మధిర మండలం దెందుకూరు వద్ద సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాందేడ్ ఎక్స్ప్రెస్లో చోరీ జరిగింది.
మధిర(ఖమ్మం జిల్లా): మధిర మండలం దెందుకూరు వద్ద సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాందేడ్ ఎక్స్ప్రెస్లో చోరీ జరిగింది. రైలు చైన్లాగి దివ్య అనే యువతి మెడలోని 2 తులాల బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లాడు.
యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.