాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 300 ఏళ్ల క్రితం రాజుగారి అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగు వారు తమిళనాడుకి వచ్చారని, ఇప్పుడు వాళ్లు తమిళ వాళ్లమని చెప్పుకుంటున్నారని కస్తూరి చెప్పింది. అంతేకాదు, వేరేవాళ్ల భార్యపై మోజుపడొద్దని, బహుభార్యాతత్వం వద్దని బ్రాహ్మణులు చెప్తుంటే వారిని తమిళులు కాదని.. వారికి వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారని కస్తూరి కామెంట్ చేయడంతో వివాదస్పదం అయింది. ఈ క్రమంలో డిఎంకే పార్టీ నేతలపై కూడా ఆమె ఫైర్ అయింది. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. -
తమిళగ వెట్రి కళగం పార్టీపై వార్తలు.. నిజమేనా?
చెన్నై : 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కగళం (టీవీకే) పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకి నెటింట్లో ట్రెండ్ అవుతున్న ఆ వార్త నిజమేనా? దీనిపై దళపతి విజయ్ ఏమన్నారు2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పొత్తు పెట్టుకోనున్నాయని తమిళ ప్రధాన మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. అందుకు గత అక్టోబర్ నెలలో టీవీకే పార్టీ తొలి బహిరంగ సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని కొన్ని ఆధారాల్ని జత చేశాయి.అక్టోబర్లో విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆవిర్భావోత్సవం, సిద్ధాంతాల వేడుకైన పార్టీ తొలి బహిరంగ సభ జరిగింది. ఆ సభలో విజయ్ డీఎంకే, బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయితే ఎక్కడా ఏఐఏడీఎంకే గురించి ఎక్కడా మాట్లాడలేదని హైలెట్ చేశాయి.అయితే, ఈ కథనాలపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏఐఏడీఎంకేతో టీవీకే పొత్తు అనేది పూర్తిగా అబద్ధమని ఖండించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు లేకుండా టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుంది. ప్రజల మద్దతుతో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ విశ్లేషకుల ముసుగులో మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని, ఇలాంటి అవాస్తవ, తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’అని టీవీకే ఎక్స్ వేదికగా వివరణిచ్చింది. தலைமை நிலையச் செயலக அறிவிப்புதமிழக வெற்றிக் கழகத்தின் முதல் மாநில மாநாட்டில் கழகத்தின் கொள்கைகள், கொள்கை எதிரி, அரசியல் எதிரி, தேர்தல் நிலைப்பாடு குறித்தும் தமது உரையில் கழகத் தலைவர் அவர்கள் தெளிவாக, விளக்கமாக எடுத்துரைத்துள்ளார். கழகத் தலைவர் அவர்களின் வழிகாட்டுதலின்படி…— TVK Party Updates (@TVKHQUpdates) November 18, 2024 -
నవంబర్ 1 నుంచి తమిళ్ సినిమా షూటింగ్స్ బంద్
తమిళ చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి కోలీవుడ్లో ఎలాంటి షూటింగ్స్ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ విషయంపై తాము గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని నిర్మాతల మండలి తాజాగా పేర్కొంది. తమిళ చిత్ర పరిశ్రమను పునర్నిర్మించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు.తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. 'నిర్మాతల సంఘం తరపున ఇప్పటికే పలు సమస్యలను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో సినిమా బడ్జెట్తో పాటు నటీనటులు, టెక్నీషియన్ల ఫీజులు, ఇతర ఖర్చులు భారీగా పెరిగాయని నిర్మాతల మండలి పేర్కొంది. దీనిని నియంత్రించి, కొన్ని రకాల పరిమితులు తీసుకురావాలని వారు తెలిపారు. నిర్మాతల సమస్యలకు పరిష్కారం కనుగొనే వరకు నవంబర్ 1 నుంచి షూటింగ్లు, సినిమాలకు సంబంధిత ఇతర కార్యకలాపాలను ఆపేస్తున్నట్లు వారు నిర్ణయించాం. అయితే, ఈ నిర్ణయం పూర్తి చట్టవిరుద్ధమైన నిర్ణయమని నడిఘర్ సంఘం పేర్కొంది. ఇలాంటి చర్యలకు దక్షిణ భారత నటీనటుల సంఘం ఎప్పటికీ మద్దతివ్వదని తెలిపింది.తమిళ నిర్మాతల ప్రధాన డిమాండ్స్అగ్ర హీరోలు నటించిన చిత్రాలను థియేటర్లలో విడుదల చేసిన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ చేయాలి.ఇటీవలి కాలంలో ఎక్కువగా నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ తీసుకుని ఇతర చిత్రాలకు వెళ్లడం వలన నిర్మాతలు భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకున్న నటుడు, సాంకేతిక నిపుణులు వారి సినిమా పూర్తయిన తర్వాతే మరొక చిత్రానికి పనిచేయాలి.అనేక తమిళ సినిమాలు సరైన థియేటర్లు దొరక్క నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలి.నటీనటులు, టెక్నీషియన్ల జీతాలు, ఇతర ఖర్చులు అదుపులేకుండా పెరిగిపోతున్నందున, చిత్ర పరిశ్రమను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నాలు జరగాలి. -
రేసులో అజిత్.. ఉదయనిధి స్టాలిన్ అభినందన
కోలీవుడ్ సినీ నటుడు అజిత్ కుమార్కు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అభినందనలు తెలియజేశారు. తమిళనాడు ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై చాటుతుండటాన్ని గుర్తు చేస్తూ కొనియాడారు. సినీ నటుడు అజిత్ కొత్త అవతారం ఎత్తారు. అజిత్కుమార్ రేసింగ్ టీం పేరిట టీమ్ లోగోను తాజాగా ఆవిష్కరించారు. సరికొత్త పాత్రలో రేసర్గా వస్తున్నట్టు అజిత్ ఆనందంగా ప్రకటించారు. రేసర్గా తన ప్రయాణంలో గెలవాలనే సంకల్పంతో ముందుకు సాగనున్నట్టు పేర్కొన్నారు. దుబాయ్లో త్వరలో జరగనున్న దుబాయ్ 24 హెచ్ 2025 పోటీలలో తొలిసారిగా అజిత్కుమార్ రేసింగ్ టీం పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. ఈ పోటీల ట్రయల్ రన్ ప్రస్తుతం దుబాయ్లో జరుగుతోంది. ఇందులో తమిళనాడు స్పోర్ట్స్ విభాగం లోగోను ధరించి ఈ ట్రయల్ రన్లో దూసుకెళ్తున్న వీడియో వైరల్గా మారింది. తమిళనాడు స్పోర్ట్స్ అండ్ డెవలప్మెంట్ విభాగం నేతృత్వంలో క్రీడాభ్యున్నతికి జరుగుతున్న తోడ్పాటుకు మరింత బలం చేకూర్చే విధంగా అజిత్ ఆ లోగో ధరించడాన్ని ఉదయనిధి స్టాలిన్ ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికగా తమిళనాడు స్పోర్ట్స్ను చాటడం గర్వించ దగ్గ విషయం అని, ఇందుకు అభినందనలు తెలియజేశారు. -
నేడు 'విజయ్' తొలి బహిరంగ సభ.. ఎంతమంది రానున్నారంటే..?
తమిళ సినీ రంగం నుంచి మరో అగ్రనటుడు పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారే తరుణం ఆసన్నమైంది. విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆవిర్భావోత్సవం, సిద్ధాంతాల వేడుకైన పార్టీ తొలి మహానాడు నేడు (అక్టోబర్ 27) జరగనుంది. ఇందుకోసం ఆ పార్టీ నేతలు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే, ఒకరోజు ముందుగానే నేతలందరూ విల్లుపురానికి చేరుకున్నారు. కాగా మహానాడులో విజయ్ ఏఏ అంశాలను ప్రస్తావిస్తారు.. ఎవరిని టార్గెట్ చేస్తారు.. సిద్ధాంతాలు ఏరకంగా ఉంటాయనే విషయం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సభ హైలెట్స్ ఇవే..5 నుంచి 7 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా .వేదికపై విజయ్ ఎగుర వేసే పార్టీ జెండా ఐదేళ్ల పాటు ఎగిరే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.చైన్నె – తిరుచ్చి జాతీయ రహదారిలోని వీసాలై వద్ద 85 ఎకరాల విస్తీర్ణంలో సినీ సెట్టింగ్లను మించి మహానాడు ఏర్పాట్లు.సభా వేదిక చుట్టూ.. వేలునాచ్చియార్, కామరాజర్, పెరియార్, అంబేడ్కర్, తమిళ తల్లి, చోళ, చేర, పాండ్య రాజుల కటౌట్లను ఏర్పాటు చేయడం.సభా ప్రాంగణంలో విజయ్ అభిమానులకు సమీపంలోకి వచ్చి పలకరించే విధంగా 800 మీటర్లకు ప్రత్యేకంగా ర్యాంప్ ఏర్పాటు.వాహనాల పార్కింగ్ కోసం 207 ఎకరాల స్థలం కేటాయింపు.చైన్నె నుంచి విక్రవాండి వరకు సుమారు 150 కి.మీ దూరంలో విజయ్ కటౌట్లు, పార్టీ జెండాలను తమిళగ వెట్రికళగం వర్గాలు ఏర్పాటు చేశాయి.ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అభిమానులు, పార్టీ కేడర్ చేరుకునే విధంగా ప్లాన్.. సాయంత్రం 5 గంటలకు మహానాడు మొదలయ్యే రీతిలో షెడ్యూల్ సిద్ధం.మహానాడు భద్రత విధులలో ఇద్దరు డీఐజీలు, 10 మంది ఎస్పీలు, 15 మంది ఏడీఎస్పీలు, 50 మంది డీఎస్పీలు సహా 6 వేల మంది పోలీసులు ఉన్నారు. -
రెండు చేతులు చాచి ఆహ్వానం పలుకుతున్నా అంటూ విజయ్ లేఖ
దళపతి విజయ్ కొన్ని గంటల్లో తన అభిమానులను కలవనున్నాడు. తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన తర్వాత తను తొలిసారి భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నాడు. దీంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్న దేశ ప్రజలు అందరూ ఆయన ఏం మాట్లాడనున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలైలో విజయ్ పార్టీ తొలి మహానాడు కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచం కీర్తించే రీతిలో వీసాలైలో పార్టీ ఆవిర్భావం, సిద్ధాంతాల వేడుకను జరుపుకుందామని కేడర్కు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ పిలుపునిచ్చారు. మహానాడుకు కొంత సమయం మాత్రమే ఉండడంతో కేడర్కు పిలుపునిస్తూ విజయ్ లేఖ రాశారు. రేపు జరిగే మహానాడు ప్రపంచమే కీర్తించే వేడుకగా నిలవబోతోందని, ఆమేరకు వేడుక జరుపుకుందామని కేడర్కు సూచించారు. పార్టీ జెండాలతో తరలిరావాలని, వీసాలైలలో అందరికీ ఆహ్వానం పలికేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. బ్రహ్మాండ ఏర్పాట్లు జరిగాయని, ఈ సిద్ధాంతాల వేడుకకు తన గుండెల్లో గూడు కట్టుకున్న ప్రతి అభిమాని, కేడర్ను సగర్వంగా ఆహ్వానిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.తొలి మహానాడులో అందర్నీ తాను నేరుగా కలవనున్నట్లు వ్యాఖ్యలు చేశారు. ఇది సిద్ధాంతాల విజయపు వేడుక అని, రెండు చేతులు చాచి ఆహ్వానం పలుకుతున్నానని ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, భద్రత, సురక్షితంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. హృదయం అనే తలుపును వీసాలై సరిహద్దుల్లో తెరచి ఉంచి ఆహ్వానిస్తుంటానని, మహానాడులో కలుద్దాం..తమిళ మట్టి గెలుపు కోసం శ్రమిద్దాం...2026 మన లక్ష్యం అని ముగించారు. కాగా, ఈ మహానాడు కోసం చేసిన ఏర్పాట్లపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. జాతీయ రహదారి వెంబడి ఫ్లెక్సీలు, హోర్డింగ్లు హోరెత్తించడంతో వాటిని తొలగించే విధంగా హుకుం జారీ చేశారు. అలాగే, కోయంబత్తూరులో అయితే విజయ్, అన్నాడీఎంకే దివంగత నేత ఎంజీఆర్ చిత్ర పటాలతో ఫొటోలు, ఫ్లెక్సీలు వెలిశాయి. -
నటి గౌతమిని మోసం చేసిన సినీ ఫైనాన్సియర్
నకిలీ పత్రాలను సృష్టించి తన భూమిని కబ్జా చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తున్నారు సినీ నటి గౌతమి. ఈ కేసులో తనకు న్యాయం దక్కేవరకు పోరాడుతానని ఆమె తెలిపారు. రామనాథపురం జిల్లాతో పాటు చెన్నై పరిసర ప్రాంతాల్లో నటి గౌతమికి సుమారు 150 ఎకరాల భూములు ఉన్నాయి. కారైక్కుడికి చెందిన సినీ ఫైనాన్సియర్ అళగప్పన్.. గౌతమికి చెందిన స్థలం అమ్మిపెడుతానని చెప్పి ముందుగా ఆ పత్రాలను పరిశీలించారు. ఆపై వాటికి నకిలీ పత్రాలను సృ ష్టించి తన సొంతానికి విక్రయించారు.ఈ క్రమంలో గౌతమి నుంచి రూ. 3కోట్లు తీసుకుని మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రామనాథపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో గౌతమి ఫిర్యాదు చేశారు. సి.అళగప్పన్, ఆయన భార్య నాచ్చాళ్, కుమారుడు శివ, కోడలు ఆర్తి, బంధువు భాస్కర్, కారు డ్రైవర్ సతీష్ కుమార్పై కేసు నమోదు చేశారు. ఏడాది నుంచి వారు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వారు మళ్లీ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే, వారికి బెయిల్ ఇవ్వకూడదని తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టుకు తెలుపుకున్నారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని ఆమె పేర్కొన్నారు. -
ప్రముఖ గాయని పి.సుశీలను అవార్డ్తో సత్కరించిన తమిళనాడు
తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే ‘కలైజ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్’ పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు గాన కోకిల పి.సుశీల, ప్రొఫెసర్, రచయిత, కవి మహ్మద్ మెహతాలను అక్కడి ప్రభుత్వం ఎంపిక చేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి సందర్భంగా ఏటా జూన్ 3న ‘కలైజ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్’ పురస్కారాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో తమిళ సినీ రంగంలో విశిష్ట సేవలు అందించినవారిని సత్కరించే క్రమంలో పి. సుశీల పేరును ప్రభుత్వం ఎంపిక చేసింది.ఇదీ చదవండి: ఆ క్రెడిట్ అంతా హీరోలకేనా.. హీరోయిన్లకు ఇవ్వరా: మాళవిక మోహన్‘కలైజ్ఞర్ నినైవు కలైతురై విత్తగర్’ (కరుణానిధి స్మారక కళారంగ మాంత్రికులు) పురస్కారాన్ని గాయని పి. సుశీలకు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రదానం చేశారు. చెన్నైలోని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు పురస్కారంతో పాటు రూ.10లక్షల బ్యాంకు చెక్, జ్ఞాపికను స్టాలిన్ అందజేశారు.ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో జన్మించిన పి. సుశీల తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు. దీంతో ఆమెను గౌరవించే విధంగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. క్వీన్ ఆఫ్ మెలోడి, గాన కోకిలగా కొనియాడుతున్న ఆమెను ఇలా సత్కరించినందుకు సంతోషంగా ఉందని అభిమానులు తెలుపుతున్నారు. -
కోర్టుకు స్పీకర్ అప్పావు
సాక్షి, చైన్నె : అసెంబ్లీ స్పీకర్ అప్పావు శుక్రవారం చైన్నెలోని ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట తన తరఫు వాదనను ఉంచారు. గత ఏడాది చైన్నెలో జరిగిన పుస్తక ఆవిష్కరణ వేడుకలో స్పీకర్ అప్పావు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై విమర్శలు ఎక్కుబెట్టారు. జయలలిత మరణించినానంతరం 40 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు డీఎంకేలో చేరడానికి సిద్ధమయ్యారని వివరించారు. అయితే, వారిని చేర్చుకునేందుకు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ నిరాకరించారని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల పరువుకు భంగం కలిగించేలా ఉన్నట్టు ఆ పార్టీ పరిగణించింది. స్పీకర్ అప్పావుపై అన్నాడీఎంకే తరఫున పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఎంపీ, ఎమ్మెల్యేల కేసు విచారించే ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. శుక్రవారం స్పీకర్ అప్పావు ఈ పిటిషన్ విచారణ నిమిత్తం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయవేల్ ఎదుట హాజరయ్యారు. తన తరఫున వాదనను కోర్టు ముందు ఉంచారు. సమన్లను తీసుకునేందుకు తాను నిరాకరించినట్టుగా అన్నాడీఎంకే పేర్కొనడాన్ని ఖండించారు. తనకు న్యాయస్థానాలన్నా, న్యాయమూర్తులన్నా గౌరవం ఉందని, తాను సమన్లు నిరాకరించినట్టుగా పేర్కొంటున్న వ్యవహారంపై కూడా విచారణ జరగాలని ఆయన కోరారు. తనకు ఎలాంటి సమన్లు రాలేదని స్పష్టం చేశారు. వాదనల అనంతరం తర్వాత విచారణను ఈనెల 26వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.ఎంపీకి అవమానం● అధికారులు సారీసాక్షి, చైన్నె: చైన్నె విమానాశ్రయం ఆవరణలో కాంగ్రెస్ మహిళా ఎంపీ సుధాకు తీవ్ర అవమానం జరిగింది. ఆమె సామాజిక మాధ్యమం వేదికగా ఫిర్యాదు చేయడంతో విమానాశ్రయ అధికారులు శుక్రవారం సారీ చెప్పారు. మైలాడుతురై నుంచి ఎంపీగా తొలిసారిగా పార్లమెంట్లో ఆర్ సుధా అడుగుపెట్టారు. ఆమె మహిళా న్యాయవాది కావడమే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. చైన్నె విమానాశ్రయం ఆవరణలో తనకు ఎదురైన అవమానం గురించి ఆమె సామాజిక మాధ్యమం ద్వారా విమానయాన శాఖ, ఎయిర్ పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. గురువారం అర్ధరాత్రి తను ఢిల్లీ నుంచి చైన్నెకు వచ్చినట్టు పేర్కొన్నారు. తన కారులో వెళ్తుండగా పార్కింగ్ ఎంట్రీ వద్ద సిబ్బంది తనతో దురుసుగా వ్యవహరించారని, తాను ఎంపీ అని చెప్పినా బలవంతంగా ఫీజు చెల్లించే విధంగా చేశారని పేర్కొన్నారు. తాను ఫీజు చెల్లించే బయటకు రావాల్సి వచ్చిందని, ఎంపీకి విలువ లేదా అని ప్రశ్నించారు. ఇందుకు విమానాశ్రయ అధికారులు స్పందించారు. ఆమెకు క్షమాపణ చెప్పడమే కాకుండా ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామన్నారు. పార్కింగ్ ప్రవేశ మార్గంలో ఫీజులు వసూళ్లు చేస్తున్నది కాంట్రాక్టు సంస్థకు చెందిన వారని పేర్కొంటూ, అయినా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
చిత్రపరిశ్రమలో మీ జోక్యం ఎందుకు అంటూ విశాల్ ఫైర్
కోలీవుడ్ హీరో విశాల్ తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ప్రభుత్వ జోక్యం ఎక్కువైందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం చిత్ర పరిశ్రమలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో తన రత్నం సినిమా విడుదల సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేశారు.తమిళ చిత్రసీమలో రెడ్ జెయింట్ మూవీస్ ఆధిపత్యం గురించి బహిరంగంగానే విశాల్ మాట్లాడారు. ఆ సంస్థ అధినేత తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్పై కూడా విశాల్ విమర్శలు చేశారు. తను నటించిన రత్నం సినిమా విడుదలను కూడా అడ్డుకున్నారంటూ.. వారికి అలాంటి అధికారం ఎవరిచ్చారో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కడలూరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన విశాల్ మీడియాతో సమావేశమై మాట్లాడారు. ఇక సినిమా రంగంపై డీఎంకే ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని సంచలన ఆరోపణ చేశాడు.ఆయన మాట్లాడుతూ.. 'తమిళ సినిమాకు ఈ ఏడాది చాలా కష్టం కాలంగా ఉంది. సినిమాలను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడమే దీనికి కారణం. రాబోయే రోజుల్లో 10 పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. ఆ 10 సినిమాలు కూడా దీపావళి, దసరా, క్రిస్మస్ పండుగలను టార్గెట్ చేసుకుని విడుదలవుతున్నాయి. దీంతో చిన్న సినిమాలను కొనేవారు లేరు, విడుదల చేసేవారు లేరు. మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అయితే ఈ ఏడాది కమర్షియల్గా చిత్ర పరిశ్రమకు కష్టతరమైన సంవత్సరంగా మారనుంది. దీనికి ప్రధాన కారణం సినిమా పరిశ్రమలోకి ప్రభుత్వం చొచ్చుకు రావడమే.. ఇందులోకి ప్రభుత్వం ఎందుకు రావాలి..? గత ప్రభుత్వం ఇలాంటి పనులు చేయలేదు. అని విశాల్ తెలిపారు. తమిళనాడులో తాము షూటింగ్కి వెళ్లినప్పుడు తాగునీరు లేని గ్రామాలు ఎన్నో చూశామని విశాల్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పైగానే అవుతున్నా తాగునీరు లేని గ్రామాలు చూస్తున్నామంటే కాస్త విడ్డూరంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. -
'మదర్ ఇండియా'కు సిద్ధం..
తమిళసినిమా: నటుడు, దర్శకుడు శశికుమార్కు మళ్లీ హీరోగా అవకాశాలు వరుస కడుతున్నాయి. అయోథి చిత్ర విజయంతో ఈయనకు మంచి టైమ్ వచ్చిందనే చెప్పాలి. సూరి కథానాయకుడిగా నటించిన గరుడన్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించి ఆ చిత్ర విజయంలో శశికుమార్ భాగం అయ్యారు. తాజాగా మరో చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీనికి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన ఇంతకు ముందు కూక్కూ, జోకర్, జిప్సీ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఇటీవల కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన జపాన్ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో ఈయనకిప్పుడు నటుడు శశికుమార్ చేయూత నిచ్చారు. వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఒలింపియా మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.ఈ సంస్థ ఇంతకు ముందు డాడా వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రానికి మందర్ ఇండియా అనే టైటిల్ను ఖారారు చేసినట్లు తెలిసింది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా ఉంటుందని సమాచారం. ఈ చిత్రం ద్వారా కన్నడ నటి చైత్రా జె.అచ్చర్ కథానాయకిగా కోలీవుడ్కు పరిచయం అవుతున్నారు.ఈమె ఇటీవల కన్నడంలో నటించిన సప్త సాగరదాచే ఎల్లో సైడ్ ఏ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటుడు శరత్కుమార్ మరోవైపు స్వీయ దర్శకత్వంలో కుట్ర పరంపరై అనే వెబ్ సిరీస్ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇవి చదవండి: ఆవిడ బయోపిక్లో నటించాలని..! -
విద్యార్థులను ఘనంగా సన్మానించిన విజయ్.. ఆమెకు డైమండ్ రింగ్
కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ సాయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటారు. ఇప్పటికే తమిళనాడులో ఆయన అనేకసార్లు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి ప్రసిద్ధి చెందారు. తాజాగా మరోసారి మంచి మనసు చాటుకున్నారు విజయ్. ఇటీవల వెలువడిన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారిని అభినందించి వారికి బహుమతులు కూడా అందించారు. గతేడాది తమిళనాడు టాపర్కు డైమండ్ నెక్లస్ ఇచ్చిన విజయ్.. ఈ ఏడాదిలో టాపర్గా నిలిచిన విద్యార్థికి డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చారు.హీరో నుంచి రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత తొలిసారి తన పార్టీ 'తమిళగ వెట్రి కళగం' పేరుతో విధ్యార్థులను అభినందించారు. తమిళనాడులోని నియోజకవర్గాల వారీగా టెన్త్, ఇంటర్లో టాప్ 3లో నిలిచిన విద్యార్థులకు సన్మానం చేసి బహుమతులు అందించారు. తొలి విడుతగా జూన్ 28న జరిగిన ఈ కార్యక్రమంలో 750 మంది విద్యార్థులతో పాటు 3500 మంది తల్లిదండ్రులు వారి సన్నిహితులు పాల్గొన్నారు. చెన్నైలోని తిరువాన్మియూర్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.తమిళనాడు వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ ప్రతి విద్యార్థికి శాలువా, సర్టిఫికెట్తోపాటు రూ.5000 ప్రోత్సాహకం అందించి అభినందించారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ శాఖాహార విందును ఏర్పాటు చేశారు. వేడుకల్లో పాల్గొనేందుకు 21 జిల్లాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి, తమిళనాడు వెట్రి కజగం పూర్తి ఖర్చు భరించింది. వారిని తిరిగి తమ ఇంటికి చేర్చే వరకు విజయ్ అన్నీ ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి విజయ్ ఇలా మాట్లాడారు. 'ఇటీవలి పది, పన్నెండవ పరీక్షలలో విజయం సాధించిన నా తమ్ముళ్లు, సోదరీమణులు వారితో వచ్చిన తల్లిదండ్రులకు నా వినయపూర్వకమైన నమస్కారాలు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన కోర్సులో చేరండి. అనుకున్నది సాధించే వరకు పోరాడండి. సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వార్తాపత్రికలు చదవండి. డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. భవిష్యత్లో రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయంగా క్రియాశీలకంగా మారాలి.' అని విద్యార్థులను విజయ్ ప్రోత్సహించారు. గతేడాది కూడా విజయ్ ఇలాంటి కార్యక్రమమే జరిపించారనే విషయం తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయనున్నారు.వృత్తిపరంగా, విజయ్ ఇటీవల లియో చిత్రంలో కనిపించారు. ఇందులో త్రిష కూడా నటించింది. ఇది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. తాజాగా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) సినిమా పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. -
ఓబీసీల కోసం రాజ్యాంగ సవరణ తప్పదు..
బిహార్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 నుంచి 65 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ఇది దేశంలోని బీసీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. బిహార్ నమునాగా ఇతర రాష్ట్రాలు కూడా కులగణన చేసి శాస్త్రీయంగా బీసీల జీవన స్థితిగతుల లెక్కలు తీసుకుని విద్యా–ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంపుదల చేసుకోవచ్చని ఆశగా ఎదురు చూసిన వారు విస్మయానికి గురైనారు. దీంతో రాజ్యాంగ సవరణ చేయకుండా ఓబీసీల విద్యా–ఉద్యోగ రిజర్వేషన్ల పెంపుదల జరుగదని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రం 69 శాతానికి పెంచిన మొత్తం రిజర్వేషన్ శాతం ఇప్పటికీ కొనసాగుతున్న విషయం గమనార్హం. శాసన సభలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది రాష్ట్ర ప్రభుత్వం. పార్టీలకు అతీతంగా సీఎం జయలలిత ఆధ్వర్యంలో అన్ని పార్టీల ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్లి అప్పటి పీవీ నరసింçహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి... తమ శాసన సభ చేసిన చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా చేశారు. దీంతో తమిళనాడులో అమలు జరుగుతున్న 69 శాతం రిజర్వేషన్లపై ఏ కోర్టులోనూ ఛాలెంజ్ చేసే అవకాశం లేకుండాపోయింది.బిహార్ రాష్ట్రం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ తరహాలో బీసీలకు అధిక రిజర్వేషన్లు అందేలా చూడాలి. బిహార్తో పాటుగా అన్ని రాష్ట్రాలూ ఇదే దారిలో ప్రయాణించవలసి ఉంది. ఇది జాతీయ ఉద్యమంగా రూపుదాల్చవలసి ఉన్నది. ఏ రాష్ట్రంలోనైనా బీసీల రిజర్వేషన్లు పెంచాలనే తలంపుతో ఏ విధాన నిర్ణయం తీసుకున్నప్పటికీ 1992లో ‘ఇందిరా సహానీ’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాద’నే తీర్పును అడ్డుపెట్టుకుని ఆధిపత్య వర్గాలు కోర్టులకు వెళ్ళి అడ్డుపడుతున్నాయి. బిహార్లో మాదిరిగా మహారాష్ట్ర, రాజస్థాన్, హరియాణా ప్రభుత్వాలు 50 శాతం రిజర్వేషన్లు మించి ఇచ్చాయని సుప్రీంకోర్టులో పిల్స్ వేశారు. దీన్ని బట్టి చూస్తే విధిగా రాజ్యాంగసవరణ చేస్తే తప్ప బీసీలకు న్యాయం చేయడానికి వేరే మార్గం లేదని అర్థమవుతుంది.బిహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 50 శాతానికి మించి ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలా అంగీకరించిందని బీసీలు ప్రశ్నిస్తున్నారు.ఈ డబ్ల్యూఎస్కు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు జనాభా గణన చేయలేదు. వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేయకుండా అగ్రవర్ణాలలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. దేశజనాభాలో అగ్రవర్ణాలు ఎంతమంది? వారిలో పేదరికం ఎంత శాతం? ఈ లెక్కలు లేకుండా 10 శాతం రిజర్వేషన్లు ఎలా ఇచ్చారో కేంద్రమే చెప్పాలి. అయినా సుప్రీంకోర్టు ధర్మాసనం 10 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 85 శాతం మంది ఉంటే వీరిలో 56 శాతంగా ఉన్న బీసీలలో పేదలు ఎంతమందో ఎవరి దగ్గరా లెక్కలు లేవు. అందుకే ఓబీసీ రిజర్వేషన్లలో ఎలాంటి పరిమితి విధించకుండా అత్యవసరంగా రాజ్యాంగంలోని 15(4), 16(4) ఆర్టికల్స్ను సవరించాలి. అపుడే బీసీలకు విద్యా– ఉద్యోగ రంగాలలో న్యాయం జరుగుతుంది.పట్నా హైకోర్టు తీర్పు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇపుడు దేశంలోని ఓబీసీలంతా స్పష్టంగా మహాత్మా జ్యోతిబా ఫూలే ఆలోచనలతో తమిళనాడులో రామస్వామి పెరియార్ కొనసాగించిన ఉద్యమ స్ఫూర్తితో ఓబీసీ ఉద్యమం కొనసాగించవలసి ఉంది. నితీష్ ప్రభుత్వం ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున తమిళనాడులాగా ఒక చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చుకుని బిహారు రాష్ట్రం వరకు రిజర్వేషన్ల పెంపును అమలు జరుపుకునే అవకాశముంది. ప్రస్తుతం ఎన్డీఏ మిత్రత్వం బిహారుకు కలిసివచ్చే విధంగా ఉంది.దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్క తాటిపైకి వచ్చి బడుగులందరి తరఫున నిలిచి కేంద్రంపై బీసీ రిజర్వేషన్లు పెంచడానికై రాజ్యాంగ సవరణ చేయాలని ఒత్తిడి పెంచాలి. ఓబీసీల హక్కుల సాధన కోసం జాతీయోద్యమం రూపుదాల్చే సమయం ఆసన్నమయ్యింది.దేశంలో రిజర్వేషన్ల రక్షణ కోసం పాటు పడిన బీఆర్ అంబేడ్కర్ తర్వాత అంతగా కృషి చేసినవారు తమిళనాడు సామాజిక, రాజకీయ రంగాల నాయకులనే చెప్పాలి. ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు విద్యా–ఉద్యోగాలలో రిజర్వేషన్ల పెంపుదల కోసం తమిళనాడులో మహోద్యమాలు జరిగాయి. పెరియార్ రామస్వామి చేసిన కృషి మరువలేనిది. రిజర్వేషన్లను న్యాయస్థానం అడ్డుకోకుండా చేయడంలో పెరియార్ రామస్వామి జరిపిన పోరాటం మరిచిపోలేనిది. అంబేడ్కర్ రిజర్వేషన్ల రక్షణ కోసం చేసిన పోరాటానికి కొనసాగింపుగా తమిళనాడులో పెరియార్, ఉత్తర భారతంలో రామ్ మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్లు చేసిన ఉద్యమాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు దేశవ్యాపితంగా ఓబీసీ రిజర్వేషన్ల కోసం జాతీయ ఉద్యమం రూపుదాల్చవలసి ఉంది. నేటి ఓబీసీ యువతరం, విద్యావంతులు ఈ ఉద్యమంలో కీలకంగా పాల్గొనాలి. బడుగు వర్గాల నుంచి వచ్చిన యువతరం బీసీలకు జరిగిన అన్యాయాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. బీసీలను ఐకమత్యం చేసే పనిలో పాలుపంచుకోవాలి. ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ, సామాజిక రంగాలలో బీసీలకు న్యాయం జరిగేదాకా ఉద్యమపథంలో ముందుకు సాగక తప్పదు. న్యాయస్థానాల్లో న్యాయపోరాటం విధిగా చేయాలి.– జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ చైర్మన్ -
51 మంది మృతి.. ప్రభుత్వంపై భగ్గుమన్న సూర్య, విజయ్
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణపురం ప్రాంతం కల్తీ మద్యం బాధితుల రోదనలతో ప్రతిధ్వనిస్తోంది. కల్తీ మద్యం కాటుకు 51 మంది మరణించారు. అయితే, ఆస్పత్రుల పాలైన బాధితుల సంఖ్య 116కు పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ చెప్పారు. వీరిలో 34 మంది పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చొప్పున సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. క్కువ శాతం మిథనాల్ కలిపిన సారాయి తాగడం వల్లే మరణాలు సంభవించినట్లు సీఎం అన్నారు.ఈ సంఘటనపై కోలీవుడ్ టాప్ హీరోలు భగ్గుమంటున్నారు. ఈ సంఘటన గురించి దళపతి తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేయడమే కాకుండా.. బాధితులను పరామర్శించాడు. 'గతేడాది కూడా ఇలాంటి ఘటనతో 22మందికి పైగా చనిపోయారు. అయినా, ప్రభుత్వంలో ఉన్న నేతల్లో ఎలాంటి మార్పు రాలేదు. పైగా తమ విధానాలు మార్చుకోలేదు. ఇప్పటికైనా మద్యం విషయంలో ప్రభుత్వం కళ్లు తెరవాలి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి. ఈ మరణాలకు కారణమైన వారిని శిక్షించాలి. వారి మరణ వార్త వినగానే నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. మద్యం విషయంలో ప్రభుత్వ తీరును తప్పకుండా మార్పుచేయాలి. ఇలాంటి ఘటనల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇప్పటికైన తమిళనాడు ప్రభుత్వం కఠన నిర్ణయం తీసుకోవాలి.' అని విజయ్ కోరారు.ఈ ఘటనను ఖండిస్తూ హీరో సూర్య ఓ ప్రకటన విడుదల చేశారు. 'ప్రభుత్వం, రాజకీయ పార్టీలు దూరదృష్టితో వ్యవహరిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి విషాద మరణాలను అరికట్టవచ్చు. గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్వల్పకాలిక పరిష్కారాలను పక్కనపెట్టి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మద్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. కల్తీ మద్యం, అక్రమ విక్రయాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. తమిళనాడు పరిపాలన తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ బతుకులు బాగుపడాలని ఓట్లు వేసే తమిళనాడు ప్రజలు మద్యానికి బానిసలుగా కాకుండా ప్రభుత్వం చూడాలి. అందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించాలి. మద్యం విషయంలో ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావాలి.' అని సూర్య కోరారు. మృతులకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆసుపత్రిలో ఉన్నవారు కోలుకోవాలని సూర్య ప్రార్థించారు. -
ప్రియుడితో సినీ నటి ప్లాన్.. స్నేహితురాలిని బర్త్డే పార్టీకి పిలిచి ఆపై..
బర్త్డే పార్టీకి వెళ్లిన బాలికకు మత్తు మందు ఇచ్చి, లైంగికదాడి జరిగిన ఘటన తమిళనాడులో జరిగింది. ఈ కేసులో సహయనటి, విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. చైన్నెలోని పెరంబూర్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక చేత్తుపట్టులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. విద్యార్థిని తన స్నేహితులతో కలిసి అన్నానగర్ ప్రాంతంలోని ఓ కాఫీ షాప్నకు వెళ్లింది. ఆ సమయంలో పెరుంగళత్తూరు ప్రాంతానికి చెందిన సహాయ నటి ప్రతిషా అకీరాతో విద్యార్థినికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ స్నేహితులయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలో గత నెల 13వ తేదీన సాలీగ్రామంలోని ఓ హోటల్లో జరిగిన తన పుట్టినరోజు వేడుకలకు హాజరు కావాలని విద్యార్థినిని అకీరా ఆహ్వానించింది. ఆ తర్వాత అక్కడికి వెళ్లిన విద్యార్థినికి అకీరా, ఆమె ప్రియుడు సహా ఇద్దరు యువకులు మిఠాయిలు ఇచ్చారు. విద్యార్థి నిరాకరించినప్పటికీ, వారు ఆమెకు బలవంతంగా మిఠాయిలు తినిపించారు. అందులో కొంచెం తినగానే విద్యార్థిని స్పృహతప్పి పడిపోయింది. అనంతరం ఇద్దరు యువకులు ఆ బాలికను పడక గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. చాలా సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన ఆ బాలిక నిద్ర లేచి తనపై లైంగికదాడి జరిగిందని గ్రహించి దిగ్భ్రాంతి చెందింది. దీని గురించి అడిగితే జరిగిన సంఘటన గురించి బయట చెప్పవద్దు. అలా అయితే, నీకు, మీ కుటుంబానికి పరువు పోతుందని సహాయ నటి అకీరా విద్యార్థినిని బెదిరించింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం తెలుపలేదు. ఈ స్థితిలో రెండు రోజుల క్రితం తనపై లైంగికదాడి జరిగిన విషయాన్ని విద్యార్థిని తన సోదరికి చెప్పింది. వెంటనే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బర్త్ డే పార్టీ అంటూ తన కుమార్తెకు మత్తు మందు కలిపిన మిఠాయిలు ఇచ్చి లైంగికదాడి చేశారంటూ విద్యార్థిని తల్లిదండ్రులు విరుగంబాక్కం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నటి అకీరా, వడపళనికి చెందిన కాలేజీ విద్యార్థి సోమేశ్ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న విలియమ్స్ కోసం వారు తీవ్రంగా వెతుకుతున్నారు. బర్త్ డే పార్టీకి వెళ్లిన విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన చైన్నెలో సంచలనం సృష్టించింది. -
కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇల్లు పోలీసుల రక్షణలో ఉంది. ఇలా రెండున్నరేళ్ల నుంచి ఆయన ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో పోలీసు రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై తమిళనాట చర్చ జరుగుతుంది. సూర్య కుటుంబం ప్రస్తుతం చెన్నైలో లేదు.. అయినా కూడా ఆ ఇంటికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలుసుకుందాం.జై భీమ్తో వివాదంసూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్ కలిసి నిర్మించిన చిత్రం జై భీమ్. 2021లో అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం విడుదలైంది. జైభీమ్లోని కొన్ని సన్నివేశాలు తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని 'రుద్ర వన్నియర్ సేన' సంఘం ఆరోపించింది. ఇరులార్ కమ్యూనిటీ (ఆదివాసీలు) సభ్యులకు కస్టోడియల్ టార్చర్ వెనుక తమ వర్గానికి చెందిన సభ్యులు ఉన్నట్లు సినిమాలో చూపించడాన్ని వారు తప్పుపట్టారు. సూర్యపై దాడి చేసిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని ఆ సంఘం తెలిపింది. 'రుద్ర వన్నియర్ సేన' సంఘానికి సూర్య బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో టీ నగర్లోని సూర్య ఇంటి వెలుపల ఐదుగురు సాయుధ పోలీసులను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇప్పటికీ పోలీసుల రక్షణ ఎందుకు..?జై భీమ్ సినిమా సమస్య కొన్ని నెలల తర్వాత ముగిసినప్పటికీ, సూర్య ఇంటికి గత రెండున్నరేళ్లుగా నలుగురు పోలీసులు రక్షణగా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో సూర్య కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. వారందరూ ఇప్పుడు ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. అయినా ఆ ఇంటికి పోలీసుల రక్షణ ఎందుకు అనే ప్రశ్న తలెత్తింది. ఈ పరిస్థితిలో, నటుడు సూర్య ఇంటికి పోలీసు రక్షణ ఎవరి ఆదేశాల మేరకు కొనసాగుతుందని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించారు. పోలీస్ కమిషనర్ వివరణపోలీస్ కమిషనర్ ఆదేశం మేరకు నవంబర్ 15, 2021న తాత్కాలిక భద్రత కల్పించామని, సూర్యకు ముప్పు పొంచి ఉన్నందున భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం మేరకు భద్రతను ఇప్పటికీ కొనసాగిస్తున్నామని సమాధానమిచ్చారు. సాధారణంగా బెదిరింపులకు గురైన వ్యక్తులకు పోలీసు రక్షణ కల్పించినప్పుడు సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా పోలీసు శాఖకు రుసుము చెల్లించాలి. అలా అయితే, ప్రస్తుత పోలీసు రక్షణ కోసం సూర్య ఏమైనా డబ్బు చెల్లిస్తున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తింది, దానికి సమాధానం లేదు. దీంతో గత రెండున్నరేళ్లుగా సూర్య ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పిస్తున్నట్లు తేలింది. ఇది ఎంతవరకు న్యాయమని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఇందులో తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆయన అన్నారు. -
ఇంటర్లో టాప్ మార్కులతో అదరగొట్టిన సూర్య కూతురు
సౌత్ ఇండియాలో బ్యూటిఫుల్ కపుల్స్గా సూర్య- జ్యోతిక జంట ఉంటుంది. చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన జోడీగా వీరికి గుర్తింపు ఉంది. వీరి కుమార్తె దియా ఇటీవల ముగిసిన 12వ తరగతి సాధారణ పరీక్షలో మంచి మార్కులు సాధించినట్లు సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, ఈ దంపతలులకు దియా అనే 17 ఏళ్ల కుమార్తెతో పాటు దేవ్ అనే 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు.సూర్య కుటుంబం మొత్తం సినిమా రంగంలో ఉన్నప్పటికీ దియా, దేవ్ ఇద్దరు కూడా సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. దియా టెన్నిస్, ఫుట్బాల్ ఆటలపై దృష్టి సారిస్తుంటూ.. దేవ్ కరాటే వైపు అడుగులు వేస్తున్నాడు. చదువుతో పాటుగా ఆటలపై కూడా వారు ఆసక్తి చూపుతున్నారు.ఇంటర్లో అదరగొట్టిన దియాసూర్య కూతురు దియా ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు రాసింది. తాజాగా ఫలితాలు కూడా విడుదలయ్యాయి. దియా మంచి మార్కులతో పాస్ అయినట్లు సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె సాధించిన మార్కులు ఇవే అంటూ కోలీవుడ్లో వైరల్ అవుతుంది. తమిళంలో 100కి 96, ఇంగ్లిష్లో 97, గణితంలో 94, ఫిజిక్స్లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్లో 97 మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించినట్లు సమాచారం. దియా ఇన్ని మార్కులు సాధించినందుకు కుటుంబ సభ్యులు ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారట. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఈ సమాచారం ఎంత వరకు నిజమో తెలియదు.2022లో టెన్త్లో కూడా సత్తా చాటిన దియా10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా దియా టాప్ మార్క్లు సాధించింది. తమిళంలో 95, ఆంగ్లంలో 99, గణితంలో 100, సైన్స్లో 98, సోషల్లో 95 మార్కులు సాధించింది. 500 మార్కులకు గాను 487 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. -
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
గతేడాదిలో 'సలార్'తో ట్రెండింగ్లోకి వచ్చిన శ్రియా రెడ్డి తాజాగా 'తలైమై సేయలగం' వెబ్ సిరీస్తో రానుంది. తమిళంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్లో కాంతార ఫేమ్ కిషోర్ మరో లీడ్రోల్లో నటిస్తోన్నాడు. జీ5 వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ ఈ సిరీస్ను రిలీజ్ చేస్తున్నారు.తలైమై సేయలగం పేరుతో తెరకెక్కుతోన్న ఈ పొలిటికల్ డ్రామా సిరీస్ను భారీ అంచనాలతో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో శ్రియారెడ్డితో పాటు కస్తూరి, భరత్, రమ్య నంబీశీన్, దర్శన గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ వసంత బాలన్ ఈ పొలిటికల్ మ్యాజిక్ సిరీస్కు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ గురించి కీలక సమాచారాన్ని మేకర్స్ ప్రకటించారు. మే 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోందని తెలిపారు.రీసెంట్గా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన రాధిక శరత్కుమార్ ఈ వెబ్ సిరీస్ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తమిళనాడు నుంచి బీజేపీ అభ్యర్థిగా లోకసభ ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడులో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రాడాన్ మీడియా వర్క్స్ పతాకంపై ఆమె నిర్మిస్తుంది. ఈ సిరీస్కు గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. -
ఓటింగ్ కేంద్రంలో ఆమె కాళ్లకు నమస్కరించి సెల్ఫీ దిగిన స్టార్ హీరో
తమిళనాడులో నేడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కోలీవుడ్ ప్రముఖ హీరోలు క్యూ కట్టారు. సెలబ్రిటీలతో పాటుగా సామాన్య ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా క్యూలలో నిలబడి తమ ప్రజాస్వామిక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, తలపతి విజయ్, నటుడు ధనుష్, నటుడు విక్రమ్ వంటి ప్రముఖులు చెన్నైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విదేశాల్లో ఉన్న విజయ్ కూడా ఈరోజు తమిళనాడుకు వచ్చి ఓటు వేశారు. చేతికి చిన్న గాయంతో కనిపించిన విజయ్ వచ్చే 2026 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ సందర్భంలో కోలివుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు, వీల్ చైర్లో నడవలేని ఒక వృద్ధురాలు ఆయన్ను సెల్ఫీ కోరింది. విజయ్ నటన అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంది. మంచి భవిష్యత్ ఉన్న నటుడు అని ఆమె కొనియాడింది. దీంతో వెంటనే విజయ్ సేతుపతి ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకుని ఆ వృద్ధురాలితో సెల్ఫీ దిగి ఆనందం వ్యక్తం చేశాడు. ఆమె తల్లి లాంటి వ్యక్తి కావడంతో కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ సమయంలో చాలామంది అభిమానులు ఆయనతో కరచాలనం చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. This Is Why He Is Makkal Selvan #VijaySethupathi 🥹❤️pic.twitter.com/txOW6vF731 — Kolly Corner (@kollycorner) April 19, 2024 -
తమిళనాడులో ఎన్నికలు.. తొలి ఓటు వేసింది ఆ స్టార్ హీరోనే
లోక్సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 39 స్థానాలకూ నేడు (ఏప్రిల్ 19) తొలి దశలోనే ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఎంతో ఉత్కంఠతో కూడిన ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే,బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. అయితే తమిళనాడు లోక్సభ ఎన్నికలకు ఓటు వేసేందుకు నటులు రజనీకాంత్, అజిత్ కుమార్, శివకార్తికేయన్ శుక్రవారం తెల్లవారుజామున పోలింగ్ బూత్లకు చేరుకున్నారు. రజనీకాంత్, అజిత్ కుమార్, శివకార్తికేయన్ శుక్రవారం ఉదయం చెన్నైలోని పోలింగ్ బూత్లలో ఓటు వేసేందుకు క్యూ లైన్లలో నిలబడ్డారు. తమిళ మీడియా చెబుతున్న ప్రకారం ఈ ఎన్నికల్లో మొదటగా ఓటేసిన సినిమా హీరో అజిత్ కుమార్ అని తెలుస్తోంది. ఆయన ఉదయం 6:30 గంటలకే పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాక ముందే ఆయన క్యూ లైన్లో పాల్గొన్నారు. చెన్నైలోని తిరువాన్మియూర్లో అజిత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని నిమిషాల తర్వాత, రజనీకాంత్, శివకార్తికేయన్లు కూడా పోలింగ్ బూత్ల వద్ద ఓటు వేయడానికి బారులు తీరిన క్యూ లైన్లోనే నిలబడ్డారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మిడియాతో పలు విషయాలను పంచుకున్నారు. ప్రజలు బయటకు వచ్చి తమ పౌర కర్తవ్యాన్ని నిర్వహించాలని రజనీకాంత్,అజిత్, శివకార్తికేయన్ కోరారు. వీరందరి తర్వాత MNM అధినేత కమల్ హాసన్ చెన్నైలోని కోయంబేడులోని పోలింగ్ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీ చేయడం లేదు. #WATCH | Tamil Nadu: Actor Ajith Kumar arrives at a polling Booth in Thiruvanmiyur to cast his vote in the first phase of #LokSabhaElections2024 pic.twitter.com/WtX1er0u0j — ANI (@ANI) April 19, 2024 #Sivakarthikeyan Casted his vote 👆✅ pic.twitter.com/aHI9felO1w — AmuthaBharathi (@CinemaWithAB) April 19, 2024 #WATCH | Actor Rajnikanth casts his vote at a polling booth in Chennai, Tamil Nadu. #LokSabhaElections2024 pic.twitter.com/6Ukwayi5sv — ANI (@ANI) April 19, 2024 #WATCH | Tamil Nadu: Actor and MNM chief Kamal Haasan casts his vote at a polling booth in Koyambedu, Chennai. Makkal Needhi Maiam (MNM) is not contesting the #LokSabhaElections2024📷, the party supported and campaigned for DMK. pic.twitter.com/Skw6hyAMXu — ANI (@ANI) April 19, 2024 -
టార్గెట్ ఫిక్స్.. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విశాల్
తమళనాడులో పొలిటికల్ ఎంట్రీపై హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఇండియాలో టాప్ హీరో లిస్ట్లో ఉన్న విశాల్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని చాలా ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో ఓ ప్రెస్మీట్లో పాల్గొన్న విశాల్ రాజకీయ ప్రకటన చేశారు. తమిళనాడులో కొత్త పార్టీని స్థాపించి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. సరైన వసతులు లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారందరికీ సేవ చేయడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే తన ఉద్దేశం అని.. ఈ కారణంతోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు విశాల్ పేర్కొన్నారు. ఇదే సమయంలో మరో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా..? అని ప్రశ్నించగా.. అందుకు ఆయన నో అని చెప్పారు. ముందుగా ప్రజల్లో తాను ఏంటో నిరూపించుకోవాలని తెలిపారు. ఆ తర్వాతే ఎన్నికల పొత్తు గురించి ఆలోచిస్తానని అన్నారు. విజయ్ తర్వాత విశాల్ కూడా రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటన రావడంతో ఈ టాపిక్ ఇప్పుడు తమిళనాట భారీ చర్చలకు దారితీసింది. తమిళనాడులో విశాల్ ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ క్రమంలో తన అమ్మగారి పేరు మీద నెలకొల్పిన ‘దేవి ఫౌండేషన్’తో ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు, బాధిత రైతులకు సాయం చేస్తున్నారు. షూటింగ్లకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజల కష్టాలు, అవసరాలను అడిగి తెలుసుకుని వారందరికీ తగిన సాయం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారందరికీ తన చేతనైనంత సాయం చేస్తూ విశాల్ వార్తల్లో నిలుస్తూ వచ్చిన విషయం తెలిసిందే. -
విజయ్పై ఎన్నికల్లో పోటీ చేస్తా.. ప్రకటించిన స్టార్ హీరోయిన్
'తమిళగ వెట్రిక్ కళగం' పేరుతో తమిళనాడులో రాజకీయ పార్టీని పెట్టారు దళపతి విజయ్. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో ఉంటుందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నట్లు విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్ పార్టీ పెట్టిన సమయం నుంచి తమిళనాట రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది. 2026 ఎన్నికల్లో గట్టిపోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో హీరో విజయ్పై తాను పోటీ చేస్తానని సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రకటించేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గ్లామర్ డాల్ నమిత.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ మీద పోటీ చేస్తానని ప్రకటించింది. నమిత తమిళనాడు బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున నమిత చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ తరఫున ఎన్నికల ప్రచారంలో ఆమె ఉంది. నీలగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎల్ మురుగన్ పోటీ చేస్తుండటంతో ఆయన తరపున నమిత ఎన్నికల ప్రచారం చేస్తుంది. దీంతో నమితను చూసేందుకు భారీగా జనాలు ఎగబడుతున్నారు. నమితకు తమిళనాడులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె కోసం ఏకంగా అభిమానులు గుడి కూడా కట్టించారు. ఈ క్రమంలో 2026 ఎన్నికల్లో తాను బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్పై పోటీ చేస్తానని చెప్పిన నమిత.. విజయ్ కూడా రాజకీయాల్లో రాణించాలని కోరుకుంది. రాజకీయాల్లో తెలివైన ప్రత్యర్థిపై పోటీ చేయాలని, అప్పుడే రాజకీయ ఎదుగుదలకు అవకాశం ఉంటుందని అనుకుంటున్నట్లు నమిత తెలివిగా సమాధానం చెప్పింది. హీరో విజయ్ మీద నమిత పోటీ చేస్తే డిపాజిట్లు కూడా ఆమెకు దక్కవని ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో నమిత పేరు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. -
ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకున్న ఖుష్బూ.. కారణం ఇదేనా?
బరువెక్కిన హృదయంతో ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకుంటున్నానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సినీ నటి, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఖుష్బూ లేఖ రాశారు. తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికలలో ఖుష్బూ సీటును ఆశించిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు బీజేపీ సీటు ఇవ్వలేదు. దీంతో కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు, ఎన్నికల ప్రచారాలకు ఆమె దూరంగా ఉంటూ రావడం చర్చకు దారి తీసింది. దీనికి ముగింపు పలికే విధంగా అధిష్టానం ఆదేశాల మేరకు కొద్దిరోజు క్రితమే ఎన్నికల ప్రచారానికి కుష్భు సిద్ధమయ్యారు. కొన్ని చోట్ల మమా అనిపించే విధంగా ప్రచారం కూడా చేశారు. శనివారం దక్షిణ చైన్నె అభ్యర్థి తమిళి సై సౌందర రాజన్కు మద్దతుగా కుష్బూ ప్రచారం కూడా చేశారు. అయితే హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో గానీ ఎన్నికల ప్రచారం నుంచి బరువెక్కిన హృదయంతో తాను తప్పుకుంటున్నట్లు జేపీ నడ్డాకు ఆమె లేఖ రాయడం గమనార్హం. కారణం ఇదేనా..? 2024 లోక్సభ ఎన్నికల్లో ఖుష్బూకు సీటు ఇవ్వకుండా బీజేపీ దూరం పెట్టిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో తాజాగా పార్టీలో చేరిన మరో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్కు బీజేపీ సీటు ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారని తమిళనాట భారీగా ప్రచారం జరుగుతుంది. ఈసారి తప్పకుండా సీటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న ఖుష్బూకు సీటు దక్కకపోవడంతో తీవ్రమైన నిరాశకు గురైయారని వినికిడి. ఈ లోక్సభ ఎన్నికల్లో అన్నామలై, ఎల్.మురుగన్, తమిళిసై సౌందర్రాజన్, రాధికా శరత్కుమార్ వంటి ముఖ్యులకు సీటు కేటాయించిన విషయం తెలిసిందే. పార్టీలో సీనయర్ల అందరికీ సీటు కేటాయించిన బీజేపీ.. ఖుష్బూకు మొండి చేయి చూపించింది. వాస్తవంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూ పోటీ చేసి ఓడిపోయారనే విషయం తెలిసిందే. దీంతో ఈ లోక్సభ ఎన్నికల్లో మళ్లీ ఆమెకు కేటాయిస్తారని అక్కడి నేతలు అందరూ భావించారు. ఖుష్బూకు ఎందకు సీటు దక్కలేదనే విషయంపై తమిళనాడు బీజేపీ నేతలు కూడా పలు కామెంట్లు చేస్తున్నారు. ఖుష్బూకు ఎక్కడ ఏం మాట్లాడాలో ఇంకా తెలియలేదని వారు చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం మహిళలకు ప్రతి నెలా ఇస్తున్న రూ.1000ను భిక్షగా ఆమె కామెంట్ చేసి తప్పుచేశారని పేర్కొంటున్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీకి నష్టాన్ని తెచ్చాయని చెబుతున్నారు. అది కాస్త అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించాయంటున్నారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలోని మహిళలు కూడా ఖుష్బూ పట్ల సానుకూలంగా లేరని గుర్తుచేశారు. అందువల్ల ఆమెకు సీటు ఇస్తే ఓడిపోతారన్న భావనతో కేటాయించలేదని బీజేపీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఫైనల్గా ఆమెకు సీటు దక్కకపోవడం.. రీసెంట్గా పార్టీలో చేరిన రాధికా శరత్ కుమార్కు ప్రధాన్యత ఇచ్చి సీటు ఇవ్వడంతో ఖుష్బూలో వ్యతిరేఖత వచ్చిందని అందుకే ఇక ఎన్నికల ప్రచారానికి ఆమె గుడ్బై చెప్పారని ప్రచారం జరుగుతుంది. -
ఈ ముగ్గురు సినిమా స్టార్స్ ధరించిన 'కరుంగలి దండ' గురించి తెలుసా..?
చాలామంది ప్రముఖులు తమ మెడలో స్పటిక,రుద్రాక్ష, కరుంగలి మాల ఇలా వారి నమ్మకం కొద్ది వివిధ దండలు ధరిస్తూ ఉంటారు. ప్రస్తుతం కోలీవుడ్కు చెందిన స్టార్స్ లోకేష్ కనగరాజ్, ధనుష్, శివకార్తికేయన్ వంటి వారు కరుంగలి దండను తమ మెడలో ఎప్పటికి ధరించే ఉంటారు. వారు పలు వేదికల మీదికి వెళ్లినా సరే ఈ దండను మాత్రం తొలగించరు. అంతలా ఈ కరుంగలి దండకు వారు ప్రాముఖ్యత ఇస్తారు. అది ఎందుకు ధరిస్తున్నారో అనే విషయాన్ని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కారణం ఏమిటంటే..: లోకేష్ కనగరాజ్ 'విక్రమ్ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఒక సందర్భంలో షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాధానికి గురయ్యాను. అప్పుడు నా మిత్రుడు ఆర్ట్ డైరెక్టర్ సతీష్ నాకు ఈ కరుంగలి దండను ఇచ్చాడు. అప్పుడు ఈ మాల గురించి నాకు పెద్దగా ఎలాంటి సమాచారం తెలియదు. కానీ ఈ దండను ధరించమని అతను చెప్పడంతో నేను తీసుకున్నాను. ఇక నుంచి నీకు అన్నీ మంచే జరుగుతాయి.. ఎలాంటి ప్రమాధాలు జరగవు అని చెప్పాడు. నాకు అలాంటి వాటి పట్ల పెద్దగా నమ్మకం లేదు. కానీ ఆయన కోరిక మేరకు ఆ మాలను ధరించాను. కానీ ఆ సమయం నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. విక్రమ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎంతో పేరుప్రతిష్ఠలు వచ్చాయి. దీంతో ఆ దండను నేను ఎప్పడూ తొలగించలేదు.' అని ఆయన చెప్పారు. కరుంగాలి మాల అంటే.. కరుంగలి అంటే జమ్మి చెట్టు అని అర్థం. ఆ చెట్టు కాండం నుంచి ఈ దండను తయారు చేస్తారు. జ్యోతిషశాస్త్ర రీత్యా, కరుంగాలి మాల అంగారక గ్రహానికి చెందినది. అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉందని, అలాగే ఈ హారం ధరించిన వ్యక్తి వారి జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందని జ్యోతిష్య నిపుణుల నమ్మకం. అలాగే విద్యార్థులు తమ జ్ఞాపకశక్తి , మేధో శక్తులను మెరుగుపరచడానికి , విద్యలో రాణించడానికి ఈ మాలన ధరిస్తారని చెబుతారు.వ్యాపారస్తులతో పాటు నిరుద్యోగులు, జాబ్ హోల్డర్లు కూడా ఈ దండను ధరిస్తారు. అందుకే ఈ దండలకు భారీ డిమాండ్ పెరిగింది. ఆన్లైన్లో దొరికే మాలలన్నీ డూప్లికేట్ ఉండొచ్చని.. వాటి వల్ల మంచి కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువని జ్యోతిష్య నిపుణులు పలు సందర్భాల్లో హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ మాలను తమిళనాడులోని పాతాళ శంభు మురుగన్ ఆలయం దగ్గర మాత్రమే తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. రాత్రి నిద్రపోయే ముందు ఈ హారాన్ని తీసి ఇంట్లో దేవుడు దగ్గర పెట్టుకుని.. ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ ఈ మాలను ధరించవచ్చని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తారు. తమిళనాడులోని సోలైమలై కొండల దిగువన ఈ ఆలయం ఉంది. మదురై నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయంలో సుబ్రమణ్య స్వామి ఉన్నారు. శివకార్తికేయన్, ధనుష్ కూడా కరుంగాలి అభిమానులే కరుంగలి మాలను కోలీవుడ నుంచి శివకార్తికేయన్, ధనుష్ కూడా ధరిస్తారు. ఒక ఇంటర్వ్యూలో ఈ దండ గురించి మాట్లాడుతూ.. 'ఈ కరుంగలి మాల ధరించిన సమయం నుంచి నా జీవితం మారిపోయింది. సినిమాల పరంగా మంచి అవకాశాలు దక్కాయి.' అని చెప్పాడు. పలుమార్లు ఈ ఆలయానికి ధనుష్ కాలినడక ద్వారా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. చుట్టూ కొండల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. -
విజయ్ పార్టీలో స్టార్ నటుడి కుమారుడు.. గతాన్ని తలుచుకుని ఎమోషనల్
తమిళ సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని 'తమిళగ వెట్రిక్కళగం'లో సభ్యులుగా చేరేందుకు రాష్ట్రంలోని యువకులు పోటీ పడ్డారు. ఆయన పిలుపు ఇచ్చిన 24 గంటల్లోనే 50 లక్షల మందికి పైగా సభ్యులుగా పేర్లను నమోదు చేసుకున్నారు. సభ్యత్వం పొందినవారిలో యాభైశాతానికి పైగా యువతీయువుకులే ఉన్నారని సమాచారం. ఈ సందర్భంలో, ప్రముఖ నటుడు నాజర్ కుమారుడు 'నూరుల్ హసన్ ఫైజల్' విజయ్ పార్టీలో చేరారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ విజయ్ సార్ అంటే ఎనలేని అభిమానంతో పార్టీలో చేరినట్లు ఆయన అమ్మగారు 'కెమిలా' ఈ సందర్బంగా చెప్పారు. ఈ క్రమంలో విజయ్తో ఉన్న అనుబంధాన్ని ఆమె ఇలా గుర్తుచేసుకున్నారు. 'నా కుమారుడు చిన్నప్పటి నుంచి విజయ్ సార్ను అభిమానిస్తాడు. కొన్నాళ్ల క్రితం అతను యాక్సిడెంట్కి గురి కావడంతో ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. కనీసం మమ్మల్ని కూడా గుర్తుపట్టలేదు. కానీ విజయ్ సార్ని మాత్రమే ఆ సమయంలో గుర్తుపట్టాడు. ఆ తర్వాత విజయ్ సార్ మా ఇంటికి వచ్చి ఆయన్ను ఓదార్చారు.' అని నాజర్ సతీమణి గుర్తుచేసుకున్నారు. ఈరోజు తమ కుమారుడు ఇలా ఉన్నాడంటే దానికి ప్రధాన కారణం విజయ్ అంటూ నాజర్ కూడా ఎమోషనల్ అయ్యాడు. విజయ్ పార్టీ పెట్టి తన అభిమానులకు పిలుపు ఇవ్వడంతో వెంటనే తమ కుమారుడు ఫైజల్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నట్లు ఆయన అన్నారు. విజయ్ సార్ రాజకీయాల్లోకి రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని ప్రస్తుత వాతావరణంలో మార్పు రావాలని ఆయన చెప్పుకొచ్చారు. -
జయలలిత ఆస్తుల వేలం.. కోర్టుకు చెల్లించాల్సిన డబ్బు ఎంత..?
దివంగత సీఎం జయలలిత జీవితం సినిమా రంగం నుంచే ప్రారంభమైంది. ఇష్టం లేకపోయిన డబ్బు కోసమే ఈ రంగంలోకి అడుగుపెట్టినట్లు ఆమె చెప్పేవారు. అలా సినిమాల్లో స్టార్గా ఉన్నప్పుడే 1982లో రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత అక్కడ కూడా తన సత్తా చాటారు. సినిమా రంగంలో ఉన్నప్పుడే భారీగా ఆస్తులు కూడబెట్టిన ఆమె రాజకీయాల్లో తన ఆస్తులపై పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆమెకు చెందిన ఆభరణాలు, ఆస్తులను వేలం వేసి కోర్టుకు ఆమె చెల్లించాల్సిన జరిమానా మొత్తాన్ని అందజేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. వివరాలు.. అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి, చిన్నమ్మ శశికళ, చిన్నమ్మ బంధువులు ఇలవరసి, సుధాకరన్కు 2014లో బెంగళూరు ప్రత్యేక కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఇందులో అమ్మ జయలలితకు నాలుగేళ్లు జైలు శిక్షతో పాటు రూ. 100 కోట్లు జరిమానా విధించారు. మిగిలిన వారికి తలా రూ. పది కోట్లు జరిమానా, జైలు శిక్ష విధించారు. దీనిని వ్యతిరేకిస్తూ అప్పీల్కు వెళ్లగా నిర్దోషులుగా బయటపడ్డారు. అయితే ఈ తీర్పుపై దాఖలైన పునర్ సమీక్ష పిటిషన్పై విచారణ ముగియక ముందే జయలలిత మరణించారు. 2017లో వెలువడ్డ ఈ తీర్పులో జయలలితను దోషిగానే పరిగణించారు. ఆమె జీవించి లేకపోవడంతో శిక్ష నుంచి తప్పించారు. అయితే జరిమానాలో మార్పు చేయలేదు. జయలలిత మరణించి 6 సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు జరిమానా చెల్లింపు జరగలేదు. ఈ జరిమానా వసూలుపై కోర్టు దృష్టి పెట్టింది. అదే సమయంలో జయలలిత వద్ద సీజ్ చేసిన బంగారు ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 28 కేజీల నగలు, 800 కేజీల వెండితో పాటు ఇతర వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికి మార్చి 6,7 తేదీలలో అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. దీనిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించినానంతరం జరిమానా చెల్లింపునకు సంబంధించిన ఆదేశాలు వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. జయలలితకు చెందిన ఆభరణాలను ట్రెజరీకి పంపించి విలువ లెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపడుతుండడం గమనార్హం. దీని ఆధారంగా రూ. 40 కోట్లు వచ్చేందుకు వీలుందని, మరో 60 కోట్లు ఆమెకు చెందిన ఆస్తులను వేలం వేసి అందించాలని కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అలాగే కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 5 కోట్లు కర్ణాటక ప్రభుత్వానికి అందజేయాల్సి ఉండడంతో ముందస్తు లెక్కలతో జయలలిత ఆస్తుల వేలానికి కార్యాచారణ ప్రారంభించినట్లు తెలిసింది. -
విజయ్కాంత్పై ప్రేమతో ఆయన సతీమణి ఏం చేశారంటే..?
నటుడు విజయకాంత్ సతీమణి ప్రేమలత తన చేతిపై భర్త బొమ్మను పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డీఎండికే అధినేత, నటుడు అనారోగ్యం కారణంగా గత డిసెంబర్లో కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయంలో ఖననం చేశారు. విజయకాంత్ మృతి చెంది నెలరోజులు కావొస్తున్నా.. ఆయన స్మారక స్థూపానికి సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు రోజూ పెద్దసంఖ్యలో తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. ముఖ్యంగా బయట ప్రాతాల నుంచి చైన్నెకి వచ్చిమరీ అభిమానులు సందర్శిస్తున్నారు. అలాగే నిత్యం ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ఇదిలా ఉండగా విజయకాంత్ సతీమణి ప్రేమలత తాజాగా తన కుడిచేతిపై విజయకాంత్ బొమ్మను టాటూగా వేయించుకున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిత్యం విజయకాంత్ను చూసుకునేలా ఈ టాటూ వేసుకున్నట్లు తెలుస్తోంది. -
Actor Vijay: ‘ఎదుగుదలకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు’
చెన్నై: ‘తమిళగ వెట్రి కళగం’పార్టీని ప్రకటించిన సినీనటుడు విజయ్ దళపతి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు, బృందాలను రంగంలోకి దించబోతున్నారని సమాచారం. తాజాగా విజయ్ ఒక లేఖను విడుదల చేశారు. ‘నా ఎదుగుదలకు సహకరించిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు. సినీరంగ ప్రముఖులు, వివిధ రాజకీయపార్టీ నేతలు, అభిమానులు, అండగా నిలిచిన మీడియా అందరికీ కృతజ్ఞతలు. గుండెల్లో నింపుకున్న అభిమానులు అందిరికీ థ్యాంక్యూ. తమిళ ప్రజలు సంక్షేమం కోసం రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్నా.. విజయం సాధిస్తా..’ అని విజయ్ లేఖలో పేర్కొన్నారు. -
పొలిటికల్ ఎంట్రీ తర్వాత విజయ్ ప్లాన్ ఇదేనా..?
'తమిళగ వెట్రి కళగం' పార్టీని ప్రకటించిన సినీనటుడు విజయ్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. లోక్సభ ఎన్నికల అనంతరం రాష్ట్ర పర్యటనపై దృష్టి పెట్టే విధంగా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. వివరాలు.. దశాబ్ద కాలంగా రాజకీయ చర్చలు, వార్తలకు తెరదించుతూ రాజకీయ పార్టీని విజయ్ ప్రకటించేసిన విషయం తెలిసిందే. 'తమిళగ వెట్రి కళగం'గా నామకరణం చేసిన విజయ్ పార్టీలో 'ద్రావిడం' అన్న పదానికి చోటు కల్పించ లేదు. తమిళనాడులోని పార్టీల ముందు తప్పనిసరిగా ఆ పదం అనేది ఉంటూ వస్తోంది. అయితే భిన్నంగా తమిళ ప్రజలు, తమిళనాడును ప్రతిబంబించే విధంగా 'తమిళగ వెట్రి కళగం' అన్న పేరు ప్రజలలోకి దూసుకెళ్లడం ఖాయం అని విజయ్ మద్దతుదారులు, అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్రకటన చేసిన విజయ్కు మక్కల్ నీది మయ్యం నేత, విశ్వనటుడు కమల్ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసినట్టు సమాచారం. ఇక విజయ్కు సర్వత్రా శుభాకాంక్షలు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎండీఎంకే నేత వైగో సైతం విజయ్ మంచివారని, గర్వం లేని వ్యక్తి అని పేర్కొంటూ, ఆయన రాకను ఆహ్వానిస్తున్నానని ప్రకటించారు. విజయ్ రాకతో డీఎంకేకు వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ ఎంపీ 'కనిమొళి' వ్యాఖ్యానించారు ప్రజల్లోకి ఎంట్రీ ఎప్పుడంటే.. పార్టీ ప్రకటన తదుపరి ఇక మున్ముందు రాజకీయంగా కార్యాచరణను విస్తృతం చేయడానికి విజయ్ సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలను, బృందాలను రంగంలోకి దించబోతున్నారు. జిల్లాల కార్యదర్శులతో భేటీలను విస్తృతం చేయనున్నారు. ఇప్పటికే ఆనంద సాగరంలో మునిగి ఉన్న అభిమానులందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చే విధంగా పార్టీ సభ్యత్వ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి పెట్టబోతున్నారు. అలాగే పార్టీ జెండా, గుర్తును ప్రజలకు పరిచయం చేయడం, పార్టీ ఆవిర్భావ మహానాడుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మహానాడు మదురై లేదా కడలూరులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూలై లేదా ఆగస్టు నుంచి విజయ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలు ఉంటాయని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. అదే సమయంలో పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా, సమాచారమైనా ఇకపై విజయ్ మాత్రమే ప్రకటిస్తారని విజయ్ మక్కల్ ఇయక్కం ప్రధాన కార్యదర్శి బుషి ఆనంద్ పేర్కొన్నారు. విజయ్ ఎలాంటి సమాచారమైనా స్వయంగా ప్రకటిస్తారని, అంత వరకు వేచి ఉండాలని సూచించారు. -
Vijay Political Party: రాజకీయ పార్టీ ప్రకటించిన హీరో విజయ్
తమిళనాడులో హీరో విజయ్ పార్టీ ప్రకటించాడు. 'తమిళగ వెట్రి కళగం'Tamizhaga Vetri Kazhagam పేరుతో ఆయన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. గత మూడేళ్లుగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతుండగా నేటితో దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తమిళగ వెట్రి కళగం పేరును రిజస్టర్ చేసినట్లు ప్రకటన రావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. గత కొద్ది నెలలుగా ఆయన ఎక్కువగా ప్రజల్లోనే కనిపించడమే కాకుండా పలు సేవా కార్యక్రామాల్లో పాల్గొంటు ఉన్న విషయం తెలిసిందే. పార్టీ ప్రకటన అయితే వచ్చేసింది కానీ అందుకు సంబంధించిన గుర్తును త్వరలో ప్రకటించనున్నారు. పార్టీ ఎజెండాను కూడా త్వరలో ప్రకటిస్తామాని విజయ్ నుంచి ఒక నోట్ వెలువడింది. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని దానిని నిర్మూలించడమే తన ధ్యేయం అని విజయ్ అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన టార్గెట్ అని విజయ్ పేర్కొన్నారు. హీరో విజయ్ తన రాజకీయ రంగప్రవేశం ఒకరోజుతో అనుకుని జరగలేదు. పక్కా ప్లాన్తోనే ఆయన అడుగులు వేశారు. పొలిటికల్ రంగంలోకి దిగిన తర్వాత తన లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి అనే దృఢ సంకల్పంతోనే టీమ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తన విజయ్ మక్కళ్ ఇయక్కుమ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరవయ్యారు. ఈ సంఘం ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆపై అనేక రక్తదాన శిబిరాలతో పాటు ఉచిత విద్య కేంద్రాలు, ఉచిత న్యాయ సలహా కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ ఏర్పాటు చేశారు. గతేడాది తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు చెందిన పదవ తరగతి, ప్లస్టూ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను ముగ్గురు చొప్పున తన కార్యాలయానికి రప్పించి వారికి ప్రశంసాపత్రాలతో పాటు కానుకలను అందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ వారితో ముఖ్యంగా నోటుకు ఓటు విధానం సరికాదని, దీన్ని అందరూ పాటించాలని హితవు పలికారు. నెలరోజుల క్రితం తమిళనాడులో తుపాను దెబ్బకు వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. వారందరికి తనవంతుగా సాయం అందించి వారికి అండగా నిలిచాడు. ఇలా తన పొలిటికల్ ఎంట్రీ కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం తమిళనాడులో సినిమా పరిశ్రమ నుంచి కమల్ హాసన్, ఖుష్బూ, నమిత వంటి వారు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. విజయ్ రాకతో ఆయన పార్టీలోకి మరికొంత మంది చేరనున్నారని సమాచారం. View this post on Instagram A post shared by Vijay (@actorvijay) -
ప్రకాశ్ రాజ్, బాబీ సింహాపై స్టాలిన్ ప్రభుత్వం చర్యలు
సౌత్ ఇండియాలో ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, బాబీ సింహా అక్రమ నిర్మాణాల కేసుకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. కొడైకెనాల్ మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణలపై మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. అక్కడ మధురై బెంచ్ చేపట్టిన విచారణ సందర్భంగా స్టాలిన్ సర్కారు ఈ మేరకు వివరణ ఇచ్చింది. కొడైకెనాల్లో సరైన అనుమతులు లేకుండా, నిబంధనలను ఉల్లంఘించి నటులు ప్రకాష్ రాజ్, బాబీ సింహా బంగ్లా నిర్మిస్తున్నారని గతేడాది సెప్టెంబర్లో వివాదం తలెత్తింది. కొడైకెనాల్ కొండ ప్రాంతంలోని రైతుల రాకపోకలు కొనసాగించేన దారిలో వారు ఇల్లు నిర్మించారని అక్కడి రైతులు ఫిర్యాదు చేశారు. నటులు ప్రకాష్ రాజ్, బాబీ సింహా నిబంధనలను ఉల్లంఘించి బంగ్లాలు నిర్మిస్తున్నారని పెతుపర గ్రామాధికారి మహేంద్రన్ ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేశారు. విల్పట్టి పంచాయతీ పరిధిలోని ప్రాంతంలో నటుడు ప్రకాష్ రాజ్ 7 ఎకరాల భూమిని, బాబీ సింహా ఒక ఎకరాన్ని కొనుగోలు చేశారు. నటీనటులిద్దరూ నిబంధనలను ఉల్లంఘించి ఆ భూమిలో బంగ్లా నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. కొడైకెనాల్ వంటి కొండ ప్రాంతాలలో బంగ్లాల నిర్మాణానికి తమిళనాడు బిల్డింగ్ పర్మిట్ నిబంధనల ప్రకారం సరైన అనుమతి పొందాలి. అలాగే కొండ ప్రాంతాలలో ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి భవన నిర్మాణ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం అవసరం. అయితే ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రకాష్రాజ్, బాబిసింహలు పెటుప్పరై ప్రాంతంలో బంగ్లా నిర్మించారని తెలుస్తోంది. ఈ విషయమై ఫిర్యాదు చేసినా.. ఇద్దరూ ప్రముఖ నటులు కావడంతో ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమ నిర్మాణాల వల్ల కొండచరియలు విరిగిపడి పెద్ద నష్టం వాటిల్లుతుంది. అలాగే కొడైకెనాల్ పెటుప్పరైలో ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా అధునాతన పరికరాలు ఉపయోగించి రాళ్లను పగలగొట్టినందుకు సరైన ప్రభుత్వ అనుమతి లేకుండా ఆధునిక బంగ్లాలు నిర్మించిన నటులు ప్రకాష్రాజ్, బాబీ సింహలపై చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యక్తి ఎస్. మహమ్మద్ జునాథ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇది ఇప్పటికే ఉన్న నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని ఆరోపించారు. ఈ నిర్మాణాల వల్ల సమీపంలోని నివాసాలకు ముప్పు ఏర్పడిందని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణకుమార్, విజయకుమార్ ఈ పిటిషన్పై వాదనలు విన్నారు. రెండు భవనాల నిర్మాణ పనులను నిలిపివేసినట్లు న్యాయస్థానానికి తమిళనాడు సర్కారు తెలిపింది. ఇద్దరిపైనా లీగల్ యాక్షన్ ప్రారంభించినట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ వివరణను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు- ప్రకాశ్ రాజ్, బాబీ సింహాపై తీసుకున్న చర్యలకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను జనవరి 9కి వాయిదా వేసింది. -
ఒక్క సీటుతో కింగ్మేకర్.. కూటమిలతో తగ్గిన విజయకాంత్ క్రేజ్
కోలీవుడ్ ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) అనారోగ్యంతో చికిత్స పొందుతూ... నేడు (డిసెంబర్ 28) తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విజయకాంత్ మృతి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. విజయకాంత్ జననం: విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగరస్వామి. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత తన పేరును విజయకాంత్గా మార్చుకున్నారు. విజయకాంత్కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. సినిమా ఎంట్రీ: విజయకాంత్ 27 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశారు. 1979లో 'ఇనిక్కుం ఇలామై' చిత్రంతో విలన్గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు 150కి పైగా చిత్రాల్లో నటించారు. రోజుకు మూడు షిఫ్టులు పనిచేశారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ. ఆ తర్వాత ఆయన నుంచి ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 1984లో విజయకాంత్ నుంచి 18 సినిమాలు విడుదలయ్యాయి. 20కి పైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్గా కనిపించాడు. విజయకాంత్ తమిళ చిత్రాల్లో మాత్రమే నటించారు. ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన సినిమాలు చాలా భాషల్లో డబ్బ్ అయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లకు విజయకాంత్ ఒకప్పుడు గట్టి పోటీ ఇచ్చారు. విజయకాంత్ మెసేజ్ బేస్డ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. దేశభక్తి చిత్రాలైనా, గ్రామీణ నేపథ్య సినిమాలైనా, ద్విపాత్రాభినయాలైనా నటించేందుకు విజయకాంత్ ఎప్పుడూ ముందుండేవారు. వాటితో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ సందడి చేసేవారు. అయితే ఆయన ఏ నిర్మాత వద్ద కూడా ముందుగా డబ్బు తీసుకోడని కోలీవుడ్ పరిశ్రమలో గుర్తింపు ఉంది. కోలీవుడ్ నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమా అవకాశం ఇస్తారని సమాచారం. ఒక్క సీటుతో రాజకీయ ప్రయాణం 2005లో దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) అనే పార్టీని సినీ నటుడు విజయకాంత్ ఏర్పాటు చేశారు. తొలిసారిగా 2006 ఎన్నికల సమయంలో తన పార్టీ నుంచి తానొక్కడే గెలిచాడు.. కానీ ఆయన పార్టీ 10 శాతం ఓట్లు సాధించి తమిళ రాజకీయాలలో విజయకాంత్ను ప్రత్యామ్నాయ శక్తిగా మార్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికలలో జయలలిత (అన్నాడీఎంకే)తో చేతులు కలిపి 41 సీట్లలో 29 స్థానాలను గెలుచుకున్నారు. ఆ సమయంలో ఎం.కరుణానిధి (డీఎంకే) పార్టీని చిత్తు చేసిన విజయకాంత్ ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఆ తదుపరి అన్నాడీఎంకేతో వైరం వంటి పరిణామాలు విజయకాంత్ పార్టీకి గడ్డు పరిస్థితులను సృష్టించాయి. దీంతో జయలలిత, విజయకాంత్ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. కూటమిల పేరుతో నష్టం 2014 లోక్సభ ఎన్నికలలో ఆయన ఎన్డీఏతో వెళ్లి ఓటమిని చవి చూశారు. కానీ ఓటు బ్యాంక్ శాతం పెంచుకోవడం ఆయనకు కలిసి వచ్చిన అంశంగా మారింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అవతరించినా, ఫలితం శూన్యం. ఆ ఎన్నికల్లో అన్నిచోట్ల విజయకాంత్ కూటమి పార్టీ డిపాజిట్లను కోల్పోయింది. ఆ ఎన్నికల్లో విజయకాంత్ కూడా సుమారు 50 వేలకు పైగా ఓట్లతో ఓటమి చెందారు. ఆ తర్వాత వరుస ఓటములు ఎదురైనా ఏ మాత్రం డీలా పడకుండా కేడర్ మద్దతు, సినీ అభిమానుల అండతో ఒంటరిగానే పార్టీని నడిపిస్తూ వచ్చారు. కానీ కూటమిల పేరుతో ఆయన ఇతర పార్టీలకు అనుకూలంగా పనిచేయడం, ఇతర పార్టీలకు చెందిన అధినేతల సలహాలతో డీఎండీకేను ముందుకు నడపడం వంటి కారణాలతో ఆయన ఇమేజ్ క్రమేపి తగ్గుతూ వచ్చింది. ఇంతలో ఆయన తరుచుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడటం కూడా పార్టీకి నష్టం వాటిల్లింది. చివరకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా, పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించ లేని పరిస్థితి నెలకొంది పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఆయన సతీమణి ప్రేమలతకు ఆయన అప్పచెప్పారు. తాజాగా ఆయన మరణం డీఎండీకే పార్టీకి తీరని లోటు అని చెప్పవచ్చు. 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలలో ఆయన సతీమణి ప్రేమలత ఒంటరిగానే బరిలోకి దిగుతారా..? మరేదైనా పార్టీకి మద్ధతు ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. -
రూ. 100 కోట్ల కేసులో ప్రకాష్ రాజ్కు ఊరట.. ఆ స్కామ్లో క్లీన్ చిట్
అక్రమ నగదు బదిలీ కేసులో చిక్కుకున్న ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్కు ఊరట లభించింది. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన జ్యువెలరీ గ్రూపుపై రూ.100 కోట్ల పోంజీ, మోసం కేసులో ప్రకాష్ రాజ్ పేరు వినిపించింది. దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసి ఆయన్ను విచారించింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆయనకు క్లీన్ చిట్ లభించింది. నివేదికల ప్రకారం, మనీలాండరింగ్ కేసులో ప్రకాష్ రాజ్ ప్రమేయం లేదని తేలింది. ఆయన ఆ సంస్థకు కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని తెలిపింది. దీని గురించి ఎక్స్లో పోస్ట్ చేసిన ప్రకాష్ రాజ్, "తమిళం అర్థం కాని వారి కోసం. తమిళనాడులోని ప్రణవ్ జ్యువెలర్స్ మోసంతో నటుడు ప్రకాష్ రాజ్కు ఎటువంటి సంబంధం లేదని అధికారిక ప్రకటన వెలువడింది. నా వెంట నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నన్ను నమ్మి ఎందరో ఆదరించారు. సత్యమేవ జయతే." తిరుచిరాపల్లికి చెందిన భాగస్వామ్య సంస్థ ప్రణవ్ జ్యువెలర్స్పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. నవంబర్ 20న ఈడీ అధికారులు దాడులు నిర్వహించి రూ.23.70 లక్షల నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నటుడు ప్రకాష్ రాజ్ ఈ జ్యువెలర్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ ఈ విధంగా, ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలని ఈడీ కోరింది. కొన్ని ఉద్దేశపూర్వక చెల్లింపులు, ఇతర ఆర్థిక లావాదేవీల గురించి ఆయన్ను ప్రశ్నించాలని కోరుతూ ED గత నెలలో అతనికి సమన్లు జారీ చేసింది. కేసు నేపథ్యం: ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జ్యువెలర్స్ కంపెనీపై తమిళనాడు ఆర్థిక నేరాల విభాగం పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. పోలీసుల ఫిర్యాదు మేరకు ప్రణవ్ జ్యువెలర్స్, ఇతరులు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పేరుతో అధిక లాభాలు వస్తాయని ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేశారని ఈడీ తెలిపింది. అయితే, ప్రణవ్ జ్యువెలర్స్ తమ డబ్బును పెట్టుబడిదారులకు తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారు. జ్యువెలర్స్ ఆర్గనైజేషన్, ఇతర అనుబంధ వ్యక్తులు ప్రభుత్వ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించడం ద్వారా మోసం చేశారు. విచారణలో, బ్యాంక్ చెల్లింపులు, నకిలీ ఎంట్రీలకు బదులుగా రూ.100 కోట్లకు పైగా ఇచ్చినట్లు అంగీకరించింది. 23.70 లక్షలు వివరించలేని రూ. నగదు, 11.60 కిలోల బంగారు కడ్డీలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. For those who don’t understand Tamil BREAKING NEWS:-Official announcement of the Investigation team. Actor prakash raj is not involved in any ponzi scam of tamilnadu s Pranav jewellers.. 🙏🏿🙏🏿🙏🏿 I thank everyone who trusted me and stood by me .. #SathyamevaJayathe #justasking pic.twitter.com/AZ6hLM8wjI — Prakash Raj (@prakashraaj) December 15, 2023 -
వరద బాధితులకు నయనతార సాయం.. అయినా తప్పని విమర్శలు
మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడులోని చెన్నైతోపాటు శివారు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వర్షం తగ్గినా ఇంకా చాలా చోట్ల వరద ప్రభావం కొనసాగుతోంది. అక్కడ ప్రజల పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంది. చాలా ప్రాంతంలో ఇంట్లోకి నీళ్లు రావడంతో నిత్యవసర అవసరాలకు చాలా ఇబ్బందలు పడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల సహాయక సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా ప్రభుత్వం జారవిడుస్తున్నా కూడా సమస్య తీరడం లేదు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ చాలా చోట్ల సాధారణ ప్రజలు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. పునరావాస కేంద్రాల్లో వేలాదిగా తుపాను బాధితులు కనీస అవసరాలు తీరక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో పలువురు స్వచ్ఛంద సేవకులు, సినీ సెలబ్రిటీలు సాయం చేసేందకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే విజయ్,సూర్య,విశాల్ ఫ్యాన్స్ తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రముఖ హీరోయిన్ నయనతార సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తన వ్యాపార సంస్థ అయిన ‘ఫెమీ 9’ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది. దుస్తులు,ఆహారం, శానిటరీ న్యాప్కిన్లు, వాటర్ బాటిళ్లు, మెడిసిన్స్,పాలు వంటి వాటిని ఆమె అందించింది. (ఇదీ చదవండి: తిరుపతిలో బిగ్ బాస్ బ్యూటీ 'వాసంతి' నిశ్చితార్థం) దీంతో ఆమెకు ఫ్యాన్స్తో పాటు నెటిజన్లు అభినందనలు తెలిపారు. కానీ మరికొందరు మాత్రం ఆమెను తప్పుబడుతున్నారు. తన కంపెనీకి చెందిన ‘ఫెమీ 9’ అడ్వర్టైజ్మెంట్ బోర్డులతో ఉన్న వాహనంలో వరద బాధితులకు సహాయం అందించడం ఏంటి..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విపత్తు సమయంలో కూడా కంపెనీని ప్రమోట్ చేసుకోవడం ఏంటి అంటూ నయనతారపై విమర్శలు చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం నయన్కు విపరీతంగా సపోర్ట్ చేస్తున్నారు. ఆమె కంపెనీకి చెందిన కాస్మోటిక్స్ను ఆ వాహనాల ద్వారానే ట్రాన్స్పోర్టు చేస్తుంటారు. ప్రజలకు సాయం చేసేందుకు అందులోని సామాన్లను ఖాళీ చేసి ప్రజలకు అవసరమైన సామాగ్రిని తీసుకొని వచ్చినట్లు కొందరు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా తన కంపెనీకి ఉన్న డ్రైవర్లు అయితే ఈ పనిని కరెక్ట్ చేయగలుగుతారని భావించే నయన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాయంలో కూడా ఇలా నయన్ను తప్పుబట్టడం ఏంటి..? అని కొందరు తిప్పికొడుతున్నారు. View this post on Instagram A post shared by F E M I 9 (@femi9official) -
సాయం చేయాలంటూ ఫ్యాన్స్ను కోరిన విజయ్
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను కారణంగా చెన్నైలో నివశిస్తున్న ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో తుపాను తీరాన్ని తాకినప్పటికీ, వర్షం కారణంగా చెన్నైని వరదలు ముంచెత్తాయి. చాలా చోట్ల క్రమంగా అక్కడి పరిస్థితులు చక్కబడుతున్నాయి. అయితే, వేలచ్చేరి, మడిపాక్కం, పల్లికరణై, పెరుంబాక్కం, దురైపాక్కం వంటి ప్రాంతాల్లో నీరు చేరిపోయి చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా విద్యుత్ కోత ఏర్పడింది. సాధారణ ప్రజలు ఆహారానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో తమిళనాడులోని ఇతర జిల్లాల నుంచి వాలంటీర్లు చెన్నైకి వెళ్లి సహాయం చేయడం ప్రారంభించారు. అక్కడ కూడా చాలా మంది ఫుడ్, వాటర్ బాటిళ్లు అందజేస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన సూర్య, కార్తి తమిళ ప్రజలకు సాయం చేసేందుకు అందరి కంటే ముందుగా రియాక్ట్ అయ్యారు. ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం రూ. 10 లక్షలు సాయం ప్రకటించారు. ఆ తర్వాత వర్ధమాన నటుడు హరీష్ కళ్యాణ్ లక్ష 10 రూపాయలు ఇచ్చారు. ఇందులో విజయ్ ఏం చేయబోతున్నాడా అని చాలా మంది ఎదురు చూశారు. కానీ అతను ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు. దీంతో ఆయన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. విజయ్ మౌనం వీడాడు ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ పేజీలో మాట్లాడుతూ.. చెన్నైతోపాటు శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. వేలాది మంది ప్రజలు తాగునీరు, ఆహారం లేకుండా, తగిన మౌలిక వసతులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించాలని కోరుతూ సోషల్ మీడియాలో ఇంకా అనేక స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో, బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల్లో ప్రజా ఉద్యమ నిర్వాహకులందరూ స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. చేయి చేయి కలుపుదాం, దుఃఖాన్ని దూరం చేద్దాం.' అని విజయ్ తెలిపాడు. అంతే కాకుండా ప్రభుత్వానికి సాయం చేయడానికి వలంటీరులుగా రావాలని తమ ఫ్యాన్స్ను సాయం కోరాడు. -
'మిచౌంగ్' తుపాను.. ఆవేదనతో ఫైర్ అయిన విశాల్
'మిచౌంగ్' తుపానుతో తమిళనాడు రాజధాని చెన్నైలోని రోడ్లన్నీ చెరువును తలపిస్తున్నాయి. అన్ని ప్రాంతాలను వర్షపు నీరు చుట్టుముట్టింది. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ పరిస్థితిపై హీరో విశాల్ స్పందించారు. విపత్తు సమయంలో తగిన చర్యలు తీసుకోవడంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) విఫలమైందంటూ విశాల్ ఆరోపించారు. 'డియర్ ప్రియా రాజన్ (చెన్నై మేయర్), జీసీసీ కమిషనర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులకు నేను చెప్ప దలుచుకున్నది ఏమిటంటే... మీ కుటుంబాలతో మీరు క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నాను. వరదల వల్ల వచ్చే నీరు మీ ఇళ్లలోకి రాదనుకుంటున్నా. ఇలాంటి సమయంలో మీకు మాత్రం నిరంతర విద్యుత్తు, ఆహారం ఉంటుంది. కానీ ఒక ఓటరుగా ఇదే నగరంలో నివసిస్తున్న మేమంతా అలాంటి పరిస్థితిలో లేము. 2015లో చెన్నైలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అప్పుడు వారందరికీ మేము సాయం చేశాం. కానీ ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఇప్పుడు అంతకు మించిన దారుణమైన పరిస్థితి కనిపించడం చాలా భాదగా ఉంది. అయినప్పటికీ ఈ సమయంలో కూడా మేము కచ్చితంగా ఆహారం, తాగునీరు, కనీస వసతి కల్పిస్తాము. ఇలాంటి సాయం చేస్తూనే ఉంటాం. ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బయటకు రండి. బయటకు వచ్చి అవసరమైన సాయం చేసేందుకు ముందుకు వస్తారని ఆశిస్తున్నాం.' అని పేర్కొన్నారు. Dear Ms Priya Rajan (Mayor of Chennai) and to one & all other officers of Greater Chennai Corporation including the Commissioner. Hope you all are safe & sound with your families & water especially drainage water not entering your houses & most importantly hope you have… pic.twitter.com/pqkiaAo6va — Vishal (@VishalKOfficial) December 4, 2023 చదవండి: చెన్నైలో జలప్రళయం -
మాజీ టెలికాం మంత్రికే బురిడీ! ఒక్క ఫోన్ కాల్తో రూ.లక్ష మాయం..
టెక్నాలజీ విస్తృతం అవుతున్నకొద్దీ సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్నే బురిడీ కొట్టించి రూ.లక్ష కాజేశారు. తనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, ఆ కాలర్తో ఎటువంటి వివరాలు పంచుకోనప్పటికీ తన బ్యాంక్ ఖాతా నుంచి సుమారు రూ. లక్ష డెబిట్ అయ్యాయని దయానిధి మారన్ ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ప్రకారం.. దయానిధి మారన్కు అక్టోబర్ 8వ తేదీన తనకు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ అందుకున్న తర్వాత, ఆయన బ్యాంక్ ఖాతా నుంచి రూ. 99,999 డెబిట్ అయింది. తాను బ్యాంక్ సిబ్బంది అని చెప్పుకుంటూ ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి.. దయానిధి మారన్ బ్యాంకు వివరాలు అడిగారు. కానీ ఆయన ఆ వివరాలేవీ ఆ వ్యక్తితో పంచుకోనప్పటికీ, కొద్దిసేపటికే అనధికార లావాదేవీ జరిగినట్లు గుర్తించామని ఫిర్యాదును ఉటంకిస్తూ పోలీసులు తెలిపారు. ఎంపీ దయానిధి మారన్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 9న అక్కడి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్)లో కేసు నమోదు చేశారు. మాజీ టెలికాం మంత్రి.. దయనిధి మారన్ గతంలో కేంద్ర ఐటీ, టెలికం మంత్రిగా పనిచేశారు. తన పదవీకాలంలో కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పెద్ద మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సేకరించడంలో కీలక పాత్ర పోషించారు. నోకియా, మోటరోలా, ఎరిక్సన్, ఫ్లెక్స్ట్రానిక్స్, డెల్తో సహా అనేక బహుళజాతి టెలికాం కంపెనీలు దేశంలో యూనిట్లను ఏర్పాటు చేశాయి. -
ఇంతటి దుఃఖంలో కూడా విడుదల ఆపొద్దని చెప్పిన విజయ్ ఆంటోనీ.. కారణమిదే
సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఆయన కుటుంబం ఇప్పటికీ శోకసంద్రంలోనే ఉంది. మీరాతో పాటు తాను కూడా మరణించానని ఆయన తెలిపాడు. కంటికి రెప్పలా చూసుకున్న బిడ్డ చనిపోతే ఏ తండ్రి అయినా పడే బాధ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన కుటుంబం మొత్తం ఇంత దుఃఖంలో ఉన్నా తన కొత్త సినిమా 'రత్తం' విడుదల ఆపకూడదని నిర్ణయించుకోవడం విశేషం. (ఇదీ చదవండి: తండ్రి కన్నీరు పెడుతుంటే.. బావకు భజన చేసిన బాలకృష్ణ) దీనికి ప్రధాన కారణం ఇప్పటికే ఆ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. దీంతో నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని ఆయన భావించాడట. ముందుగా అనుకున్న సమయానికే చిత్రం అక్టోబర్ 6న తమిళ్లో విడుదలవుతోందని మేకర్స్ ప్రకటించారు.తెలుగు వర్షన్ విడుదల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రెండు వారాల క్రితం నుంచే రత్తం సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టారు. బిజినెస్ డీల్స్ తో పాటు థియేటర్లను కూడా ముందస్తుగానే లాక్ చేసుకున్నారు. తీరా ఇలాంటి సమయంలో సినిమా వాయిదా పడితే నిర్మాతకు భారీగా నష్టం వస్తుందని విజయ్ ఆంటోనీ భావించారట. చెన్నైలో తీవ్ర సంచలనం సృష్టించిన వరుస హత్యల నేపథ్య కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సీఎస్ ఆముధన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో పరిశోధక అధికారిగా, భిన్న కోణాలున్న వ్యక్తిగా కనిపించనున్నారు విజయ్. చెన్నైలో జరిగిన ఈ వరుస హత్యల కారణంగా పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. దీంతో కొందరు మంత్రుల రాజీనామాకు కూడా దారితీసింది. ఈ సన్నివేశాల్ని ఎంతో ఆకట్టుకునే విధంగా దర్శకుడు చూపించిన తీరు సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇందులో నందితా శ్వేత జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. మీడియా, రాజకీయ, న్యాయవ్యవస్థల మధ్య ఉన్న బంధం ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఈ మూవీలో ప్రధానంగా చూపించారని తెలుస్తోంది. -
భారత్లో ఫాక్స్కాన్.. 500 మిలియన్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు ఐఫోన్లను తయారీ చేసి సరఫరా చేసే ఫాక్స్కాన్ టెక్నాలజీ సంస్థ భారత్ రెండు మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను నిర్మించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 500 మిలియన్ల పెట్టుబడి పెట్టే యోచనలో ఉందంటూ బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఫాక్స్కాన్ ఈ తయారీ యూనిట్లను కర్ణాటకలో నిర్మించనుండగా..ఒక ఫ్యాక్టరీ ఐఫోన్ల తయారీ, రెండో ఫ్యాక్టరీలో యాపిల్కు విడిభాగాలు ఉత్పత్తి చేయనుందని నివేదిక పేర్కొంది. అయితే, ఏ రాష్ట్రంలో ఫ్యాక్టరీలను నిర్మించాలనే అంశంపై ఫాక్స్కాన్ స్పష్టత ఇచ్చినప్పటికీ.. ప్రాంతం ఎక్కడనేది నిర్ణయించలేదు. ఈ వారంలో ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన అనువైన ప్రాంతంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిలో కర్నాటకలో ఫాక్స్ కాన్ యూనిట్ కోసం 80 బిలియన్ రూపాయల ($972.88 మిలియన్లు) పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. చైనా కంటే భారత్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్కాన్ కంపెనీ సిద్ధమైంది. తమిళనాడులో ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాల తయారీ కేంద్రంలో 16 బిలియన్లను పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది. తద్వారా 6,000 మందికి ఉపాధి కలగనుంది. కాగా, ఫాక్స్ కాన్ తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని కాంచీపురం జిల్లాలో నిర్మించనుందని తెలుస్తోంది. దీనిపై ఫాక్స్కాన్, తమిళనాడు ప్రభుత్వాలు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదీ చదవండి : చైనాను వద్దనుకొని వచ్చేస్తోంది?.. భారత్లో ఫాక్స్కాన్ 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులు -
గోడలకు కళ్లుంటాయి.. గోప్యంగా చూస్తుంటాయి! జర జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: గోడలకు చెవులుంటాయ న్నది పాత సామెత. కానీ గోడ లకు కళ్లు కూడా ఉంటాయన్న చందంగా నేటి పరిస్థితులు మారుతున్నా యి. తమిళనాడు తిరు కొవి లూర్ లోని ఓ టెక్స్ టైల్ దుకాణంలో ఇటీ వల ట్రయల్ రూంలో దాచిన సెల్ఫోన్ ద్వారా యువతులు దుస్తులు మార్చు కొనే వీడి యోలను కొందరు గలీజుగాళ్లు రికార్డు చేయడం తెలిసిందే. ఇలా ఎక్కడో ఒక చోట ఈ తరహా ఘటనలు బయట పడుతూనే ఉన్నా యి. ఈ నేపథ్యంలో ట్రయల్ రూంలకు వెళ్లిన ప్పుడు లేదా హోటళ్లలో బస చేసిన ప్పుడు మహిళలు కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలని పోలీ సులు సూచిస్తున్నారు. ►నచ్చిన దుస్తులు సరిపోయాయో లేదో తెలుసుకోవాలంటే వినియోగదారులు ట్రయల్ రూంలకు వెళ్లక తప్పదు. అదేవిధంగా విహారయాత్రలు, ఆఫీస్ పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటళ్లలో బస చేయడమూ అనివార్యమే. అక్కడ వాష్రూంలను వాడకుండా ఉండలేం. ఇదే అవకాశంగా చేసుకొని కొందరు సిబ్బంది రహస్య కెమెరాలు పెట్టి మహిళల వీడియోలను తీసే దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. హోటళ్లు, దుకాణ యజమానులకు తెలియకుండానే కొందరు సిబ్బంది ఇలాంటి అనైతిక పనులకు పాల్పడుతుండటం యాజమాన్యాలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇలా చేస్తే ముప్పు తప్పుతుంది.. ► వస్త్రాల కొనుగోలు కోసం మాల్స్కు వెళ్లిన ప్పుడు ట్రయల్ రూంకు వెళ్లాల్సి వచ్చినా లేదా హోటళ్లలో వాష్రూంలు వాడాల్సి వచ్చినా అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలించాలి. ఏమాత్రం అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే బయటకు వచ్చేయాలి. ► సెల్ఫోన్ టార్చ్ వేస్తూ చూస్తే రహస్య కెమెరాలు ఉండి ఉంటే వాటి లెన్స్పై టార్చ్పడి రిప్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా కూడా రహస్య కెమెరాల ప్రమాదం నుంచి బయటపడొచ్చు. ► హోటల్ గదుల్లో బస చేయాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా రాత్రివేళ్లలో నిద్రించాలంటే ముందుగా సీలింగ్ ఫ్యాన్ ఉన్న గదుల్లో లైట్లు ఆర్పి సెల్ఫోన్ టార్చ్ వేసి చూడాలి. రెడ్లైట్ బ్లింక్ అవుతున్నట్లు గమనిస్తే దాన్ని హిడెన్ కెమెరాగా అనుమానించాలి. ► ట్రయల్ రూంలు, హోటల్ రూంలకు ఉన్న తలుపులకు ఏవైనా అనుమానాస్పద రంద్రాలు ఉన్నట్లు గుర్తించినా.. అందులో ఏవైనా వస్తువులు ఉన్నట్లు గమనించినా వెంటనే యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలి. ► ట్రయల్ రూంలు, వాష్ రూంలలో దుస్తులు తగిలించేందుకు ఉండే కర్టెన్ రాడ్స్ లేదా కొక్కాలకు కెమెరాలు పెట్టే అవకాశం ఉంటుంది. అలాంటివి ఉన్నాయో లేదో చూడాలి. ► ట్రయల్ రూంలలో, వాష్రూంలలో ఉండే అద్దాల వెనుక సైతం మనకు తెలియకుండా కెమెరా పెట్టి రికార్డ్ చేసే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మిర్రర్ ట్రిక్ వాడాలి. మీ వేలిని అద్దానికి తాకేలా పెడితే దాని ప్రతిబింబానికి మీ వేలికి దూరం ఉంటే అది నిజమైనది. ఆ వేలు ప్రతిబింబానికి ఆనితే అది రెండోవైపు నుంచి మనం కనిపించే అవకాశం ఉన్నట్లు అనుమానించాలి. -
రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. గతంలోనూ ఇదే చర్చ
దక్షిణాదిన స్టార్ కథానాయికగా పేరు తెచ్చుకున్నారు కీర్తిసురేష్. ఆమె ఒక పక్క గ్లామర్ పాత్రలు చేస్తూనే... మరోపక్క కథానాయిక ప్రాధాన్యమున్న కథలతోనూ ప్రయాణం చేస్తున్నారు. తాజాగా ఆమె మదిలో చాలా ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక పక్క నటిగా దూసుకుపోతున్నా, మరోపక్క వదంతులు వలయంలో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేమ, ప్రేమికుడు వంటి ప్రచారం ఈమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి వార్తలు చదువుతుంటే బాధేస్తుందని కీర్తిసురేషే ఇటీవల స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. (ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన 'సలార్' విలన్.. నేడు సర్జరీ) ఇక కెరీర్ విషయానికి వస్తే ఈ మధ్య తెలుగులో బిజీగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె అక్కడ నటిస్తున్న చిత్రాలలో 'మామన్నన్' ఒకటి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్తో జతకట్టిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 29న తెరపైకి రానుంది. దీంతో కీర్తిసురేష్ ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ మామన్నన్ ఒక రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చెప్పారు. ఇందులో తనది చాలా సీరియస్ పాత్ర అని తెలిపారు. సమీకాలంలో తనకు ఈ తరహా పాత్రలే వస్తున్నాయన్నారు. (ఇదీ చదవండి: 'నేనో ఇంజనీర్ని.. హీరోయిన్ అవుతాననుకోలేదు') ఇక రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అని అడుగుతున్నారని, ఆ విషయం గురించి ఆలోచించాలని అన్నారు. దీంతో రాబోయేరోజుల్లో రాజకీయ ప్రవేశం చేస్తారని కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. ఈ ఊహాగానాల్లో నిజమే కావచ్చని పలువురు తెలుపుతున్నారు. ప్రస్థుతం ఆమె తాజా చిత్రంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్తో జతకట్టింది. దీంతో వారిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కీర్తి పొలిటికల్ ఎంట్రీ ఉండవచ్చని తెలుస్తోంది. కానీ గతంలోనూ కీర్తి సురేష్ బీజేపీలో చేరుతుందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేయగా ఆమె తల్లి మేనక వాటిలో నిజం లేదని, తమ కూతురుకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలేదని స్పష్టం చేసింది. కానీ ఈ బ్యూటీ మాత్రం రాబోయే రోజుల్లో రాజమౌళి, శంకర్ వంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. -
రాజకీయాల్లో సినిమా ఇంపాక్ట్.. గతం ఏం చెబుతోంది?
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఆసక్తిగా ఉంటాయి. అక్కడలో సినిమా, రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది.. సినిమా హీరోలు సొంత పార్టీలు స్థాపించి ప్రజల్లోకి వెళ్లి రాజకీయాల్లో అత్యంత క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వరకూ అందరూ సినీరంగం నుంచి వచ్చిన వారే.. ఎంజీఆర్ మొదలు విజయ్ కాంత్, కమల్ హాసన్ వరకూ సొంత పార్టీలు స్థాపించిన వారే.. దక్షిణ భారత్లో ఏపీ రాజకీయల తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ రాజకీయాలు తమిళనాడువి మాత్రమే.. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల ఆధిపత్యం ఉంటుంది.. డీఎంకే లేదా ఏఐడీఎంకే ఈ రెండు పార్టీలే తమిళ రాజకీయాలను శాసిస్తాయి.. అప్పట్లో కరుణానిధి, జయలలిత మధ్య రాజకీయ యుద్ధం జరుగుతూనే ఉండేది. చరిత్ర సృష్టించిన సినీ నటుల రాజకీయ ప్రస్థానం తమిళనాడు రాజకీయాలలో సినీరంగ ప్రముఖుల ప్రవేశం మొదట కరుణానిధితో మొదలైంది. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీకి ఆ పార్టీ పత్రికకి ఆయన మరణించే వరకు అధ్యక్షుడిగా, పత్రిక సంపాదకుడిగా ఉన్నారు. ఇక ఎంజీ రామచంద్రన్ 1972 అక్టోబర్ 17న ఆల్ ఇండియా అన్నాడీఎంకే (ఏఐఎడిఎంకె) పార్టీని స్థాపించారు. మొదట 11 మంది ఎమ్మెల్యేలతో మొదలైన ఆయన ప్రస్థానం 1977లో ప్రభుత్వాన్ని ఏర్పరిచి పదేళ్ల సుదీర్ఘ కాలం ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక జయలలిత విషయానికి వస్తే ఎం.జి.రామచంద్రన్ మరణానంతరం ఆయన వారసురాలిగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని రాజకీయాల్లో నిలదొక్కుకున్నారు. 1991 తమిళనాడు ఎన్నికల్లతో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 225 గెలిచి మొదటిసారి ముఖ్యమంత్రిగా రాజకీయాలలో తన సత్తా చాటుకున్నారు. ఆ తర్వాత 2001లో రెండవసారి 2011లో మూడవసారి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె మరణానంతరం వెనువెంటనే మరో రాజకీయ దిగ్గజం కరుణానిధి కూడా మరణించడంతో తమిళనాడులో ఒక్కసారిగా రాజకీయ శూన్యత ఏర్పడింది. సరిగ్గా అలాంటి సమయంలోనే కమలహాసన్ 'మక్కల్ నీది మయ్యం' (ప్రజా న్యాయ కేంద్రం) అనే పార్టీని స్థాపించారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ తన కొత్త పార్టీ ప్రారంభం అవుతుందని అదే సమయంలోనే ప్రకటించారు. 1970లో విప్లవాత్మక మార్పు.. 1970 చివర్లో తమిళ సినీ రంగంలో విప్లవాత్మక మార్పులే వచ్చాయి. ఎంజీఆర్-శివాజీ గణేషన్ల శకం ముగిసింది. అప్పుడే రజనీ-కమల్ ద్వయం హవా మొదలైంది. వీరిద్దరూ 1970 చివరి నుంచి 1990ల చివరి వరకు తమిళ సినిమా పరిశ్రమను దున్నేశారనే చెప్పాలి. తమిళంలో హిట్ సినిమా అంటే.. అయితే రజనీ లేదా కమల్ పేరు దానిలో కచ్చితంగా ఉండేది. ఎంజీఆర్-శివాజీల స్థానాన్ని రజనీ-కమల్ భర్తీ చేసినప్పుడు ప్రజలు ఎర్రతివాచీ పరిచారు. రజనీని ఎంజీఆర్తో, కమల్ను శివాజీతో అభిమానులు పోల్చారు. కానీ ఈ పోలికలన్నీ సినిమాల వరకే. ఇప్పుడు రాజకీయాల విషయానికి వస్తే.. రజనీ ఎంజీఆర్లా మారలేకపోయారని ఎప్పుడో తేలిపోయింది.. ఇక మిగిలింది కమల్ హాసన్, శివాజీ అవుతారో? లేదో తేలాల్సి ఉంది. రాజకీయాల నుంచి రజనీ ఎందుకు తప్పుకున్నారు? రజనీకాంత్ పార్టీ రద్దు చేయడానికి ప్రధాన కారణం.. ఆయన ఆరోగ్యమేనని తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశించాల్సిన గడువు దాటిపోయిందని ఆయన భావిస్తున్నట్లు సంబంధికులు తెలిపారు. రాజకీయాల్లో ఉంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుందని, ఇందుకు తన ఆరోగ్యం సహకరించకపోవచ్చని రజినీకాంత్ అభిప్రాయపడ్డారు. దీంతో రజినీ మక్కల్ మండ్రం పార్టీని రద్దు చేసుకున్నట్లే అయింది. కమల్ హాసన్ ఎటువైపు? మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ పార్టీకి వచ్చిన ఓట్లు 3.6 శాతం మాత్రమే. దాంతో రాజకీయ నాయకుడిగా కమల్ కొంత గందరగోళంలో పడ్డారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ద్రావిడ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండకపోతే తమిళనాడులో రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని తేల్చిచెప్తున్నారు. అదే సమయంలో సినిమాలు, రాజకీయాల మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం అంత తేలికైన విషయం కాదని కూడా హెచ్చరిస్తున్నారు. పాలిటిక్స్ను పార్ట్ టైమ్ హాబీగా తీసుకుంటే తమిళ ఓటర్లు ఆదరించరని అంటున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూ.. సీరియస్ పొలిటిషియన్ అని చెప్తే నమ్మేందుకు ప్రస్తుత ఓటర్లు సిద్ధంగా లేరని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా కమల్ హాసన్ ముందున్నవి రెండే ఆప్షన్లు తమిళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకటి పార్టీకి ప్యాకప్ చెప్పడం, రెండు పొత్తు కుదుర్చుకొని పార్లమెంట్ సభ్యుడిగా అడుగుపెట్టడం. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే పొత్తుకు సిద్ధమనే సంకేతాలు కమల్ నుంచి కనిపిస్తున్నాయి. ఈ మధ్య జరిగిన ఈరోడ్ ఉపఎన్నికలో డీఎంకే అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అంతే కాదు విక్రమ్ సినిమా విజయోత్సవాల్లో డీఎంకే అధినేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్తో కలిసి వేదికను పంచుకున్నారు. అన్నట్టు తమిళనాడులో విక్రమ్ సినిమా హక్కులను ఉదయనిధి స్టాలిన్ కొనుగోలు చేశారు. మరి ఈ పరిణామాలు కమల్కు ఏ మేరకు కలిసొస్తాయో చూడాలి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో డీఎంకే వైపు టర్న్ తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. దళపతి విజయ్ రానిస్తాడా? సినీ నటుడు విజయ్ రాజకీయ ప్రవేశ చర్చ తరచూ తెర మీదకు వస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇటీవల కాలంలో తన చిత్రాల్లో రాజకీయంగా చర్చకు తావిచ్చే డైలాగులతో ఆయన ముందుకు సాగుతున్నారు. ఇది వివాదాలకు సైతం దారి తీస్తున్నాయి. అలాగే విజయ్ ఇటీవల కాలంగా వేస్తున్న అడుగులు 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పయనం సాగిస్తున్నట్టుగా పలువురు భావిస్తున్నారు. అభిమానులతో జిల్లాల వారీగా సమీక్షలు, సమావేశాలతో విజయ్ అప్పుడప్పుడూ బీజీగానే ఉన్నారు. అలాగే, ఒకే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేయిస్తున్నారు. ఇకపోతే ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే లియో షూటింగ్ పనులు జరుగుతున్నాయి. మరోకటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఇవి పూర్తి అయ్యేందుకే మరో రెండేళ్లు సమయం పడుతుంది. ఈ లోపు ఎన్నికలు మొదలవుతాయి. దీంతో తమిళ రాజకీయాల్లో ఆయన ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చని తెలుస్తోంది. కానీ విజయ్ పార్టీని ప్రారంభిస్తే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకే లాభంగా మారొచ్చని చర్చ జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా అధికార పార్టీకే ఎక్కువ లాభం చేకూరుతుందని పొలిటికల్ టాక్. రాజకీయాల్లో సినిమా గ్లామర్ కష్టమేనా? తమిళనాడు సినీ రాజకీయాల చరిత్ర చూస్తే.. పాత తరం వారు మాత్రమే రాజకీయాల్లో రానించారని తెలుస్తోంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత మాత్రమే అక్కడి పొలిటికల్ డ్రామాలో సూపర్హిట్ కొట్టారు. తర్వాత వచ్చిన విజయ్ కాంత్, శరత్ కుమార్, కుష్బూ, రజనీకాంత్, కమల్ హాసన్ వీరిలో ఎవరూ రాజకీయాల్లో మెప్పించలేదనే చెప్పవచ్చు. మరి తాజాగా పొలిటికల్ గేమ్లో అడుగుపెట్టాలనుకుంటన్న విజయ్ ఏ మేరకు రానిస్తాడో తెలియాలంటే 2026 ఎన్నికల వరకు ఆగాల్సిందే. -
హ్యుందాయ్ రూ.20,000 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత్లో రూ.20,000 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు వెల్లడించింది. తమిళనాడులో వచ్చే 10 ఏళ్లలో ఈ మొత్తాన్ని దశలవారీగా వెచ్చించనున్నట్టు తెలిపింది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ అభివృద్ధి, వాహనాల ప్లాట్ఫామ్స్ ఆధునీకరణకు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా తమిళనాడు ప్లాంటును ఈవీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. 1,78,000 యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. అయిదేళ్ల వ్యవధిలో ప్రధాన రహదార్లలోని కీలక ప్రదేశాలలో 100 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. హ్యుందాయ్ వార్షిక తయారీ సామర్థ్యం 8.5 లక్షల యూనిట్లకు పెంచాలని నిర్ణయించింది. -
జల్లికట్టు పోటీలో అపశ్రుతి..నలుగురు మృతి
దక్షిణాదిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించే సంప్రదాయ క్రీడ జల్లికట్టు పోటీల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ మేరకు ఎద్దులతో నిర్వహించే జల్లికట్టు పోటీల్లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు సంఘటనల్లో నలుగురు మృతి చెందారు. ఆదివారం కర్ణాటకలో శివమొగ్గలో ఒక ప్రమాదం జరగగా, శనివారం షికారిపురలో మరో ప్రమాదం జరిగింది. ఈమేరకు కర్ణాటకలో ఆదివారం నాడు ఎద్దు మీదకు దూకడంతో గాయపడ్డ 34 ఏళ్ల వ్యక్తి సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు, అలాగే మరో వ్యక్తి ఎద్దులు గుంపు మీదకు దూసుకురావడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అలాగే తమిళనాడులోని పాలమేడులో జరిగిన జల్లికట్టులో క్రీడాకారుడు అరవింద రాజన్(24) అనే యువకుడుని ఎద్దు ఢీ కొట్టి చంపగా, తిరుచ్చిలో ఒక ప్రేక్షకుడు 25 ఏళ్ల వ్యక్తి ఎద్దు దాడిలో మృతి చెందాడు. అసలు ఈ జల్లుకట్టు అనేది ఒక ప్రమాదకరమైన సాంప్రదాయ క్రీడ. ఇక్కడ శక్తిమంతమైన యువకులు బలమైన ఎద్దులపై ఆధిపత్య చెలాయించడానకి ప్రయత్నించే ఒక సరదాతో కూడిన ప్రమాదకరమైన క్రీడ. ఈ పోటీలో ఎద్దులు క్రీడా మైదానంలోకి ప్రవేశించగానే అక్కడే ఉండే యువకులు వాటిని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ముపురం పట్టుకుని కౌగలించుకోవడానికి యత్నిస్తారు. ఆ సమయంలో వారికే కాకుండా అక్కడ చూస్తున్నవారికి, పక్కనున్నవారు గాయపడే అవకాశాలు ఎక్కువ. రూ. 3 లక్షల పరిహారం ప్రకటించిన స్టాలిన్ జల్లికట్టులో జరిగిన ఈ ఘటనలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ఈ పోటీల్లో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబాలకు చెరో రూ. 3 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. (చదవండి: రివర్ క్రూయిజ్ చిక్కుకోలేదు! భద్రత దృష్ట్యా అలా చేశాం) -
షూటింగ్ పోటీల్లో అజిత్ సత్తా.. 4 బంగారు పతకాలు కైవసం
Ajith Kumar Wins Medals In Tamilnadu 47Th State Shooting Championship: ప్రముఖ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాల్లోనే కాకుండా ఇతర రంగాలలోనూ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయనకు బైక్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే బైక్ రేసింగ్, రైఫిల్ షూటింగ్లో ఆయన పలు పతకాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం తన 61వ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అజిత్ రైఫిల్ షూటర్గా బంగారు పతకాలను, కాంస్య పతకాలను గెలుచుకోవడం సినీ ఇండస్ట్రీలో విశేషంగా మారింది. తమిళనాడు రాష్ట్రస్థాయిలో 47వ రైఫిల్ షూటింగ్ పోటీలు తిరుచ్చిలో ఈనెల 26వ తేదీ నుంచి రైఫిల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో 1300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా ఈ పోటీలో పాల్గొనడానికి అజిత్ టీమ్ చెన్నై సమీపంలోని మౌరై వీరపురం పోలీసు ట్రైనింగ్ అకాడమీలో తీవ్రంగా రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేసింది. ఇక ఈనెల 27వ తేదీన అజిత్ టీమ్ తిరుచ్చిలో జరిగిన పోటీలో పాల్గొని 4 బంగారు పతకాలను, 2 కాంస్య పతకాలను గెలుచుకుంది. సెంటర్ ఫైర్ పిస్టల్, స్తందర్డ్ పిస్టల్ వస్టర్, 50 మీటర్ల ప్రీ పిస్టల్ మాస్టర్, స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ కేటగిరీల్లో పసిడి పతకాలను, 50 మీటర్ల ప్రీ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్ కేటగిరీలో కాంస్య పతకాలను సాధించారు. దీంతో అజిత్ అభిమానులు ఆయన్ను షూటింగ్ స్టార్ అంటూ కొనియాడుతున్నారు. చదవండి: నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్.. ఈ ఏడాది దుమ్మురేపిన సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవే.. -
16 రోజుల్లో రూ. 300 కోట్లు.. బాహుబలి 2 రికార్డు బద్దలు..
సుమారు నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్. ఆయన తాజాగా నటించి సూపర్ బ్లాక్బ్లస్టర్ హిట్గా నిలిచిన చిత్రం 'విక్రమ్'. కమల్తోపాటు విజయ్సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించిన ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాతో పవర్ఫుల్ కమ్బ్యాక్ ఇచ్చాడు కమల్ హాసన్. అయితే ఈ మూవీ విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లలో సగం అంటే రూ. 150 కోట్లు ఒక్క తమిళనాడు రాష్ట్రం నుంచే వచ్చాయట. దీంతో ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో ఉన్న బాహుబలి 2 సినిమా కలెక్షన్ల రికార్డును విక్రమ్ బద్దలు కొట్టినట్లయింది. వచ్చే రోజుల్లో విక్రమ్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమా సక్సెస్ సాధించిన సంతోషంలో చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి, థియేటర్ యజమానులకు స్పెషల్ పార్టీ ఇచ్చింది మూవీ యూనిట్. మూవీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. చదవండి: 'విక్రమ్' సక్సెస్ డిన్నర్ పార్టీ.. విందులోని వంటకాలు ఇవే.. చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ కామంతో కళ్లు మూసుకుపోతే.. -
సరికొత్తగా మూవీ ప్రమోషన్స్.. 40 రోజులపాటు ప్రచార రథయాత్ర..
చెన్నై సినిమా: మాయోన్ చిత్ర ప్రచారానికి వినూత్నంగా(విష్ణుమూర్తి శేష శయనం ప్రతిభతో) రథయాత్రను ప్రారంభించారు. నటుడు సిబిరాజ్, తాన్యా జంటగా నటించిన చిత్రం మాయోన్. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ పతాకంపై అరుణ్ మొళి మాణిక్యం కథను అందించి నిర్మించిన చిత్రం ఇది. ఎన్.కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రచార యాత్ర విశేషపూజ, హోమాలతో ఆదివారం ప్రారంభమైంది. ఇక రామాపురంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార రథయాత్రను రాష్ట్రవ్యాప్తంగా 40 రోజులపాటు నిర్వహించనున్నట్లు నిర్మాత తెలిపారు. దైవం, సైన్స్, విగ్రహాల స్మగ్లింగ్, గుప్తనిధులవేట వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందించిన చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు. డావిన్సీ కోడ్ వంటి చిత్రాలు తనకు చాలా ఇష్టమని, ఆ తరహా చిత్రాల్లో నటించాలనే కోరిక ఈ చిత్రంతో నెరవేరిందని నటుడు సిబిరాజ్ పేర్కొన్నారు. -
కోలీవుడ్ ఫస్ట్ ప్లేస్లో దూసుకుపోతోంది: ముఖ్యమంత్రి
చెన్నై సినిమా: తమిళ సినిమా రంగం దేశంలో ప్రథమస్థానంలో దూసుకుపోతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పేర్కొన్నారు. సౌత్ ఇండియా మీడియా, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (సదస్సు) శనివారం ఉదయం చెన్నైలో మొదలైంది. స్థానిక నందంబాక్కంలోని ట్రేడ్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొని సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించానని పేర్కొన్నారు. తమిళ సినిమా భారతీయ సినిమాలో ప్రథమస్థానంలో దూసుకుపోతుందని ప్రశంసించారు. చిత్ర పరిశ్రమ ఐక్యతకు తాను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈతరం యువత గంజాయి, గుట్కా వంటి మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని, అలాంటి వాటిపై సినిమాల్లో అవగాహన కలిగించే విధంగా సంభాషణలు పొందుపరచాలని సీఎం స్టాలిన్ తెలిపారు. దక్షిణ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు సత్యజ్యోతి ఫిలిమ్స్ త్యాగరాజన్ అధ్యక్షత వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖులు దర్శకుడు మణిరత్నం, నటుడు జయంరవి, టాలీవుడ్ నుంచి డైరెక్టర్ రాజమౌళి, సుకుమార్, మల్లువుడ్ నుంచి నటుడు జయరాం, ఫాహత్ ఫాజిల్, శాండిల్వుడ్ నుంచి శివరాజ్కుమార్ మొదలగు 300 మందికి పైగా పాల్గొని సినిమాకు చెందిన వివిధ అంశాలపై ప్రసంగించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, సినిమా మార్కెట్ విస్తరణ, ఓటీటీ ప్రభావంపై తమ అనుభవాలను, అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చదవండి: బుల్లితెర నటుడి కొత్త ఇల్లు.. కోట్లల్లో ధర.. -
ఆ రాష్ట్రంలో భారీగా ఆస్తిపన్ను పెంపు! ఈ నిబంధనలే కారణం ?
తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో ఆస్తి పన్నును పెంచబోత్నుట్టు ప్రకటించింది. ప్రతిపక్షాలతో పాటు మిత్ర పక్షం నుంచి విమర్శలు వస్తున్నా వెనక్కి తగ్గేది లేదంటోంది స్టాలిన్ ప్రభుత్వం. ఈ మేరకు ఆ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ శనివారం న్యూఢిల్లీలో స్పష్టమైన ప్రకటన చేశారు. తమిళనాడులో ఉన్న పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను భారీగా పెరగనుంది. ఆ రాష్ట్ర రాజధాని చెన్నై విషయాన్ని పరిశీలిస్తే... 600 చదరపు అడుగుల లోపు ఉన్న ఆస్తులపై 50 శాతం, 600ల నుంచి 1200 చదరపు అడుగుల స్థలంలో విస్తరించిన ఆస్తులపై 75 శాతం పన్ను, 1200 నుంచి 1800 చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ఉన్న ఆస్తులపై వంద శాతం పన్ను పెరగబోతుంది. 1800 చదరపు అడుగులకు మించితే 150 శాతం పన్ను పెంచనున్నట్టు సమాచారం. డీఎంకే సర్కారు తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష అన్నా డీఎంకేతో పాటు మిత్రపక్షం కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. కరోనా కాటు, ద్రవ్యోల్బణం ఎఫెక్ట్, పెట్రోలు ధరల వాతలతో ప్రజలు ఉక్కిరిబిక్కరవుతున్న సమయంలో ఈ పన్ను పెంపు సరికాదంటున్నాయి. పదిహేనో ఫైనాన్స్ కమీషన్ నిబంధనల ప్రకారం కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధులు రావాలంటే ఆస్తి పన్ను పెంచక తప్పడం లేదంటూ స్టాలిన్ ప్రభుత్వం చెబుతోంది. పన్నులు పెంచినప్పటికీ అవి బెంగళూరు, లక్నో, అహ్మాదాబాద్, ఇండోర్, అహ్మదాబాద్, ముంబై, కోల్కతా కంటే తక్కువగానే ఉంటాయని అక్కడి ప్రభుత్వం అంటోంది. చదవండి: జీఎస్టీ వసూళ్లు.. రికార్డ్ -
ప్రధానికి సీఎం స్టాలిన్ లేఖ
సాక్షి ప్రతినిధి,చెన్నై: శ్రీలంక ప్రభుత్వ చెరలో ఉన్న తమిళనాడు జాలర్ల విడుదలపై జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ ద్వారా బుధవారం విజ్ఞప్తి చేశారు. శ్రీలంక సముద్రతీర రక్షణ దళాలు 29 మంది జాలర్లను, వారికి చెందిన 79 మరపడవలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నాయని అందులో పేర్కొన్నారు. ఈనెల 7వ తేదీన మూడు మరపడవల్లో చేపలవేటకు వెళ్లిన 11 మంది తమిళ జాలర్లను అరెస్ట్ చేసి శ్రీలంకలోని మయిలాట్టి కోస్ట్గార్డ్ ప్రదేశానికి తరలించారని, గత కొన్ని వారాలుగా శ్రీలంక కోస్ట్గార్డు అధికారాలు భారత్కు చెందిన అమాయక మత్స్యకారులపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ఇటీవలకాలంలో మూడుసార్లు జాలర్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. శ్రీలంక అధికారులు అసంబద్ధ వైఖరి వల్ల జాలర్ల జీవనాధారం దెబ్బతినడమే కాదు, వారి ప్రాణాలకు, హక్కులకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం ద్వారా చర్చలు జరిపి మత్స్యకారుల విముక్తికి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఇదిలా ఉండగా, జాలర్ల అరెస్ట్కు నిరసనగా రామేశ్వరంలో మాత్రమే కొసాగుతున్న మత్స్యకారుల సమ్మె మరింత విస్తృతం కానుంది. రామనాథపురం జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి ఆందోళనకు దిగనున్నట్లు మత్యకార సంఘాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే తమ కు ఈపరిస్థితి ఏర్పడిందని ఆరోపించాయి. -
ఈవీ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. రేంజ్ కూడా అదుర్స్!
తమిళనాడుకు చెందిన బూమ్ మోటార్స్ తన ఎలక్ట్రిక్ బైక్ కార్బెట్ ను విడుదల చేసింది. కంపెనీ ఈ మోడల్ను 'భారతదేశం అత్యంత మన్నికైన, దీర్ఘకాలిక ఎలక్ట్రిక్ బైక్'గా పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ బైకులో 2.3 కిడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంది. కావాలంటే దీనిని 4.6 కిహెచ్ డబ్ల్యు సామర్థ్యంకు రెట్టింపు చేసుకోవచ్చు. ఈ బైకును ఒకసారి ఫుల్ల చార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. దీనిలోని బ్యాటరీలను మార్చుకోవచ్చు. వీటితో పోర్టబుల్ ఛార్జర్ కూడా వస్తుంది. సాధారణంగా ఇంట్లో ఉపయోగించే 15ఏ సాకెట్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. దీని గరిష్ఠ వేగం గంటకు 75 కిలోమీటర్లు. ఇది అత్యధికంగా 200 కిలోల లోడ్ మోయగలదు. మన దేశంలోని కఠినమైన రోడ్లకు తగ్గట్టు దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. వాహనం బ్యాటరీ ఫుల్ ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్. కంపెనీ ప్రస్తుతం బ్యాటరీపై 5 సంవత్సరాల వారెంటీని, వాహనంపై 7 సంవత్సరాల వారెంటీని అందిస్తోంది. కొనుగోలు కోసం 5 సంవత్సరాల ఈఎమ్ఐ ప్లాన్ కూడా అందిస్తోంది. దీనిని బుక్ చేసుకోవడానికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రెండు మోడల్స్ ఉన్నాయి. 100 కిమీ దూరం వెళ్లే కార్బెట్ 14 మోడల్ బైక్ ధర వచ్చేసి రూ.86,999గా ఉంటే, 200 కిమీ దూరం వెళ్లే కార్బెట్ 14 ఈఎక్స్ బైక్ ధర రూ.1,19,999గా ఉంది. ఇందులో సీఓ2 ఆఫ్ సెట్ ట్రాకింగ్, యాక్సిడెంట్/థెఫ్ట్ డిటెక్షన్, పేరెంటల్ మోడ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు జనవరి 2022 నుంచి ప్రారంభమవుతాయి. (చదవండి: ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న జియోబుక్ ల్యాప్టాప్ ఫీచర్స్ ఇవే!) -
సినీ పరిశ్రమలో మరో విషాదం
చెన్నై: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ నృత్య దర్శకుడు కూల్ జయంత్ (44)బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. సినీ రంగంలో డాన్సర్గా జీవితాన్ని ప్రారంభించి నృత్య దర్శకుడి స్థాయికి ఎదిగారు. ప్రభుదేవా, రాజు సుందరం వద్ద పలు చిత్రాలకు డాన్సర్గా పని చేసిన కూల్ జయంత్ సుమారు 800 చిత్రాలకు పైగా డాన్సర్గా పని చేశారు. అనంతరం కాదల్ దేశం చిత్రం ద్వారా నృత్య దర్శకుడిగా పరిచయమయ్యారు. తమిళం, మలయాళం భాషల్లో సుమారు 100కు పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు. మలయాళంలో మమ్ముట్టి, మోహన్లాల్ వంటి ప్రముఖ నటుల చిత్రాలకు కూల్ జయంత్ నృత్య దర్శకత్వం వహించారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఈయన బుధవారం ఉదయం స్థానిక వెస్ట్ మాంబళంలోని స్వగృహంలో కన్నుమూశారు. ఈయన మృతిపై పలువురు తమిళ, మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బుధవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. -
అఫ్గాన్ పరిస్థితులు సవాల్గా మారాయి: రాజ్నాథ్ సింగ్
-
పెట్రోలు ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
పెట్రోలు ధర వంద రూపాయల మార్క్ను దాటేసి వాహనదారులను హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఆగకుండా పెరుగుతున్న ధరల వల్ల బంకు వెళ్లిన ప్రతీసారీ సామాన్యుడు బడ్జెట్ లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. అయితే, ఈ పెట్రోల్ ధరలపై కేంద్ర ఆర్ధిక మంత్రి మళ్లీ పాత పాట పాడారు. యూపీఏ హయాంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్లపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అసలు, వడ్డీని చెల్లించాల్సి వస్తుందని, ఈ చెల్లింపుల కారణంగానే ధరలు పెరుగుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 16న మీడియా సమావేశంలో అన్నారు. గత యూపీఏ ప్రభుత్వం రూ.1.3 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ బిల్లులు, రూ.37,340 కోట్ల వడ్డీని తిరిగి చెల్లించలేదని తెలిపారు. ఒక మీడియా సమావేశంలో తమిళనాడు తరహాలో కేంద్రం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తుందా అని విలేఖరి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి సీతారామన్ ఇలా సమాధానం ఇచ్చారు.. "మేము గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అన్నింటిని జాబితా చేస్తూ 2014లో ఒక తెల్ల కాగితాన్ని విడుదల చేసి ఉండాల్సింది. చమురు బాండ్లు దానిలో పెద్ద భాగం. గత యూపీఏ ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు చమురు బాండ్ల జారీ చేయడం వల్ల ఇంధన ధరలు తగ్గాయి. ఇప్పటికీ ఆ భారాన్ని ప్రజలు మోస్తున్నట్లు" అన్నారు. లీటరు పెట్రోల్ రేటుపై రూ.3 ఇంధన పన్నును తగ్గిస్తూన్నట్లు తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 13న ప్రకటించింది. ఈ తగ్గింపు వల్ల ఆ రాష్ట్ర ఖజానా మీద ఏడాదికి రూ.1,160 కోట్ల భారం పడనుంది. -
సైకిల్ పై చక్కర్లు కొట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్
-
శశికళపై మరో కేసు నమోదు..
సాక్షి, చెన్నై(తమిళనాడు): తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత మహిళ నేత వి.కె శశికళపై మరో కేసు నమోదైంది. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి CV షణ్ముగానికి శశికళ అనుచరులు నుంచి బెదిరింపులు వస్తున్నాయని తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని రోషనాయ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది..దీంతో ఆమె పైన పలు సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడు మాజీ మంత్రి షణ్ముగంను బెదిరించిన ఆరోపణలపై శశికళ తో పాటు 501 మంది మద్దతుదారులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కొన్నేళ్ల క్రితం అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ.. ఇప్పుడు మళ్లీ పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జైలు నుంచి వచ్చిన తరువాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏప్రిల్ 6న రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించింది శశికళ. ఈ మధ్య తన మద్దతుదారులతో మాట్లాడిన ఫోన్ సంభాషణలు ఆడియో వెలుగులోకి వచ్చాయి. అందరం కలిసి ఐకమత్యంలో పనిచేద్దామని తాను చెప్పిన మాటలను పెడచెవిన పెట్టడం వల్లే అన్నాడీఎంకే ఓటమిపాలైందని శశికళ అన్నారు. చదవండి: ‘దెయ్యాల గుంపు వేధిస్తుంది.. నన్ను కాపాడండి సార్’ -
Tokyo Olympics: విజేతలకు స్టాలిన్ భారీ ఆఫర్..
సాక్షి, చెన్నై(తమిళనాడు): వచ్చే నెలలో ఆరంభం కానున్న టోక్యో ఒలింపిక్స్లో పోటీ చేసే భారతీయ క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు మూడు కోట్ల నగదు ఇవ్వనున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్ శనివారం వెల్లడించారు. సిల్వర్ పతక విజేతకు రెండు కోట్లు, అలానే కాంస్య పతక విజేతకు ఒక కోటి ఇవ్వనున్నట్లు తమిళనాడు సీఎం తెలిపారు. స్థానిక నెహ్రు స్టెడియంలో క్రీడాకారులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గోన్న స్టాలిన్ ఈ ప్రకటనలు చేశారు . ప్రభుత్వం ఎప్పడూ క్రీడాకారులకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్, కరణం మల్లేశ్వరి, పిటి.ఉష వాళ్ల రంగాల్లో సత్తా చాటారని, వాళ్లను ఆదర్శంగా తీసుకువాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు వాయిదాపడి.. ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.14 క్రీడా విభాగాలకు మొత్తం 102 మంది భారతీయ అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్ కోసం అర్హత సాధించారు. చదవండి: డెల్టా దాడి.. ఈసారి టీ 20 ప్రపంచ కప్ విదేశాల్లో..? -
ఆ.. ఐదు రాష్ట్రాల్లోనే కరోనా తీవ్రత
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినా దక్షిణాది రాష్ట్రాలు ఇంకా గండం నుంచి గట్టెక్కలేదు. దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఇంకా లక్షకు పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో నాలుగు రాష్ట్రాలు దక్షిణాదివే కావడం గమనార్హం ఇక్కడే అధికం ఏప్రిల్, మేలలో దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ గడగడలాడించింది, ఆ తర్వాత క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఒక్కో రాష్ట్రం లాక్డౌన్, కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తోంది. అయితే దక్షిణ భారత దేశం ఇంకా కరోనా కబంధ హస్తాల నుంచి బయటపడలేదు. జూన్ 1 నుంచి 14 వరకు గణాంకాలు పరిశీలిస్తే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో నాలుగు దక్షిణాది రాష్ట్రాలే. తమిళనాడు ఫస్ట్ కరోనా సెకండ్ వేవ్ మహారాష్ట్రపై అత్యధిక ప్రభావం చూపించింది. వేవ్ మొదలైనప్పటి నుంచి నిన్నా మొన్నటి వరకు మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదు అవుతూ వచ్చాయి. తాజాగా ఆ స్థానం తమిళనాడుకు మారింది. గత రెండు వారాల్లో తమిళనాడులో 2.43 లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో 1.10 లక్షల కొత్త కేసులు వచ్చాయి. ఢిల్లీ సేఫ్ సెకండ్ వేవ్ తీవ్రతకు ఢిల్లీ చిగురుటాకుల వణికిపోయింది. ఆక్సిజన్ లభించక వందల మంది చనిపోయారు. అయితే కఠిన లాక్డౌన్ తర్వాత అక్కడ కేసులు తగ్గుముఖం పట్టాయి. క్రమంగా పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. మే ద్వితీయార్థంలో 20.14 వేల కేసులు నమోదు అయితే జూన్ ప్రథమార్థంలో ఈ సంఖ్య 4,407కు పడిపోయింది. గోవాలో సైతం కేసుల సంఖ్య 15,555 నుంచి 5,226కి తగ్గింది. ఈ రెండు వారాలు కీలకం లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్న ఐదు రాష్ట్రాలకు రాబోయే రెండు వారాలు ఎంతో కీలకం. సడలింపులు ఇస్తూనే కఠిన లాక్డౌన్/ కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. చదవండి: కణితి అని భావిస్తే.. వైట్ ఫంగస్గా తేలింది -
‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్పై డైరెక్టర్ భారతీరాజా ఫైర్
సాక్షి, చెన్నై: తమిళనాడులో ది ప్యామిలీమెన్ 2 వెబ్సిరీస్పై నిరసనల సెగలు రగులుతున్నాయి. నటి సమంతను శ్రీలంకకు చెందిన తమిళ యువతి పాత్రలో నెగటివ్గా చూపించిన ఈ వెబ్సిరీస్పై తమిళనాట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెబ్ సిరీస్ను నిషేధించాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, పలు రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇలా ఉండగానే వెబ్సిరీస్ ఈ నెల 4న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ చర్యలను నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ తీవ్రంగా ఖండించారు. తాజాగా సీనియర్ దర్శకుడు భారతీరాజా ఈ వెబ్సిరీస్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తమిళ జాతికి వ్యతిరేకంగా రూపొందిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్సిరీస్ను ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించకపోవడం బాధాకరమన్నారు. తమిళ ద్రోహులు రూపొందించిన వెబ్సిరీస్గా పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి నిషేధం విధించాలని కోరారు. ప్రసారాన్ని ఆపకుంటే అమెజాన్ సంస్థపై పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. -
కరోనాతో మరణించిన పోలీసు కుటుంబాలకు రూ.25లక్షలు..
చెన్నై: కరోనా కట్టడిలో పోలీసులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వాళ్ల ప్రాణాలు పణంగా పెట్టి మరి కరోనా విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెకెండ్ వేవ్ లో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన 36 మంది పోలీసుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కొవిడ్ డ్యూటీలు చేస్తూ పోలీసు ఉన్నతాధికారులతో సహా మొత్తం 84 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొలుత 13 మంది పోలీసుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. తాజాగా ఆయా ప్రాంతాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారుల సిఫార్సు మేరకు 36 మంది పోలీసుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలని స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా 35 మంది పోలీసుల కుటుంబాలకు కూడా త్వరలో ఆర్థికసాయం అందిస్తామని స్టాలిన్ తెలిపారు. (చదవండి:రాజీవ్ హత్య కేసులో దోషులను విడుదల చేయండి: సీఎం స్టాలిన్) -
తమిళ నాడు లో వేగంగా కరోనా కేసులు
-
కేసు వెనక్కి తీసుకున్న ఇళయరాజా!
సంగీత దర్శకుడు ఇళయరాజా తన కేసును వెనక్కి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇళయరాజా 40 ఏళ్లకు పైగా స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్న గదిని ఖాళీ చేయాలంటూ ప్రసాద్ స్టూడియో అధినేతలు ఒత్తిడి చేశారు. ఇళయరాజా ఈ విషయమై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో స్టూడియో అధినేతలు ఇళయరాజాకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: ఇళయరాజాకు ఎందుకు అనుమతివ్వరు న్యాయమూర్తి ఎన్.సతీష్కుమార్ ఒక రోజు ధ్యానం చేసుకోవడానికి ఇవ్వాలన్న ఇళయరాజా కోరికను ఎందుకు అంగీకరించరని ప్రసాద్ స్టూడియో అధినేతలను ప్రశ్నించారు. అందుకు స్టూడియో అధినేతలు ఇళయరాజా తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారని బదులిచ్చారు. దీనికి బదులివ్వాల్సిందిగా ఇళయరాజాను న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో తన పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్టు ఇళయరాజా బుధవారం కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. -
పార్టీ ఏర్పాటుతో 24 గంటల్లో అధికారమా?
సాక్షి, చెన్నై: ప్రజాకర్షణ లక్ష్యంగా గ్రామసభలకు డీఎంకే బుధవారం శ్రీకారం చుట్టింది. శ్రీపెరంబదూరు సమీపంలోని కున్నం గ్రామంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పర్యటించారు. గ్రామాల్లో తిరుగుతూ అన్నాడీఎంకేను వ్యతిరేకిద్దాం అనే కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.2021లో అధికారం లక్ష్యంగా వ్యూహాలకు డీఎంకే పదును పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజలకు మరింత చేరువయ్యే రీతిలో గ్రామసభలకు నిర్ణయించారు. జనవరి 10వ తేదీ వరకు 16 వేల గ్రామాల్లో ఈ సభల నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. ప్రజలతో మమేకం అయ్యే రీతిలో, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా కరపత్రాల పంపిణీ, స్థానిక సమస్యలపై దృష్టి అంశాలను పరిగణించి బుధవారం ఈ గ్రామసభలకు శ్రీకారం చుట్టారు. డీఎంకే ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శుల నేతృత్వంలో ఆయా గ్రామాల్లో సభలు సాగాయి. ప్రజలతో కలిసి నేలపై కూర్చుని వారితో మాట్లాడడం, వారి సమస్యలను ఆలకించడం, అన్నాడీఎంకే సర్కారు వైఫల్యాలను ఎత్తి చూపించే విధంగా ఈ సభలు సాగాయి. చదవండి: రజనీకాంత్ జోష్కి బ్రేక్ స్టాలిన్ పర్యటన.. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు సమీపంలోని కున్నంలో గ్రామసభకు స్టాలిన్ హాజరయ్యారు. ప్రజలకు మరింత చేరువయ్యే రీతిలో ఆయన పర్యటన ఆ గ్రామంలో సాగింది. గ్రామంలో నడుచుకుంటూ వీధివీధిన నడుచుకుని తిరుగుతూ కరపత్రాలను స్టాలిన్ అందజేశారు. స్టాలిన్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావంతో అన్నా ఏళ్ల తరబడి ప్రజల కోసం శ్రమించారని గుర్తు చేశారు. అయితే, కొందరు పార్టీ ప్రకటించిన తర్వాత 24 గంటల్లో అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని పరోక్షంగా దక్షిణ భారత చలన చిత్ర సూపర్స్టార్ రజనీకాంత్ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. తానూ..రౌడీనే అన్నట్టుగా తానూ రైతు అని గొప్పలు చెప్పుకుంటు సీఎం పళనిస్వామి అదే రైతులకు ద్రోహం తలబెట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చదవండి: ప్రజలు మార్పు తీసుకురావాలి: కమల్ కేంద్ర వ్యవసాయ చట్టాల రూపంలో రైతులు తీవ్ర నష్టాల్ని, కష్టాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని, దీనిని వ్యతిరేకించకుండా మద్దతు పలుకుతున్న సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నిబంధనల్లో సవరణలు చేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ డీఎంకే నేతృత్వంలో మద్రాసు హైకోర్టు బుధవారం ఓ పిటిషన్ దాఖలైంది. ఇక, పార్టీలో చేరే వారిని ఆహ్వానించే రీతిలో సభ్యత్వ నమోదుకు టోల్ ఫ్రీనంబర్ను డీఎంకే ప్రకటించింది. ఆ మేరకు 9171091710 నంబర్కు ఫోన్ చేసి తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని ప్రజలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. -
విజన్ 200; రజనీపై పరోక్ష విమర్శలు
సాక్షి, చెన్నై: 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజన్ 200 నినాదంతో ముందుకు వెళ్దామని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయాత్తం అవుతూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులు, ముఖ్య నేతలతో ఆదివారం అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకేకు వ్యతిరేకం నినాదంతో రూపొందించిన ప్రచార లఘు చిత్రాలను ఆవిష్కరించారు. చదవండి: నేను ఎంజీఆర్ రాజకీయ వారసుడ్ని: కమల్ 23 నుంచి గ్రామ సభలు ప్రజలకు మరింత చేరువయ్యే రీతిలో గ్రామ సభలకు డీఎంకే నిర్ణయించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఈ వివరాలను సమావేశంలో ప్రకటించారు. ఈనెల 23 నుంచి జనవరి 10వ తేది వరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 16 వేల గ్రామాల్లో ఈ సభలు సాగనున్నట్టు, ఇందులో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ, జిల్లా ఇన్చార్జ్లు, కార్యదర్శులు, ముఖ్య నేతలు తప్పని సరిగా పాల్గొనాల్సిందేనని ఆదేశించారు. ఈ సభల్లో అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించాలని సూచించారు. ఎన్నికలకు సిద్ధంకండి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రసంగిస్తూ.. ముందుగానే ఎన్నికల నగారా మోగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి 200లకు పైగా స్థానాలను కైవశం చేసుకోవడమే లక్ష్యం అన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. తాను జనవరి మొదటి వారం నుంచి ప్రచారం మొదలు పెడతానని తెలిపారు. డీఎంకే గెలుపు ఖాయమని.. దీనిని అడ్డుకునేందుకు కొత్త వాళ్లు పుట్టుకొస్తున్నారని అన్నారు. వారి చేత బలవంతంగా పార్టీలు ఏర్పాటు చేయిస్తున్నారని పరోక్షంగా రజనీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఇలాంటి వాళ్లు ఎందరు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు. -
ఇళయరాజాకు ఎందుకు అనుమతివ్వరు
చెన్నై:సుమారు 40 ఏళ్లకుపైగా తన చిత్రాలకు సంబంధించిన సంగీత కార్యక్రమాలు నిర్వహించిన ప్రసాద్ స్టూడియోలో ఒకరోజు ఇళయరాజాకు ధ్యానం చేసుకోవడానికి ఎందుకు అవకాశం ఇవ్వరని మద్రాసు హైకోర్టు ప్రసాద్ స్టూడియో నిర్వాహకులను ప్రశ్నించింది. సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో ఇళయరాజా కోసం నాలుగు దశాబ్దాల క్రితం ఒక రూమును ప్రత్యేకంగా కేటాయించారు. ఆ గదిలోనే ఇళయరాజా తన చిత్రాలకు సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే గత ఏడాది ఆ గదిని వేరే కార్యక్రమానికి కేటాయించడంతో ఇళయరాజాని ఖాళీ చేయాల్సిందిగా స్టూడియో అధినేతలు ఒత్తిడి చేశారు. దీంతో ఇళయరాజా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సోమవారానికి వాయిదా వేశారు. -
తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా..
చెన్నై: రాజకీయాల్లోకి వస్తానని షకీలా అన్నారు. పలు భాషల్లో 200 పైగా చిత్రాల్లో నటించి శృంగార తారగా ప్రేక్షకులను అలరించిన నటి షకీలా. ఆమె బయోపిక్ ఇప్పుడు షకీలా పేరుతోనే ఐదు భాషల్లో రూపొందింది. ఇందులో షకీలా పాత్రలో నటి ఏస్తర్ నటించారు. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నటి షకీలా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను రాసుకున్న తన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం షకీలా అని తెలిపారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఇందులో పొందుపరచలేదని.. చిత్రానికి ఏది అవసరమో దాన్ని చెప్పినట్లు తెలిపారు. ఒక వ్యక్తి జీవించి ఉండగానే తన జీవిత చరిత్ర సినిమాగా రూపొందడం ఆసక్తికరమైన విషయమని అన్నారు. తాను చేసిన తప్పులను కూడా ఈ చిత్రంలో చూపినట్లు తెలిపారు. ఈ చిత్రం నటీనటులకు, ఇతర మహిళలకు ఒక మంచి పాఠంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను తన సొంత సోదరి కారణంగానే చాలా మోసపోయానని చెప్పారు. అయినా తన కుటుంబాన్ని ఇప్పటికీ తానే పోషిస్తున్నానని అన్నారు. రాజకీయాల్లోకి వస్తారా అని చాలా మంది అడుగుతున్నారని, తాను తప్పకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నారని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ ఆహ్వానించినా ఆ పార్టీలో చేరడానికి సిద్ధమని షకీలా పేర్కొన్నారు. -
పొత్తులు కొన్నిసార్లే కలిసి వస్తాయి: కమల్
సాక్షి, చెన్నై: తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఏడాది మే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందస్తు ప్రచారానికి పలు పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా మక్కల్ నీది మయ్యం నేత, నటుడు కమల్హాసన్ తన పార్టీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ను సోమవారం మధురైలో లాంచ్ చేశారు. ఈ క్రమంలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని.. అయితే ఏ నియోజకవర్గం నుంచి దిగుతాననే విషయాన్ని త్వరలో ప్రకటిస్తానని అన్నారు. చదవండి: కమల్తో అసద్.. దోస్తీ! సూపర్ స్టార్ రజనీకాంత్ ఏర్పాటు చేయబోయే పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. ‘పొత్తులు కొన్ని సార్లు విడిపోతాయి. మరికొన్ని సార్లు కొత్తవి పుట్టుకువస్తాయి. ప్రస్తుతానికి రజనీకాంత్ పార్టీతో పొత్తు విషయం గురించి నిర్ణయం తీసుకోలేదని’ అన్నారు. ఇక కమల్ హాసన్ పాల్గొన్న ర్యాలీపై పలు విమర్శలు వస్తున్నాయి. ఆయన కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, ర్యాలీలో పాల్గొన్న క్రమంలో మాస్క్ కూడా ధరించలేదని చర్చించుకుంటున్నారు. ఇక కమల్ ర్యాలీలో భారీగా పాల్గొన్న అభిమానులు, కార్యకర్తలు భౌతికదూరం పాటించకుండా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: మోదీపై ప్రశ్నల వర్షం కురిపించిన కమల్ #WATCH | Tamil Nadu: Actor & Makkal Needhi Maiam (MNM) chief Kamal Haasan holds a roadshow in Virudhunagar town pic.twitter.com/c4egrkBOb0 — ANI (@ANI) December 15, 2020 -
ఢిల్లీలో తిష్ట వేసిన రజనీకాంత్..
నటుడు రజనీకాంత్ పార్టీ స్థాపన పనుల్లో భాగంగా మక్కల్ మన్రం పెద్దలు ఢిల్లీలో తిష్టవేశారు. ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయంలో శుక్రవారం పార్టీ పేరును నమోదు చేసినట్లు సమాచారం. సాక్షి, చెన్నై : రాజకీయాల్లోకి రావడం ఖాయమని రజనీకాంత్ 2017 డిసెంబర్లో చెప్పారు. ఈ డిసెంబర్ 31న పార్టీ స్థాపనపై కీలక ప్రకటన చేస్తానని ఇటీవల స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీ స్థాపన, ఏప్రిల్ లేదా మేలో వచ్చే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ఖాయమని అందరూ భావిస్తున్నారు. పార్టీ స్థాపనపై మక్కల్ మన్రం నిర్వాహకులతో రజనీకాంత్ చెన్నైలోని తన ఇంటి వద్ద శుక్రవారం మరోసారి సమాలోచనలు జరిపారు. ప్రధాన సమన్వయకర్త అర్జున్మూర్తి, పర్యవేక్షకులు తమిళరువి మణియన్, మక్కల్ మన్రం రాష్ట్ర నిర్వాహకులు సుధాకర్, మన్రం మాజీ అధ్యక్షులు సత్యనారాయణన్ పాల్గొన్నారు. పార్టీ పేరును రిజిస్టర్ చేయడంలో ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద మక్కల్ మన్రం అగ్రనేతలు శుక్రవారం బిజీబిజీగా గడుపుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి న్యాయవాదుల నుంచి సలహా లు స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు, పతాకం, చిహ్నంపై రజనీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మూడు పేర్లను సీఈసీ వద్ద నమోదు చేస్తే అందులో ఏదో ఒకదాన్ని అధికారులు ఆమోదిస్తా రు. ఈ ప్రక్రియ నెలాఖరుకు పూర్తయితే 31న పార్టీ పేరును రజనీ అధికారికంగా ప్రకటిస్తారని అంచనా. నేడు రజనీ జన్మదినం.. ఈనెలాఖరులో పార్టీని ప్రకటించబోతున్న తరుణంలో శనివారం నాటి రజనీకాంత్ 71వ జన్మదినోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలతో అభిమానులు సందడి చేయనున్నారు. రజనీకాంత్కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని, ఎన్నికల్లో ఘనవిజయం సా«ధించాలని ప్రార్థిస్తూ మక్కల్ మన్రం నిర్వాహకులు ఎన్నూరులోని శ్రీ అంకాళ పరమేశ్వరీ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు. మక్కల్ మన్రం చెన్నై పశ్చిమం శాఖ తరఫున జిల్లా కార్యదర్శి ఆర్ రవిచంద్రన్ వెస్ట్మాంబళంలోని శంకరమఠంలో శుక్రవారం సాయంత్రం గోపూజ జరిపారు. అశోక్నగర్లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకం, మహిళా విభాగం అధ్వర్యంలో రంగరాజపురంలో సంక్షేమ కార్యక్రమాలు, సైదాపేటలో అన్నదానం శనివారం నిర్వహిస్తారు. కాంగ్రెస్ ఎంపీ ఎద్దేవా.. పార్టీని స్థాపించి సినిమా షూటింగులకు వెళ్లే ఒకే ఒక రాజకీయనేత దేశమొత్తం మీద రజనీ మాత్రమేనని అంటూ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ఎద్దేవా చేశారు. పార్టీ రాజకీయాలను ఎవరైనా ఎంతో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాక్షేత్రంలోకి దిగి పాటుపడాల్సి ఉంటుంది. అయితే పార్టీని స్థాపించిన తరువాత “అన్నాత్త’ అనే చిత్రం షూటింగ్ కోసం 40 రోజులపాటు రజనీ వెళ్లిపోతున్నట్లు వెలువడిన సమాచారం విచిత్రంగా ఉందని ఆమె అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాహుల్ సమక్షంలోనే సీట్ల సర్దుబాటు..
సాక్షి, చెన్నై: కాంగ్రెస్–డీఎంకేల మధ్య కూటమి దోస్తీ కొనసాగడం ఖాయమైంది. అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే కూటమి భాగస్వామైన కాంగ్రెస్ సీట్ల సర్దుబాటుపై బుధవారం తొలి అడుగువేసింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దినేష్ గుండూరావు, డీఎంకే అధ్యక్షులు స్టాలిన్తో చర్చ లు జరిపారు. కాంగ్రెస్ కోరినన్ని సీట్ల కేటాయింపు డీఎంకేకు సంకటంగా, సవాలుగా మారనుంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నా హాలపై అన్ని పార్టీలు తలమునకలై ఉన్నాయి. తమిళనాడు ఏ ఎన్నికలు వచ్చినా అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ అనాధిగా కొనసాగుతోంది. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి ఖరారైంది. డీఎంకే పదేళ్లుగా ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. రాబోయే ఎన్నికలను డీఎంకే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డీఎంకే కూటమిలో అనేక పార్టీలుండగా వీటిల్లో కాంగ్రెస్ ప్రధానమైనది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రెండురోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళనాడు కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. డీఎంకే కూటమిలో కొనసాగాలని, అపుడే గెలుపు సాధ్యమని కాంగ్రెస్ నేతలంతా రాహుల్ను కోరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దినేష్ గుండూరావు బుధవారం చెన్నైకి చేరుకున్నారు. రాహుల్ ఆదేశాలకు అనుగుణంగా డీఎంకేతో కూటమిని ఖరారు చేసేందుకు, సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేఎస్ అళగిరి తోపాటు స్టాలిన్ను కలిశారు. డీఎంకే కూటమిలో ఉంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ కేవలం 8 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ కారణంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు డీఎంకే అధికసీట్లు కేటాయించే అవకాశం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ 45 సీట్లు కోరుతుండగా డీఎంకే 25– 30 స్థానాలను మాత్రమే కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం. కమల్హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యంను డీఎంకే కూటమిలో కలుపుకుంటే మెజార్టీ స్థానాల్లో గెలుపొందవచ్చని కొందరు కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నట్లు సమాచారం. రాహుల్గాంధీ చెన్నైకి రానున్నారు: గుండూరావు ఎన్నికల వ్యూహం, పోటీచేయదలచుకున్న స్థానాల అంశాలపై చర్చలు జరిపేందుకు త్వరలో రాహుల్గాంధీ చెన్నైకి రానున్నారని దినేష్ గుండూరావు తెలిపారు. డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నాఅరివాలయంలో బుధవారం రాత్రి స్టాలిన్ను ఆయన కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లలో పోటీచేయాలనే అంశంపై రాహుల్గాంధీ సమక్షంలోనే డీఎంకేతో చర్చలు జరుగుతాయని చెప్పారు. డీఎంకే కూటమి బలోపేతం చేయడం ఎలా అనే అంశంపై మాత్రమే స్టాలిన్తో మాట్లాడాం. సీట్ల సర్దుబాటు అంశం ఈరోజు అజెండా కాదని వ్యాఖ్యానించారు. -
హత్యచారం కేసు: పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మథురలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో అసలైన నిందితులను అరెస్ట్ చేయలేదని బాలిక కుంటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. నవంబర్ 26న కట్టెల కోసం సమీపంలోని అడవిలోకి వెళ్లిన ఓ ఎనిమిదేళ్ల బాలిక అదృశ్యం అయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమె కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా, మరుసటి రోజు ఆ బాలిక అడివిలో విగతజీవిగా పడి కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆ బాలికను అత్యాచారం చేసి, హత్య చేసినట్ల ఆమె తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, ఒక మానసిక వికలాంగుడిని ఈ కేసులో అరెస్ట చేసి అసలు నిందితులను పోలీసులు వదిలేశారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఈ ఘటనకు పాల్పడిన మరి కొంత మంది నిందితులు బయటనే ఉన్నారని అన్నారు. అసలు నిందితులను అరెస్ట చేసి లోతుగా దర్యాప్తు చేయాలని బాలిక తండ్రి డిమాండ్ చేశాడు. అరెస్ట్ చేసిన మానసిక వికలాంగుడిని పోలీసులు పలుమార్లు ప్రశ్నిస్తూ వేధిస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తులో భాగంగానే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అదే విధంగా మరింత లోతుగా విచారిస్తామని పేర్కొన్నారు. -
ఏపీ అప్రమత్తం: దూసుకొస్తున్న నివార్..
సాక్షి, అమరావతి: రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా ‘నివార్’ మారనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 370 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 25న సాయంత్రం తమిళనాడులోని మమాళ్లపురం-కరైకల్ మధ్య, పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 65-85 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. (చదవండి: ప్రాణ నష్టం లేకుండా చూడాలి : సీఎం జగన్) తుపాను ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. ముందస్తుగా సహాయక చర్యల కోసం నెల్లూరు జిల్లాకు 2 ఎస్డీఆర్ఎఫ్, 1 ఎన్డీఆర్ఎఫ్.. చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు విపత్తుల శాఖ తెలిపింది. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను, ప్రభుత్వ శాఖలను విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు అప్రమత్తం చేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రైతాంగం వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. తీర,లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. (చదవండి: నివార్ తుఫాన్: ఏపీలో భారీ వర్షాలు) -
నివర్ తుఫాన్: ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన నివర్ తుఫాను రేపు మరింత తీవ్ర రూపం దాల్చనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన నివర్ చెన్నై ఆగ్నేయం దిశగా 420 కిమీ వేగంతో పుదుచ్చెరి చుట్టూ కారైకల్, మామల్లపురం, తమిళనాడు తీరాలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో 24 గంటల్లో నివర్ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీనివల్ల రేపు, ఎల్లుండి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చెరిల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి ప్రభుత్వాలు రక్షణ చర్యల్లో భాగంగా సహాయక బృందాలను అప్రమత్తం చేస్తున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం ఇక రేపు(బుధవారం) మామళ్లపురం- కరైకల్ తీరం వెంబడి 65-85 కిమీ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భార వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతీ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున్న మత్సకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేగాక నెల్లూరు జిల్లాలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలను సిద్దం చేస్తుండగా.. కాకినాడ, అమలాపురం, పెద్దాపురంలోని 13 మండలాలు అధికారులకు ఏపీ ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఇక కృష్ణా జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ ఇంతియాజ్ అలీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. చెన్నైలో 100 కి.మీ వేగంతో ఈదురు గాలులు అయితే నిన్నటి నుంచి చెన్నై, కరైకల్, నాగపట్నంలో కురిసిన వర్షం కారణంగా చెన్నై పోర్టులో 6వ నంబర్ వద్ద తమిళనాడు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. చెన్నైలో 100 కి.మీ వేగంతో గాలులు వీచే సూచనలు ఉండటంతో కడలూరు పోర్టులో 7వ నంబర్ వద్ద అధికారులు హెచ్చరిక జారీ చేశారు. కడలూరు, మహాబలిపురం, పెరబలూరులో కూడా భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
అందుకే షూటింగ్ మధ్యలో వెళ్లిపోయా
సాక్షి, చెన్నై: విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్లు ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జననాథన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లాభం’. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన షూటింగ్స్ ఇటీవల ప్రారంభం కావడంతో ఈ సినిమా తిరిగి సెట్స్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ‘లాభం’ షూటింగ్లో పాల్గొన్న శ్రుతిహాసన్ అర్థంతరంగా షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయారు. దీంతో దీనిపై పలు రకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై స్పందిస్తూ ట్విటర్ వేదికగా శ్రుతీ సోమవారం వివరణ ఇచ్చారు. షూటింగ్ స్పాట్కు పెద్ద ఎత్తున చుట్టూ పక్కల ప్రజలు తరలి వచ్చినందున తాను షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ‘దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు షూటింగ్ స్పాట్కు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో కోవిడ్-19 వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మహమ్మారి కాలంలో అందరికి ప్రమాదమే. ప్రతి ఒక్కరూ ప్రాటోకాల్ పాటించాల్సిందే. ఒక మహిళగా, సినీ నటిగా కరోనా ప్రొటోకాల్ దృష్ట్యా పలు నిర్ణయాలు తీసుకునే హక్కు నాకుంది. అందుకే షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయాను’ అంటూ శ్రుతీ వివరించారు. (చదవండి: వకీల్ సాబ్ సెట్లో అడుగుపెట్టనున్న శృతి) కాగా ప్రస్తుతం ‘లాభం’ షెడ్యూల్ చివరి దశకు చేరుకుంది. స్క్రిప్ట్లో భాగంగా ఈ క్రైమాక్స్ సీన్స్ను తమిళనాడులోని ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతంలో షూటింగ్ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు విజయ్ సేతుపతిని, శ్రుతిహాసన్ను చేసేందుకు భారీగా తరలివచ్చారు. ఇక ఇది ఊహించని చిత్ర యూనిట్ ముందుగా ఎలాంటి భద్రత చర్యలు ఏర్పాటు చేసుకోకపోవడంతో అక్కడ రద్దీ పెరగడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. కాగా లాభం చిత్రంలో జగపతిబాబు, కలైరసన్, సాయి ధన్షిక, రమేష్ తిలక్, పృథ్వీ, తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అభించింది. ఇక సినిమా విడుదల తేదీని కూడా దర్శక నిర్మాతలు త్వరలోనే ప్రకటించనున్నట్లు సినీ వర్గాల సమాచారం. (చదవండి: మానసిక ఆందోళనతో బాధపడ్డా: శ్రుతిహాసన్) COVID is a serious health risk everyone ! The pandemic is not over ! I as a person and an actor have the right to prioritise my safety and health if protocols are not followed ! Just saying — shruti haasan (@shrutihaasan) November 19, 2020 -
చిన్నమ్మ రూ.10 కోట్ల జరిమానా చెల్లింపు
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఆమె చెల్లించాల్సిన రూ.10 కోట్ల పది లక్షల జరిమానాను కోర్టుకు చెల్లించారు. రశీదులను పరప్పన అగ్రహార చెరకు చిన్నమ్మ న్యాయవాదులు పంపించినట్టు సమాచారం. అక్రమాస్తుల కేసులో జైలు నుంచి జనవరిలో శశికళ విడుదల కాబోతున్నట్టు విషయం తెలిసిందే. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమె విడుదల అవుతారన్న సమాచారంతో అన్నాడీఎంకేలో చర్చ తప్పలేదు. అదే సమయంలో చిన్నమ్మ విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు సైతం సాగుతున్నట్టుగా చర్చ జోరందుకుంది. అదేసమయంలో ఆమె తరఫు న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ అయితే, చిన్నమ్మ విడుదలను ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ముందుగానే ఆమె జైలు నుంచి బయటకు వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చదవండి: రూ.10 కోట్లు.. చిక్కుల్లో చిన్నమ్మ జరిమానా చెల్లింపు.. ఆదివారం బెంగళూరుకు వెళ్లిన రాజా చెందూర్ పాండియన్ చిన్నమ్మకు కోర్టు విధించిన జరిమానా చెల్లింపు పనిలో పడ్డారు. బెంగళూరులోని న్యాయ వాది ముత్తుకుమార్తో కలిసి రూ.10 కోట్ల 10 లక్షలను మంగళవారం సంబంధిత కోర్టులో చెల్లించారు. డీడీ రూపంలో న్యాయమూర్తి అందుకున్నారు. రశీదు బుధవారం ఉదయాన్నే ఆ కోర్టు నుంచి చిన్నమ్మ న్యాయవాదులు అందుకున్నట్టు తెలిసింది. శశికళ విడుదల విషయంగా తమ తరఫు లేఖను పరప్పన అగ్రహారచెరకు పంపించినట్టు తెలిసింది. రాజాచెందూర్ పాండియన్ను ప్రశ్నించగా, అన్ని ప్రక్రియలు సజావుగానే సాగుతున్నాయని, చిన్నమ్మ ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యేందుకు సైతం అవకాశాలు ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో అనుభవించిన జైలు జీవితం మేరకు ఆమె ముందుగానే విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువేనని ధీమా వ్యక్తం చేశారు. శశికళ విడుదలైనంత మాత్రాన అన్నాడీఎంకేలో ఎలాంటి పరి ణామాలు చోటుచేసుకునే ప్రసక్తే లేదని కోవైలో మీడియాతో సీఎం ఎడపాడి మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు. -
పొలిటికల్ ఎంట్రీపై సూపర్స్టార్ పునరాలోచన!
చెన్నై : రాజకీయ రంగప్రవేశంపై సూపర్స్టార్ రజనీకాంత్ పునరాలోచనలో పడినట్టు సంకేతాలు పంపారు. సరైన సమయంలో రాజకీయాల్లో అడుగుపెట్టడంపై తన వైఖరి వెల్లడిస్తానని ఆయన బుధవారం పేర్కొన్నారు. తాను రాసినట్టు చెబుతున్న బహిర్గతమైన లేఖపై రజనీ వివరణ ఇచ్చారు. ఈ లేఖ తాను రాయలేదని..అయితే తన ఆరోగ్యం, డాక్టర్ల సూచనలు మాత్రం నిజమేనని ఓ ప్రకటనలో తెలిపారు. తాను రజనీ మక్కల్ మండ్రమ్తో చర్చించి రాజకీయ వైఖరిపై సరైన సమయంలో ప్రకటన చేస్తానని రజనీకాంత్ స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ ఎంట్రీ ఖాయమని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు కొద్దిముందు ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తితో తన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన ప్రణాళికలు దెబ్బతిన్నాయని రజనీ రాసినట్టు చెబుతున్న లేఖపై పలు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నందున కోవిడ్-19 సోకే ప్రమాదం ఉందని సమూహాల్లో కలువరాదని వైద్యులు ఆయనకు సూచించినట్టు ఈ లేఖలో ప్రస్తావించారు. తన చుట్టూ ఉన్న వారి బాగోగుల కంటే తన గురించి తాను ఎక్కువగా విచారించబోనని ఈ లేఖలో రజనీ పేర్కొనట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కావాలనే కోరికతో తాను ఎన్నికల్లో పోటీ చేయనని ఈ ఏడాది మార్చిలో రజనీ తేల్చిచెప్పారు. చదవండి : రజనీకాంత్పై మద్రాస్ హైకోర్టు సీరియస్ -
అక్కడ గెలిస్తే.. అధికారం చేతికొచ్చినట్టే
సాక్షి, చెన్నై: గెలుపే లక్ష్యంగా శ్రమించాలని, కొంగుమండలాన్ని గుప్పెట్లోకి తీసుకుంటే, అధికారం చేతికొచ్చినట్టే అని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొంగుమండలం పరిధిలో కోవై, తిరుప్పూర్, ఈరోడ్ జిల్లాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ జిల్లాల్లో ఘోర పరాజయం రూపంలో గత ఎన్నికల్లో అధికారాన్ని తృటిలో డీఎంకే కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఈ జిల్లాలపై దృష్టి పెడుతూ, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఒక్కో రెవెన్యూ జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్ని కలుపుతూ పార్టీ పరంగా ఒక జిల్లాగా ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అని విభజించి కార్యదర్శులను నియమించారు. ఈ పరిస్థితుల్లో బుధవారం చెన్నై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొంగుమండలం నేతలతో స్టాలిన్ భేటీ అయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గం వారీగా పరిస్థితిని సమీక్షించారు. గెలుపు లక్ష్యంగా శ్రమించాలని, సమష్టిగా ముందుకుసాగాలని నేతల్ని కోరారు. ఈ జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాల్లో విజయఢంకా మోగిస్తే, అధికారం చేతుల్లోకి వచ్చినట్టే అని, ఆ మేరకు నేతలు ఓట్ల కోసం పరుగులు తీయాలని పిలుపునిచ్చారు. పార్టీ పరంగా ఏదేని సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని స్థానిక నేతలకు కొన్ని నంబర్లను స్టాలిన్ ఇవ్వడం గమనార్హం. కొంగుమండలం ఈసారి చేజారకూడదని, గెలుపే లక్ష్యంగా శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. సీఈసీ కసరత్తులు.. అసెంబ్లీ ఎన్నికల కసరత్తులపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సత్యబ్రత సాహు దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, మాదిరి ఓటర్ల జాబితా విడుదలకు కసరత్తులు, జిల్లాల్లో ఎన్నికల అధికారుల నియామకం, వారితో భేటీలకు తగ్గట్టుగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సత్యబ్రత సాహు, ఇతర ఎన్నికల అధికారులతో బుధవారం భేటీ అయ్యారు. సచివాలయం నుంచి సాహుతో పాటు అధికారులు సీఈసీతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఓటర్ల జాబితా కసరత్తులు, నవంబర్లో జరగనున్న జిల్లాల ఎన్నికల అధికారులతో సమీక్షలు, అఖిలపక్షం భేటీ అంశాలను సీఈసీ దృష్టికి సాహు తీసుకెళ్లారు. -
గుణిషా అగర్వాల్ ‘డిజిటల్’ సాయం
నిరుపేద విద్యార్థుల ఇబ్బందులు గమనించింది ఓ టీనేజ్ అమ్మాయి. ఐటీ కంపెనీలను సంప్రదించింది. వారి సాయంతో విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తోంది. చెన్నై పోలీస్ కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్ కుమార్తె పేరు గుణిషా అగర్వాల్. 12వ తరగతి చదువుతోంది. 17 ఏళ్ల గుణీషా తన తల్లి ఆన్లైన్ క్లాస్లో పాల్గొనడానికి ఇంట్లో పనిచేసే అతడి కుమార్తెకు ల్యాప్టాప్ ఇవ్వడం చూసింది. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు ఆన్లైన్లోనే చదువులు కొనసాగిస్తున్నారు. కానీ, వీరిలో చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు. వీరు ఆన్లైన్లో చదువుకోవాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ సమస్య ఒకటే కాదు ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు వంటి పరికరాలు కావాలి. ఇదంతా గమనించిన గుణిషా అవసరమైన విద్యార్థులకు సహాయం చేయాలని సంకల్పించింది. కంపెనీల చొరవ చెన్నైలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలా మంది విద్యార్థులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ల్యాప్టాప్లను గుణిషాకు విరాళంగా ఇస్తున్నారు. అలాగే, ఓ ఐటి కంపెనీ, థింక్ఫినిటీ అండ్ కన్సల్టింగ్ కూడా గుణిషాకు సహాయం చేయడానికి చొరవ తీసుకున్నాయి. ఈ సంస్థ 50,000 రూపాయలతో గుణిషా కోసం ఉచితంగా వెబ్సైట్ను తయారు చేసింది. అదే సంస్థకు చెందిన సాంకేతిక నిపుణులు విద్యార్థులకు ఇచ్చిన పాత పరికరాలను ఆన్లైన్ తరగతుల ప్రకారం ఫార్మాట్ చేస్తారు. సలహాదారు బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ, ‘ఐటి విభాగంలో పనిచేసిన తరువాత కూడా, విద్యార్థులకు సహాయం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. గుణిషా కారణంగా, మేం కూడా ఈ గొప్ప పనిలో పాల్గొనే అవకాశం లభించింది’ అని ఆనందంగా తెలిపారు. వారు ఇప్పటివరకు 25 పరికరాలను విద్యార్థులకోసం కేటాయించారు. ఈ వారం, మరో 15 మంది విద్యార్థులకు కంప్యూటర్ పరికరాలను ఇవ్వబోతున్నారు. ‘కరోనా కాలం కారణంగా కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు నిరుద్యోగులుగా మారారు. ఇటువంటి పరిస్థితిలో, చాలా పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని అవసరమైన వారికి అందిస్తే విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉంటాయి అనుకున్నాను. వాటిని అవసరమైన వారికి అందించడమే ఇప్పుడు నా బాధ్యత. తద్వారా వారి ఆన్లైన్ చదువులు నిరాఘాటంగా కొనసాగుతాయి’ అంటోంది గుణిషా. -
చోరీ కేసు: పోలీసుస్టేషన్కు నటి సుచిత్ర
సాక్షి, టీ.నగర్: సొంత ఇంట్లో చోరీ చేసి నాటకమాడిన బుల్లితెర నటి సుచిత్ర మంగళవారం పోలీసుస్టేషన్లో హాజరైంది. బన్రూట్టి సమీపంలోగల మాలిగైమేడు గ్రామానికి చెందిన దేసింగు (55). ఇతను సెప్టెంబర్ 12న ఇంటికి తాళం వేసి భార్య పచ్చయమ్మాల్, కుమారుడు మణికంఠన్తో బయటికి వెళ్లారు. దేసింగు ఇంటికి తిరిగిరాగా బీరువాలో ఉన్న 18 సవర్ల నగలు, నగదు చోరీకి గురయ్యాయి. పోలీసుల విచారణలో తన ఇంట్లో మణికంఠన్ చోరీ చేసిన విషయం తెలిసింది. మణికంఠన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో భార్య సుచిత్ర బుల్లితెర నటి అని, ఆమె సొంతగా సీరియల్ తీసేందుకు నగదు అవసరమైందని, దీంతో తాను, సుచిత్ర నగలు, నగదు చోరీ నాటకమాడినట్లు తెలిపారు. సుచిత్ర మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు కండిషన్ బెయిలు మంజూరుచేసి బన్రూట్టి మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోవాలంటూ ఉత్తర్వులిచ్చింది. దీంతో సుచిత్ర సోమవారం బన్రూట్టి మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయింది. సుచిత్ర బన్రూట్టి పోలీసు స్టేషన్లో మంగళవారం ఉదయం హాజరై సంతకం చేశారు. కరోనా నేపథ్యంలో లాక్డైన్ కారణంగా డబ్బుల ఇబ్బంది గురైన నటి సుచిత్ర తన ఇంట్లోనే పధకం ప్రకారం మణకంఠన్తో చోరీ నాటకమాడినట్టు పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
వాళ్లంతా బుర్ర లేనోళ్లు..!
సాక్షి, చెన్నై : మానసిక ఎదుగుదల లేని పార్టీ కాంగ్రెస్ అని, ఆ పార్టీ నాయకులకు బుర్ర కూడా తక్కువే అంటూ బీజేపీ మహిళా నేత, నటి కుష్బు ఎద్దేవా చేశారు. వివిధ రాష్ట్రాల్లో ప్రచారానికి తన సేవలను వాడుకున్నప్పుడు తానో నటినని తెలియలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘనస్వాగతం.. జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన నటి కుష్బుకు చెన్నై విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్తో పాటు పలువురు నేతలు ఆమెను పూలమాలతో ముంచెత్తారు. అక్కడి నుంచి నేరుగా కమలాలయం చేరుకున్న కుష్బు మీడియాతో మాట్లాడారు. తాను డీఎంకే నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆ పార్టీని విమర్శించలేదని, ప్రస్తుతం అదే శైలిలో సాగాలని నిర్ణయించినా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వదలిపెట్టేలా లేరన్నారు. తనను విమర్శించ బట్టే, ఇప్పుడు పెదవి విప్పాల్సి వస్తోందన్నారు. విమర్శిస్తే, ఎదురు దాడికి సిద్ధమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్లో తనను అణగదొక్కారని, అక్కడ బుర్ర తక్కువ నాయకులే ఎక్కువని, తనకు తెలివి ఉండబట్టే మేల్కొని బయటకు వచ్చేశానని వ్యాఖ్యానించారు. ఇది వరకు ప్రతి పక్షంలో ఉండబట్టే, అధికార పక్షాన్ని వ్యతిరేకించినట్టు తెలిపారు. ఇప్పుడు తానో నటి అన్న విషయం కాంగ్రెస్ వాళ్లకు గుర్తొచ్చినట్టుందని మండిపడ్డారు. బీజేపీలో చేరడానికి తన భర్త సుందర్ కారణం కాదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు తాను ఆనందంగా ఉన్నానని పేర్కొన్నారు. బీజేపీకి పెరిగిన గ్లామర్ ఇమేజ్ కుష్బు బీజేపీలో చేరడంతో ఆ పార్టీలో సినీనటుల సంఖ్య పెరిగింది. ఇప్పటికే నమిత, గౌతమి, గాయత్రి రఘురాం, మధువంతి, కుట్టి పద్మిని, నటుడు రాధారవి, సంగీత దర్శకులు గంగై అమరన్, దీనా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. 60 స్థానాలే లక్ష్యం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నారు. అన్నాడీఎంకే నుంచి ఆ సీట్లను రాబట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి రంగంలోకి దిగబోతున్నారు. ఈ నెల 17న ఆయన చెన్నైకు రానున్నారు. అన్నాడీఎంకే వర్గాలతో భేటీ, బీజేపీలో చేరిక కార్యక్రమాలు అంటూ ముందుకు సాగబోతున్నారు. -
కుష్బూకు చాన్స్ దక్కేనా?
సాక్షి, చెన్నై: సినీ నటి కుష్బూకు కాంగ్రెస్లో ప్రమోషన్ కల్పించబోతున్నారు. ఆమెకు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు ఏఐసీసీ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సినీ నటి కుష్బూ వాక్ చాతుర్యం, రాజకీయ అడుగుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డీఎంకే నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన ఆమెకు పార్టీ అధికార ప్రతినిధి పదవి దక్కింది. అయితే, కాంగ్రెస్లోని గ్రూపు రాజకీయాలు తట్టుకోలేని పరిస్థితి. ఎన్నికల్లో పోటీకి పలుమార్లు ప్రయత్నించినా, సీటు దక్కలేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవల రాష్ట్ర బీజేపీలో చేరుతున్న సినీ గ్లామర్కు ప్రత్యేక గుర్తింపు కల్పించే రీతిలో పదవుల్ని కట్టబెడుతున్నారు. అయితే, అలాంటి గుర్తింపులు కాంగ్రెస్లో కుష్బూకు కరువే అన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో కుష్బూ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు పది రోజులుగా ఓ ప్రచారం సాగుతోంది. చదవండి: (తలైవి పాత్రలో ఒదిగిపోయిన కంగనా) ఈ సమయంలో కుష్బూ ఢిల్లీ వెళ్లి రావడం ప్రాధాన్యతకు దారి తీసింది. అయితే, కుష్బూ సేవల్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు ఏఐసీసీ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్లో అధ్యక్షుడు కేఎస్ అళగిరి తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షులుగా విష్ణుప్రసాద్, మయూరా జయకుమార్, మెహనకుమార మంగళం, హెచ్ వసంతకుమార్లను ఏఐసీసీ నియమించింది. ఇందులో హెచ్ వసంతకుమార్ మరణించారు. ప్రస్తుతం ఈ పదవీ ఖాళీగా ఉంది. ఈ పదవిని కుష్బూకు ఏఐసీసీ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు తగ్గ అధికార ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్లో చర్చ సాగుతోంది. మేనిఫెస్టో కమిటీ సాక్షి, చెన్నై: 2021 ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై డీఎంకే దృష్టి పెట్టింది. ఇందుకోసం ఎనిమిది మందితో కమిటీని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఆదివారం ప్రకటించారు. మరో ఆరు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనున్న విషయం తెలిసిందే. ఇప్పటినుంచి రాజకీయ పక్షాలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఇందులో డీఎంకే కాస్త దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ సారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో డీఎంకే శ్రేణులు వేగాన్ని పెంచారు. ప్రజల్ని ఆకర్షించే దిశగా ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ పరుగులు తీస్తున్నారు. ఇప్పటివరకు వెలువడ్డ సర్వేలన్నీ డీఎంకేకు అనుకూలంగా ఉండడంతో, ఇది చేజారకుండా మరింత బలాన్ని పెంపొందించుకోవడం లక్ష్యం వ్యూహాలకు మరింత పదును పెట్టే పనిలో స్టాలిన్ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టిపెట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ప్రకటించారు. స్టాలిన్ ఆదేశాలతో ఎన్నికల మేని ఫెస్టో కమిటీని ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ప్రకటించారు. ఇందులో పార్టీ కోశాధికారి టీఆర్ బాలు, ఎంపీలు కనిమొళి, రాజా, తిరుచ్చిశివ, టీకేఎస్ ఇళంగోవన్, అందియూరు సెల్వరాజ్, పార్టీ సీనియర్ సుబ్బలక్ష్మి జగదీశన్, ప్రొఫెసర్ రామస్వామి ఉన్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి సమస్యలు, చేపట్టాల్సిన పనులకు తగ్గ నివేదికలు రాష్ట్ర కార్యాలయానికి చేరాయి. వీటన్నింటిని పరిశీలించి, రాష్ట్రవ్యాప్తంగా పర్యటన తర్వాత మేనిఫెస్టోను సిద్ధం చేసి అధ్యక్షుడికి ఈ కమిటీ సమర్పించనుంది. అలాగే, సీట్ల పంపకాలకు సంబంధించి ఓ కమిటీని రంగంలోకి దించేందుకు డీఎంకే సిద్ధమవుతోంది. ఈ సారి ఎన్నికల్లో కనీసం 180 స్థానాల్లో పోటీ చేయాలన్న లక్ష్యంతో డీఎంకే ఉండడంతో మిత్రులకు సింగిల్ డిజిట్ సీట్లే దక్కబోతున్నాయి. -
చిన్నమ్మకు షాక్ : రూ 2000 కోట్ల ఆస్తుల ఫ్రీజ్
చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళకు బుధవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయ పన్ను అధికారులు ఆమెకు చెందిన రూ 2000 కోట్ల విలువైన ఆస్తులను బినామీ నిరోధక చట్టం కింద స్తంభింపచేశారు. వీటిలో రూ 300 కోట్ల విలువైన రెండు ఆస్తులున్నాయి. సిరుతవుర్, కొడనాడు ప్రాంతాల్లోని ఈ ఆస్తులు జయలలిత సన్నిహితురాలు శశికళ, ఇలవరసి, సుధాకరన్ల పేరు మీద ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. స్తంభింపచేసిన ఆస్తులకు ఆదాయపన్ను శాఖకు చెందిన బినామీ నిరోధక విభాగం అధికారులు నోటీసులు అతికించారు. కాగా, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్రమాస్తుల కేసులో బెంగళూరు పర్పప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. శిక్షా కాలం ముగిసి వచ్చే ఏడాది జనవరిలో ఆమె విడుదల కానున్నట్టు సమాచారం హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. చదవండి : చిన్నమ్మకు కొత్త చిక్కులు -
కుర్చీ కొట్లాట: పన్నీరుకు బుజ్జగింపు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ను బుజ్జగించేందుకు రాయబారాలు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పన్నీరు మద్దతు నేత నత్తం విశ్వనాథన్ ద్వారా ఈ ప్రయత్నాలు సాగుతుండడం గమనార్హం. ఎట్టకేలకు అధికారిక సమీక్షకు పన్నీరు బుధవారం హాజరయ్యారు. అన్నాడీఎంకేలో సాగుతున్న కుర్చీ కొట్లాట గురించి తెలిసిందే. మంగళవారం పన్నీరుసెల్వం మద్దతుదారులతో మంతనాల్లో మునిగారు. పన్నీరు ఇంట సాగుతున్న పరిణామాలపై దృష్టిపెట్టినట్టుగా ఆ పార్టీ కో కన్వీనర్, సీఎం పళనిస్వామి సైతం వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. పొద్దుపోయే వరకు ఓ వైపు పన్నీరు నివాసంలో, మరో వైపు పళని నివాసంలో ముఖ్యనేతల భేటీలు సాగాయి. ఇది బుధవారం కూడా కొనసాగడం గమనార్హం. అయితే, పన్నీరును బుజ్జగించేందుకు ఆయన మద్దతుదారుడైన మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్ను అస్త్రంగా ప్రయోగించే పనిలో పళని శిబిరం నిమగ్నం కావడం చర్చకు దారి తీసింది. ఓ వైపు పళని నివాసంలో, మరో వైపు పన్నీరు నివాసంలో అంటూ ఆయన అక్కడ..ఇక్కడ పరుగులతో మంతనాలు సాగించడం గమనార్హం. పన్నీరును బుజ్జగించి సామరస్య పూర్వకంగా ముందుకు సాగే రీతిలో నత్తం రాయబారాన్ని పళని సాగించినట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, కుర్చీ విషయంలో పన్నీరు మెట్టు దిగనప్పటికీ, మంతనాలకు కాస్త బ్రేక్ ఇచ్చి అధికారిక కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. అయితే, సీఎం కార్యక్రమానికి మాత్రం వెళ్ల లేదు. సమీక్షకు హాజరు.. సీఎండీఏలో సాగిన సమీక్షకు పన్నీరు వెళ్లారు. గృహ నిర్మాణాలతో పాటు ఇతర ›ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించిన తీరు తెన్నుల గురించి గంటన్నర పాటు అధికారులతో సమీక్షలో మునిగిన పన్నీరు, ఆ తర్వాత నివాసానికి వెళ్లారు. అక్కడ తన మద్దతు ముఖ్యనేతలతో మళ్లీ మంతనాల్లో మునిగి ఉండడంతో ఈ వివాదానికి తెరపడేదెప్పుడో అన్న ఎదురుచూపుల్లో అన్నాడీఎంకే వర్గాలు ఉన్నాయి. మంత్రి జయకుమార్ తాజా వ్యవహారాలపై స్పందిస్తూ, అన్నాడీఎంకేలో విభేదాలు లేవని, పార్టీ సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఈనెల ఏడో తేదీన చేయాల్సిన ప్రకటన వ్యవహారాలపై పార్టీ ముఖ్యులతో పన్నీరు భేటీల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. మంత్రి ఓఎస్ మణియన్ అయితే, అన్నాడీఎంకేలో పోరు లేదు..వార్ లేదు అంతా ఒక్కటే అని, మీడియా రాద్ధాంతం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు పన్నీరు శిబిరానికి పుండుమీద కారం చల్లినట్లయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళనిస్వామినే అని ఇందులో ఎటువంటి మార్పు లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి ఆజ్యం పోశాయి. -
అన్నాడీఎంకేలో కుర్చీ వార్
సాక్షి, చెన్నై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో నిప్పు రాజుకుంది. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం ఎవరికివారు ‘నేనంటే నేనే’ అంటూ వాదులాడుకునే స్థాయికి చేరింది. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు పార్టీ సోమవారం స్పష్టం చేసింది. చదవండి: (కుష్బూను సందిగ్ధంలో పడేసిన గ్రూపు రాజకీయాలు) ఎడపాడి, పన్నీర్ మాటల యుద్ధం చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సోమవారం పార్టీ కార్యవర్గ సమావేశం రసవత్తరంగా సాగింది. ఎడపాడి, పన్నీర్ వర్గాలు రెండుగా విడిపోయి బలప్రదర్శన చేస్తూ తమ నేతలకు స్వాగతం పలికాయి. తమనేతే సీఎం అభ్యర్థి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున హోం మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు సీఎం ఎడపాడికి బందోబస్తు పెంచారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఈ సమావేశంలో ఎడపాడి, పన్నీర్ మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఈ అంశంపై 11 మందితో మార్గదర్శక కమిటీని వేయాలని పన్నీర్ ప్రతిపాదించగా, పార్టీ పరంగానే నిర్ణయం తీసుకోవచ్చు, కమిటీ అవసరం లేదని ఎడపాడి నిరాకరించారు. జయలలిత ఆదేశాల మేరకు సీఎం అయినందున తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అని పన్నీర్సెల్వం చెప్పగా, మిమ్మల్నే కాదు జయను సైతం సీఎంను చేసింది శశికళేనని ఎడపాడి బదులిచ్చారు. సుమారు ఐదు గంటపాటు సమావేశం జరిగినా ఓ అవగాహనకు రాలేకపోయారు. వచ్చే నెల 7వ తేదీన జరుగనున్న జనరల్ బాడీ సమావేశంలో ఎడపాడి, పన్నీర్ సంయుక్తంగా ప్రకటన చేస్తారని ఆ పార్టీ అగ్రనేత కేపీ మునుస్వామి మీడియాకు తెలిపారు. 15 తీర్మానాలు ఆమోదం పార్టీ ప్రయోజనాలు, సిద్ధాంతాలకు కట్టుబడి సమష్టిగా పాటుపడదాం, తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం జీఎస్టీ సహా పలు అభివృద్ధి కార్యక్రమాల బకాయిలను చెల్లించాలని, కరోనా కష్టకాలంలో ప్రజల కోసం శ్రమించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఆరోగ్య, పోలీస్ శాఖలతోపాటు అన్నాడీఎంకే శ్రేణులకు ధన్యవాదాలు, ద్విభాషా విధానం, తమిళనాడులో నీట్ పరీక్ష రద్దు తదితర 15 తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు. -
శశికళ ముందస్తు విడుదల లేదు
కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లు శశికళ ముందుగానే విడుదల కాబోరని తేలిపోయింది. నాలుగేళ్లు పూర్తిచేసుకున్న తరువాతనే వచ్చే ఏడాది జనవరిలో జైలు నుంచి విముక్తి లభిస్తుందని కర్ణాటక జైళ్లశాఖ స్పష్టం చేసింది. సాక్షి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్లు అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టయి కోర్టులో దోషులుగా రుజువైంది. చెరో రూ.10 కోట్ల జరిమానా, నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ ప్రకారం 2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ లెక్కన వచ్చే ఏడాది నాలుగేళ్లు పూర్తయి జనవరి లేదా ఫిబ్రవరి నాటికి విడుదల కావాల్సి ఉంది. అయితే సత్ప్రవర్తన కింద ముందస్తుగానే ఈ ఏడాది ఆఖరులో చిన్నమ్మ విడుదలయ్యే అవకాశం ఉందని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ దశలో శశికళ విడుదలపై బెంగళూరుకు చెందిన టీ నరశింహమూర్తి అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద కర్ణాటక జైళ్లశాఖకు ఉత్తరం రాశారు. చదవండి: (రియాకు రిమాండ్ పొడిగింపు) వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ విడుదలయ్యే అవకాశం ఉందని జైళ్లశాఖ అతడికి బదులిచ్చింది. శశికళకు చెందాల్సిన సెలవు రోజులను పరిగణనలోకి తీసుకుని ఈ నెలాఖరులో లేదా వచ్చేనెలలో విడుదలవుతారని ఆమె అనుచరులు ఇంకా ఆశాభావం వ్యక్తంచేస్తూ తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు çసమీపిస్తున్న తరుణంలో శశికళ ముందస్తు విడుదల ఈ విషయం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మరో సమాచారం బయటకు వచ్చింది. చదవండి: (తెరపైకి దియా, నమ్రత!) ఈ పరిస్థితిలో సామాజిక కార్యకర్త టీ నరశింహమూర్తి సమాచార హక్కు చట్టం కింద జైళ్లశాఖపై మరో ఉత్తరాన్ని సంధించారు. ఖైదీలకు ఇచ్చే సెలవు దినాలు, ఇలాంటి సెలవులు ఏఏ కేటగిరి ఖైదీలకు వర్తిస్తాయి, ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు వర్తిస్తుందా అని అందులో ప్రశ్నించారు. ఇందుకు జైళ్లశాఖ బధులిస్తూ...జీవితాంతం జైలుశిక్ష పడిన ఖైదీలకు మాత్రమే సెలవు దినాలు వర్తిస్తాయని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం కింద శిక్ష అనుభవించేవారికి వర్తించదని స్పష్టం చేసింది. చిన్నమ్మ కోసం సైకిల్ యాత్ర నామక్కల్ జిల్లా తిరుచెంగోడు సమీపంలో మాంగుటైపాళయంకు చెందిన వడివేల్ (50) అనే వ్యక్తి అమ్మమక ఎంజీఆర్ మన్రం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకెళ్లి శశికళను కలుసుకునేందుకు ఈనెల 18న సైకిల్ యాత్రను ప్రారంభించాడు. రోజుకు 45 కి.మీ పయనిస్తూ సోమవారం రాత్రి హోసూరుకు చేరుకున్నాడు. శశికళతో ములాఖత్ కోసం జైలు అధికారులకు వినతపత్రం ఇస్తానని.. అనుమతి లభించిన పక్షంలో..‘మీరు వస్తేనే పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడగలరు, ప్రజలు మీకోసం ఎదురుచూస్తున్నారు’ అని చెబుతానని మీడియాతో అన్నారు. -
మోదీ పుట్టిన రోజు వేడుకలో ఒక్కసారిగా మంటలు
సాక్షి, చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా తమిళనాడు బీజేపీ కార్యకర్తలు జరుపుకున్న వేడుకలో అసశృతి చోటుచేసుకుంది. గురువారం ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలో మంటలు చెలరెగడంతో కార్యకర్తలు గాయపడిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వేడుకలో బాణా సంచాలు పేలుస్తూ.. హీలియం బెలూన్లను వదులుతున్న క్రమంలో పేలుడు సంభవించి మంటలు చెలరెగడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కార్యకర్తలంతా అక్కడి నుంచి పరుగుల తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై బీజేపీ పార్టీ సభ్యుడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో కొంతమంతి కార్యకర్తలు స్వల్ఫంగా గయపడినట్లు చెప్పాడు. ఈ వేడుకలో బాణసంచాలు హీలియం బెలూన్లు వాడటం వల్లే ప్రమాదం జరిగిందన్నాడు. బాణాసంచాలు హీలియం బెలూన్లను తాకడంతో పేలుడు సంభవించి ఉంటుందని అతడు అభిప్రాయం వ్యక్తి చేశాడు. అయితే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ 5 మందిపైగా గుంపుగా ఉండరాదని ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో పార్టీ కార్యకర్తల ఇలా పదుల సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి రోజు 6000 వేల కేసులు నమోదవుతుండగా.. చెన్నైలోనే 1000కి పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 5 లక్షలకు చేరుకున్న ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
200 సీట్లే లక్ష్యం!: డీఎంకే మిత్రుల్లో కలవరం
సాక్షి, చెన్నై: రానున్న ఎన్నికల్లో 200 సీట్లల్లో డీఎంకే అభ్యర్థులు పోటీ చేయాల్సిన అవశ్యం ఉందని, ఇందుకు అధ్యక్షుడి మీద ఒత్తిడి తెద్దామన్న యువజన సమావేశ నినాదం ఆ పార్టీ మిత్ర పక్షాల్లో కలవరాన్ని రేపింది. పార్టీ కోశాధికారి టీఆర్ బాలు, యువజన నేత ఉదయనిధి స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడాన్ని మిత్రపక్షాలు తీవ్రంగానే పరిగణించాయి. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, మనిదనేయమక్కల్ కట్చి అంటూ చిన్నా, చితకా పార్టీలో డీఎంకే మెగా కూటమి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, రానున్న ఎన్నికల ద్వారా అధికారం కైవసం లక్ష్యంగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటికే 2021 ఎన్నికల్లో డీఎంకే అధికారం చేజిక్కించుకోవాలంటే, అధిక స్థానాల్లో పోటీ అనివార్యం అని సర్వేల్లో తేలింది. ఈ పరిస్థితుల్లో డీఎంకే మిత్ర పక్షాల్లో కలవరాన్ని రేపుతూ, స్టాలిన్ వారసుడు, యువజన నేత ఉదయనిధి, పార్టీ కోశాధికారి టీఆర్ బాలు వ్యాఖ్యలు చేయడం గమనించాల్సిన విషయమే. 200 సీట్లలో పోటీ తప్పనిసరి.. డీఎంకే యువజన సమావేశం బుధవారం చెన్నైలో జరగ్గా, టీఆర్ బాలు, ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, 2021 ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టాలంటే, డీఎంకే అభ్యర్థులు 200 స్థానాల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. మిత్ర పక్షాలకు కావాల్సినన్ని సీట్లు లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన దృష్ట్యా, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ప్రాధాన్యత పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో 200 స్థానాల్లో డీఎంకే అభ్యర్థులే పోటీ చేయాల్సిన అవశ్యం ఉందని, ఇందుకోసం అధ్యక్షుడిపై ఒత్తిడి తెద్దామని ఆ సమావేశం వేదికగా టీఆర్తో పాటు యువజన నేతలు నినదించడం గమనార్హం. ఇది కాస్త డీఎంకే మిత్రుల్లో కలవరాన్ని రేపుతోంది. ప్రధానంగా అధిక సీట్లను ఆశిస్తున్న కాంగ్రెస్కు బెంగతప్పడం లేదు. 200 స్థానాల్లో డీఎంకే పోటీ చేయాల్సి వస్తే, ఆపార్టీకి ఈ సారి మరీ తక్కువగా, మిగిలిన మిత్ర పక్షాలకు సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితం చేయక తప్పదేమో అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. 45 రోజులు 25 లక్షలు.. బలోపేతం లక్ష్యంగా 45రోజుల్లో 25 లక్షల మంది కొత్త సభ్యుల్ని చేర్చడం లక్ష్యంగా అందరూ మనతో కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ సాగనుంది. ఈ కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆన్లైన్ ద్వారా శ్రీకారం చుట్టారు. -
ప్రభుత్వానికి కమల్ పది ప్రశ్నలు
సాక్షి, చెన్నై: అధికారాన్ని కాపాడుకోవడమే ప్రాతిపదికగా, ప్రజాసంక్షేమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పార్టీ అధినేతగా తన బాధ్యతను నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందు ప్రశ్నలు పెడుతున్నానని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షులు, నటుడు కమలహాసన్ అన్నారు. ప్రజాప్రయోజనాలను ఆశిస్తూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటన విడుదల చేస్తున్నానని చెప్పారు. ఆ ప్రకటనలోని వివరాలు.. విద్యను రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మార్పునకు ప్రయత్నాలు చేయకుండా, నీట్ రద్దుకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని కేంద్రప్రభుత్వాన్ని దారితెచ్చుకోలేదు. నీట్ పరీక్షకు సరైన శిక్షణావకాశాలను కల్పించకుండా ఎంతమంది విద్యార్థుల ప్రాణాలను బలిగొంటారు. నష్టపరిహారతో సమస్యను కప్పిపుచ్చాలని చూస్తున్నారా, జీవనాధారం కోల్పోయి అందే ఆర్థికసహాయం రైతన్నకు చెందకుండా దారిమళ్లింది. ప్రభుత్వం తన అవినీతిని కరోనా కాలంలో కూడా చాటుకోవడం న్యాయమా, ఆన్లైన్ విద్యాబోధనకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యానికి పాల్పడింది. ఆన్లైన్ విద్యాబోధనను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఏమి చేస్తుంది ? కరోనా కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా చేతులు దులుపేసుకున్నారు. జీవనాధారం కోల్పోయిన ప్రజలకు ఏమి సమాధానం చెబుతారు ? కరోనా కష్టకాలంలో ఎనిమిది లేన్ల రోడ్డు కోసం ఎందుకు తహతహలాడుతున్నారు? రుతుపవనాలు, తుపాన్ల కాలంలో నష్టపోయేది మత్స్యకారులే. వారి వృత్తి రక్షణకు తీసుకున్న చర్యలు ఏమిటి ? చరిత్రలో ఎన్నడూ ఎరుగని ఆర్థిక దుర్బర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు, ఉద్యోగావకాశాల మెరుగుకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు ? కేంద్ర ప్రభుత్వం నుంచి జీఎస్టీ వాటా పొందడంలో ఉదాసీనత ఎందుకు, ఒత్తిడి చేసేందుకు వెనకడుగు ఎందుకు ? ఈ అమ్మ ప్రభుత్వం టాస్మాక్లను మూసివేయడాన్ని ఎపుడు ప్రారంభిస్తారు ? ఈ రుతుపవనాల కాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చేపట్టిన చర్యలు ఏమిటి ? ప్రజల తరఫున ప్రజల్లో ఒకడిగా అడిగిన ఈ పది ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం ఉందా అని ఆ ప్రకటనలో కమల్ పేర్కొన్నారు. -
ఎస్పీ బాలు లేచి కూర్చొని మాట్లాడుతున్నారు
సాక్షి, చెన్నై: తన తండ్రి మరింత వేగంగా కోలుకుంటున్నారని, ఎంతో హుషారుగా వ్యవహరిస్తున్నారని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. బాలు ఆరోగ్యం గురించి సోమవారం సాయంత్రం ఆయన వీడియో విడుదల చేశారు. అందులో ఆయన ‘నేను ఈనెల 10న మీడియాతో మాట్లాడాను. ఈ నాలుగు రోజుల్లో నాన్న ఆరోగ్యంలో గణనీయ మార్పు వచ్చింది. ఫిజియోథెరపీ కొనసాగుతోంది. వైద్యులు కూర్చోబెట్టగా 15–20 నిమిషాల వరకు వారితో మాట్లాడుతున్నారు. ఊపిరితిత్తుల సమస్య కూడా నయం అవుతోంది. ఆరోగ్యంలో మరింత పురోగతి కనపడుతోంది. మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. -
తమిళనాడులో హిందీ వార్
రాష్ట్రంలో హిందీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఉద్యమం బయలుదేరింది. తద్వారా తమిళాభిమాన పార్టీలు, బీజేపీ మధ్య సమరానికి దారితీసింది. కొందరు సినీ సెలబ్రిటీలు, యువత హిందీ తెలియదు పోరా అంటూ టీషర్టులతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే పనిలో పడ్డారు. అదే సమయంలో హిందీ నేర్చుకుంటే తమిళం కాదు, డీఎంకే గల్లంతు అంటూ బీజేపీ యువత ఎదురు దాడికి దిగింది. సాక్షి, చెన్నై: ఆది నుంచి హిందీ, సంస్కృతానికి తమిళనాడు వ్యతిరేకమన్న విషయం తెలిసిందే. గతంలో కాంగ్రెస్ పాలకులు హిందీని బలవంతంగా రుద్దే యత్నం చేస్తే ఉద్యమం ఉప్పెనలా ఎగసి పడింది. దీంతో కేంద్రం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. ఇతర భాషల వారు రాష్ట్రంలో ఉన్నా విద్య, ఉపాధి రంగాల్లో తమిళులకే పెద్ద పీట. మిగిలిన భాషల వారు అల్పసంఖ్యాక వర్గాలే. హిందీ, సంస్కృతాన్ని తమిళుల దారిదాపుల్లోకి రానివ్వరు. బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తే పోరాటాలు బయలుదేరుతాయి. (ఆమెకు హిందీ తెలుసు; నిజంగా సిగ్గుచేటు!) ఇటీవల కూడా హిందీ, సంస్కృతం విషయంగా కేంద్రం పలు సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలతో పోరాటాలు భగ్గుమన్నాయి. తాజాగా కేంద్రం త్రి భాషా విధానంతో హిందీ, సంస్కృతంను బలవంతంగా రుద్దే యత్నం చేస్తున్నట్టు తమిళ అభిమాన సంఘాలు, పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం చట్టాన్ని పాలకులే కాదు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో హిందీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఉద్యమం బయలుదేరడం గమనార్హం. సమరంలో సెలబ్రిటీలు హిందీకి వ్యతిరేకంగా సినీ సెలబ్రిటీలు యువన్ శంకర్రాజ, ఐశ్వర్య రాజేష్, శాంతను తదితరులు పరో క్షంగా, ప్రత్యక్షంగా హిందీ వ్యతిరేక నినాదాలతో టీ షర్టులు ధరించి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యారు. ‘హిందీ తెలియదు పోరా, నేను తమిళం మాట్లాడే భారతీయుడిని’ అన్న నినాదాలు ఉన్న టీషర్టులు ధరించి తమ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. డీఎంకే యువజన నేత, నటుడు ఉదయ నిధి సారథ్యంలో టీ షర్టుల హిందీ వ్యతిరేక ఉద్యమం మరింత ఊపందుకుంది. డీఎంకే ఎంపీ కనిమొళితో కొందరు యువకులు హిందీ వ్యతిరేక నినాద టీషర్టులు ధరించి సామాజి క మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో హిందీకి వ్యతిరేకంగా కనిమొళి నేతృత్వంలో సామాజిక మాధ్యమం వేదికగా ఉద్యమం మొదలైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. దీనిపై కనిమొళిని ప్రశ్నించగా యువత, కొందరు సెలబ్రిటీలు హిందీకి వ్యతిరేకంగా తమదైన శైలిలో స్పందిస్తున్నారని తెలి పారు. చట్టం బయటకు వచ్చే సమయంలో ఈ ఆగ్రహం ఉప్పెనలా ఎగసి పడుతుందన్నారు. బీజేపీ యువత ఎదురు దాడిలో నిమగ్నమైంది. ‘హిందీ నేర్చుకున్నంత మాత్రాన.. తమిళం గల్లంతు కాదని, డీఎంకే అడ్రస్సే గల్లంతు’ అంటూ టీషర్టులతో ఎదురుదాడి సాగిస్తుండటం గమనార్హం. -
ఫస్ట్ ఉమన్ అంబులెన్స్ డ్రైవర్
అంబులెన్స్ అంటే ఆఘమేఘాల మీద నడపాలి. లోపల ఉన్న పేషెంట్ గగ్గోలు పెడుతున్నా బంధువులు కంగారులో రోదిస్తున్నా చెదరక గమ్యాన్ని చేరాలి. అవసరమైతే ఫస్ట్ ఎయిడ్ చేయాలి.ఊపిరికి పచ్చదీపం చూపాలి.ఇదంతా మగవారి పని అని అందరూ అనుకుంటారు.కాదని నిరూపిస్తోంది చెన్నై వీరలక్ష్మి. మొన్న రెండు రోజుల క్రితం ఆగస్టు 31న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి 118 కొత్త అంబులెన్స్లకు పచ్చజెండా ఊపి ప్రజల వైద్యసేవలకు వాటిని అంకితం చేశారు. రాష్ట్రంలో వేయికి పైగా ఉన్న అంబులెన్స్లకు ఇవి కొత్త చేర్పు. ఇది ఒక విశేషమైతే ఈ కొత్త అంబులెన్స్లలో ఒకదానికి ఒక మహిళా డ్రైవర్ను ఆయన అపాయింట్ చేయడం మరో విశేషం. ఆ మహిళ పేరు వీరలక్ష్మి. ఈ నియామకంతో వీరలక్ష్మి తమిళనాడు తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్ అయ్యింది. బహుశా భారతదేశంలో ఈ కోవిడ్ కాలంలో డ్యూటీలో ఉన్న ఏకైక మహిళా డ్రైవర్ కూడా కావచ్చు. చెన్నైలో నివాసం ఉండే 30 ఏళ్ల వీరలక్ష్మి ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లమా చేసింది. క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్న భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలని ఆరేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో డ్రైవింగ్ నేర్చుకుంది. అప్పటి నుంచి తనూ క్యాబ్ డ్రైవర్గా మారి పని చేయడం మొదలెట్టింది. అంతే కాదు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే మహిళలకు శిక్షకురాలిగా కూడా మారింది. హెవీ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ను సంపాదించింది. అయితే కరోనా అందరికీ తెచ్చినట్టే వారి కుటుంబానికి ఇబ్బందులను తెచ్చింది. భర్తకు తగినంత పని లేదు. తనకు కూడా లేదు. ఈ సమయంలోనే కొత్త అంబులెన్స్ డ్రైవర్ల కోసం తమిళనాడు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కావలసిన అర్హతలు అన్నీ ఉన్నాయి. కాని అంబులెన్స్ డ్రైవర్గా ఇప్పటి వరకూ స్త్రీలెవరూ పని చేయలేదు. ‘ఏం చేద్దామనుకుంటూ ఉంటే మా అమ్మ ధైర్యం చెప్పింది. గట్టిగా ప్రయత్నిస్తే సాధించలేనిది అంటూ ఉండదు అని చెప్పింది’ అంది వీరలక్ష్మి.అపాయింట్మెంట్ వచ్చాక కొన్నాళ్లు అంబులెన్స్ డ్రైవర్గా ఉండటానికి అవసరమైన ట్రైనింగ్ ఇచ్చారు. ప్రాక్టికల్ అనుభవం కోసం అంబులెన్స్ డ్రైవర్లతో పాటు పంపారు. ‘నాకు పాసింజర్లను కూచోబెట్టుకుని క్యాబ్ నడపడమే తెలుసు. కాని అంబులెన్స్లో ప్రయాణికులతో పాటు చాలాసార్లు రక్తం కూడా ఉంటుంది. ముందు భయం వేసినా తర్వాత అలవాటైంది. 108 అంబులెన్స్ అంటే కోవిడ్ పేషెంట్స్ను కూడా తీసుకురావాల్సి రావచ్చు. కాని మా జాగ్రత్తలు మాకున్నాయి అన్న ధైర్యం ఉంది. ఇటువంటి సమయంలో అవసరమైన వారికి సేవ చేయబోతున్నానన్న సంతృప్తి కూడా ఉంది’ అంది వీరలక్ష్మి. ఆమె మొదటిసారి యూనిఫామ్ వేసుకొని అన్ని అంబులెన్స్లతో పాటు నడుపుతుంటే చూడటానికి తండ్రితో పాటు వచ్చిన పదేళ్ల కూతురు, ఐదేళ్ల కొడుకు తమ తల్లివైపు గర్వంగా, ఆశ్చర్యంగా చూశారు. శక్తి సామర్థ్యాలను చూపి, పాత మూసలు పగులగొట్టే వీరలక్ష్మి వంటి వారిని ఎవరైనా అలాగే చూడాల్సిందే. -
అమెరికన్ యువతిపై అత్యాచార యత్నం
సాక్షి, వేలూరు(తిరువణ్ణామలై): తిరువణ్ణామలై గిరివలయం రోడ్డులో ఉంటున్న విదేవీ యువతిపై స్వామిజీ అత్యాచారానికి యత్నించాడు. దీంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అమెరికాకు చెందిన యువతి(31) ఐదు నెలల క్రితం తిరువణ్ణామలై వచ్చింది. లాక్డౌన్ కారణంగా తిరువణ్ణామలైలోని గిరివలయం రోడ్డులోని అరుణాచలనగర్లో ఒక ఇంటిలో అద్దెకు ఉంటోంది. ఈ ప్రాంతంలో సాధువులు, స్వామిజీలు అధికంగా ఉంటున్నారు. నామకల్ జిల్లా తిరుమలై పట్టి గ్రామానికి చెందిన మణిగండన్(41) తిరువణ్ణామలైలోని గిరివలయం రోడ్డులో స్వామిజీగా ఉంటున్నాడు. (అయినవాళ్లే హతమార్చారు.. ) ఆ యువతి ఆ ప్రాంతానికి తరచూ వెళ్లి వచ్చేది. ఆదివారం ఉదయం ఇంటిలో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన మణిగండన్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో పాటు ఇంటిలో ఉన్న కత్తితో మణిగండన్ స్వామిజీపై దాడి చేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని మణిగండన్ను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం తాలూకా పోలీసులకు అప్పగించారు. చదవండి: రూ.కోటి కోసం బాలుడి కిడ్నాప్ -
ఇద్దరు హిజ్రాలు సహా ముగ్గురు హత్య
సాక్షి, చెన్నై: తిరునెల్వేలిలో ఇద్దరు హిజ్రాలు సహా ముగ్గురు హత్యకు గురైన సంఘటన శుక్రవారం కలకలం రేపింది. తిరునెల్వేలి సమీపంలోని సూత్తమల్లిలో హిజ్రాల నివాస ప్రాంతం ఉంది. ఇక్కడ నివాసం ఉంటున్న హిజ్రాలు భవాని, అనుష్క ఆమె భర్త మురుగన్ గురువారం నుంచి కనిపించలేదు. వారి కోసం సహ హిజ్రాలు ఆ చుట్టు పక్కల పలు ప్రాంతాల్లో గాలించారు. అయినా వారి ఆచూకీ కానరాలేదు. దీంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ స్థితిలో శుక్రవారం ఈ సంఘటన గురించి పోలీసులు అదే ప్రాంతానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు పాళయంకోట ఫోర్ వే రోడ్డు సమీపంలో ఉన్న బావిలో తేలుతున్న గోనె సంచుల్లో కట్టిన స్థితిలో ముగ్గురి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కనిపించకుండా పోయిన హిజ్రాలు మృతదేహాలుగా కనిపించిన స్థితిలో సహ హిజ్రాలు పెద్ద సంఖ్యలో సూత్తమల్లి పోలీస్స్టేషన్ను ముట్టడించి, హంతకులను పట్టుకోవాల్సిందిగా ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
ఏడేళ్ల బాలికకు సమన్లు
సాక్షి, తిరువళ్లూరు: పాఠశాల భవనాలకు మరమ్మతులు చేయాలని కోర్టు మెట్లు ఎక్కిన ఏడేళ్ల బాలికను విచారణకు హాజరు కావాల్సిందిగా మీంజూరు పోలీసులు సమన్లు జారీ చేయడం కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా మీంజూరులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. పాఠశాల భవనం శిధిలావస్థకు చేరడంతో పాటు గోడలకు బీటలు వారాయి. దీంతో ఆందోళన చెందిన రెండో తరగతి బాలిక ముత్తరసి మరమ్మతులు చేపట్టాలని కోరుతూ కలెక్టర్ సహా పలువురు ఉన్నత అధికారులకు విన్నవించుకుంది. అయితే వారు చర్యలు చేపట్టకపోవడంతో తన తండ్రి సాయంతో హైకోర్టులో పిటిషన్ను వేసింది. బాలిక వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు, మీంజూరు పాఠశాలకు ఆరు నెలల్లో మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాలికకు మీంజూరు పోలీసులు బుధవారం ఉదయం నోటీసులు జారీ చేశారు. మీంజూరు పోలీస్స్టేషన్కు నేరుగా వచ్చి హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. -
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి విజయ్?
చెన్నై: రానున్న శాసనసభ ఎన్నికల బరిలోకి విజయ్ దిగనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్లో జరుగుతున్న చర్చ ఇదే. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారాయి. ఇలాంటి సమయంలో యువ నటుడు దళపతి విజయ్ రాజకీయ రంగప్రవేశానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తాజా సమాచారం. ఈ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. అందులో భాగంగా విజయ్ తండ్రి, ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఈయన కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పార్టీ పేరును నమోదు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగా ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ న్యాయవాదితో సంప్రదించినట్లు తెలిసింది. -
ఫేస్బుక్, వాట్సాప్లకు ధీటుగా ‘బిగ్రాఫి’
చెన్నై: ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలకు సవాలు విసిరేలా బిగ్రాఫి అనే యాప్ను తమిళనాడు తేనికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి రూపొందించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. తేని, కర్నల్ జాన్ బెన్నిక్విక్నగర్ ప్రాంతానికి చెందిన బాలమురుగన్ (45), జయమణి దంపతుల కుమారుడు మిధున్ కార్తిక్ (13) కుమార్తె కనిష్కాశ్రీ (10). ఇరువురూ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిది, ఐదో తరగతి చదువుతున్నారు. కరోనా వైరస్ కారణంగా గత ఐదునెలలుగా పాఠశాలలు తెరవనందున ఇంట్లో ఉన్న మిధున్ కార్తిక్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలకు ప్రత్యామ్నాయంగా బిగ్రాఫి అనే కొత్త యాప్ను ఆవిష్కరించాడు. లడాక్ సరిహద్దు వివాదంతో చైనా టిక్టాక్, హలో యాప్ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో మిధున్ కార్తిక్ బిగ్రాఫి యాప్ను కనుగొన్నాడు. (ఫేస్బుక్ను బీజేపీ నియంత్రిస్తోంది: రాహుల్) దీనిగురించి మిధున్ కార్తిక్ మాట్లాడుతూ పూర్తిగా భద్రతా అంశాలతో రూపొందించబడిన బిగ్రాఫి యాప్లో సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా ప్రవేశించలేమని అన్నాడు. సమాచారం చోరీ, పేజీ హ్యాకింగ్కు వీలులేని విధంగా రూపొందించినట్లు పేర్కొన్నాడు. మొదటి విడతగా మెసేజ్ షేరింగ్, ఫోటో అప్లోడ్, షేరింగ్, లైక్ చేయడం, అభిప్రాయం వ్యక్తం చేయడం వంటి అంశాలున్నట్లు తెలిపాడు. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్లో బిగ్రాఫి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నాడు. ప్రస్తుతం ఆరు వేల మందికి పైగా తన యాప్ను వినియోగిస్తున్నట్లు తెలిపాడు. మిధున్ కార్తిక్ తండ్రి బాలమురుగన్ మాట్లాడుతూ మిధున్ కార్తిక్కు చిన్ననాటి నుంచే కంప్యూటర్లో ఆసక్తి అధికమని, దీంతో ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడని తెలిపారు. యోగా వెబ్సైట్ కూడా రూపొందించినట్లు తెలిపారు. (గురుకుల విద్యార్థులకు వాట్సాప్ క్లాసులు ) -
పార్టీ పెట్టిన పది రోజుల్లోనే..
రజనీకాంత్ ఈ పేరు ఇప్పుడు సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయరంగంలోనూ ట్రెండింగ్గా మారింది. ఇండియన్ సూపర్స్టార్గా ఇప్పటికీ వెలిగిపోతున్న ఈ 69 ఏళ్ల నటుడు రజనీకాంత్. ఈయన ప్రస్తుతం కథానాయకుడిగా అన్నాత్త చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సీవీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నయనతార, కుష్బూ, మీనా, కీర్తి సురేష్ కథానాయికలు నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 40 శాతం షూటింగ్ను జరుపుకుంది. లాక్డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. కాగా రజనీకాంత్ తదుపరి చిత్రం ఏమిటన్నది ఇప్పుడు. చర్చనీయాంశంగా మారింది. కాగా ఆయన గురించి ఆసక్తిని రేకేతిస్తున్న మరో అంశం రాజకీయ రంగ ప్రవేశం. అవును రజనీకాంత్ రాజకీయాలకు రావాలన్నది ఆయన అభిమానులు 30 ఏళ్ల కల. వారి ఆకాంక్షను నెరవేర్చే విధంగా గత ఏడాది క్రితం రజనీకాంత్ త్వరలో రాజకీయపార్టీని నెలకొన్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. (రజనీ రాజకీయ ప్రవేశం ఉంటుందా..?) అయితే ఆయన ఇప్పటివరకు పార్టీని ప్రకటించలేదు. దీంతో రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి సుముఖంగా లేరని, ఆయన పార్టీని పెట్టే ఆలోచన లేదనే అభిప్రాయాన్ని త్వరలో వెల్లడించే అవకాశం ఉందని ప్రసారం ఓ పక్క జరుగుతోంది. కాగా తమిళనాడులో శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్లో, మేలో శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే రాజకీయ పార్టీ పై రజనీకాంత్ ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు. దీంతో ఆయన అభిమానుల్లో తమ తలైవా రాజకీయ పార్టీని ప్రారంభిస్తారా లేదా అన్న శంక పట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు, బీజేపీ పార్టీ కార్యకర్త ఎస్వీ.శేఖర్ మాట్లాడుతూ ఇప్పుడు రజనీరాజకీయ రంగ ప్రవేశం గురించి అధికంగా చర్చ జరుగుతోందని అన్నారు. (రాయని డైరీ : రజనీకాంత్ (సూపర్ స్టార్)) ఎన్నికలు దగ్గర పడడంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి అభిమానుల్లో అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. అయితే రజనీకాంత్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన పది రోజుల్లోనే ఎన్నికలు వచ్చినా, ఆయన ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. తమిళ ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తారని యస్వీ.శేఖర్ పేర్కొన్నారు. దీంతో రజనీరాజకీయం మరోసారి ట్రెండింగ్ మారింది. కాగా ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కాలాన్ని కీలంవాక్కంలోని తనను ఫాంహౌస్లో గడుపుతున్న రజనీకాంత్ అక్కడ రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి తీవ్రంగా చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. (రజనీ ఫారిన్ కారు: ఇంత పెద్ద స్టోరీనా!) -
కూతుర్ని హతమార్చి నాటకం
సాక్షి, చెన్నై: తన కుమార్తెను పరువు కోసం హతమార్చిన ఓ తండ్రి, బాత్రూంలో జారిపడ్డట్టుగా నాటకాన్ని రక్తి కట్టించాడు. అయితే, పోస్టుమార్టం నివేదికలో ఆ యువతి గొంతు నులిమి హతమార్చినట్టు తేలడంతో ఆ తండ్రి నాటకం గుట్టురట్టు అయింది. ఈ ఘటన కాంచీపురం జిల్లాలో చోటుచేసుకుంది. కాంచీపురం జిల్లా ఉత్తర మేరకు చెందిన బాలాజీ కుమార్తె సెంతారకై రెండు రోజుల క్రితం బాత్రూంలో మృతదేహంగా తేలింది. ఆమె బాత్రూంలో జారిపడి మరణించినట్టు కుటుంబీకులు తేల్చారు. అయితే, అనుమానాలు బయలు దేరడంతో పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. అంత్యక్రియలు ముగిశాయి. ఆ యువతి బాత్రూంలో జారిపడి మరణించినట్టు కుటుంబీకులు నాటకాన్ని బాగానే రక్తి కట్టించారు. దీనిని సర్వత్రా నమ్మేశారు. అయితే, తప్పు చేసిన వాడు ఏదో ఒక రూపంలో చిక్కక తప్పదు అన్నట్టుగా ఈ కుటుంబం గుట్టు పోస్టుమార్టం నివేదిక బయటపెట్టింది. గొంతు నులిమి చంపేశాడు.. సెంతారకై స్థానికంగా ఓయువకుడ్ని ప్రేమించినట్టున్నారు. ప్రియుడితో సెంతారకై చెట్టా పట్టాల్ని తండ్రి బాలాజీ పసిగట్టాడు. ఆ యువకుడితో పెళ్లి చేయడం ఇష్టం లేని బాలాజీ, ఆగమేఘాలపై సెంతారకైకు వివాహ ఏర్పాట్లు చేశాడు. కరోనా భయం, లాక్ కష్టాలు ఉన్నా, ఏ మాత్రం తగ్గకుండా కుమార్తె వివాహం బలవంతంగా చేశాడు. అయితే, తనకు జరిగిన బలవంతపు వివాహంపై సెంతారకై తీవ్ర ఆగ్రహంతో ఉండడమే కాకుండా అంత్తారింటికి వెళ్లకుండా మారం చేస్తూ వచ్చినట్టుంది. దీంతో ఆమెను బలవంతంగా అత్తారింటికి పంపించేందుకు తండ్రి బాలాజీ, ఇతర కుటుంబీకులు తీవ్రంగానే ప్రయత్నించారు. అదే సమయంలో ఆ యువకుడితో తన కుమార్తె పారిపోయిన పక్షంలో కుటుంబం పరువు బజారుకెక్కుతుందన్న ఆందోళనలో బాలాజీ పడ్డట్టున్నారు. దీంతో తన కుమార్తెను గొంతు నులిమి హతమార్చి, బాత్రూంలో జారిపడి మరణించినట్టుగా నాటకాన్ని రక్తికట్టించి అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో బాలాజీని శనివారం అరెస్టు చేసిన పోలీసులు మధురాంతకం సబ్జైలుకు తరలించారు. -
రాజ్భవన్లో 84 మంది సిబ్బందికి కరోనా
సాక్షి, తమిళనాడు: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం ఏకంగా ఆరు వేలకు సమీపంగా చేరింది. తాజగా గురవారం రాజ్భవన్లో 84 మంది సిబ్బందికి కరోనా పాటిజిట్గా నిర్ధారణ అయింది. 147 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 84 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. పాజిటివ్గా నిర్ధారణ అయిన వారిలో సెక్యూరిటీ, ఫైర్ సిబ్బంది ఉన్నారు. ఈ మేరకు రాజ్భవన్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక బుధవారం నిర్థారణ అయిన కరోనా పాజిటివ్ కేసుల జాబితాలో మరో ఎమ్మెల్యే చేరిపోయారు. దీంతో కరోనా బారినపడిన నలుగురు మంత్రులతోకలుపుకొని ఎమ్యెల సంఖ్య 17కు చేరుకుంది. రాష్ట్రం లో మొత్తం కరోనా కేసులు సంఖ్య 186492 కేసలు నమోదు కాగా, 51765 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటికే 131583 మంది కరోనా నుంచి డిశ్చార్జ్ కాగా, 3144 మంది మృతి చెందారు. ఇక బుధవారం ఒక్కరోజే ఏకంగా 5849 కేసుల నమోదయ్యాయి. -
30 ఏళ్లుగా 15 మైళ్లు నడుస్తూ..
తమిళనాడు: దట్టమైన అడవి.. అందులో క్రూర మృగాలు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియదు. ఇక మనిషి తప్పిపోయి ఒక్కసారి అడవిలోకి వెళితే వస్తాడో రాడో కూడా తెలియదు. అలాంటి అడవి గుండా 30 ఏళ్లుగా ఓ పోస్టుమ్యాన్ నడుచుకుంటూ వెళ్లి మారుమూల ప్రాంతాలకు ఉత్తరాలు అందించాడు. అతడి పేరు డి శివన్. తమిళనాడులో పోస్టుమ్యాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు ఉత్తరాలు చేరవేయడానికి అతడు దట్టమైన అడవి, జలపాతాల గుండా 15 మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆయన క్రూర మృగాల దాడులను కూడా ఎదుర్కొన్నాడు. ఆయినా బెదరకుండా 30 ఏళ్లుగా అదే అడవి గుండా నడుచుకుంటూ వెళ్లీ తన విధులను నిర్వర్తించాడు. Postman D. Sivan walked 15 kms everyday through thick forests to deliver mail in inaccessible areas in Coonoor.Chased by wild elephants,bears, gaurs,crossing slippery streams&waterfalls he did his duty with utmost dedication for 30 years till he retired last week-Dinamalar,Hindu pic.twitter.com/YY1fIoB2jj — Supriya Sahu IAS (@supriyasahuias) July 8, 2020 ప్రస్తుతం శివన్ పదవి విరమణ పొందుతున్నాడు. ఈ సందర్భంగా అంకిత భావంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన శివన్ను ప్రశసింస్తూ ఐఏస్ అధికారి సుప్రియా సాహు బుధవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ ట్వీట్కు వేల్లో లైక్లు వందల్లో కామెంట్స్ వచ్చాయి. నిబద్ధతతో, అంకిత భావంతో పనిచేసిన శివన్పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తూ పదవి విరమణ శుభకాంక్షలు తెలుపుతున్నారు. ‘దేశ నిర్మాణంలో అతని పాత్ర చాలా ప్రశంసించబడింది... అతని నిబద్ధతకు అభినందనలు’, ‘అతను పద్మ పురస్కారానికి అర్హుడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
తండ్రికొడుకుల మృతిపై సీబీఐ కేసులు నమోదు
తమిళనాడు: పోలీసుల కస్టడీలో మరణించిన తండ్రికొడుకుల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) బుధవారం రెండు కేసులను నమోదు చేసింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో పి. జయరాజ్ అతడి కుమారుడు బెనిక్స్లను కోవిల్పట్టి పోలీసులు అరెస్టు చేసి హింసించి చంపిన విషయం తెలిసిందే. కర్ఫ్యూ సమయంలో కూడా వారు మొబైల్ షాపును తెరిచిఉంచడంతో అరెస్టు చేసినట్లు కేరళ పోలీసులు ఆరోపించారు. దీంతో జయరాజ్, బెన్నిక్స్ల కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. దీంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపడుతున్నట్లు కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: రాత్రంతా కొట్టారు.. లాఠీలకు రక్తపు మరకలు) ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన మహిళ పోలీసు అధికారి తండ్రికొడుకులను జూన్ 19న అరెస్టు చేసి రాత్రంతా హింసించినట్లు జుడిషియల్ మేజిస్ట్రేట్ ఎంఎస్ బరతిదాసన్కు తెలిపారు. అంతేగాక వారిని కొట్టిన లాఠిలపై, టెబుల్పై రక్తం మరకలు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆమె కోరారు. తమిళనాడు తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సాత్తాన్కులానికి చెందిన జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్లు సెల్ఫోన్ షాపు నిర్వహిస్తుండేవారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్లో పరిమిత సమయానికి మించి షాపును తెరిచారనే ఆరోపణతో జూన్ 19న పోలీసులు అరెస్టు చేశారు. (కస్టడీలో తండ్రి కొడుకుల మృతి; ఆందోళనలు) -
తమిళనాడు మంత్రికి కరోనా పాజిటివ్
చెన్నై: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ మహమ్మారి సామాన్య ప్రజానీకం నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ వైరస్ బారిన పడగా తాజాగా తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పీ అన్బళగన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు మద్రాస్ ఇన్స్టిటూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ ట్రామాటాలజీ వెల్లడించింది. (తమిళనాడులో లాక్డౌన్..జూలై 31 వరకు) కరోనాకు సంబంధించిన లక్షణాలు ముందుగా మంత్రికి లేవని వైద్యులు తెలిపారు. ఆయనకు సిటీ స్కాన్ పరీక్ష చేసినప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించలేదనన్నారు. అయితే ముందు జాగ్రత్తగా మంత్రి అన్బళగన్ను పర్యవేక్షణలో ఉంచామని పేర్కొన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా మంత్రికి సంబంధించిన రెండో శాంపిల్ ద్వారా కరోనా పాజిటివ్గా తేలినట్లు వైద్యులు తెలిపారు. ఆయన జూన్ 29 నుంచి స్వల్ప దగ్గుతో ఆస్పత్రికి వస్తే చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం మంత్రి పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యక్తిగత సహాయకుడు దామోదరన్ కరోనా వైరస్తో మృతి చెందిన విషయం తెలిసిందే. (కరోనా నుంచి కోలుకున్న బండ్ల గణేష్) -
వారి మరణం ఆమోదయోగ్యం కాదు: సునీల్ ఛెత్రి
న్యూఢిల్లీ: తమిళనాడులో పోలీసుల కస్టడీలో మరణించిన జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్లకు న్యాయం జరగాలని భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. ఇప్పటికే వారి మరణానికి న్యాయం జరగాలంటూ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. తాజాగా సునీల్ ఛెత్రి ట్వీట్ చేస్తూ.. జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ విషయంలో జరిగింది ఆమోదయోగ్యం కాదు. తిరిగి వారి ప్రాణాలను ఏదీ తిరిగి ఇవ్వలేదు. కనీసం వారి మరణానికైనా న్యాయం జరగాలి. అది ఒక బలమైన ఉదాహరణగా ఉండాలి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం స్పందిస్తూ ‘‘రక్షకులే అణచివేతదారులుగా మారినప్పుడు’’ అంటూ ట్వీట్ చేశారు. (‘సెల్’ కోసమే దాష్టీకమా?) తమిళనాడు తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సాత్తాన్కులానికి చెందిన జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్లు సెల్ఫోన్ షాపు నిర్వహిస్తుండేవారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేరళలో విధించిన లాక్డౌన్లో పరిమిత సమయానికి మించి షాపును తెరిచారనే ఆరోపణతో జూన్ 19న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వారు ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. పోలీసులు అడిగిన సెల్ఫోన్ ఇవ్వలేదనే జయరాజ్, బెనిక్స్లను అరెస్టు చేశారని, ఆ కక్ష్యతోనే లాఠితో అమానుషంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలతో మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారిపై దాడి చేసిన ఇద్దరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడులోని దుకాణదారులంతా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. (తండ్రీకొడుకుల అనూహ్య మరణం!) -
‘వారి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’
చెన్నై: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పి.జయరాజ్, బెనిక్స్లను పోలీసులు జైలు కస్టడీలో హింసించి చంపిన ఘటనను నటుడు, రాజకీయ నేత కమల్హాసన్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై కమల్ హాసన్ స్పందిస్తూ.. మృతి చెందిన తండ్రీకొడుకుల ఘటనలో సీఎం పళనిస్వామి ప్రధాన నిందితుడుని ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తిగా బాద్యత వహించాలన్నారు. తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి పోలీసుల చర్యకు మద్దతు పలకుతున్నారని దుయ్యబట్టారు. ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇది సరైన పద్దతి కాదని దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు మద్దతు పలుకుతూ ప్రభుత్వం ఉగ్రవాదానికి అనుమతి ఇస్తోందని విమర్శించారు. అదే విధంగా తూత్తుకూడిలో వేదాంత స్టెర్లైట్ కాపర్ పరిశ్రమను మూసేయాలంటూ 2018లో నిరసన తెలిపిన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపి 13 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ఘటనను కమల్ గుర్తు చేశారు.(ఇండియా ‘జార్జి ఫ్లాయిడ్’లు) ఇప్పడు పి.జయరాజ్, బెనిక్స్లపై పోలీసులు దాడి చేశారని ఇది హత్యా నేరం కాదా అని కమల్ తీవ్రంగా ప్రశ్నించారు. కాగా, తమిళనాడులోని శాంతాకులం ప్రాంతానికి పి.జయరాజ్ (62) జూన్ 19న తన దుకాణాన్ని లాక్డౌన్ నిబంధనల ప్రకారం సాయంత్రం 7 గంటలకు మూసివేయకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తండ్రి గురించి కనుక్కోవడానికి వెళ్లిన జయరాజ్ కొడుకు బెనిక్స్నూ అదుపులోకి తీసుకున్నారు. ఇక 21న వీరిద్దరూ పోలీసుల రిమాండ్లోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. -
స్వస్థలాలకు చేరిన వీర జవాన్ల మృతదేహాలు
సాక్షి, న్యూఢిల్లీ: లద్దాఖ్లోని గాల్వన్ లోయా వద్ద చైనాతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన సైనికుల మృతదేహాలు బుధవారం వారి స్వస్థలాలకు చేరుకున్నాయి. సోమవారం రాత్రి చైనా దాడిలో 20 మంది భారత సైనికులు వీరమరణం పోందినట్లు ఆర్మీ అధికారులు మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మరణించిన సైనికుల మృతదేహాలను ఉంచిన శవపేటికకు జాతీయా జెండాను కప్పి సైనిక లాంఛనాలతో వారి స్వస్థలాలకు తరలించారు. కాగా మరణించిన సైనికుల్లో బీహార్కు చెందివారు అయిదుగురు, పంజాబ్కు చెందిన నలుగురు, పశ్చిమ బెంగాల్, ఓడిశా, జార్ఖండ్కు రాష్ట్రాలకు చెందిన వారు ఇద్దరూ చొప్పున ఉన్నారు. చత్తీస్గడ్, మధ్యప్రదేశ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ చెందిన ఒక్కొక్కరూ ఉన్నారు. కాగా ఇవాళ సైనికుల మృతదేహాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నాయి. (సూర్యాపేటలో కల్నల్ సంతోష్ అంతిమయాత్ర) మరణించిన సైనికుల పేర్లు.. 1. కల్నల్ బి. సంతోష్బాబు (తెలంగాణ) 2. నాయిబ్ సుబేదార్ నుదురం సోరెన్ 3. నాయబ్ సుబేదార్ మన్దీప్ సింగ్ 4. నాయబ్ సుబేదార్ సత్నం సింగ్ 5. హవిల్దార్ కె పళని 6. హవిల్దార్ సునీల్ కుమా 7. హవిల్దార్ బిపుల్ రాయ్ 8. నాయక్ దీపక్ కుమార్ 9. సిపాయి రాజేష్ ఒరాంగ్ 10. సిపాయి కుందన్ కుమార్ ఓజా 11. సిపాయి గణేష్ రామ్ 12. సిపాయి చంద్రకాంత ప్రధాన్ 13. సిపాయి అంకుష్ 14. సిపాయి గుర్బిందర్ 15. సిపాయి గుర్తేజ్ సింగ్ 16. సిపాయి చందన్ కుమార్ 17. సిపాయి కుందన్ కుమార్ 18. సిపాయి అమన్ కుమార్ 19. సిపాయి జై కిషోర్ సింగ్ 20. సిపాయి గణేష్ హన్స్డా అడ్డుకున్న సంతోష్ నేతృత్వంలోని దళం సూర్యాపేటలో కల్నల్ సంతోష్బాబు అంత్యక్రియలు.. కాగా తెలంగాణకు చెందిన కమాండర్ కల్నల్ సంతోష్బాబు మృతదేహాన్ని బుధవారం రాత్రి దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి హైదరాబాద్లోని హకీంపేటలోని వైమానిక దళానికి తరలించారు. ఆ తర్వాత విద్యానగర్లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. జాతియ జెండా కప్పిన సంతోస్ బాబు శవపేటికను సైనికులు అంబులెన్స్ నుంచి బయటకు తీస్తుండగా అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఉద్వేగానికి లోనవుతూ ‘సంతోష్ బాబు అమర్ హ’ అంటూ నినాదాలు చేశారు. గురువారం ఉదయం కల్నల్ సంతోష్బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ఆయన స్వస్థలం సూర్యాపేటలో ముగిశాయి. సంతోష్ అంత్యక్రియలకు మంత్రి జగదీశ్రెడ్డితో పాటు రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. -
తేజస్ విమానం నడిపిన ఎయిర్ చీఫ్ మార్షల్
సాక్షి, చెన్నై: భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా బుధవారం ఎంకే1 తేజస్ తేలికపాటి యుద్ధ విమానంలో విహరించారు. తమిళనాడులోని సూలూరు ఎయిర్స్టేషన్లో ఈ విమానాన్ని ఆయన పరిశీలించారు. ఇది నాలుగో తరం సూపర్సోనిక్ విమానాల్లో చిన్న ది, తెలికపాటిది. ఈ విమానాలను ఫ్లయింగ్ బుల్లెట్లుగా పిలుస్తారు. (హద్దు మీరుతున్న డ్రాగన్) తేజస్ విమానాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా స్వయంగా నడిపారు. ఈ విమానాన్ని కోయంబత్తురు సమీపంలో ఉన్న సూలూరు 45వ స్కాడ్రన్ చేర్చారు. దీంతో సూలూరు ఎయిర్స్టేషన్ తేజస్ విమానాలను కలిగి ఉన్న రెండో ఐఏఎఫ్ స్కాడ్రన్గా నిలుస్తోంది. ఈ తేజస్ విమానం స్వదేశి పరిజ్ఞనంతో తయారు చేయబడింది. (మేకలు అమ్మి సొంతూరికి పయనం) -
అక్కడ బ్యూటీ పార్లర్, సెలూన్లకు అనుమతి
సాక్షి, చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి బ్యూటీ పార్లర్లను, సెలూన్లను తిరిగి తెరవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ను మే 31 వరకు పొడగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేవలం గ్రామాల్లోని సెలూన్లను తెరవడానికి అనుమతినిచ్చిన ప్రభుత్వం తాజాగా తమిళనాడుకు చెందిన సెలున్లు, బ్యూటీ పార్లర్లకు కూడా తెరిచేందుకు అనుమతించింది. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా ఉండే రాష్ట్రాలలో తమిళనాడు రెండవ స్థానంలో ఉన్నందున చెన్నై, కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని వీటికి మాత్రం ప్రభుత్వం అనుమంతించలేదు. (బోయిన్పల్లి ఠాణాలో కరోనా కలకలం..) ఈ దుకాణాలు పాటించాల్సిన నియమాలు: దుకాణాల్లో ఎయిర్ కండిషనింగ్ను వాడకూడదు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 దుకాణాలు తెరిచి ఉంచాలి. సిబ్బంది, కస్టమర్లు మాస్క్లు ధరించడం తప్పనిసరి. సామాజిక దూరం పాటించడంతో పాటు కనీసం 5 సార్లు క్రిమిసంహారక మందును షాపులో స్ర్పే చేయాలి. ఇక కరోనా లక్షణాలతో ఉన్న సిబ్బందిని కానీ కస్టమర్లను కానీ లోనికి అనుమతించకూడదు. కరోనా లక్షణాలతో ఉన్న సిబ్బంది లేదా కస్టమర్ను లోపలికి అనుమతించకూడదు. సెలూన్లలో పనిచేసే సిబ్బంది ఎవరైనా కంటైన్మెంట్ జోన్లలో నివసిస్తే వారికి పనిచేయడానికి అనుమతి లేదు. -
కరోనా: ‘మహా’ భయం!
మహారాష్ట్ర నుంచి వస్తున్న వారి రూపంలో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. రెడ్జోన్ల పరిధిలో లేని జిల్లాల మీద ఈ ప్రభావం పడుతుండడంతో కేసులు అమాంతంగా పెరుగుతున్నాయి. ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కరోనా కేసులు తొలుత ఢిల్లీ జమాత్కు వెళ్లిన వారి రూపంలో ప్రవేశించాయి. ఆ సమాచారం జనాన్ని భయాందోళనకు గురిచేసింది. ఈ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న సమయంలో కోయంబేడు మార్కెట్ రూపంలో కరనో కోరలు చాచింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు నుంచి విల్లుపురం, కడలూరు వరకు కోయంబేడు రూపంలో కేసులు అమాంతంగా పెరిగాయి. పక్క రాష్ట్రాలను సైతం ఈ మార్కెట్ వదలి పెట్టలేదు. రోజుకు పదుల సంఖ్యలో ఉన్న కేసులు వందల సంఖ్యలో పెరగడంలో ఈ మార్కెట్ కీలక పాత్ర పోషించింది. (ఒక్క రోజులో 6 వేలకుపైగా కేసులు) కోయంబేడు ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు ముమ్మరం చేశారు. ఈ ప్రభావం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు శివార్లకు పరిమితమయ్యే రీతిలో కట్టడి చర్యలు తీసుకున్నారు. ఇది కొంత మేరకు ఫలితాన్నిచ్చింది. కోయంబేడు నుంచి తేని వెళ్లి వైరస్ ప్రభావంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 69 ఏళ్ల వృద్ధుడు శుక్రవారం మరణించాడు. తేని మీద నిఘా పెంచారు. పెరుగుతున్న కలవరం లాక్డౌన్ నాలుగో సారి పొడిగించినా ఆంక్షల సడలింపు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి కలిసి వస్తోంది. రాష్ట్రంలో 25 జిల్లాల్లో పూర్తిగా ఆంక్షలు సడలించారు. చెన్నై మినహా మిగిలిన 11 జిల్లాల్లో కొంత మేరకు సడలింపులిచ్చారు. విదేశాల్లో ఉన్న తమిళులు స్వస్థలాలకు తిరుగు పయనమవుతున్నారు. వీరి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిని చెన్నై వైపుగా అనుమతించడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి చెన్నైకి, చెన్నై నుంచి ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ప్రత్యేక రైలు సేవలు లేవు. కోయంబత్తూరు, మదురై వైపుగా ప్రత్యేక రవాణా సేవలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర ముంబై, ఒడిశా, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ నుంచి తమిళులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. వీరికి రైల్వేస్టేషన్లు, ఆయా జిల్లాల సరిహద్దుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్, పీసీఆర్ పరీక్షలు నిర్వహించి, వైరస్ ప్రభావానికి గురికాకుండా ఉన్న వారిని వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్లకు తరలిస్తున్నారు. కొందర్ని వారి ఇళ్లల్లోనే స్వీయ నిర్బంధంలో ఉంచుతున్నారు. అయినా కరోనా కేసుల తీవ్రత మరీ తక్కువగా ఉన్న జిల్లాల్లో సైతం ప్రస్తుతం అమాంతంగా పెరుగుతుండడం కలవరంలో పడేసింది. ముంబై రూపంలో.. దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో ఉన్నాయి. ఇక్కడి నుంచి తిరుగుపయనం అవుతున్న తమిళుల రూపంలో రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధ, గురు, శుక్రవారాల్లో ముంబై, పరిసరాల నుంచి వచ్చిన వారిలో అత్యధిక శాతం మంది వైరస్ ప్రభావానికి లోనైనట్టు పరిశోధనలో తేలింది. గురువారం ముంబై నుంచి వచ్చిన వారిలో 76 మంది, శుక్రవారం వచ్చిన 56 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో మొత్తంగా గురువారం 87 మంది, శుక్రవారం 68 మంది వైరస్ ప్రభావానికి గురికావడంతో ఆందోళన తప్పడం లేదు. బయట నుంచి వస్తున్న వారి రూపంలో అమాంతంగా కేసులు పెరిగాయి. ప్రధానంగా విరుదునగర్, తిరునల్వేలి, రామనాథపురం, తూత్తుకుడి, తేని, తిరువారూర్, దిండుగల్, పుదుకోట్టై, మధురై, కృష్ణగిరి, ఈరోడ్ జిల్లాల్లో ఈ కేసుల్ని గుర్తిస్తున్నారు. ఈ జిల్లాలన్నీ కరోనా భారి నుంచి బయట పడి ఉన్నాయి. మళ్లీ ఇక్కడ కేసులు పెరుగుతుండడంతో రెడ్జోన్ల సంఖ్య పెరిగేనా అనే అనుమానం కలుగుతోంది. పరిశోధనల ముమ్మరం చెన్నైలో అత్యధికంగా కరనో కేసులు ఉన్న విషయం తెలిసిందే. ఈ నగరంతో పాటు కోయంబత్తూరు నగరం పరిధిలో అత్యధికంగా జనాభా కల్గిన ప్రాంతాల్ని ఎంపిక చేసి కరోనా పరీక్షల మీద ఐసీఎంఆర్ దృష్టి పెట్టింది. జనాభా అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో 400 మంది చొప్పున రక్తనమూనాలను సేకరించి పరిశోధనల్ని ముమ్మరం చేశారు. ఈ విషయంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ మనోజ్ మాట్లాడుతూ కోయంబత్తూరు, తిరువణ్ణామలై, చెన్నై రాష్ట్రంలో అత్యధిక జనాభా కల్గి ఉన్నట్టు వివరించారు. ఒక్కో నగరంలో పది మండలాలను ఎంపిక చేశామని, ఒక్కో మండలం నుంచి 400 మంది చొప్పున ఎంపిక చేసి రక్తనమూనాలను సేకరించి పరిశోధనలు సాగుతున్నాయన్నారు. ప్రస్తుతం చెన్నైలో కంటోన్మెంట్ జోన్ల పరిధిలో ఐదు వేల మంది రక్తనమూనాల్ని సేకరించి పరిశోధన మీద దృష్టి పెట్టినట్టు వెల్లడించారు. చెన్నైలో ఇదివరకు కోయంబేడు, రాయపురం మండలాల్లో కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ప్రస్తుతం ఆ జాబితాలో తిరువీకానగర్ కూడా చేరింది. గత వారం వరకు కేసులు మరీ తక్కువగా ఉన్న అన్నానగర్ మండలంలో ప్రస్తుతం రోజుకు కనీసం 20 నుంచి 30 కేసులు బయట పడుతుండడంతో ఆందోళన రెట్టింపు అవుతోంది. -
కరోనా: ముగ్గురు ఐపీఎస్లకు పాజిటివ్
సాక్షి, చెన్నై: ప్రభుత్వ ఉత్తర్వులతో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజలతోపాటు అధికారులు సైతం అయోమయానికి గురవుతున్నారు. కేసులు తక్కువగా ఉన్నపుడు కఠినంగా వ్యవహరించి.. పాజిటివ్ కేసులు పెరుగుతున్న వేళ వైరస్ను తక్కువ అంచనా వేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోకి కరోనా వైరస్ ప్రవేశించినప్పుడు ప్రభుత్వం భయంగొలిపే ప్రకటనలు చేసింది. వైరస్ సోకినా ఇతరులకు వ్యాపిస్తుందని చెప్పి మార్చి 24వ తేదీ నుంచి లాక్డౌన్ విధించింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒకరికి పాజిటివ్గా తేలితే ఆ వీధి మొత్తం సీలువేసి రెడ్జోన్గా ప్రకటించారు. వీధిలోని వారందరికీ కరోనా పరీక్షలు చేశారు. కేసు బయటపడిన ఐదు కిలోమీటర్ల పరిధిలో అందరికీ వైద్యపరీక్షలు చేయాల్సిందిగా ఆదేశించారు. (కోయంబేడు కొంపముంచిందా?) వైరస్ లక్షణాలున్నవారు ఆసుపత్రిలో 14 రోజులు, హోం క్వారంటైన్లో 14 రోజులు ఉండాలని చెప్పారు. పాజిటివ్ కేసులు పెరిగే కొద్దీ ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను మారుస్తూ వస్తోంది. పాజిటివ్ కేసు బయటపడిన వారి ఇంటిని మాత్రమే కట్టడి చేస్తామని..వీధులకు సీలు వేయబోమని తెలిపింది. కుటుంబ సభ్యులకు మాత్రమే పరీక్షలు చేస్తామని చెబుతోంది. ఆసుపత్రుల్లో అడ్మిటైన వారిని మూడు నాలుగు రోజుల్లో ఇంటికి పంపివేస్తున్నారు. అనారోగ్యానికి గురైనా వైరస్లక్షణాలు లేనిపక్షంలో ఇంటివద్దనే భౌతికదూరం పాటిస్తూ చికిత్సపొందాలని ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ కేసులు తక్కువగా ఉన్నప్పుడు లాక్డౌన్ నిబంధనలు కఠినంగా ఉండేవి. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న వేళ సడలింపులు పెరిగిపోతున్నాయి. ఇలా వైరస్ విలయతాండవం ఆడుతున్న వేళ పాత ఉత్తర్వుల్లో మార్పులు, లాక్డౌన్ సడలింపులతో అంతా ఆయోమయంలో పడిపోతున్నారు. తమిళనాడులో పదిరోజుల్లో వైరస్ కేసులు మూడింతలయ్యాయి. మొదటి నుంచి చెన్నైలో ఎక్కువ కేసులు నమోదవుతుండగా కోయంబేడు మార్కెట్ ప్రభావంతో చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, అరియలూరు జిల్లాల్లో సైతం చెన్నై తరువాత ఎక్కువగా కేసులు పెరుగుతున్నాయి. చెన్నైలో మంగళవారం నాటికి 4,882, తిరువళ్లూరులో 467, కడలూరులో 396, చెంగల్పట్టులో 391, అరియలూరులో 344, విళుపురం 299 కేసులు నమోదయ్యాయి. చెన్నైలో కరోనావైరస్ కేసు బయటపడిన పరిసర ప్రాంతాల్లో రీసైకిల్ మాస్క్లను ఉచితంగా పంపిణీ చేసినట్లు కరోనావైరస్ ప్రత్యేకాధికారి డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు 5 వేల పడకలతో కూడిన 39 ప్రత్యేక కరోనా కేంద్రాలను సిద్ధంగా ఉన్నాయని అన్నారు. అధికారులకు కరోనా కాటు చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే హెల్త్ఇన్స్పెక్టర్కు సోమవారం కరోనా సోకింది. అలాగే చెన్నైలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు వైరస్ బారిన పడడంతో పోలీసు బాధితుల సంఖ్య 190కి చేరుకుంది. కరోనా అప్డేట్స్ మంగళవారం నమోదైన కేసులు 716 మొత్తం పాజిటివ్ కేసులు 8718 చెన్నైలో కేసుల సంఖ్య 518 చెన్నైలో మొత్తం కేసులు 4882 మరణాలు 8 (మొత్తం 61) -
ప్రాణం తీసిన ప్రహరీ గోడ
సాక్షి, చెన్నై : చల్లగాలి కోసం ఇంటి బయట మంచి మీద కూర్చుని ఉన్న తండ్రి, ఇద్దరు కుమార్తెలను ప్రహరీ గోడ ప్రాణం తీసింది. ఓ ఖాళీ స్థలం కోసం నిబంధనలకు విరుద్ధంగా మరీ ఎత్తులో నిర్మించి ఉన్న ప్రహరీ గోడ నేలమట్టం కావడంతో పీక్కన్ కరణైలో విషాదం చోటు చేసుకుంది. చెన్నై శివారులోని తాంబరం సమీపంలోని పీక్కన్ కరణై ముత్తమిళ్ వీధి శ్రీనివాస నగర్కు చెందిన రాజాంగం(60) పెయింటర్. ఆయనకు కుమార్తెలు కళ(40), సుమిత్ర(32) ఉన్నారు. ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఉక్కపోత కారణంగా ఇంట్లో ఉన్న మంచాన్ని తీసుకొచ్చి బయట వేసుకున్నారు. మంచం మీద కూర్చుని తండ్రి, కుమార్తెలు మాట్లాడుకుంటుండగా హఠాత్తుగా ఆ ఇంటికి అనుకుని ఉన్న ఎత్తయిన ప్రహరీ గోడ నేలమట్టం అయ్యింది. క్షణాల్లో ఆ ప్రహరీ గోడ నేలమట్టం కావడం, ఆ శిథిలాల కింద తండ్రి, కుమార్తెలు చిక్కుకున్నారు. ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. పక్కింట్లో ఉన్న వాళ్లతో కలిసి శిథిలాల కింద పడి ఉన్న వారిని రక్షించే యత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, 108 వర్గాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని అతికష్టం మీద బయటకు తీశారు. ముగ్గుర్ని చికిత్స నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలో రాజంగం మరణించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమిత్ర సోమవారం వేకువజామున చికిత్స ఫలించక మరణించింది. ఆమె మరణించిన కాసేపటికి కళ కూడా విగత జీవిగా మారింది. ప్రహరీ గోడ నేలమట్టం కావడంతో తండ్రి, కుమార్తెలు మరణించిన సమాచారం ఆ పరిసర వాసుల్ని విషాదంలోకి నెట్టింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఖాళీస్థలంలో ఎత్తయిన ప్రహరీ నిర్మించి ఉండటంతోనే అది నేల మట్టమైనట్టు విచారణలో తేలింది. ఖాళీగా ఉన్న స్థలాలను కాపాడుకునేందుకు ఆయా స్థలాల యజమానాలు, అనేక చోట్ల ఎత్తయిన ప్రహరీ గోడలను పీక్కన్ కరణ్లో నిర్మించి వదిలి పెట్టి ఉన్నారని, వాటిని పర్యవేక్షించే వాళ్లు లేక అవి శిథిలావస్థకు చేరుతున్నాయని, తరచూ ›ప్రమాదాలు తప్పడం లేదని ఆ పరిసర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తమిళనాడులో తొలి కరోనా మరణం
చెన్నై : దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో తమిళనాడులో బుధవారం తొలి కరోనా మరణం చేటు చేసుకుంది. మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్తో బాధపడుత్ను 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రి సీ విజయ్భాస్కర్ తెలిపారు. ఆ వ్యక్తి రక్తపోటుతో పాటు మధుమేహంతో బాధపడుతున్నట్లు ఆయన చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్నమరో ముగ్గురిని గుర్తించి, ఐసోలేషన్లో ఉంచామని ఆయన వెల్లడించారు. దీంతో భారత్లో కరోనా మరణాల సంఖ్య 11కు చేరింది. కాగా, ఇప్పటివరకు దేశంలో 519 కరోనా పాజటివ్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది. (భారత్ @ 519) -
నెలసరి ఉన్నా ఈ గర్భగుడిలోకి వెళ్లవచ్చు!
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఓ ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయంలో నెలసరి సమయంలో కూడా మహిళలలు పూజలు చేసుకోవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ ప్రత్యేక ఆలయం కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో ఉంది. దీని పేరు ‘మా లింగా భైరవి’. ఇక్కడ బైరాగిని అమ్మవారు కొలువుదేరి ఉన్నారు. ఈ ఆలయ గర్భగుడిలోకి కేవలం మహిళలకు మాత్రమే అనుమతి ఉండటం మరో విశేషం. సద్గురు జగ్గీ వాసుదేవ్ ఉన్నత భావాలు కలిగిన స్వామిజీ అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆశ్రమంలో.. మా లింగా భైరవి ఆలయానికి ప్రతిరోజు పురుషులు, మహిళా భక్తులు దర్శనార్థం వస్తుంటారు. కానీ ఈ ఆలయ గర్భగుడి లోపలికి వెళ్లి పూజలు చేసుకునే అవకాశం కేవలం మహిళలకు మాత్రమే ఆయన కల్పించారు. దీనికి కారణం రుతుస్రావం సమయంలో వారిని అంటరాని వారిగా చూడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేశారు. అదే విధంగా మహిళలకు రుతుస్రావం అనేది ప్రకృతిలో భాగమనీ.. ఆ సమయంలో మహిళలు గుడికి రాకూడదు, పూజలు చేయకూడదంటూ ఆంక్షలు విధించడం సరైనది కాదని తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. గత జన్మలో మహిళ.. ఈ జన్మలో ఇలా! ఈ విషయం గురించి నిర్మలా అనే ఆశ్రమ మహిళా సన్యాసిని మాట్లాడుతూ.. ‘ ఇది స్వామీ సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్ణయం. రుతుస్రావ సమయంలో మహిళల అభద్రతా భావాన్ని పోగొట్టేందుకే ఆయన ఇలా చేస్తున్నారు. దీంతో బైరాగిని మాతను పూజించుకోవడానికి రోజూ మహిళలు, పురుషులు వస్తారు. కానీ గర్భగుడిలోకి కేవలం మహిళలను మాత్రమే అనుమతించడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఆలయాల్లోని గర్భగుడిలోకి మహిళలకు అనుమతి ఉండక పోవడం.. ఇక్కడ ఆ ఏర్పాటు ఉండటంతో వారంతా సంతోషిస్తున్నారు’ అని ఆమె చెప్పారు. ‘నెలసరిలో వంట చేస్తే కుక్కలుగా పుడతారు’ ‘‘కంప్యూటర్ యుగంలో కూడా చాలా ప్రాంతాల్లో రుతుస్రావంలో ఉన్న మహిళలను, యువతులను అంటరానివారుగా భావిస్తారన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వారిని ఇంట్లోకి అనుమతించరు. ఇక వారికి తినడానికి ప్లేటు, గ్లాసు విడిగా ఉంచుతారు. ఆ సమయంలో ఇంట్లోని వారంతా వారి పట్ల ప్రవర్తించే తీరు చూస్తే అభద్రత భావం కలుగుతుంది. ఈ ఆచారాన్ని వారు అవమానకరంగా భావించడంతో పాటుగా.. వారి ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. అందుకే వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకే సద్గురు వాసుదేవ్ ఇలా చేస్తున్నట్లు’’ నిర్మల తెలిపారు. -
పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో...
చెన్నై : తనను వివాహం చేసుకోవాలన్న ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో ఓ వ్యక్తి యువతిని దారుణంగా హత్య చేశాడు. కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. అనంతరం మృతదేహాన్నిగుట్టు చప్పడు కాకుండా నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. ఈ వ్యవహారమంతా బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తమిళనాడుకు చెందిన ఓ యువతి(17) మంగళవారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో యువతి తండ్రి అదే రోజు సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. అలాగే జాఫర్ షా(26) అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉన్నట్లు, ఇంతకుముందు చాలా సార్లు తన కూతురిని వేధింపులకు గురిచేశాడని యువతి తండ్రి పోలీసులకు తెలియజేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జాఫర్ గురించి విచారించగా ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. అనంతరం అతడి మొబైల్ లొకేషన్ను తనిఖీ చేయగా తమిళనాడులోని వలపరాయ్లో ఉన్నట్లు తేలింది. పోలీసులు అక్కడికి చేరుకోగా నిందితుడి కారులో యువతి కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు జాఫర్ను విచారించగా.. యువతిని పొడిచి చంపి మృతదేహన్ని ఊరి చివర పడేసినట్లు అంగీకరించాడు. కాగా సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లి చూడగా తేయాకు తోట పక్కన యువతి మృతదేహం పడి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీన పరుచుకున్న పోలీసులు ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే యువతి ఎలాంటి లైంగిక వేధింపులకు గురైనట్లు ఆనవాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తదుపరి విచారణ కొనసాగుతుందని తమిళనాడు పోలీసులు తెలిపారు. -
మనసుకు సుస్తీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అనేకమంది కుంగుబాటు (డిప్రెషన్), ఆత్రుత (యాంగ్జయిటీ) వంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. తెలంగాణతోపాటు కేరళ, తమిళనాడుల్లోనూ ఈ రకమైన మానసిక రుగ్మతలు 1.4 రెట్లు పెరగడం గమనార్హం. 1990 నుంచి 2017 వరకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో మానసిక రుగ్మతలపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనం చేసింది. ‘భారతదేశంలో మానసిక రుగ్మతల భారం’అనే పేరుతో ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2017లో దేశంలో 19.73 కోట్ల మందికి మానసిక రుగ్మతలు ఉన్నాయి. అంటే దేశంలోని మొత్తం జనాభాలో 14.3 శాతం మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. బాల్యం, టీనేజీల్లో మానసిక రుగ్మతల ప్రాబల్యం 1990–2017 మధ్య తగ్గినప్పటికీ, యుక్తవయసులో మానసిక రుగ్మతల ప్రాబల్యం పెరిగింది. ప్రతీ ఏడుగురు భారతీయులలో ఒకరు వివిధ రకాల తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. 1990–2017 మధ్య మానసిక రుగ్మతలతో బాధపడే వారి సంఖ్య రెట్టింపు అయిందని నివేదిక తెలిపింది. ఆత్మహత్యల రేటు ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు తెలంగాణలో మానసిక రుగ్మతల జాబితాలో ఉన్నారు. పురుషుల కంటే స్త్రీలు అధికంగా కుంగుబాటు, ఆత్రుతలకు గురవుతున్నారు. దీనికి ప్రధానంగా హార్మోన్ల అసమతుల్యత, కుటుంబ ఒత్తిడి తదితర కారణాలున్నాయి. అకాల మరణాలు.. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు అకాలంగా మరణిస్తారు. లేకుంటే మానసిక సమస్యల కారణంగా వైకల్యానికి గురవుతున్నారని నివేదిక తెలిపింది. మానసిక రోగాలతో బాధపడే వారిలో చాలామంది ఆస్పత్రుల్లో చేరడంలేదు. మన దేశంలో 1982లో నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంను ప్రారంభించారు. దీన్ని 1996లో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంగా మార్పులు చేసి తిరిగి ప్రారంభించారు. జాతీయ మానసిక ఆరోగ్య విధానం 2014లో అందుబాటులోకి వచ్చింది. 2017లో మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం వచ్చింది. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మానసిక ఆరోగ్య సేవలను సరిగా అమలు చేయడంలేదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించిన రోగుల అవసరాలను గుర్తించడం, చికిత్స చేయడం తక్షణ కార్యక్రమంగా చేపట్టాలి. మహిళలు ఆత్మహత్యలవైపు పోకుండా చూడాలి. ఎందుకంటే భారతీయ మహిళలు ప్రపంచ మహిళా ఆత్మహత్య మరణాల రేటులో రెండింతలు కలిగి ఉన్నారు. యోగా కూడా మానసిక రుగ్మతల నుంచి కాపాడటానికి ఉపయోగపడుతుందని నివేదిక తెలిపింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం, ఎక్కడెక్కడో ఒంటరి బతుకు పోరాటం చేయడం.. చాలీచాలని జీతాలతో బతకడం.. పెళ్లిళ్లు పేరంటాలకు వెళ్లే పరిస్థితి లేకపోవడం.. ఇలా పలు కారణాలతో అనేకమంది మానసికంగా బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ఆరోగ్యమంటే ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా పటిష్టంగా ఉండటమే. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పోటీ ప్రపంచంలో ఉరుకులు పరుగుల జీవితమైంది. మానసిక సమస్యలతో బాధపడే వారిలో గ్రామాల కంటే పట్టణాల్లోనే రెండు మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. అందువల్ల పట్టణాల్లో ప్రత్యేకంగా మానసిక చికిత్సాలయాలు మరిన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంది. పీహెచ్సీ స్థాయి నుంచి మానసిక వైద్యం ఇప్పటికే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మానసిక రుగ్మతలపై రాష్ట్రాలను హెచ్చరించింది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) స్థాయి నుంచి కూడా మానసిక రోగులకు వైద్యం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఎర్రగడ్డలో ఉన్న మానసిక చికిత్సాలయంలో మానసిక రోగులకు చికిత్స చేస్తున్నారు. అది కూడా అత్యంత తీవ్రమైన స్థాయికి వచ్చాకే జరుగుతోంది. కానీ మానసికంగా వివిధ స్థాయిల్లో ఉన్న రోగులకు వారివారి స్థితిని బట్టి చికిత్స చేసే పరిస్థితి లేనేలేదు. కాబట్టి పీహెచ్సీల్లోనూ మానసిక రోగులకు చికిత్స అందించేలా ప్రణాళిక రచించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందుకోసం కొందరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ►తెలంగాణలో ప్రతీ లక్ష మందిలో.. 3,750 మంది కుంగుబాటుతో బాధపడుతున్నారు ►3,600 మంది ఆతృతతో బాధపడుతున్నారు ►4,000 మంది వరకు మేధో వైకల్యం (ఇంటలెక్చువల్ డిజెబిలిటీస్)తో బాధపడుతున్నారు. ►742 మంది ప్రవర్తన రుగ్మత (కాండక్ట్ డిజార్డర్స్)తో బాధపడుతున్నారు. -
నేడు గొల్లపూడి అంత్యక్రియలు
తమిళ సినిమా: ప్రఖ్యాత సినీ నటుడు, సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు భౌతిక కాయానికి ఆదివారం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయన భౌతిక కాయాన్ని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, భానుచందర్, నటీమణులు సుహాసిని, ప్రభ, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్తో పాటు పలువురు రాజకీయ, పారిశ్రామిక వేత్తలు సందర్శించి ఘన నివాళి అర్పించారు. ఆయన మనవళ్లు, మనవరాళ్లు విదేశాల నుంచి శనివారం చెన్నై చేరుకోగా.. ఓ ప్రైవేటు ఆస్పత్రి మార్చురీలో ఉన్న భౌతిక కాయాన్ని టి.నగర్లోని నివాసానికి తీసుకొచ్చి ఆప్తులు, కుటుంబీకుల సందర్శనార్థం ఉంచారు. ఆయన వద్ద శిక్షణ పొందా: చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. గొల్లపూడి తనకు మంచి మిత్రుడని, అంతకంటే గొప్ప ఆప్తుడని చెప్పారు. ఆయనతో 1989లో పరిచయం ఏర్పడిందని, తాను ఆయన వద్ద కొన్ని వారాల పాటు శిక్షణ తీసుకున్నానని వెల్లడించారు. గొల్లపూడి తాను నటించిన ఐ లవ్ యూ చిత్రానికి మాటలు రాశారని, ఆ తర్వాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలో కలిసి నటించామని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి తమ అనుబంధం కొనసాగుతూ వచ్చిందన్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరన్నారు. ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ గొల్లపూడి గొప్ప నటుడు, రచయిత, వక్త అని కొనియాడారు. తనకు ఆయనతో చిరకాల అనుబంధం ఉందన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు తీర్చలేనిదని పేర్కొన్నారు. ఇదిలావుండగా.. గొల్లపూడి అంత్యక్రియలను ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో టి.నగర్లోని కన్నమ్మపేట శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
పట్టువదలని విక్రమార్కుడు
సాక్షి, చెన్నై: పట్టువదలని విక్రమార్కుడిలా విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం ప్రత్యేక అధికారి పొన్ మాణిక్య వేల్ ముందుకు సాగుతున్నారు. తనకు అప్పగించిన బాధ్యతల్లో ఏ మాత్రం తగ్గబోనని మరో మారు చాటుకున్నారు. ఆ్రస్టేలియాలో ఉన్న రెండు విగ్రహాలను భారత్కు తెప్పించేందుకు సిద్ధం అయ్యారు. తమిళ పాలకుల నుంచి స్పందన కరువు కావడంతో చాకచక్యంగా విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఆ విగ్రహాలను ఇక్కడికి రప్పించే ఏర్పాట్లు చేశారు. ‘పొన్ మాణిక్య వేల్’ఈ పేరు వింటే చాలువిగ్రహాల స్మగ్లర్ల గుండెల్లో దడ బయలు దేరుతుంది. విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం ఐజీగా ఆయన స్మగ్లర్లకు ముచ్చమటలు పట్టించారు. దేశ విదేశాల్లో ఉన్న విగ్రహాలను ఇక్కడికి రప్పించే దిశగా ముందుకు సాగారు. అందుకే పదవీ కాలం ముగిసినా, ఆయన్నే ప్రత్యేక అధికారిగా కోర్టు నియమించింది. ప్రత్యేక అధికారిగా ఆయన నియమితులైనా పాలకుల నుంచి సాయం మాత్రం కరువైంది. అయితే, తనకు అప్పగించిన బాధ్యతల విషయంలో ఆయన ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు నిదర్శనం తాజాగా, పాలకుల నుంచి సహకారం లేకపోవడంతో ఏకంగా విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించి రూ.నాలుగు కోట్లు విలువగల రెండు విగ్రహాలను భారత్కు రప్పించడం విశేషం. ఆ్రస్టేలియా నుంచి.. తిరునల్వేలి జిల్లా వీరనల్లూరు సమీపంలో తిరువడై మరుదూర్ గ్రామం ఉంది. ఇక్కడ పాండ్య రాజుల హయంలో (600 ఏళ్ల క్రితం) మూంగీశ్వర ముడయార్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని రెండు ద్వార పాలకుల విగ్రహాలు 1995లో అపహరణకు గురయ్యాయి. ఈ కేసు విషయంలో పోలీసులు చేతులెత్తేయగా, పొన్ మాణిక్య వేల్ రహస్యంగా విచారణ చేపట్టి, ఆ విగ్రహాలు ఎక్కడున్నాయో గుర్తించారు. స్మగ్లర్లు లక్ష్మి నరసింహన్, అశోకన్లు తన అనుచరుల ద్వారా ఇండో నేపాల్ ఆర్ట్ గ్యాలరీకి తరలించినట్టు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాలోని ఓ ప్రముఖ గ్యాలరీలో ఉంచినట్టు గుర్తించారు. ఈ విగ్రహాల విలువ రూ.4 కోట్ల 98 లక్షలు. ఈ విగ్రహాలు తమిళనాట చోరీ చేసి, ఆ్రస్టేలియాకు తరలించినట్లు ఆ గ్యాలరీకి హెచ్చరికలతో కూడిన లేఖను ఇటీవల పొన్ మాణిక్య వేల్ పంపించారు. ఆ గ్యాలరీ వర్గాలు స్పందించి, భారత్కు తీసుకెళ్లాలని సూచించినా, వాటిని ఇక్కడికి తీసుకు రావడంలో పాలకుల సహాకారం అన్నది పొన్ మాణిక్య వేల్కు కరువైంది. దీంతో వ్యూహాత్మకంగా, పట్టువదలని విక్రమార్కుడిలా మాణిక్య వేల్ వ్యవహరించారు. విదేశీ వ్యవహారాల శాఖ సాయంతో... తమిళనాడులో దోపిడికి గురైన విగ్రహాలు ఆ్రస్టేలియాలోని కొన్ని గ్యాలరీల్లో ఉన్నాయని, వీటి విలువ వెలకట్టలేమని పేర్కొంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. రెండు ద్వార పాలకులతో పాటుగా అక్కడున్న అన్ని విగ్రహాల విలువ, వాటి గురించిన పూర్తి వివరాలను ఆ లేఖలో పొందుపరిచారు. ఇందులో రెండు విగ్రహాలను అప్పగించేందుకు సంబంధిత గ్యాలరీ ముందుకు వచ్చినా, ఇక్కడకు తీసుకు రాలేని పరిస్థితి ఉందని, సాయం అందించాలని కోరారు. దీంతో ఆ్రస్టేలియాలోని భారత రాయబార కార్యాలయ వర్గాల ద్వారా విదేశీ వ్యవహారాల శాఖ సంప్రదింపులు జరిపాయి. దీంతో ఆ విగ్రహాలను ఆస్ట్రేలియా ప్రధాని ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదికి అప్పగించేందుకు నిర్ణయించారు. జనవరిలో ఆ్రస్టేలియా నుంచి ఈ విగ్రహాలు ఢిల్లీకి రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి అప్పగించనున్నారు. అనంతరం ఈ విగ్రహాలను పొన్మాణిక్య వేల్ బృందం తిరునల్వేలిలోని ఆలయానికి చేర్చనున్నారు. ఇందుకు తగ్గ అధికారిక ప్రకటన వెలువడటం విశేషం. ఇక, ఆ్రస్టేలియాలో ఉన్న మిగిలిన విగ్రహాలు, సింగపూర్లో ఉన్న 16 విగ్రహాలను మరి కొన్ని నెలల్లో ఇక్కడికి తెప్పిస్తానని పొన్ మాణిక్య వేల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
అవసరమైతే కలిసి పనిచేస్తాం
సాక్షి, చెన్నై: తమిళ ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేయడానికి సిద్ధమేనని మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల హాసన్, రజనీకాంత్ మంగళవారం వేర్వేరుగా వ్యాఖ్యానించారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేసి డిసెంబరుతో ఏడాది కానుంది. అయితే ఆయన ఇంత వరకు పార్టీ ›ప్రకటన చేయలేదు. తన లక్ష్యం 2021 అసెంబ్లీ ఎన్నికలే అని చెబుతూ వస్తున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా మరో వైపు సమయానుగుణంగా రాజకీయ వ్యాఖ్యలను పేల్చుతూ వస్తున్నారు. అదే సమయంలో రజనీ కన్నా ముందుగా కమల్ మక్కల్ నీది మయ్యం పార్టీని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో ఈనెల 8న కమల్ బర్త్డే సందర్భంగా రాజ్కమల్ కార్యాలయంలో జరిగిన దివంగత దర్శకుడు బాలచందర్ విగ్రహావిష్కరణకు రజనీ హాజరయ్యారు. తాను కాషాయం వలలో పడనని కమల్తో తన బంధం విడదీయరానిదిగా రజనీ వ్యాఖ్యానించారు. అలాగే రజనీకాంత్ను తనను ఎవరూ విడదీయలేరని, తమ మధ్య రహస్య ఒప్పందం ఉందని కమల్ వ్యాఖ్యానించి రాజకీయ చర్చకు తెరలేపారు. ఈ ఇద్దరు ఏకం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ మొదలైంది. ఇందుకు తగ్గట్టుగా మంగళవారం రజనీ వ్యాఖ్యలు చేయడం, అందుకు తగ్గట్టుగా కమల్ స్పందించడం ఆ చర్చలకు బలాన్ని చేకూర్చాయి. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తమిళనాట చర్చ జోరందుకునేలా చేశాయి. కలిసి పనిచేయడానికి రెడీ రజనీ కాంత్ మంగళవారం మీడియా ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తమిళ ప్రజల సంక్షేమం కోసం తప్పని సరి అయినా, అవశ్యమైనా కమల్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అదే సమయంలో ఒడిశాలో జరిగిన డాక్టరేట్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ముగించుకుని చెన్నైకు వచ్చిన కమల్ మీడియాతో మాట్లాడారు. తమిళ ప్రజల సంక్షేమం, తమిళనాడు అభివృద్ధి కాంక్షిస్తూ అవసరం అయితే రజనీకాంత్తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమేనని ప్రకటించారు. తమ ఇద్దరు 44 ఏళ్లుగా సినీ రంగంలో కలిసి పనిచేస్తున్నామని, ప్రజాహితం కోసం కలయిక అవశ్యం అయితే సిద్ధమేనని వ్యాఖ్యానించారు. కాగా, రజనీ, కమల్, విజయ్ వంటి నటులు అందరూ ఏకమై వచ్చినా అన్నాడీఎంకేకు ఢోకా లేదని.. 2021 ఎన్నికల్లో మళ్లీ అధికారం అన్నాడీఎంకేకు దక్కుతుందని మత్స్యశాఖ మంత్రి జయకుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
నూరేళ్లు కలిసి జీవించారు.. కానీ గంట వ్యవధిలో..!!
చెన్నై : పుట్టిన ప్రతి జీవికీ తప్పనిసరిగా వచ్చేది మరణం. అది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరిని ఎలా మృత్యురూపంలో కబళిస్తుందో చెప్పడం కష్టం. నూరేళ్ల నిండిన వారి అనుబంధం గంట వ్యవధిలో ముగిసిపోయంది. వివరాల్లోకెళ్తే.. తమిళనాడులో శతాధిక వృద్ధ దంపతులు ఒకే రోజు తనువు చాలించారు. భర్త మరణం తట్టుకోలేని భార్య మృతదేహం వద్దే ఏడుస్తూ ప్రాణాలు విడిచింది. దీంతో వారి నిండు నూరేళ్ల బంధం, 75 సంవత్సరాల వైవాహిక బంధం ముగిసిపోయాయి. తమిళనాడు రాష్ట్రంలోని పుడుక్కొట్టాయ్ జిల్లాలో కుప్పకూడి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కుప్పకూడి గ్రామంలో వెట్రివేల్ (104), పిచాయ్ (100) అనే శతాధిక దంపతులు ఉన్నారు. వీరికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. వీరందరికీ వివాహాలు అయిపోయాయి. ఫలితంగా ఈ వృద్ధ జంటకు 23 మంది మనవళ్లు, మనవరాండ్లు, మునిమనువళ్లు ఉన్నారు. వీరంతా ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నారు. వీరిద్దరు మంచి ఆరోగ్యవంతులు. వారి వందేళ్ల జీవిత పయనంలో జబ్బు పడ్డ సందర్భాలు కూడా చాలా తక్కువ. ఇదే విషయాన్ని అనేకసార్లు కుటుంబ సభ్యలతో ప్రస్తావించేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వెట్రివేల్కు ఛాతిలో నొప్పి రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్టు వెల్లడించారు. తర్వాత వెట్రివేల్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. భర్త శవం పక్కనే కూర్చోని ఏడుస్తు భార్య పిచాయి మూర్ఛపోయింది. దీంతో వైద్యులను పిలిపించి పరీక్షించగా, ఆమె కూడా ప్రాణాలు వదిలినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో 75 ఏళ్ల వైవాహిక బంధం ముగిసిపోయింది. ఈ శతాధిక వృద్ధులు చనిపోవడంతో వారి ఇంట్లోనే కాకుండా గ్రామంలో కూడా విషాదఛాయలు అలముకున్నాయి. -
గంగ కాలువపై సెల్ఫీ తీసుకుంటూ యువకుడి గల్లంతు
సాక్షి, చిత్తూరు : యువకుడు తెలుగుగంగ కాలువపై సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోయిన సంఘటన ఉబ్బలమడుగు అడవిలో మంగళవారం జరిగింది.. పోలీసుల కథనం మేరకు చెన్నైకు చెందిన మహేష్కుమార్ కుమారుడు మనోజ్ (24) స్నేహితులైన మాణిక్యం, ప్రశాంత్తో కలసి మంగళవారం ఉబ్బలమడుగు అడవిలోని జలపాతానికి విహారయాత్రకు వచ్చారు. మనోజ్ స్నేహితులతో కలసి తెలుగు గంగ మెయిన్ కాలువపై నిలుచుని సెల్ఫీ తీసుకునేందుకు ఉపక్రమించాడు. కాలుజారి కాలువలో పడిపోయాడు. కాలువలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.. ఈ విషయన్ని మాణిక్యం, ప్రశాంత్ స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ ధర్మారెడ్డి కేసు నమోదు చేసుకుని, మృతదేహాం కోసం గాలిస్తున్నారు. -
కూతురు పెళ్లి; అమితానందంలో కుటుంబం!
చెన్నై : ఇంట్లో వివాహం వంటి శుభకార్యం జరిగితే ఇళ్లంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది. బంధువులతో పెళ్లింట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. అయితే ఓ కుటుంబానికి తమ ఇంట్లో వివాహం జరుగుతుందనే ఆనందం కంటే అత్యున్నత పదవిలోని వ్యక్తి పంపిన సందేశం వారిని ఉద్వేగానికి లోనుచేసింది. వివరాలు.. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన రాజశేఖరన్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తన కూతురు వివాహాన్ని సెప్టెంబర్ 11న నిశ్చయించాడు. పెళ్లికి బంధువులు, తెలిసిన వాళ్లతోపాటు ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఆహ్వనించాడు. ఇందులో భాగంగా ప్రధానికి లేఖ రాశాడు. తరువాత కుటుంబం పెళ్లి పనుల్లో మునిగిపోయిన కుటుంబం ఈ విషయం గురించి మరిచిపోయింది. అయితే గత శనివారం ప్రధాని నుంచి కుటుంబానికి ఓ లేఖ అందింది. అది చదివిన కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయారు. ప్రధాని పంపిన లేఖలో ‘‘మీ కుమార్తె వివాహం గురించి నాకు తెలియపరచడం నా అదృష్టంగా భావిస్తున్నా. మీ ఇంట్లో జరిగే శుభ సందర్భానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నూతన వధువరులకు నా శుభాకాంక్షలు, నవ జంట ఎల్లప్పుడు శ్రేయస్సు, ఆనందాలతో జీవించాలి’’ అని ప్రధాని లేఖలో ఆశీర్వదించారు. ఏకంగా ప్రధాని నుంచి వధూవరులను ఆశీర్వదిస్తూ లేఖ రావడంతో రాజశేఖరన్ కుటుంబం సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయింది. ప్రధాని పంపించిన లేఖను ఫ్రేమ్ కట్టించాలని నిర్ణయించుకున్నట్లు సదరు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఉగ్ర అలర్ట్
సాక్షి, నెల్లూరు: తమిళనాడులో ఉగ్రవాదులు చొరబడ్డారన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరంగా చేపట్టింది. ముఖ్యంగా శ్రీహరికోట రాకెట్ కేంద్రం, కృష్ణపట్నం పోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. సీఐఎస్ఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు గస్తీని నిర్వహిస్తున్నారు. తీరం వెంబడి కోస్ట్గార్డ్, మెరైన్, స్థానిక పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. మత్స్యకార గ్రామాల్లోని ప్రజలతో సమావేశాలు నిర్వహించి కొత్తవ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తించినా, అనుమానస్పదంగా ఎవరైనా కనిపించినా వెంటనే సమాచారం అందించాలని సూచనలు చేస్తున్నారు. జిల్లాలో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి సిబ్బందితో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలిచ్చారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా రెండురోజులుగా పోలీసు అధికారులు జిల్లాను జల్లెడ పట్టారు. పర్యటన రద్దు అయినా తనిఖీలను కొనసాగుతూనే ఉన్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు కొనసాగిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. -
సాహోకు ఆ రికార్డు దాసోహం
చెన్నై : సాహో ఫీవర్ పీక్స్కు చేరడంతో రికార్డులు సైతం సాహోకు దాసోహం అంటున్నాయి. ఆగస్ట్ 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సాహో అత్యధిక స్ర్కీన్లలో విడుదలవుతూ బాహుబలి రికార్డులను అధిగమిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ్, మళయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతున్న సాహో తమిళ్ వెర్షన్కు అత్యధిక స్క్రీన్లు దక్కాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 తమిళనాడులో 525 థియేటర్లలో రిలీజ్ కాగా సాహో ఏకంగా 550 స్క్రీన్లలో సందడి చేయనుంది. సాహోకు పెద్దసంఖ్యలో థియేటర్లు అందుబాటులోకి రావడంతో బాహుబలి 2 వసూళ్ల రికార్డును అధిగమించే అవకాశం ఉందని నిర్మాతలు భావిస్తున్నారు. సాహోతో తమిళ ప్రేక్షకులకు ఓ మంచి చిత్రం చూసిన అనుభూతి దక్కుతుందని దర్శకుడు సుజీత్ చెప్పారు. బాహుబలి సిరీస్ విడుదల అనంతరం పలు భాషా పరిశ్రమల మధ్య హద్దులు చెరిగిపోవడం విశేషం. అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్, ఇస్మార్ట్ శంకర్ వంటి పలు తెలుగు సినిమాలు తమిళ తెరపైనా వినోదం పంచాయి. సాహో తరహాలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా సైతం తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ భాషల్లో భారీ స్ధాయిలో విడుదలకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని వేలూరు, తిరువణ్ణామలై, విలుపురం జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వేలూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు కారణంగా పలు జిల్లాల్లో జన జీవనం స్తంభించింది. విస్తారమైన వర్షాలు కురవడంతో కొన్ని చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలు నగరాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.కుండపోత గా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. పలు లోతట్టు ప్రాంతాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. పది జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ ప్రకటించింది. -
చోరీకి వెళ్లిన దొంగకు చిర్రెత్తుకొచ్చింది...
సాక్షి, చెన్నై: దొంగతనానికి వచ్చిన చోట చిల్లిగవ్వ దొరక్కపోవడంతో ఓ దొంగ చిర్రెత్తిపోయాడు. ఆ దుకాణ యజమానికి ఓ లేఖ రాసి చీవాట్లు పెట్టి వెళ్లాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కడలూరు జిల్లా మందారకుప్పంలో జయరామన్ అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ దుకాణంపై ఓ దొంగ కన్నేశాడు. గురువారం అర్ధరాత్రి అతి కష్టం మీద దుకాణం పై కప్పును తొలగించి లోపలికి వెళ్లాడు. ఉదయాన్నే దుకాణం తెరచిన జయరామన్ షాక్కు గురయ్యాడు. పైకప్పు దెబ్బతిన్నా దుకాణంలో వస్తువులు ఏమాత్రం చోరీకి గురి కాలేదు. అయితే కొన్ని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో వాటిని సరి చేస్తుండగా ఓ లేఖని గుర్తించాడు. ప్రాణాలను పణంగా పెట్టి అతి కష్టం మీద దొంగతనానికి వస్తే గల్లాలో చిల్లిగవ్వ కూడా పెట్టవా? అని అందులో యజమానిని దొంగ ప్రశ్నించాడు. దొంగతనం చేయడం అంత సులభం కాదని..ఎంతో కష్టపడాల్సి ఉందని ఇక్కడున్న పప్పుదినుసులను పట్టుకెళ్లి తానేమి చేసుకోవాలని విచారం వ్యక్తం చేశాడు. ఈ లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
తలైవి కంగనా
ఈ మధ్య కంగనా రనౌత్ పొలిటికల్ స్పీచ్లను ఎక్కువగా వింటున్నారు. అది కూడా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇచ్చిన ప్రసంగాలను వింటున్నారట. అది మాత్రమే కాదు.. తన బాడీ లాంగ్వేజ్ జయలలితకు మ్యాచ్ అయ్యేలా వర్కవుట్ చేస్తున్నారు. ఆమెలా నడవడానికి, మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఆమె పాత్రలో నటించనున్నారు కాబట్టి. కథానాయికగా మంచి పేరు తెచ్చుకుని, తమిళనాట రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి ‘పురుచ్చి తలైవి’ (విప్లవ నాయకురాలు)గా పేరు గాంచిన జయలలిత జీవితం ఆధారంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఏఎల్. విజయ్ దర్శకత్వం వహించనున్న ఈ బయోపిక్లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ను సెప్టెంబర్ చివర్లో మొదలు పెట్టాలనుకుంటున్నారు. ‘‘కాలేజీ చదువు ఆపేసి నటిగా రాణించాలని జయలలిత నిర్ణయం తీసుకున్నప్పటి సన్నివేశాలతో సినిమా మొదలవుతుంది. ముందుగా మైసూర్లో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఆ తర్వాత చెన్నై, ముంబై ప్రాంతాల్లో చిత్రీకరణ ప్లాన్ చేశాం. అలాగే కంగనా లుక్స్, బాడీ లాంగ్వేజ్కి సంబంధించి వర్క్షాప్స్ జరుగుతున్నాయి. త్వరలో కంగనా లుక్ టెస్ట్ ప్లాన్ చేశాం. మంచి స్కిల్డ్ ప్రోస్థెటిక్ మేకప్ ఆర్టిస్టులను టీమ్లోకి తీసుకోవాలనుకుంటున్నాం. ఆల్రెడీ రచయితలు విజయేంద్ర ప్రసాద్, రజత్ అరోరా స్క్రిప్ట్పై వర్క్ చేస్తున్నారు’’ అని చెప్పారు ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన శైలేష్ ఆర్. సింగ్. -
నింద శరాఘాతమై.. మనసు వికలమై..
సాక్షి, నగరి : మనవడు జులాయిగా తిరగడానికి కారణం మీరేనంటూ కుమారుడు తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురైన తమిళనాడుకు చెందిన వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరి కీళపట్టు కువస్థలీ నది వంతెన వద్ద చోటుచేసుకుంది. ఎస్ఐ శివశంకర్ కథనం..తమిళనాడు తిరుత్తణి సమీపంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన దంపతులు ఇ.ఏలుమలై (79), సులోచన (56) చాలా కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు బాబు, గోపి, కుమార్తె సరళ ఉన్నారు. వీరిలో చిన్నకుమారుడు గోపి కొన్నేళ్ల క్రితం మృతిచెందాడు. అతని కుమారుడు వినోద్కుమార్ను తాత ఏలుమలై, పెదనాన్న బాబు పోషిస్తున్నారు. వినోద్కుమార్ జులాయిగా మారడంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవలు బుధవారం ఎక్కువయ్యాయి, వినోద్కుమార్ జులాయిగా మారడానికి మీరే కారణమంటూ తల్లిదండ్రులను బాబు గట్టిగా నిందించాడు. దీంతో మనస్తాపానికి గురైనవారు గురువారం గుడికి వెళ్లి వస్తామని చెప్పి స్వగృహం నుంచి బయలుదేరారు. తమ వద్ద ఉన్న డబ్బులతో పురుగుల మందు కొన్నారు. గురువారం రాత్రి నగరి మున్సిపాలిటీ కీళపట్టు వద్ద కుశస్థలి నది వంతెన కిందకు చేరుకున్నారు. అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం కాలకృత్యాలకు వెళ్లిన స్థానికులు వారి మృతదేహాల ను గమనించి సమాచారం చేరవేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, చిత్తూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును సుమో ఢీకొనడంతో తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. శ్రీవారి దర్శనం ముగించుకొని చెన్నై వెళ్తుండగా నగరి కణంమెట్ట వద్ద రోడ్డుపై గుంతను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును సుమో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగరు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
శిక్ష ‘ఆటో’మాటిక్
కొందరు నేరస్తులు తమకు తాముగా తయారు అవుతారు. కొందరిని వ్యవస్థ తన అవసరాల కోసం బలవంతులను చేస్తుంది. బుట్టలోని పామును చూపి డబ్బు దండుకునేవాడి అవసరం తీరే వరకే ఆ పాముకు గుడ్డూ పాలూ.ఆ తర్వాత? చట్టం తన పని తాను మొదలెడుతుంది.ఆటో శంకర్ జీవితం నేరంతో మొదలై శిక్షతో ముగుస్తుంది.నేరం ఎప్పుడూ శిక్షతోనే ముగుస్తుందని అతనిపై తీసిన తాజా వెబ్ సిరీస్ప్రేక్షకులకు చూపెడుతోంది. చూడండి. రియల్ ఆటో శంకర్ గురించి... గౌరీ శంకర్.. 1955లో తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో పుట్టాడు. పెయింటింగ్, డాన్స్, యాక్టింగ్ పట్ల ఉన్న ఆసక్తితో మద్రాస్ వచ్చాడు. పెరియార్ నగర్లో కొన్నాళ్లు పెయింటర్గా పనిచేశాడు కూడా. సినిమాల్లో అవకాశాలు రాకపోయేసరికి, రావనీ తెలిసీ నేరప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఇది 1980 లనాటి సంగతి. అప్పుడు కల్తీసారాకు ఆటోలే ముఖ్యమైన రవాణా సాధనాలుగా ఉండేవి. ఆటో కూడా నడుపుతున్న శంకర్ అతి తక్కువ కాలంలోనే పేరుమోసిన లిక్కర్ స్మగ్లర్ అయ్యాడు. తన తమ్ముడు మోహన్, బావ ఎల్దిన్తో కలిసి ఇంకొంతమంది నమ్మకస్తులైన అనుచరగణంతో సొంత గ్యాంగ్ను తయారు చేసుకున్నాడు. ఫ్లష్ ట్రేడ్లోకి దిగిన ఆరునెలలకే మద్రాస్ను సెక్స్వర్కర్స్ కేంద్రగా మార్చాడు. 1995లో అరెస్ట్ అయ్యాడు. సోదాల్లో పోలీసులకు అతని డైరీ దొరికింది. అందులో మద్రాస్లోని పలు ర్యాంకుల్లో ఉన్న పోలీస్ అధికారులు శంకర్తో కలిసి ఉన్న ఫోటోలూ ఉన్నాయి. వాళ్లందరినీ సస్పెండ్ చేశారు. పలు హత్యల్లో నేరస్తులుగా రుజువైన శంకర్, అతని ముఖ్య అనుచరులు ఎల్దిన్, శివాజీలను అదే యేడు అంటే 1995లోనే సేలమ్ జైలులో ఉరితీశారు. ‘‘మా నాన్న రోజూ తాగొచ్చి అమ్మను కొట్టేవాడు. పాపం.. పిచ్చి అమ్మ... సహించి, సహించి ఆ దెబ్బలకు తట్టుకోలేక ఓ రోజు ఇంట్లోంచి వెళ్లిపోయింది. మా నాన్నేం ఊరుకోలేదు. ఇంకో ఆవిడను పెళ్లి చేసుకున్నాడు. నేను అనాథనయ్యా’’ ఆపాడు ఆ అబ్బాయి కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా. ‘‘ఏడుస్తున్నావా? ఏడ్వొద్దు. పగ ప్రతీకారాలతో కాదు ధైర్యంగా బతకాలి. నేనూ మీ నాన్నలాంటి వాడినే. తాగుడు అలవాటై రోజుల తరబడి ఇంటికే వెళ్లకపోయేవాడిని. ఇంటి బాధ్యత అంతా నా భార్యే చూసుకునేది. అలా ఒకసారి ఇంటికెళ్లా. ఇంకో మగాడితో కనిపించింది. వయసులో ఉంది.. ఏం చేస్తుంది? అయినా కోపంతో రగిలిపోయా. ఆమె కళ్లల్లో పశ్చాత్తాపం. అది చూసి మౌనంగా అక్కడి నుంచి నేను వెళ్లిపోవాల్సింది. కాని..ఆవేశంతో నా భార్య గొంతు నులిమి చంపేశా. పధ్నాలుగేళ్లు జైల్లో మగ్గి జీవితం నాశనం చేసుకున్నా. నిజానికి నా తప్పు వల్లే ఇదంతా జరిగింది. అప్పుడే బాధ్యతగా ఉన్నా సరిపోయేది. నా భార్యను వదిలేసినా.. ఆమె మానాన ఆమె ప్రశాంతంగా ఉండేది. నేనూ జైలుపాలయ్యే వాడిని కాదు. అందుకే భవిష్యత్లో ఎప్పుడైనా మీ అమ్మ, నాన్న కనిపిస్తే.. ఆవేశపడకు. వాళ్ల కళ్లల్లోకి సూటిగా చూడు.. పశ్చాత్తాపం కనిపిస్తుంది’’ అని చెప్పాడు ఓ పెద్దాయన. ఒకరి అనుభవం ఇంకొకరికి పాఠమే. లక్ష్యపెట్టి ఆచరిస్తే! అయితే ఆ అబ్బాయి లైఫ్ నేరస్తుడిగా టర్న్ తీసుకుంది.. ఉరిశిక్షతో ఎండ్ అయింది. 1980–90ల్లో మద్రాస్ నేర సామ్రాజాన్నేలిన డాన్ గౌరీ శంకర్ రియల్ స్టోరీ ఆధారంగా జీ5 నిర్మించిన ‘ఆటో శంకర్’’ వెబ్సిరీస్ ఇది. ఆ చానెల్లో స్ట్రీమ్ అవుతోంది. వెబ్ ప్లే.. మొదట్లోనే చెప్పుకున్నట్టుగా అమ్మానాన్న ఉన్న అనాథ శంకర్. పెరిగిపెద్దయ్యాక జీవనోపాధికి ఆటో నడుపుతుంటాడు. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ టైమ్లోనే రామ్జయన్ అనే వ్యక్తి సారా స్మగ్లింగ్ చేస్తూ ఇటు పోలీసులు, అటు రాజకీయ నాయకులకూ పెద్ద తలనొప్పిగా తయారవుతాడు. అప్పుడే ఆటో శంకర్.. ధైర్య సాహసాలు ఆ ఏరియా పోలీస్ ఆఫీసర్ కంట పడ్తుంది. ఈ శంకర్తో రామ్ జయన్కు చెక్ పెట్టించొచ్చని తనకు దగ్గరగా ఉన్న మంత్రికి చెప్పడమే కాక ప్లాన్స్ కూడా వేస్తాడా పోలీస్ అధికారి. రాత్రికి రాత్రే.. అనుకున్నట్టుగానే శంకర్ను రామ్ జయన్కు పోటీగా తయారు చేస్తాడు. శంకర్ సారా స్మగ్లింగ్, ఫ్లష్ ట్రేడింగ్కు మార్గం సుగమం చేస్తాడు ఆ పోలీస్ అధికారి. అట్లా రామ్ జయన్ వ్యాపారాన్ని, ఆధిపత్యాన్ని కూలదోస్తారు. పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలతో రాత్రికి రాత్రే డాన్ అవుతాడు గౌరీ శంకర్ ఉరఫ్ ఆటో శంకర్. అడ్డు తగిలిన పోలీసులకు మామూళ్లు పడేస్తూ మచ్చిక చేసుకుంటూంటాడు. ఒకరోజు చంద్రిక అనే అమ్మాయి తారస పడ్తుంది. ప్రేమించిన వ్యక్తిని నమ్మి... అయిన వాళ్లందరినీ వదిలి మద్రాస్ వచ్చేస్తుంది. తీరా ప్రేమించిన వాడు ఆమెను వ్యభిచారంలోకి దింపుతాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు... ఆటో శంకర్కు అనుచరుడే. ఆమె కథ విని చలించిపోతాడు. చంద్రికను ప్రేమించడం మొదలుపెడ్తాడు. శంకర్ ఇక నుంచి ఆమె వ్యభిచారం చేయదు అని తన అనుచర వర్గానికి చెప్తాడు. ఆ మాట చంద్రిక ప్రేమికుడికి నచ్చదు. అయినా మిన్నకుంటాడు. తన భర్త చంద్రికను ఇష్టపడ్తున్నాడన్న విషయంతోపాటు అతని వ్యాపారాల గురించీ తెలిసిన శంకర్ భార్య చంకలో ఒక బిడ్డ, కడుపులో మరో బిడ్డతో ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. డబ్బుకు కటకటలాడి ఆమె వచ్చేస్తుందిలే అనే నిర్లక్ష్యంలో ఉంటాడు శంకర్. కాని ఆమె ఎప్పటికీ తిరిగి రాదు. ఏకు మేకైతే... ఈలోగా మంత్రికి చంద్రిక గురించి తెలుస్తుంది. ఆమెను తన దగ్గరకు పంపించమని ఆటో శంకర్కు కబురు చేస్తాడు. పట్టించుకోడు శంకర్. మంత్రికి కోపమొస్తుంది. ‘‘మనం తయారు చేసినవాడే మనల్ని బేఖాతరు చేయడమేంటి? అంటూ పోలీస్ అధికారిని హెచ్చరిస్తాడు మంత్రి.. అప్పుడా పోలీస్ కలగజేసుకుని శంకర్ను బెదిరిస్తాడు నెమ్మదిగా.. చంద్రికకు నచ్చజెప్పి మంత్రి దగ్గరకు పంపిస్తాడు శంకర్. ఆ రోజే చంద్రికను ప్రేమించిన వ్యక్తి తాగి ఆమె గురించి అసభ్యంగా మాట్లాడ్తుంటే భరించలేక తన అనుచరులతో కలిసి అతణ్ణి సజీవంగా దహనం చేస్తాడు శంకర్. ఇంకో వైపు చంద్రికను అడ్డం పెట్టుకొని మంత్రితో తన వ్యాపారాన్ని విస్తరింపచేసుకుంటూంటాడు. గదుల్లో రహస్య కెమెరాలు అమర్చి సెక్స్ వర్కర్స్ దగ్గరకు వస్తున్న పలుకుబడి మనుషులు, నేతలు, అధికారుల ఫోటోలు తీసి దాస్తుంటాడు. గవర్నర్ పాలన.. ఈలోపు మద్రాస్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎమ్జీఆర్ చనిపోవడంతో ఆ పార్టీ రెండుగా చీలిపోతుంది. ఆ గొడవల్లో గవర్నర్ పాలన వస్తుంది. అంతే వేగంగా శంకర్ నేర సామ్రాజ్యమూ విస్తరించుకుంటుంది మహాబలిపురం వరకు. అడ్డొచ్చిన తన ముఖ్యమైన అనుచరులను, తన మాట వినని సెక్స్ వర్కర్ లలితనూ చంపేసి.. ఆ శవాలను పాతింటి గోడల్లో, నేలలో పాతి పెడ్తాడు. లలితను చంపుతుంటే ఆమె ప్రేమికుడు, శంకర్ అనుచరుడు బాబు చూస్తాడు. మిగిలిన హత్యలూ శంకరే చేశాడని అనుమానపడ్తాడు కూడా. దాంతో పోలీసులకు అప్రూవర్గా మారిపోతాడు. ఆ అవకాశం కోసమే కాపు కాస్తున్న పోలీసులు బాబు సహాయంతో ఆ శవాలన్నిటినీ వెలికి తీస్తారు. ఈ వార్త శంకర్కు చేరుతుంది. తాను రహస్యంగా తీసిన పెద్ద మనుషుల ఫోటోలను చంద్రికకిచ్చి.. పోయి లాయర్ను మాట్లాడమంటాడు. తానూ కొంత డబ్బు తీసుకొని భార్యను వెదుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్తాడు. వాకిట్లోంచే పంపించేస్తుంది భార్య. కనీసం పిల్లలనైనా చూడనివ్వమని అడిగినా వినకుండా. శంకర్ బయటకు వచ్చేసరికే ఆ ఇంటి చుట్టూ మోహరించిన పోలీసులు అతణ్ణి అరెస్ట్ చేసేస్తారు. ఆ నాటికి ఆరు హత్యల్లో నిందితుడిగా ఉంటాడు శంకర్. ఖైదీ నంబర్ 203 శంకర్ ఇచ్చిన ఫోటోలతో నేరుగా మంత్రి దగ్గరకి వస్తుంది చంద్రిక. ఆమె అందించిన వివరంతోనే శంకర్ను అరెస్ట్ చేస్తారు పోలీసులు. ప్రతిగా ఆమెను ఆ పార్టీ మహిళా నాయకురాలిగా చేస్తానని మాటిస్తాడు మంత్రి. కోర్టులో శంకర్ నేరాలూ రుజువవుతాయి. ఉరి శిక్ష ఖరారు అవుతుంది. మద్రాస్ సెంట్రల్ జైల్లో ఖైదీ నంబర్ 203గా కాలం వెళ్లబుచ్చుతూంటాడు శిక్ష అమలు అయ్యే వరకు. తనను పట్టించింది చంద్రికే అని తెలుస్తుంది శంకర్కు. జైల్లో తన తోటి ఖైదీని చూడ్డానికి వస్తున్న అతని భార్యతో మాట కలుపుతాడు. స్నేహం చేస్తాడు శంకర్. ఎంతలా అంటే.. ఆమె హెల్ప్తో ఆ జైల్లోంచి పారిపోయి.. బాబు, చంద్రికల పని పట్టేంతగా. ఆ క్రమంలో తన తండ్రి ఇంటికి వెళ్లిన శంకర్ను గదిలో బంధించి పోలీసులకు పట్టిస్తుంది అతని సవతి తల్లి. ఉరి.. శంకర్ ఉరిశిక్షను ఆపేందుకు అతని భార్య రాష్ట్రపతికి క్షమా భిక్ష పెట్టుకుంటుంది. కాని దొరకదు. చివరి రోజు భార్య చేతి భోజనం తినాలనుకుంటాడు. తెస్తుంది, అన్నం తినిపిస్తుంది ఆమె. ‘‘పిల్లల్ని తీసుకొస్తావనుకున్నా’’ అంటాడు శంకర్. ‘‘ఇప్పటి వరకూ వాళ్లకు నువ్ లేవు.. ఇక నుంచీ ఉండవ్. ఈ ఒక్క పూట మాత్రం నువ్వున్నట్టు వాళ్లకెందుకు తెలియాలి’’ అంటూ బైబిల్ అతని చేతిలో పెట్టి వెళ్లిపోతుంది ఆమె. ఆ బైబిల్ తీసి చూస్తాడు.. లోపల పుటల్లో.. పిల్లల ఫోటో ఉంటుంది. ఆ ఫొటో పట్టుకొని పొగిలి పొగిలి ఏడుస్తాడు. తెల్లవారు జామున శంకర్ను ఉరి తీస్తారు. ఆ రోజే చంద్రిక పార్టీ మహిళా నాయకురాలిగా పదవి తీసుకుంటుంది. ఆ ర్యాలీలో ఆమెను హత్య చేస్తాడు శంకర్ తండ్రి. ఇక్కడితో సమాప్తం. ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో మార్కెట్ చేసేవి క్రైమ్ అండ్ సెక్సే! ఆ సూత్రం ఆధారంగా తీసిన పది ఎపిసోడ్ల సిరీస్ ఇది. పద్దెనిమిదేళ్లు నిండిన వాళ్ల కోసమనే డిస్క్లయిమరూ ఉంది దీనికి. – సరస్వతి రమ -
పెరుగుపై జీఎస్టీ; రూ. 15 వేల జరిమానా!
చెన్నై : జీఎస్టీ పరిధిలో లేని వస్తువులపై కూడా పన్ను వసూలు చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. రాష్ట్రంలో తిరునల్వేలిలోని ఒక హోటల్లో ఓ వ్యక్తి రూ.40 పెరుగును కొన్నాడు. పెరుగు మీద కూడా హోటల్ సిబ్బంది జీఎస్టీ పన్ను విధించడంతో ఆ వ్యక్తి కంగుతిన్నాడు. జీఎస్టీ పన్ను కింద రూ. 2, ప్యాకింగ్ కవర్కి రూ. 2 లు చెల్లించాలని చెప్పడంతో బిత్తరపోయాడు. పెరుగుపైన కూడా జీఎస్టీ ఎలా వసూలు చేస్తారని అడిగాడు. దానికి హోటల్ సిబ్బంది ఇంకా పెరుగుపై తమ కంప్యూటర్ బిల్లింగ్ వ్యవస్థలో జీఎస్టీ పన్ను చూపిస్తోందన్నారు. కావున మీరు పన్నుతో కూడిన ధరను చెల్లించాలన్నారు. ఈ క్రమంలో అతను జీఎస్టీ అధికారులను సంప్రదించినా వారు కూడా దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. దీంతో ఆ వ్యక్తి వినియోగదారుల ఫోరమ్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు విన్న వినియోగదారుల ఫోరమ్ సదరు వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అదే విధంగా హోటల్ యాజమాన్యంపై రూ.15000 జరిమానా విధించింది. ఒకవేళ నెల రోజుల లోపు జరిమానా చెల్లించని క్రమంలో ఆ మొత్తానికి వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. -
దేవదాసీలపై దర్శకుడి వ్యాఖ్యలు సబబేనా?
సాక్షి, న్యూఢిల్లీ : రాజరాజ చోళుడు–1 దళితుల భూములను లాక్కున్నారని, దేవదాసీల వ్యవస్థను పటిష్టం చేశారని ఆరోపించడం ద్వారా కబాలి, కాలా చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన ప్రముఖ తమిళ దర్శకుడు పా. రంజిత్ చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆయనపై ‘హిందూ మక్కాల్ కాట్చీ (హిందూత్వ సంస్థ)’ ఫిర్యాదు చేయడంతో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలతో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలవడం, రంజిత్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై మద్రాస్ హైకోర్టులో ప్రస్తుతం వాదోపవాదాలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ నెల 17వ తేదీ వరకు ఆయన్ని అరెస్ట్ చేయరాదంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఆయన బెయిల్ పిటిషన్ వీగిపోతే ఆయన్ని అరెస్ట్ చేయవచ్చు. కేసు విషయాన్ని పక్కన పెడితే రంజిత్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవాస్తవాలు ఏమిటీ ? అసలు రాజరాజ చోళుడు ఎవరు ? ఏ కాలం నాటి వారు ? గత ఐదు దశాబ్దాలుగా తమిళనాడులోని కొన్ని కులాలు ఆయన వారసులుగా ఎందుకు చెలామణి అవుతున్నాయి ? క్రీ.శకం 848 నుంచి 1070 క్రీ.శకం వరకు తమిళ ప్రాంతంలో చోళుల సామ్రాజ్యం కొనసాగింది. విజయాలయ చోళుడు ఆ వంశానికి చెందిన తొలి రాజుకాగా, అతిరాజేంద్ర చోళుడు ఆఖరివాడు. వీరిలో గొప్ప రాజుగా కీర్తిపొందిన వారు రాజరాజ చోళుడు–1. పలు ఆలయాలను నిర్మించడంతో ఆయనకు ఆ పేరు వచ్చింది. తంజావూరులోని బహాదీశ్వర ఆలయం (శివాలయం)ను నిర్మించినది ఆయనే. థేవర్లు, నాదర్లు, వన్నియార్లు, వెల్లాలార్లు వారసులట! రాజరాజ చోళుడి వారసులమని దక్షిణ తమిళనాడులో బలమైన ఓబీసీలుగా ఉన్న థేవర్లు, నాదర్లు, ఉత్తర తమిళనాడులోని ఓబీసీల్లో బలమైన వన్నియార్లు, ఎస్సీలైన దేవేంద్ర కుల వెల్లాలార్లు గత ఐదారు దశాబ్దాలుగా చెప్పుకుంటున్నారు. ప్రతి ఏటా అక్టోబర్ నెలలో ఈ కులాల వారు చోళుడి జయంతిని ఘనంగా జరుపుకుంటారు. తామే అసలైన వారసులమంటూ రాష్ట్రమంతట పోస్టర్లు వేస్తారు. వీరిలో ఎవరు అసలు వారసులో తేల్చేందుకు ఎలాంటి చారిత్రక ఆధారాలు అందుబాటులో లేవు. రాజరాజ చోళుడి గురించి ‘పొన్నీయిన్ సెల్వన్’ పేరిట ఐదు సంపుటాలు రాసిన కల్కి క్రిష్ణమూర్తి కూడా ఆయన వారసుల గురించి పేర్కొనలేదు. 1950లో ‘పొన్నీయిన్ సెల్వన్’ ఓ తమిళపత్రికలో ఓ ధారావాహిక సీరియల్గా రావడంతో ఆయన గురించి ప్రతి ఇంటా తెల్సిపోయింది. ఆ తర్వాత వారసుల తగువు మొదలైనట్లు తెలుస్తోంది. దళితుల భూములను లాక్కున్నారా ? రాజరాజ చోళుడి హయాంలో బ్రాహ్మణులది అగ్రస్థానమని, ఆయన బ్రాహ్మణులకు భూములను, గ్రామాలను దానం చేశారని వాటిని ‘బ్రహ్మదేయ’ అని వ్యవహరించేవారని తమిళనాడు నుంచి 28 వేల రాజ శిలా శాసనాలను సేకరించి వాటిపై పరిశోధనలు జరిపిన జపాన్ చరిత్రకారుడు నొబోరు కరషిమ తెలిపారు. బ్రాహ్మణులు నేరం చేస్తే చిన్న శిక్షలు, ఇతరులు నేరం చేస్తే పెద్ద శిక్షలు ఉండేవని కూడా పేర్కొన్నారు. అందుకనే పెరియార్ ఈవీ రామస్వామి తన రచనల్లో చోళులను తీవ్రంగా విమర్శించారు. అయితే రాజరాజ చోళుడి తర్వాత అధికారంలోకి వచ్చిన రాజులు బ్రాహ్మణులతోపాటు దళితులకు భూదానం చేశారని అప్పట్లో వ్యవసాయం చేసుకునే ‘పెరియార్ల’కు పన్ను మినహాయింపు కూడా ఇచ్చారని 2012లో విడుదలైన ‘చోళకళ సెప్పెదుగల్’లో ఎం. రాజేంద్రన్ (ఐఏఎస్) పేర్కొన్నారు. అయితే దళితుల వద్ద భూమి గుంజుకున్నట్లు ఆయన ఎక్కడా తెలపలేదు. అలాంటి ఆధారాలు కూడా లేవని కోల్కతాలోని ‘సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్’లో పొలిటికల్ సైన్స్ అసెస్టెంట్ ప్రొఫెసర్ కార్తీక్ రామ్ మనోహరన్ కూడా స్పష్టం చేశారు. మరి దేవదాసీల సంగతి దేవుళ్లకు దాస్యం చేసే దేవదాసీ వ్యవస్థను అప్పట్లో తమిళనాట ‘దేవరదియాల్’గా వ్యవహరించేవారు. క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు పాలించిన పల్లవ రాజుల కాలంలో ఈ వ్యవస్థ వచ్చింది. తమిళ దర్శకుడు రంజిత్ ఆరోపించినట్లుగా రాజరాజ చోళుడు హయాంలో బలేపేతం అయింది. ఆయన కాలంలో వివిధ దేవాలయాలకు దాదాపు 400 దేవదాసీలు ఉండేవారు. అనాథలు, అభాగ్యులైన ఆడ పిల్లలను దేవదాసీలుగా కొనుగోలు చేసేవారు. వారు కేవలం దేవాలయాలను శుభ్రం చేయడానికే పరిమితం అయ్యేవారు. అక్కడ భోంచేసి, అక్కడే పడుకుంటూ తమ జీవితాలను ఆలయాలకు అంకితం చేసేవారు. వారికి ప్రత్యేక గదులను కట్టించిన ఘనత రాజరాజ చోళుడిదే. ఇక్కడ రంజిత్ విమర్శ అర్థరహితం. లైంగికంగా దేవదాసీలను ఉపయోగించుకోవడం 18వ శతాబ్దంలో మొదలై, 19వ శతాబ్దంలో బలపడినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. -
పేరుమోసిన రౌడీషీటర్ ఎన్కౌంటర్
సాక్షి, చెన్నై : నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్న ఓ రౌడీషీటర్ పాపం పండింది. ప్రజలపైనే కాకుండా పోలీసులపై కూడా కత్తి దూయడంతో అతడి ప్రాణాన్ని తుపాకీ తూటలు బలితీసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున చెన్నైలోని వ్యాసార్పాడిలో వల్లరసు అనే రౌడీషీటర్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఓ కేసు విషయంలో అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులుపై వల్లరసు కత్తితో దాడికి యత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతనిపై కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే వల్లరసు దాడిలో ఎస్ఐ పవన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వల్లరుసుపై హత్యా, హత్యాయత్నం, దాడులు వంటి పలు కేసులు ఉన్నాయి. గతంలో సెక్రటేరియట్ కాలనీలో ఓ హత్యకేసులో నిందితుడుగా ఉన్న వల్లరుసుపై హతుడి బంధువులు హత్యాయత్నం చేయడంతో అక్కడి నుంచి పారిపోయి మాదవరంలో తలదాచుకున్నాడు. -
శింబు తమ్ముడి పెళ్లయింది..
పెరంబూరు: సంచలన నటుడు శింబు ఇంకా మోస్ట్ బ్యాచిలర్గానే ఉన్నాడు. ఆయన సోదరుడు మాత్రం పెళ్లి చేసేసుకున్నాడు. సీనియర్ నటుడు, దర్శకుడు టీ.రాజేందర్ రెండవ కుమారుడు కురళరసన్కు శుక్రవారం ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఓ ఇంటి వాడయ్యాడు. బాల నటుడిగా వెండితెరకు పరిచయం అయిన ఇతడు ఆ తరువాత సంగీతంపై దృష్టి సారించాడు. శింబు, నయనతార జంటగా నటించిన ఇదునమ్మ ఆళు చిత్రం ద్వారా సంగీతదర్శకుడిగా పరిచయం అయ్యాడు కూడా. కాగా కురళరసన్ ఒక ముస్లిం యువతిని ప్రేమించడం, వివాహానికి తల్లిదండ్రులు పచ్చజెండా ఊపడంతో అతను ఇటీవల ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. శుక్రవారం కురళరసన్, తన ప్రేమించిన నబీలా అహ్మదును ఇస్లాం మత సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. స్థానిక అన్నాశాలైలోని మసీదులో జరిగిన ఈ వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు మత గురువులు మాత్రమే పాల్గొన్నారు. తమ్ముడు పెళ్లి కోసం లండన్లో ఉన్న శింబు చెన్నైకి వచ్చాడు. ఈ నవ వధూవరుల వివాహ రిసెప్షన్ను టీ.రాజేందర్ ఈ నెల 29న చెన్నైలోని ఒక స్టార్ హోటల్లో బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలో రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. -
అత్త చెవి కొరికిన అల్లుడు
కొరుక్కుపేట: అత్త చెవి కొరికిన ఓ అల్లుడు కటకటాలపాలయ్యాడు. మదురై జిల్లాలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాలు ... మదురై జిల్లా సమయనల్లూరుకు చెందిన ముత్తుకుమార్ ,కవిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐదేళ్లయినా సంతానం కలగలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకుల కోసం కోర్టులో దాఖలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కవిత పుట్టింటికి వెళ్లిన ముత్తుకుమార్ ఆమెతో ఘర్షణకు దిగాడు. సర్ది చెప్పేందుకు వచ్చిన అత్త లక్ష్మి చెవిని అల్లుడు ముత్తుకుమార్ కోపంలో కొరికేశాడు. నోప్పితో విలవిలలాడిన లక్ష్మిని ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు ముత్తుకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. -
‘అమ్మ’ పథకాల అమలుపై ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత 1991, జూన్ 24వ తేదీన మొదటి సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఆ రాష్ట్రానికి రెండో మహిళా ముఖ్యమంత్రి. ఆమెకన్నా ముందు ఆమె రాజకీయ గురువు ఎంజీ రామచంద్రన్ భార్య జానకి రామచంద్రన్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఓ నెలరోజులపాటు ఆ పదవిలో కొనసాగారు. 1991 నుంచి 2016లో ఆమె చనిపోయే వరకు ఆరు పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారంటే అందుకు ప్రధాన కారణం ఆమె ప్రజల కోసం, ముఖ్యంగా మహిళలకోసం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే కారణం. తమిళనాడులో ఆడ శిశు హత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో జయలలిత 1992లో ‘క్రేడిల్ బేబీ స్కీమ్’ను ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక కేంద్రాలు, పిల్లల సంరక్షణాలయాల్లో ఊయలలను ఏర్పాటు చేశారు. ఆడ శిశువులు అవసరం లేదనుకున్న తల్లిదండ్రులు వారిని తీసుకొచ్చి వాటిలో వేసి పోవచ్చు. ఆ తర్వాత ఆ ఆడ శిశువులను అవసరం మున్న దంపతులకు దత్తత ఇచ్చేవారు. లేదంటే ప్రభుత్వ పిల్లల సంరక్షణాలయాల్లో చేర్చేవారు. 2011లో జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించిన తర్వాత జయలలిత దాదాపు రెండు కోట్ల మంది మహిళలకు ఉచితంగా మిక్సర్ గ్రైండర్స్, ఫ్యాన్స్ పంపిణీ చేశారు. ఆమె అదే ఏడాది వద్ధులు, వితంతువుల పింఛన్లను పెంచారు. 2013, ఫిబ్రవరి నెలలో ఆమె ‘అమ్మ క్యాంటీన్లు’ స్కీమ్ను ప్రారంభించారు. రూపాయికి ఇడ్లీ, మూడు రూపాయలకు పెరుగన్నం, ఐదు రూపాయలకు సాంబార్ అన్నం చొప్పున నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయడం వల్ల ఈ క్యాంటీన్లకు అమితమైన ప్రజాదరణ వచ్చింది. 2014లో ‘అమ్మ బేబీ కేర్ కిట్’ అనే స్కీమ్ను ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన పిల్లలకు 16 వస్తువులతో కూడిన వెయ్యి రూపాయల కిట్ ఇచ్చేవారు. వాటిలో సబ్బు, టవల్, నేల్కట్టర్, దోమతెర, ఓ బొమ్మ లాంటివి ఉండేవి. 2015లో అంతర్జాతీయ తల్లి పాల దినోత్సవాన్ని పురస్కరించుకొని జయలలిత, రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్లలో 350 తల్లి పిల్లలకు పాలివ్వడానికి అనువైన గదులను ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం ‘అమ్మ ఆరోగ్య పథకం’ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ కేంద్రాల వద్ద 30 ఏళ్ల లోపు వారికి ఈ స్కీమ్ కింద ఉచిత వైద్య పరీక్షలు ఏర్పాటు చేశారు. మహిళలకైతే డీ విటమన్ స్థాయి, బోన్ సాంద్రత, పరథ్రాయిడ్ లాంటి ప్రత్యేక పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించేవారు. తమిళనాడులో 1962లో వద్ధాప్య పింఛన్లను ప్రవేశపెట్టారు. 1975లో దాన్ని వితంతువులకు కూడా వర్తింపచేశారు. 2011లో ఆ పింఛన్లను జయలలిత ప్రభుత్వం 1000 రూపాయలకు పెంచింది. ఆ పింఛన్లను 1500 రూపాయలకు పెంచుతామని 2016 ఎన్నికల ప్రణాళికలో జయలలిత ప్రకటించారు. దాన్ని అమలు చేయకముందే ఆమె మరణించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులైనవారుగానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి పళని స్వామి సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల జయలలిత ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయని ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఇది ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి ప్రతికూల అంశం. ఈ నెల 18వ తేదీన రాష్ట్రంలోని లోక్సభ స్థానాలతోపాటు రాష్ట్రంలోని 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. 234 స్థానాలు కలిగిన అసెంబ్లీలో 114 మంది సభ్యుల మద్దతు కలిగిన (స్పీకర్ మినహా) పాలకపక్షానికి ఉప ఎన్నికలు కీలకమే! -
కాల్వలోకి దూసుకెళ్లిన కారు : ఆరుగురి దుర్మరణం
చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోయంబత్తూర్ వద్ద పొలాచ్చిలోని పరంబికులమ్-అలియార్ ప్రాజెక్టు కాలువలో తాము ప్రయాణిస్తున్న కారు పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో బాధితుల మృతదేహాలను పొలాచ్చి జనరల్ ఆస్పత్రిలో ఉంచారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు. -
టీడీపీ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు
చెన్నై: టీడీపీ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ నాయకులు రామ్మూర్తి రెడ్డి, దండా బ్రహ్మానందం, జవ్వాజి రామాంజనేయుల నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. వీరంతా కూడా తమిళనాడు మంత్రి వీరమణితో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. రామాంజనేయులు చైన్నై టీటీడీ సలహా మండలిలో సభ్యుడిగా ఉన్నారు. ఈ సోదాల్లో పలు కీలకమైన డాక్యుమెంట్లతోపాటు నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లికి నిరాకరించడంతో తరగతి గదిలోనే టీచర్ హత్య
చెన్నై : పెళ్లికి నిరాకరించడంతో ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్ను తరగతి గదిలోనే ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. గాయత్రి మెట్రిక్యులేషన్ స్కూల్లో విద్యార్ధులకు గణితం బోధించేందుకు స్కూల్కు వచ్చిన ఎస్ రమ్య అనే 23 ఏళ్ల యువతిపై తరగతి గదిలోనే నిందితుడు రాజశేఖర్ దాడి చేశాడు. విద్యా సంస్థకు సమీపంలోనే బాధితురాలి ఇల్లు ఉండటంతో ఆమె ముందుగానే అక్కడికి చేరుకోగా అదును చూసి నిందితుడు ఆమెను కిరాతకంగా హత్య చేశాడని అధికారులు తెలిపారు. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకే ఆమెపై నిందితుడు దాడికి తెగబడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాలేజీలో చదువుకునే సమయం నుంచి నిందితుడికి ఆమె తెలుసని, ఆరు నెలల కిందట ఆమెను వివాహం చేసుకుంటానని బాధితురాలి తల్లితండ్రులను రాజశేఖర్ సంప్రదించగా వారు అందుకు నిరాకరించారని పోలీసులు వెల్లడించారు. పెళ్లికి నిరాకరించారనే ఆగ్రహంతో నిందితుడు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. -
‘డిఫెన్స్ స్కాములతో దోచుకున్నారు’
తిరుపూర్ : కాంగ్రెస్ హయాంలో దేశ భద్రతను పూర్తిగా విస్మరించారని, రక్షణ రంగంలో అడుగడుగునా కుంభకోణాలు చోటుచేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విపక్షంపై ధ్వజమెత్తారు. రక్షణ రంగంలో సముద్రం నుంచి ఆకాంశం వరకూ కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకు పాల్పడే క్రమంలో సైనిక బలగాల ఆధునీకరణనూ విస్మరించిందని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పని సంస్కృతి గత ప్రభుత్వాల కంటే భిన్నమన్నారు. తిరుపూర్లో ఆదివారం జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ దశాబ్ధాల పాటు దేశాన్ని పాలించిన వారు దేశ రక్షణ రంగం గురించి పట్టించుకోలేదన్నారు. ఈ రంగంలో కుంభకోణాల ద్వారా తమ సన్నిహితులకు లబ్ధి చేకూరడమే పరమావధిగా పనిచేశారని దుయ్యబట్టారు. జాతీయ భద్రతకు, రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడిఉందన్నారు. తమిళనాడులో ఏర్పాటు చేయబోయే డిఫెన్స్ కారిడార్ ద్వారా ఈ ప్రాంతంలో పరిశ్రమలు, పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయన్నారు. -
తమిళనాడులో ఐటీ దాడులు
సాక్షి, చెన్నై : పన్ను ఎగవేత, నల్లధనంపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం ఆదాయ పన్ను శాఖ తమిళనాడులోని దాదాపు 70 ప్రదేశాల్లో దాడులు చేపట్టింది. చెన్నై, కోయంబత్తూర్ సహా పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. రిటైలర్ శరవణ స్టోర్స్, రియల్ ఎస్టేట్ సంస్థలు జీస్క్వేర్, లోటస్ గ్రూప్ సహా పలు సంస్ధలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, గతంలో ఐటీ అధికారులు చెన్నైలోని పాపులర్ కేఫ్, గ్రాండ్ స్వీట్స్, హాట్ బ్రెడ్స్, శరవణ భవన్, అంజప్పర్ గ్రూప్ సహా పలు రెస్టారెంట్ చైన్స్పై దాడులు చేపట్టారు. ఈ రెస్టారెంట్ల డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాలపైనా 100 మందికి పైగా అధికారుల బృందం సోదాలు, దాడులు చేపట్టింది. ఆయా సంస్ధలు తమ ఆదాయాన్ని తక్కువగా చూపడం, పన్ను ఎగవేతలకు పాల్పడటం వంటి ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు, దాడులు నిర్వహించారు. -
గిన్నీస్ రికార్డు జల్లికట్టులో తీవ్ర విషాదం
సాక్షి, చెన్నై : గిన్నీస్ బుక్ రికార్డు కోసం అధికారులు ఏర్పాటు చేసిన అతిపెద్ద జల్లికట్టులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పుదుకొట్టై జిల్లా విరాళీమలైలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఇద్దరు మృతి చెందారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం గిన్నీస్ రికార్డులో చోటు సంపాదించగా.. 41మంది గాయపడ్డారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 21 ఎద్దులను పట్టుకుని తిరుచ్చికి చెందిన మురుగానందం మొదటిస్థానంలో, పదహారు ఎద్దులను పట్టుకుని కాట్టురుకు చెందిన కార్తీ రెండో స్థానంలో నిలుచున్నాడు. పలు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిన ఈ జల్లికట్టు కార్యక్రమంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. -
తమిళనాడులో ఘోర ప్రమాదం
సాక్షి, చెన్నై/నర్సాపూర్/సిద్దిపేట: భక్తితో 41 రోజులు మండలదీక్ష పూర్తిచేశారు. ఉత్సాహంగా అయ్యప్ప దర్శనానికి శబరిమల బయలుదేరారు. దర్శనం బాగా జరిగిందని ఫోన్ చేసి చెప్పడంతో కుటుంబసభ్యులూ సంతోషించారు. ఇంకేం.. మరో మూడు, నాలుగు రోజుల్లో వచ్చేస్తారంటూ సంతోషిస్తున్న సమయంలోనే ఊహించని వార్త షాక్కు గురిచేసింది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మృత్యువు ట్రాలీ లారీ రూపంలో కబళించింది. తమిళనాడులోని పుదుకొటై్ట్ట జిల్లా తిరుమయం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లాకు చెందిన 10 మంది అయ్యప్ప భక్తులు మృతి చెందారు. శబరిమలై అయ్యప్పను దర్శించి, రామేశ్వరంలో పవిత్ర స్నానాలు ముగించుకుని తిరుగు పయనంలో ఉన్న ఈ భక్తులు ప్రయాణిస్తున్న వ్యానును ఎదురుగా, అతివేగంగా దూసుకొచ్చిన ట్రాలీ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పరిధిలోని ఖాజీపేట, మంతూర్, రెడ్డిపల్లి, చిన్న చింతకుంట, సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మంగాపూర్లకు చెందిన 14 మంది అయ్యప్ప భక్తుల బృందం నాలుగు రోజుల క్రితం శబరిమలైకి వ్యాన్లో వెళ్లింది. డ్రైవర్తో పాటు 14మంది యాత్రకు బయలుదేరారు. అయ్యప్ప దర్శనానంతరం ఈ భక్తులు రామేశ్వరానికి వెళ్లారు. అక్కడ దర్శనం చేసుకుని రామేశ్వరం–పుదుకోట్టై రాష్ట్ర రహదారిలో తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో వీరు పయనిస్తున్న వ్యాన్ తిరుమయం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఓ కంౖటైనర్ అతి వేగంగా దూసుకొచ్చి వీరి వ్యాన్ను ఢీకొంది. వేగంగా ఉన్న రెండు వాహనాలు ఢీకొనడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో సమీప గ్రామస్తులు ఏదో ప్రమాదం జరిగిందన్న ఆందోళనతో ఘటనాస్థలానికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, తిరుమయం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ వేగమే ప్రమాదానికి కారణం లారీ ఢీకొన్న వేగంతో వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఆ శకలాలను తొలగించి సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే డ్రైవర్ సహా ఎనిమిది మంది ఘటనాస్థలంలోనే విగత జీవులయ్యారు. వారి మృతదేహాల్ని బయటకు తీసి, క్షతగాత్రులను పుదుకొట్టై మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఏడుగురిని ఆసుపత్రికి తరలించగా.. మార్గం మధ్యలో మరో ఇద్దరు మరణించారు. తీవ్రగాయాలైన మిగిలిన ఐదుగురికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద సమాచారంతో తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, డీఐజీ లలిత లక్ష్మి, జిల్లా కలెక్టర్ గణేష్, ఎస్పీ సెల్వరాజ్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని వేగవంతం చేశారు. భాషాపరమైన సమస్యల కారణంగా.. మృతులు, క్షతగాత్రుల వివరాలను సేకరించడం కష్టంగా మారింది. ఎట్టకేలకు తిరుమయం పోలీసులు వివరాలను సేకరించి.. తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాల్ని పోస్టుమార్టం తర్వాత స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నర్సాపూర్ మండలం ఖాజీపేటకు చెందిన బోయిని కుమార్ (21), జుర్రు మహేష్ (25), కర్రె నాగరాజు గౌడ్ (35).. మంతూరుకు చెందిన చీరాల శివసాయి ప్రసాద్ యాదవ్ (22), అయ్యన్నగారి శ్యాంగౌడ్ (22), రెడ్డిపల్లికి చెందిన నక్క ఆంజనేయులు(42), అంబర్పేట క్రిష్ణగౌడ్ (35), చిన్నచింతకుంటకు చెందిన ప్యాట ప్రవీణ్గౌడ్ (21), జనుముల సురేశ్ (23) వీరితో పాటు వాహనం డ్రైవర్ సురేశ్ దుర్మరణం పాలయ్యారు. ఖాజీపేటకు చెందిన మస్కూరి రాజు, కర్రె నరేశ్ గౌడ్, దొంతి భూమాగౌడ్, మంతూర్కు చెందిన చీరాల శ్రీశైలం యాదవ్, మంగాపూర్కు చెందిన దేవులపల్లి వెంకటేశ్గౌడ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కంటైనర్ లారీ డ్రైవర్ నిద్ర మత్తులో వాహనాన్ని అతి వేగంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసుల విచారణలో తేలింది. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మెదక్ జిల్లాలో విషాదం తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినవారు. దీంతో మెదక్ జిల్లా నర్సాపూర్, సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్లాలోని మృతుల గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. స్వామి దర్శనానికి వెళ్లినవారు రెండు, మూడ్రోజుల్లో తిరిగొస్తారునుకుంటున్న సమయంలో.. ఈ ప్రమాదం జరగడంతో మృతుల కుటుంబాలు షాక్కు గురయ్యాయి. సమాచారం తెలుసుకున్న మృతుల బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఖాజీపేట, మంతూర్, రెడ్డిపల్లి, చిన్నచింతకుంట, సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మంగాపూర్ గ్రామాలకు చెందిన 14 మంది 2వ తేదీ బుధవారం అయ్యప్ప దర్శనానికి శబరిమలైకి బయలుదేరారు. హైదరాబాద్కు చెందిన టెంపో ట్రావెలర్ వాహనంలో వీరు ప్రయాణమయ్యారు. ఖాజీపేటకు చెందిన బోయిని కుమార్, జుర్రు మహేశ్, మస్కూరి రాజు, కర్రె నాగరాజు గౌడ్, కర్ర నరేశ్ గౌడ్, దొంతి భూమాగౌడ్లు, మంతూరు గ్రామానికి చెందిన చీరాల శ్రీశైలం యాదవ్, చీరాల శివసాయి ప్రసాద్ యాదవ్, అయ్యన్నగారి శ్యాంగౌడ్లున్నారు. వారితో పాటు రెడ్డిపల్లికి చెందిన నక్క ఆంజనేయులు, అబంరి పేట క్రిష్ణగౌడ్లు, చిన్న చింతకుంట గ్రామానికి చెందిన ప్యాట ప్రవీణ్ గౌడ్, జనుముల సురేశ్లు కూడా ఈ బృందంలో ఉన్నారు. కాగా సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మంగాపూర్ గ్రామానికి చెందిన దేవులపల్లి వెంకటేశ్ గౌడ్ సైతం వీరితో శబరిమల యాత్రకు బయలుదేరారు. 2వ తేదీన ఖాజీపేటలో ప్రత్యేక పూజలు పూర్తి చేసుకుని ఇరుముడి కట్టుకుని శబరిమలైకి బయలుదేరి వెళ్లారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ సంతాపం తమిళనాడు దుర్ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వీరికి మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులను ఆదేశించారు. అటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ఘటనపై ట్విటర్లో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సరైన వైద్యం కోసం చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రమాదంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన పుద్దుకొట్టై కలెక్టర్ ఎస్.గణేశ్తో హరీశ్ రావు ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందజేయాల్సిందిగా కోరారు. అలాగే మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు సహకరించాలన్నారు. మృతదేహాల తరలింపుపై మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి కూడా అక్కడి కలెక్టర్ గణేశ్తో మాట్లాడారు. మృతదేహాలను స్వస్థలాలకు తీసుకువచ్చేలా చూడాలని టీఆర్ఎస్ జిల్లా నేత మురళీయాదవ్కు హరీశ్ రావు సూచించారు. నర్సాపూర్ తహసీల్దార్ భిక్షపతి, సీఐ సైదులను వెంటనే తమిళనాడు వెళ్లి మృతదేహాలను తీసుకురావటంతోపాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డిలు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల వివరాలు 1. బోయిని కుమార్ (21): ఖాజీపేటకు చెందిన బోయిని మల్లేశ్, బాలమణి దంపతుల కుమారుడు బోయిని కుమార్ (21). హైదరాబాద్లోని మాదాపూర్లో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. చేతికొచ్చిన కుమారుడు మృతిచెందడంతో కుటుంబలో విషాదం నెలకొంది. 2. మహేశ్ యాదవ్ (25): ఖాజీపేటకు చెందిన జుర్రు సాయిలు, మల్లమ్మ దంపతుల కుమారుడు జుర్రు మహేశ్ యాదవ్. ఆయనకు ఆర్నెల్ల క్రితమే వివాహం జరిగింది. నర్సాపూర్లో బైక్ మెకానిక్గా పని చేస్తూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటున్నాడు. 3. నాగరాజు గౌడ్ (35): ఖాజీపేటకు చెందిన కర్రె రామాగౌడ్, యాదమ్మ దంపతుల పిల్లలు కర్రె నాగరాజు గౌడ్, కర్రె నరేష్ గౌడ్లు అయ్యప్ప దీక్ష పూర్తి చేసుకుని శబరిమలకి వెళ్లారు. ప్రమాదంతో పెద్దవాడైన నాగరాజు మృతి చెందాడు. తమ్ముడు నరేశ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. నాగరాజుగౌడ్ 15 సార్లు అయ్యప్పస్వామి మాల ధరించాడు. మృతుడికి భార్య లక్ష్మి, పిల్లలు లోహిక, చరణ్గౌడ్లు ఉన్నారు.లాయన నర్సాపూర్లోని ఓ ప్రైవేట్ స్కూల్కు బస్సు డ్రైవర్గా ఉన్నారు. 4. చీరాల శివ సాయి ప్రసాద్ (22): మంతూర్ గ్రామానికి చెందిన చీరాల మల్లేశ, మలమ్మ దంపతుల ఏకైక కుమారుడు శివ సాయి ప్రసాద్. హైదరాబాద్లోని ఓ కాలేజీ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. 5. అయ్యన్నగారి శ్యాంసుందర్గౌడ్ (22): మంతూర్కు చెందిన అయ్యన్న గారి సంజీవగౌడ్, సుజాత దంపతులకు ఏకైక కుమారుడు శ్యాంసుందర్ గౌడ్. సంజీవ్ గౌడ్ రైతు కాగా.. మృతుడు నర్సాపూర్లో బైక్ మెకానిక్గా పని చేస్తున్నాడు. 6. నక్క ఆంజనేయులు (42): రెడ్డిపల్లికి చెందిన నక్క ఆంజనేయులు నర్సాపూర్లో మోటారు వైండింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య లావణ్య, పిల్లలు సాయి, మహాసిరిలు ఉన్నారు. టుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 7. అంబర్పేట క్రిష్ణగౌడ్ (35): రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంబర్పేట క్రిష్ణగౌడ్కు భార్య లత, ఇద్దరు పిల్లలు (అభినవ్, అభిరాం) ఉన్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తూ క్రిష్ణ గౌడ్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 8. జనుముల సురేశ్ (23): నర్సాపూర్ మండలంలోని చిన్నచింతకుంటకు చెందిన జనుముల సురేశ్ మొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గతంలోనే భర్తను కోల్పోయిన ఆ యువకుడి తల్లి.. ఇప్పుడు కుమారుడు కూడా ఇక రాడని తెలిసి రోదిస్తున్న తీరు కలచివేసింది. 9. ప్రవీణ్ గౌడ్ (21): మెదక్ మండలంలోని గడ్డమోనిపల్లికి చెందిన శ్రీనివాస్గౌడ్, భాగ్యమ్మల కుమారుడైన ప్రవీణ్గౌడ్ తన అమ్మమ్మ దగ్గర ఉంటున్నారు. చిన్నచింతకుంట గ్రామానికి చెందిన తన తాత అంజా గౌడ్ ఇంట్లో ఉంటూ నర్సాపూర్లో మీసేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. 10. సురేశ్ (వాహనం డ్రైవర్): ఆయన గురించిన వివరాలు తెలియరాలేదు. -
విదేశాలకు తీసుకెళ్తే అమ్మ బతికేవారు..
సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత మృతిపై తమిళనాడు న్యాయ శాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైద్య చికిత్స నిమిత్తం ఆమెను విదేశాలకు తరలించి ఉంటే ఆమె ప్రాణాలతో ఉండేవారని వ్యాఖ్యానించారు. జయలలిత ఆస్పత్రిలో ఉండగా ఆమె ఆరోగ్యంపై వైద్యారోగ్య కార్యదర్శి జే. రాధాకృష్ణన్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ మోహనరావులు విచారణ కమిషన్ను అవాస్తవ సమాచారంతో తప్పుదారి పట్టించారని షణ్ముగం ఆరోపించారు. జయలలిత ఆస్పత్రిలో ఉండగా వీరి పాత్రపై సందేహం వ్యక్తం చేస్తూ ఈ అంశంపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చికిత్స నిమిత్తం జయలలితను విదేశాలకు తీసుకువెళ్లే ప్రతిపాదనను వైద్యారోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ వ్యతిరేకించారని, అలా చేస్తే భారత వైద్యుల ప్రతిష్ట దెబ్బతింటుందని ఆయన భావించారని చెప్పారు. ఆయన స్వయంగా డాక్టర్ అయి ఉండీ రోగి పరిస్థితిని అంచనా వేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. జయలలితకు యాంజయోగ్రామ్ నిర్వహించాలని ముగ్గురు వైద్యులు సూచించినా ఎందుకు పరీక్షలు చేయలేదని ప్రశ్నించారు. ఆమెకు ఎందుకు యాంజియోగ్రామ్ చేయలేదని, తప్పుడు వైద్యం ఎవరు చేపట్టారని నిలదీశారు. ఆస్పత్రిపై ఎవరు అజమాయిషీ చేశారనే వాస్తవాలు వెలుగుచూడాల్సి ఉందన్నారు. కాగా జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు రాధాకృష్ణన్ అపోలో ఆస్పత్రితో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని ఆర్ముగస్వామి కమిషన్ పిటిషన్లో ఆరోపించిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జయ ఆస్పత్రిలో ఉండగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ మోహన్రావు తప్పుడు ఆధారాలు సమర్పించారని ఈ పిటిషన్ ఆరోపించింది. జయలలిత మృతిపై ఆర్ముగస్వామి కమిషన్ విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. -
22 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
చెన్నై: గజ తుపాను ప్రభావంతో తమిళనాడు ప్రభుత్వం 22 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. తుపాను కారణంగా సుమారు 80 వేల మంది ప్రజలను 438 పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షంతో పాటు భారీగా గాలులు వీస్తుండటంతో పుదుకోటైలో ఓ ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా, కారైక్కాల్లో విద్యుత్ షాక్ తగిలి ఒకరు చనిపోయారు. తీవ్ర ప్రభావిత ప్రాంతాలలో సహాయక బృందాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తోంది. గజ తుపాను కారణంగా మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. -
ఓటమి ప్రమాదంలో ఆంధ్ర
తిరువనంతపురం: ఓపెనర్గా వచ్చి సెంచరీతో చెలరేగిన కేరళ ఆల్రౌండర్ జలజ్ సక్సేనా బౌలింగ్లోనూ సత్తా చాటి ఆంధ్రను దెబ్బ తీశాడు. జలజ్ (7/44) అద్భుత ప్రదర్శనతో ఆంధ్ర జట్టు రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో ఓటమి దిశగా పయనిస్తోంది. మూడో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. రికీ భుయ్ (30 బ్యాటింగ్) కొద్దిగా ప్రతిఘటించడం మినహా ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. మొదటి 3 వికెట్లలో రెండు పడగొట్టిన జలజ్... తన ఆఫ్స్పిన్తో ఆ తర్వాత వరుసగా ఐదు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో 74 పరుగుల ఆధిక్యం కోల్పోయిన జట్టు ప్రస్తుతం చేతిలో ఉన్న 2 వికెట్లతో 28 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 227/1తో ఆట కొనసాగించిన కేరళ తొలి ఇన్నింగ్స్లో 328 పరుగులకు ఆలౌటైంది. ‘డ్రా’ దిశగా: హైదరాబాద్, తమిళనాడు మధ్య తిరునల్వేలిలో జరుగుతున్న మరో గ్రూప్ ‘బి’ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తమిళనాడు తమ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అభినవ్ ముకుంద్ (101 బ్యాటింగ్; 15 ఫోర్లు) సెంచరీ సాధించగా, సీవీ మిలింద్కు 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు 523/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 8 వికెట్లకు 565 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అక్షత్ రెడ్డి (250) మరో రెండు పరుగులు మాత్రమే జోడించి ఔటయ్యాడు. -
తీవ్రంగా మారనున్న ‘గజ’ తుఫాన్
సాక్షి, చెన్నై: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల గజ తుఫాన్ 759 కిలో మీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది. దీంతో రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుందని తమిళనాడు వాతావరణ శాఖ తెలిపింది. కావునా సముద్రంలోకి చేపల వేటగాళ్లు, జాలర్లు ఎవరు వేటకు వెళ్లకుడదని తీరంవెంబడి ఈదురుగాలులు వీచి అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడలురు రేవులలో మూడో నెంబర్ హెచ్చరికలు జారి చేసింది. -
తమిళనాట భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు తీర ప్రాంత జిల్లాలు, దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. ప్రధానంగా తేని, దిండిగల్, కోయంబత్తూరు, అరియలూరు, తంజావూరు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోబిచెట్టిపాలయం, పొల్లాచ్చి, అరియలూరు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తటంతో దాదాపు 15 గ్రామాలు జలమయం అయ్యాయి. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. బాధిత ప్రాంతాల్లో మంత్రి సెంగొట్టయ్యన్ పర్యటించి సహాయ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. పుదుచ్చేరిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక చైన్నై శివారు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో అధికారులు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు.రుతుపవనాల కారణంగా మరో 48 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు డెంగ్యూ, స్వైన్ప్లూ వ్యాధులు విస్తరిస్తుండటంతో ప్రజలు భయాందోళనల నడుమ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక భారీ వర్ష సూచనల నడుమ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని, తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే పొల్లాచ్చి, గోపిచెట్టి పాలయం తదితర ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.