
‘సమగ్ర సర్వే ఏమైంది’
సాక్షి, న్యూఢిల్లీ: సర్వ రోగ నివారణి అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే ఏమైందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సమగ్ర సర్వేకు ముందే దాదాపు 90 శాతం ఆధార్ నమోదు పూర్తయిందన్నారు. ఈ సర్వే ద్వారా నిజమైన లబ్ధిదారులు తేలుతారని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పటివరకు దళితులకు మూడెకరాల భూమి ఎందుకు పంచివ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.