Ponnala Laxmaiah
-
సినిమాను తలపించిన అసెంబ్లీ సమావేశాలు: పొన్నాల సెటైర్లు
సాక్షి, హన్మకొండ: కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన అంటూ సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాగే, అసెంబ్లీ సమావేశాలు సినిమా చూసినట్టు ఉందంటూ సెటైర్లు వేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆదివారం హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ..‘అసెంబ్లీ పేరుతో సినిమా చూపెట్టారు.. అందులో హీరో ఎవరో విలన్ ఎవరో ప్రజలు అర్థం చేసుకున్నారు. కాంట్రాక్టర్లు రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వగానే వారు చేసిన తప్పులు మాఫీ అవుతాయా?. అదానీతో రేవంత్రెడ్డికి అంతర్గత ఒప్పందం ఉంది. అందుకే రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతికి రేవంత్.. అదానీపై ఫిర్యాదు చేయలేదు. ప్రజలను తప్పు దారిపట్టించేందుకు.. అసెంబ్లీ వేదికగా మోసం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం అదానీ అంశంలో రేవంత్ రెడ్డి ర్యాలీ తీశారు.. కనీసం గవర్నర్ను కలిశారా అని ప్రశ్నించారు.రాష్ట్ర ఆదాయం మూడున్నర రెట్లు పెరిగింది. నిజ జీవితంలోనూ లోన్ అనేది ఒక భాగం. అప్పులు ఉన్నాయి కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు చేయడం లేదు అంటున్నారు.. దేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కడా ఇలా లేదు. లోన్లు పరిమితులకు లోబడే వస్తాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తారా? లేక క్లోజ్ చేస్తారా?. అప్పులు, పెట్టుబడుల గురించి మీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదు. మంత్రులు, ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రజలను తప్పుదారి పట్టించారు. బీఆర్ఎస్ పాలనలో 27 రాష్ట్రాల కంటే తెలంగాణ మెరుగైన స్థానంలో ఉంది. కాంగ్రెస్ నేతలు వస్తారా చూపిస్తాను. కొంచెం కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రజలకు మంచి చేయలేదు. అసెంబ్లీలో శాసనసభ్యుల ప్రవర్తన చాలా బాధాకరం’ అంటూ కామెంట్స్ చేశారు.మరో బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ..‘పదేళ్ల పాటు అన్ని పండుగలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా జరిపారు. బతుకమ్మ పండుగకు చీరలు.. రంజాన్, క్రిస్మస్ పండుగలకు గిఫ్ట్స్ అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. హైడ్రాతో పేదలను రోడ్డున పడేస్తున్నారు.. రియల్ ఎస్టేట్ పడిపోయింది. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ప్రతీకార రాజకీయాలకు ముగింపు పలకాలని కోరుతున్నా’ అంటూ కామెంట్స్ చేశారు. -
కాంగ్రెస్ కు సీనియర్ నేత పొన్నాల గుడ్ బై
-
పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
వాళ్ళంతా పార్టీలో సీనియర్లు.. సూపర్ సీనియర్లు.. హస్తం పార్టీ తమవల్లే చాలాసార్లు గెలిచిందంటారు. తమను గౌరవించాలని.. మాట వినాలని డిమాండ్ చేస్తారు. కాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ సీనియర్లలో చాలా మంది వెనకాడుతున్నారు. పోటీ చేయకుండా కొత్తవారికి అవకాశం ఇస్తారా అంటే.. కుదరదంటారు. అసలు టీ.కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? పోటీకి వెనకాడుతున్న నాయకులెవరు? తెలంగాణ కాంగ్రెస్లోని కొందరు సీనియర్లు ఎన్నికలు అంటేనే భయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము నెట్టుకురాగలమా అని ఆందోళన చెందుతున్నారట. పాలిటిక్స్ గతంలో మాదిరిగా లేవు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పెరిగింది. దీంతో నేతలు ఎన్నికలంటేనే భయపడుతున్నారు. కొందరు నేతలు అక్కడా.. ఇక్కడా తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని స్టేట్మెంట్స్ ఇస్తున్నారట. దీంతో కొందరు సీనియర్ల వ్యవహారం పై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో తామే ముందుండాలని, తమకు ప్రత్యేక ఆసనాలు వేయాలని కోరుకునే సీనియర్లు ఎన్నికలంటే భయపడుతున్నారని టాక్ నడుస్తోంది. రేణుక చౌదరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి లాంటి నేతలు సైతం ఎన్నికలు అనే సరికి వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగతా నేతలంతా వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో ఎన్నికలు అనే సరికి భయపడే పరిస్థితి వచ్చిందంటున్నారు కొందరు. వారసుల కోసం.. సిటింగ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ అంటేనే భయమేస్తోందని కామెంట్ చేశారు. ఉమ్మడి ఏపీలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనర్సింహ సైతం ఎన్నికలు అంటేనే భయపడుతున్నారట. దామోదర తన కూతురుని పోటీలో ఉంచితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డిలు సైతం వచ్చే ఎన్నికలను ఎదుర్కోగలమా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారట. జానారెడ్డి లాంటి నేతలు రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చి కొడుకులను రంగంలోకి దింపే ప్లాన్ చేస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య సైతం కోడలు వైశాలిని మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావాలనే యోచన చేస్తున్నారట. మాజీ ఎంపీ రేణుక చౌదరి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇలా సీనియర్ లు అని చెప్పుకునే నేతలు సైతం ఎన్నికలు అంటే జంకుతున్నారు. కాని పోటీకి దూరం అని చెప్తున్నప్పటికీ ఈ నేతలెవరు తమ నియోజకవర్గంలో మరో నేతకు అవకాశం ఇవ్వడం లేదు. తమ వారసులనే బరిలో దించాలని ఉబలాటపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల ఖర్చు భారీగా పెరిగింది. దీంతో పాటు చాలా మంది కొత్త నేతలు వెలుగులోకి వచ్చారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఓ యువనేతపై ఓడిపోవడం సీనియర్లను కలవర పెడుతోంది. కొత్త ఓటర్లతో.. సీనియర్ నేతలకు వచ్చిన గ్యాప్ పూడ్చుకోవడం సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితుల్లోనే వారు ఎన్నికలంటే భయపడే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోటీకి దూరం అనేది నిజమా? లేక ఏదైనా ఎత్తుగడతో ఇలా అంటున్నారా? అనేది నిదానంగా కాని తేలదు. చదవండి: గులాబీ ఎమ్మెల్యే ఎందుకు టెన్షన్లో ఉన్నారు?.. అక్కడ ఇదే హాట్ టాపిక్ -
ముగిసిన కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి నివాసంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పలువురు భేటీ అయ్యారు. భేటీ ముగిసిన అనంతరం సీనియర్నేత వీ. హన్మంతరావు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో జరిగిన పరిణామాలపై చర్చించామని, సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై మాట్లాడినట్లు తెలిపారు. అధిష్టానం దృష్టికి అన్ని విషయాలను తీసుకెళ్తామని అన్నారు. మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో సంస్థాగతమైన మార్పులు జరగాలని వర్కింగ్ కమిటీ సోనియా గాంధీని కోరారని తెలిపారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏవిధంగా ప్రజల విశ్వాసం పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉండాలని తెలిపారు. పార్టీకి పూర్వ వైభవం రావాలని దానిపై చర్చించామని పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్న వారు.. పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది చూడాలని అన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు సమావేశంలో బయట జరుగుతున్న ఊహాగానాలు ఏమి లేవని, ఆదివారం సోనియా గాంధీ ఏర్పాటు చేసిన సమావేశంపై చర్చించామని పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం ఉండాలని చర్చించామని తెలిపారు. ఆ కుటుంబం అడుగుజాడల్లో కార్యకర్తలు నడుస్తారని అన్నారు. పార్టీతో కొన్ని ఏళ్లుగా అనుబంధంగా కొనసాగుతున్న నేతలుగా చర్చించుకున్నామని చెప్పారు. ఢిల్లీ సమావేశం పైనే చర్చించామని, వీహెచ్ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్కు రెట్టింపు బలం కోసం ఏ విధంగా పని చేయాలనే దానిపై మాట్లాడినట్లు తెలిపారు. -
కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైలులోనే
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాత్రికి రాత్రే ఎత్తేస్తామని ప్రకటించారని.. అవివేకం, అహంకారం, అనాలోచితంగా ఆయన తీసుకునే నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. కేసీఆర్ చర్యల వల్ల రాష్ట్ర రైతాంగం ప్రమాదంలో పడుతుందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కేసీఆర్కు ప్రజలు తగిన శిక్ష విధించడం ఖాయం. మిషన్ భగీరథకు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశావు కదా! నీళ్లు ఇచ్చావా?. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి రెండు ప్రాజెక్టులకు లక్ష కోట్లకుపైగా ప్రభుత్వం సొమ్ము ఖర్చు చేశారు. ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. కేసీఆర్ రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోతారు. కేసీఆర్ తీసుకునే 90 శాతం నిర్ణయాలు ప్రజలను ఇబ్బందుల పాలు చేసేవే. కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడాన్ని.. ప్రజల్లో ఎండగడుతాం. కేసీఆర్, బీజేపీ ఆడే నాటకాలతో.. ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైలులోనే’’ అని అన్నారు. ( పల్లెల్లో పంట కొనుగోలు కుదరదు!) కేసీఆర్ తుగ్లక్లా వ్యవహరిస్తున్నారు: ఉత్తమ్ ‘‘కేసీఆర్ ఒక తుగ్లక్లాగా వ్యవహరిస్తున్నారు. చెప్పిన పంటలే వేయాలని రైతులను ఇబ్బందులు పెట్టారు. మళ్లీ ఇప్పుడు ఇష్టం వచ్చిన పంటలు వేసుకోవచ్చు అంటున్నారు. నియంత్రిత సాగుపై మొదటి నుండి చెప్తూనే ఉన్నాం కానీ వినలేదు. పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యం కాదని చెప్పడం మంచిది కాదు. పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. లేదంటే రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే.. రెండూ రహస్య ఒప్పందం చేసుకున్నాయి. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టంపై కేసీఆర్ మాట మార్చారు. పీసీసీ చీఫ్ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను’’. -
దుబ్బాకలో గెలిచింది బీజేపీ కాదు..
సాక్షి, ఖమ్మం : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవాలనే కసితో ప్రజలు బీజేపీకి ఓట్లు వేశారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే టీఆర్ఎస్లోకి పోతాడని బీజేపీ దుష్ర్పచారం చేసిందని, అందుకే బీజేపీ గెలిచిందని ఆరోపించారు. బుధవారం ఆయన పొన్నాల లక్ష్మయ్యతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో చేపట్టిన రైతు ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో సానుభూతితో రఘునందన్రావు గెలిచాడే తప్ప బీజేపీ గెలువలేదన్నారు. మాజీ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య మాట్లాతుడూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నియంతృత్వ సాగువిధానం తీసుకురావటంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. కౌలు రైతులను నిండా ముంచిన ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని విమర్శించారు. భట్టి ర్యాలీకి ఘన స్వాగతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో చేపట్టిన రైతు ట్రాక్టర్ల ర్యాలీలో ప్రజలు, రైతులు కదం తొక్కారు. ఒక్కరుగా మొదలై వేల సంఖ్యలో రైతులు తమ ట్రాక్టర్లతో సహా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. భట్టి విక్రమార్క ర్యాలీకి ప్రజలు అడుగడుగునా జన నీరాజనం పలికారు. ప్రతి గ్రామంలో భట్టి బృందానికి పూలు జల్లుతూ.. డప్పులతో మోత మోగిస్తూ ఘన స్వాగతం పలికారు. మధిరలో మొదలైన ర్యాలీకి ప్రతి గ్రామంలో రైతులు తమంతకు తాముగా చేరారు. ఒకానొక దశలో ర్యాలీ అనుకన్న సమయం కన్నా ఆలస్యంగా ముందుకు సాగింది.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు సారధ్యంలో జరుగుతున్న ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది అవాస్తవ బడ్జెట్: పొన్నాల
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ (2020-21) పూర్తిగా అవాస్తవ బడ్జెట్ అని టీపీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆర్థిక మాంద్యం అంటూ అసెంబ్లీలో అవాస్తవ బడ్జెట్ ప్రవేశ పెట్టారని విమర్శించారు. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన మూడు ప్రధాన హామీలను బడ్జెట్లో ప్రస్తావించలేదని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి గురించి బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని పొన్నాల ప్రశ్నించారు. కొన్ని వేల ఎకరాలను పేదలకు పంచిన చరిత్ర కాంగ్రెస్దేనని తెలిపారు. బడ్జెట్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదని ధ్వజమెత్తారు. బడ్జెట్ ప్రసంగంలో లో 2 లక్షల ఇళ్లు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారని నిప్పులు చెరిగారు. రాజ్యాంగ పరంగా గిరిజనులకు రావాల్సిన రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్లు అడిగే ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి.. ఈ ఏడాది ఇవ్వలేమంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని పొన్నాల డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ పార్టీ నిషేధిత సంస్థా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను టీపీసీసీ కోరింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం రాజ్భవన్లో గవర్నర్కు వినతిపత్రం అందజేసింది. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్అలీ, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, సీతక్క, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్లు ఈ బృందంలో ఉన్నారు. దాదాపు అరగంటపాటు గవర్నర్తో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు ఈనెల 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జరిగిన ఘటన గురించి వివరించారు. ఆ రోజున దేశవ్యాప్తంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ర్యాలీ కోసం తాము పోలీసులను అనుమతి కోరితే అకారణంగా తిరస్కరించారని వివరించారు. పోలీసులు చెప్పిన రూట్లో వెళ్తామని, అవసరమైతే ఎలాంటి నినాదాలు చేయకుండా మౌనంగా వెళ్తామని చెప్పినా పోలీసులు అనుమతివ్వలేదని చెప్పారు. దీనికి తోడు తమ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న కార్యకర్తలను కూడా అరెస్టు చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నిషేధిత, చట్ట వ్యతిరేక సంస్థ ఏమీ కాదని చెప్పారు. ఇదేమని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ను అడిగితే దురుసుగా జవాబిచ్చారని, ఆయన వ్యవహారశైలి, పనితీరుపై చాలా ఆరోపణలున్నాయని, వెంటనే ఆయనపై విచారణ జరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి తోడు రాష్ట్రంలో ప్రజల హక్కులను అణచివేస్తున్నారని, కనీసం నిరసనలు తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు నిరసనలకు పిలుపునివ్వగానే నాయకులను గృహ నిర్బంధం చేసి, నిరసనలు కూడా తెలపకుండా అడ్డుకుంటున్నారని వివరించారు. వీటన్నింటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం– 2014లోని సెక్షన్ 8 ప్రకారం తమకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి హైదరాబాద్లో శాంతిభద్రతల అమలుపై చొరవ తీసుకోవాలని గవర్నర్కు సమర్పించిన వినతిపత్రంలో టీపీసీసీ నేతలు కోరారు. పోలీసులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు: ఉత్తమ్ రాష్ట్రంలో పోలీసులు సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. గవర్నర్ను కలిసిన అనంతరం టీపీసీసీ నేతలతో కలిసి రాజ్భవన్ ఎదుట విలేకరులతో మాట్లాడుతూ, ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్ వరకు ఆర్ఎస్ఎస్ ర్యాలీకి, దారుస్సలాంలో ఎంఐఎం సభలకు అనుమతిచ్చిన పోలీసులు కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పైగా తమ పార్టీ కార్యాలయానికి వస్తున్న కార్యకర్తలను అరెస్టులు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. అందుకే ఆంధ్ర కేడర్కు కేటాయించినా వెళ్లకుండా, తెలంగాణలో ఉన్నత పదవిలో ఉన్న హైదరాబాద్ సీపీ వ్యవహారశైలిపై విచారణ జరిపించాలని, తనకున్న విచక్షణాధికారాలతో శాంతిభద్రతల విషయంలో చొరవ తీసుకోవాలని గవర్నర్ను కోరినట్టు ఉత్తమ్ చెప్పారు. నేనున్నది అందుకే కదా: గవర్నర్ గవర్నర్తో సమావేశం సందర్భంగా టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, గవర్నర్గా తమిళిసై పనితీరుకు కితాబిచ్చారు. గతంలోకన్నా గవర్నర్ పాత్ర బహిరంగంగా కనిపిస్తోందని, అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నారని, ప్రజల వినతులపై కూడా స్పందిస్తున్నారని పొన్నాల వ్యాఖ్యానించారు. ఇందుకు స్పందించిన గవర్నర్ తన బాధ్యత ప్రకారం వ్యవహరిస్తున్నానని, తానున్నది అందుకేనని, అందుకే వెంటనే ఆయా శాఖలకు వినతిపత్రాలు పంపించి వేస్తున్నానని కాంగ్రెస్ నేతలకు చెప్పినట్టు సమాచారం. -
రేవంత్ అరెస్ట్ అప్రజాస్వామికం: పొన్నాల
జనగామ: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. విలేకరులతో పొన్నాల మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా అనిపిస్తోందని చెప్పారు. జాతీయ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్పై ఇలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందన్నారు. పోలీసులు సంయమనం పాటిస్తే బాగుండేదన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రేవంత్ను కట్టడి చేయడానికే ఈ కుట్ర జరిగిందని, కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ఇలాంటి అప్రజాస్వామిక విధానాలు అనుసరిస్తున్నాయని విమర్శించారు. -
పొన్నాలకే జనగామ
సాక్షి, జనగామ: కూటమిలోని పొత్తులు..సీట్ల పంపకాల్లో భాగంగా జనగామ స్థానంపై రాజ కీయంగా వారం రోజులుగా నెలకొన్న ఉత్కం ఠకు తెరపడింది. కాంగ్రెస్, తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీల మధ్య కుదిరిన అవగాహనతో పొన్నాల లక్ష్మయ్యకు లైన్క్లియర్ అయింది. ఏఐసీసీ శనివారం ప్రకటించిన మూడోజాబితాలో పొన్నాల లక్ష్మయ్యకు చోటు కల్పించింది. దీంతో జనగామ సీటుపై నెలకొన్న సందిగ్దత తొలగిపోయింది. పొన్నాలకు టికెట్ ఖరారుకావడంతో కాంగ్రెస్ శిబిరంలో ఆనందం నెలకొంది. నామినేషన్ దాఖలు చేయడానికి పొన్నాల సిద్ధమవుతున్నారు. ఎట్టకేలకు.. మహాకూటమి పొత్తుల్లో భాగంగా జనగామ స్థానం కోసం టీజేఎస్ పట్టుపట్టింది. తమకే కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టం చేసింది. 12 స్థానాల్లో పోటీచేస్తామని టీజేఎస్ ప్రకటించింది. జనగామ నుంచే కోదండరామ్ పోటీచేస్తారని ప్రకటన చేయడంతోపాటు ఏకంగా ప్రచార రథాలను సిద్ధంచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండు జాబితాల్లో పొన్నాల లక్ష్మయ్యకు చోటుదక్కలేదు. ఢిల్లీకి వెళ్లిన పొన్నాల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీతో సమావేశం అయ్యారు. కోదండరాం ఒప్పుకుంటే తమకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన పొన్నాల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి స్వయంగా కోదండరాంను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. పోటీపై కోదండరాం వెనక్కితగ్గారు. దీంతో పొన్నాల పోటీకి లైన్క్లియర్ అయింది. శనివారం ఏఐసీసీ 13 మంది అభ్యర్థులతో ప్రకటించిన జాబితాతో జనగామ స్థానాన్ని పొన్నాలకు కేటాయించారు. పోటీనుంచి తప్పుకున్న కోదండరాం.. జనగామ బరి నుంచి టీజేఎస్ అధినేత కోదండరాం పోటీ నుంచి తప్పుకున్నారు. కూటమిలో సీ ట్ల సర్దుబాటు కారణంగా జనగామ నుంచి సీని యర్ కాంగ్రెస్ నేత పొన్నాలకు అవకాశం కల్పిం చడం కోసం ఆయన పోటీ నుంచి విరమించుకున్నారు. కోదండరాం పోటీ చేయడానికి ఆసక్తి ఉ న్న మంచిర్యాల, మేడ్చల్, జనగామ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో కోదండరాం పోటీ చేయనట్లు తెలుస్తోంది. నేటి నుంచి 64వ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ క్రీడలు పర్వతగిరి: ఆదివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్ జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి 64వ ఎస్జీఎఫ్ క్రీడలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె.సతీష్ తెలిపారు. అండర్–19 క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్, వూ– షూ క్రీడలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మామునూర్ ఏసీపీ ప్రతాప్కుమార్, ఆర్డీఎఫ్ పాఠశాలల చైర్మెన్ ఎర్రబెల్లి రామ్మోహన్రావు పాల్గొంటారని తెలిపారు. -
పొన్నాల ప్రయత్నాలు ఫలించేనా?
సాక్షి, న్యూఢిల్లీ: జనగామ అసెంబ్లీ సీటు విషయంలో హైడ్రామా నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య జనగామ సీటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాల్లో జనగామ సీటు విషయం తేల్చకపోవడంతో.. ఈ సీటును కోదండరామ్కు కేటాయించారని ప్రచారం సాగింది. దీంతో పొన్నాల రాహుల్గాంధీ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. జనగామ సీటుపై రాహుల్ పొన్నాలకు హామీ ఇచ్చారనీ.. కోదండరామ్ వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనగామపై స్పష్టత లేదు.. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మీడియాతో శుక్రవారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ‘జనగామ సీటు విషయంలో జరుగుతున్న పరిణామాలు సంతృప్తికరంగా లేవు. కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఎటూ తేల్చలేదు. సీట్ల పంపకం ఆలస్యమవడం కొంత నష్టం కలిగించేదే. ఈ రోజు సాయంత్రం టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్ రెడ్డి, ఆర్సీ కుంతియా, పొన్నాలతో భేటీ అవుతాను’ అని తెలిపారు. ఏదేమైనా ప్రజాకూటమిగా ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతామని కోదండరామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. టీజేఎస్ అభ్యర్థులకు రేపు బీ-ఫామ్లు ఇస్తామని తెలిపారు. టీజేఎస్ 8 సీట్లలో 6 సీట్లపై స్పష్టత వచ్చిందనీ, ఈ సాయంత్రం అభ్యర్థుల్ని ప్రకటిస్తామని తెలిపారు. చాడ వెంకట్రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని కోదండరామ్ తెలిపారు. టీజేఎస్ బలంగా ఉన్న నియోజక వర్గాల్లో ఇద్దరం కలిసి ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఒకటి, రెండు చోట్ల స్నేహపూర్వక పోటీ ఉంటుందని అన్నారు. ప్రచారం అనుకున్నంత వేగంగా సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. -
టికెట్ కోసం పొన్నాల ప్రయాస
సాక్షి, హైదరాబాద్: తన చేతుల మీదుగా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య.. ఇప్పుడు తన బీఫారం కోసం ప్రయాస పడాల్సి వస్తోంది. పొత్తుల్లో భాగంగా జనగామ స్థానాన్ని తెలంగాణ జనసమితి (టీజేఎస్)కి కేటాయించడం, అక్కడి నుంచి పోటీకి ఆ పార్టీ అధినేత కోదండరామ్ సిద్ధమవుతుండడంతో హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన పొన్నాల.. రెండోరోజు కూడా తన వంతు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి పార్టీకి తాను చేసిన సేవలను వివరించి, టికెట్ ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై తాను మాట్లాడతానని ఆయన పొన్నాలకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. అనంతరం ఢిల్లీ రావాలంటూ టీజేఎస్ అధినేత కోదండరామ్కు పిలుపు వచ్చింది. అయితే, కోదండరామ్ ఢిల్లీ వెళ్లి రాహుల్తో భేటీ అవుతారా... జనగామ విషయంలో ఏం జరుగుతుంది అనేది మాత్రం సస్పెన్స్గా మారింది. కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించిన రెండో జాబితాలోనూ పేరు లేకపోవడంతో పొన్నాలకు టికెట్ రావడం అనుమానమే అనే ప్రచారం జరుగుతోంది. అయితే, మూడో జాబితాలో కచ్చితంగా పొన్నాలకు జనగామ సీటు కేటాయిస్తారని ఆయన సన్నిహితులంటున్నారు. సికింద్రాబాద్ తెర పైకి జ్ఞానేశ్వర్ పేరు... పొత్తుల్లో భాగంగా సికింద్రాబాద్ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ స్థానాన్ని తీసుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేకపోవడంతో అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీనే బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ టికెట్ ఆశిస్తున్నవారిలో హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి, ఆదం సంతోశ్కుమార్, పల్లె లక్ష్మణ్రావు ఉన్నారు. వీరికి తోడు కొత్తగా రంగారెడ్డి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేరు వినిపిస్తోంది. అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి రావడం పార్టీలో అనేక చర్చలకు దారితీస్తోంది. -
పొన్నాలకు రాహుల్ భరోసా..!!
సాక్షి, హైదరాబాద్ : పొన్నాల లక్ష్మయ్య.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నేత. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థుల రేసులో ఉన్న నాయకుడు. కానీ, ఆయనకే టికెట్ దొరకని కష్టకాలం వచ్చింది. జనగాం టికెట్ ఆశించిన పొన్నాలకు భంగపాటు తప్పలేదు. కాంగ్రెస్ ప్రకటించిన రెండు జాబితాల్లోనూ ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఖంగుతిన్న పొన్నాల అధిష్టానం ఎదుట తన గోడు వెళ్లబోసుకోవడానికి ఢిల్లీకి పయనమయ్యారు. నేనున్నా.. పొన్నాల, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని గురువారం కలిశారు. 35 ఏళ్లుగా జనగామకు ప్రాతినిథ్యం వహిస్తున్నాననీ, ఎమ్మెల్యే టికెట్ తిరిగి ఇవ్వాలని పొన్నాల రాహుల్ను కోరినట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ మరో నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా రాహుల్తో మాట్లాడారు. పొత్తుల వల్ల రాజకీయంగా తన గొంతు కోశారని పొంగులేటి రాహుల్ వద్ద ఆవేద వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే, సీట్ల విషయంలో ఈ ఇద్దరు నేతలకు రాహుల్ భరోసా ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలాఉండగా.. కాంగ్రెస్ ప్రకటించే మూడో జాబితాలో తమ పేర్లుంటాయని పొన్నాల, పొంగులేటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
టీజేఎస్కి నా సీటే కావాలా?
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ రెండో జాబితాలోనూ తన పేరును ప్రకటించకపోవడం పట్ల మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తుల వల్లే సీటు ప్రకటన ఆసల్యం అవుతుందని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులు తేలినా, తేలకపోయినా తాను మాత్రం జనగామ నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. టీజేఎస్ పార్టీ జనగామ టికెట్ను ఎందుకు కోరుతుందో అర్ధం కావడం లేదన్నారు. కోదండరాం పోటీ చేయడానికి జనగామ ఒక్కటే ఉందా అని ప్రశ్నించారు. టీజేఎస్కు రాష్ట్రంలో 119 సీట్లు ఖాళీగా ఉండగా తాను పోటీ చేసే నియోజకవర్గం ఒక్కటే కావాల్సి వచ్చిందా అని విమర్శించారు. పొత్తులు త్వరగా తేలిస్తే కాంగ్రెస్ పార్టీకే శ్రేయస్కరం అని పొన్నాల అభిప్రాయ పడ్డారు. కాగా మంగళవారం టీజేఎస్ చీఫ్ కోదండరాం మాట్లాడుతూ.. జనగామ నుంచి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. బీసీ సీటు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయనే భావనతో జనగామ పోటీ నుంచి కోదండరాం తప్పుకుంటున్నాని కోదండరాం తెలిపారు. అయినప్పటికీ బుధవారం కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడం గమనార్హం. -
సొంతపార్టీలోనే శ్రవణ్పై తిరుగుబాటు
సాక్షి, హైదారాబాద్ : కాంగ్రెస్లో అసమ్మతి మంటలు ఇంకా చల్లారడం లేదు. మొదటి జాబితాలో పేరు లేని వాళ్లు రెండో జాబితాకోసం ఎదురు చూశారు. బుధవారం ప్రకటించిన రెండో జాబితాలోనూ తమ పేర్లు లేకపోవడంతో టికెట్పై ఆశ పెట్టుకున్న నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి కాదని టికెట్ దక్కలేదని పలువురు నేతలు ఆందోళనకు దిగారు. తమ నేతకు టికెట్ ఇవ్వకుండా మరో నేతకు ఇచ్చారని కొన్ని చోట్ల పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఖైరతాబాద్ టికెట్ను దాసోజు శ్రవణ్కు కేటాయించడం పట్ల స్థానిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్కు దానం నాగేందర్ రాజీనామా చేసిన తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గ వ్యవహారాలు చూస్తున్న రోహిణ్ రెడ్డిని కాదని దాసోజ్ శ్రవణ్కు ఇవ్వడమేంటని మండిపడుతున్నారు. ముషిరాబాద్లో తనకు ఓటేయండని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న శ్రవణ్కు ఖైరతాబాద్ ఎలా ఇస్తారని రోహిణ్ రెడ్డి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ఖైరతాబాద్ టికెట్ కాంగ్రెస్కు ఇవ్వడం పట్ల టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ టికెట్ను తెలుగుదేశం పార్టీకే కేటాయించాలంటూ ఎన్టీఆర్ భవన్ ముందు ఆందోళనకు దిగారు. ఖైరతాబాద్ టికెట్ టీడీపీకి కేటాయించాలంటూ ఓ కార్యకర్త కరెంట్ పోల్ ఎక్కి నిరసన తెలిపారు. రెండో జాబితాలోనూ పొన్నాల లక్ష్మయ్య చోటు లభించకపోవడంతో ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు జనగామలో ఆందోళనకు దిగారు. టికెట్ ఇవ్వకుండా బీసీ నేతను అవమానిస్తారా అంటూ పొన్నాల అనుచరులు మండిపడుతున్నారు. పొన్నాలకు టికెట్ ప్రకటించనందుకు నిరసనగా జనగామలోని 14మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు తమ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ న్యాయకత్వంపై రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెమ్మెల్యే టికెట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. టికెట్లను అమ్ముకుంటూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గొల్ల కురుమ సామాజిక వర్గానికి చెందిన తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తనకు అన్యాయం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొల్ల,కురుమలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తారని హెచ్చరించారు. -
పోటీ నుంచి తప్పుకుంటున్నా : కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. దీంతో అక్కడ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్న పీసీపీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు లైన్క్లియర్ అయినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కోదండరాం జనగామ నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ కూడా తన తొలి జాబితాలో జనగామ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో అక్కడ నుంచి కోదండరాం బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా తాను జనగామ పోటీ నుంచి తప్పుకుంటున్నాని కోదండరాం పేర్కొన్నారు. బీసీ సీటు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయనే భావనతో జనగామ పోటీ నుంచి కోదండరాం తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్న పీసీపీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు లైన్క్లియర్ అయింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గ సీటును తనకే కేటాయించాలని పొన్నాల మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. కోదండరాం తప్పుకోవడంతో కాంగ్రెస్ జనగామ టికెట్ను పొన్నాలకు కేటాయించే అవకాశం ఉంది. కాగా కోదండరాం ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి తరపున ప్రచారం చేస్తారని తెలుస్తోంది. కానీ ఈ విషయంపై కోదండ రాం ఎలాంటి ప్రకటన చేయలేదు. తన పోటీపై ఇప్పుడేమి మాట్లాడని కోదండరాం మంగళవారం మీడియాతో చెప్పారు. ఎక్కడ నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. టీజేఎస్ కు మొత్తం 11 సీట్లు ఖరారయ్యాయని కోదండరాం పేర్కొన్నారు. మల్కాజ్గిరి, మెదక్, దుబ్బాక, సిద్ధిపేట, వర్ధన్నపేట, అంబర్పేట సీట్లను టీజేఎస్కు కేటాయించారన్నారు. మరో ఐదు సీట్ల విషయంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. టీజేఎస్ సీట్లను బుధవారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. -
టికెట్ల లొల్లి.. కాంగ్రెస్కు మరో షాక్
నెలన్నరపాటు ఊరిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఎట్టకేలకు 65 మందితో కూడిన తొలి జాబితానైతే సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది కానీ ఈ జాబితానే కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెడుతోంది. టికెట్పై ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ నేతలు ఈ జాబితాతో నిట్టూర్చారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వాలేదని పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నేతలు ఆందోళనకు దిగగా మరి కొంత మంది రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గత 46 ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తూ వస్తున్న తనను కాదని ఇటీవల పార్టీలో చేరిన రోహిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా నిన్న మొన్న వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. పెరుగుతున్న నిరసనలు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో టికెట్లపై ఆశ పెట్టుకున్న నేతలు, వారి మద్దతుతారులు నిరసనలకు దిగారు. పలు నియోజకవర్గాల్లో పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కొత్తగూడెం స్థానాన్ని వనమా వెంకటేశ్వర్రావుకు కేటాయించడంతో ఆ టికెట్పై ఆశలు పెట్టుకున్న ఎడవల్లి కృష్ణ ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఎడవల్లి కృష్ణ వర్గీయులు ఆందోళన చేపట్టారు. పాల్యంచలోని అంబేద్కర్సెంటర్లో ఉత్తమ్కుమార్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. భద్రాచలం అసెంబ్లీ సీటును స్థానికేతరుడైన పోడెం వీరయ్యకు కేటాయించడం పట్ల వెంకటాపురం మండల కాంగ్రెస్ కమిటీ నిరసన తెలిపింది. భద్రాచలం సీటును స్థానికులకే కేటాయించాలని డిమాండ్ చేసింది. జయశంకర్ భూపాలపల్లిని స్థానికులకే కేటాయించాలని కోరుతూ ఏఐసీసీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులకు స్థానిక కాంగ్రెస్ నేతలు వినతి పత్రాలు అందజేశారు. లేని పక్షంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును సర్వే సత్యనారాయణకు కేటాయించడం పట్ల స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ సీటును సర్వేకు కేటాయించడంతో టికెట్ ఆశించిన గణేష్ రెబల్గా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. సూర్యాపేట కాంగ్రెస్లో ముసలం మొదలైంది. టికెట్ దక్కకపోవడంతో పటేల్ రమేశ్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తలతో సమావేశమై స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. తొలిజాబితాలో పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు చోటు లభించకపోవడం ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తొలి జాబితాలోనే బీసీ నాయకుడిని పక్కన పెట్టడం తప్పుడు సంకేతాలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గ సీటును తనకే కేటాయించాలని డిమాండ్ చేశారు. తనకు ఎంపీ సీటు వద్దని ఎమ్మెల్యే సీటే కావాలని అదీ కూడా జనగామ నుంచే పోటీ చేస్తానని పట్టుపడుతున్నారు. జాబితాలో తన పేరు ప్రకటించనందుకు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
వరంగల్ కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి
-
కాంగ్రెస్ జాబితాపై ఆగ్రహం.. 17న రాష్ట్రబంద్
సాక్షి, హైదరాబాద్ : మహా కూటమిలో టికెట్ కేటాయింపులపై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు తక్కువ స్థానాలు కేటాయించడంపై ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు మండిపడుతున్నారు. బీసీలకు అన్నింటా అన్యాయం జరుగుతోందని ఆగ్రహోదగ్రులవుతున్నారు. బీసీలకు టికెట్ల కేటాయింపులో అన్యాయం చేయడంపై నిరసనగా ఈ నెల 17న తెలంగాణ బంద్కు బీసీ నేత ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీలకు తగినమొత్తంలో సీట్లు కేటాయించి న్యాయం చేస్తామన్న కాంగ్రెస్ పార్టే అన్యాయం చేసిందని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. కాంగ్రెస్లోనూ బీసీ సెగలు! 65మంది అభ్యర్థులతో తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో కేవలం 13మంది బీసీ నేతలకు మాత్రమే టికెట్లు కేటాయించింది. దీంతో ఆ పార్టీలోని బీసీ నేతలు తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సహా చాలామంది బీసీ నేతలకు పార్టీ మొండిచేయి చూపడంపై అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. తనకు టికెట్ దక్కకపోవడంతో పొన్నాల హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మహూకూటమి పొత్తుల్లో భాగంగా జనగాం సీటును టీజేఎస్కు ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆ స్థానాన్ని ప్రస్తుతం పెండింగ్లో ఉంచారు. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ సాధించాలనే పట్టుదలతో పొన్నాల ఢిల్లీ వెళ్లారని ఆయన అనుచరులు చెప్తున్నారు. శేరిలింగంపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. టిక్కెట్ రాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణపై ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. ఇండింపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని భిక్షపతి యాదవ్ భావిస్తున్నారు. -
భూ కబ్జా రుజువు చేస్తే ఉరి వేసుకుంటా: పొన్నాల
జనగామ: భూ కబ్జాలకు పాల్పడినట్లు తనపై తప్పుడు కేసు బనాయించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ కేసును రుజువు చేస్తే అసెంబ్లీ ముందు ఉరి వేసుకుంటానని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామలో ఆదివారం జరిగిన సభలో పొన్నాల మాట్లాడుతూ, తనపై తప్పుడు కేసు బనాయించడమే కాకుండా, అసెంబ్లీలో రెండున్నర గంటలపాటు తనపై చర్చించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్చ కు రాకుండా.. ఎందుకు వెనకేసుకు వస్తున్నారని కేసీఆర్ను ప్రశ్నించారు. -
పేర్వారం రాములుకు మాతృవియోగం
రఘునాథపల్లి : ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ, రాష్ట్ర టూరిజం అభివృద్ధి శాఖ మాజీ చైర్మన్ పేర్వారం రాములుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి పేర్వారం వీరమ్మ (94) అనారోగ్యంతో ఆదివారం రాత్రి మం డలంలోని ఖిలాషాపూర్లో తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మె ల్యే నాగపూరి రాజలింగం, జనగామ మునిసిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, కొమురవెల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ సేవెల్లి సంపత్లు సోమవారం మృతదేహంపై పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు రాములును పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోకల శివకుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు మారుజోడు రాంబాబు, సర్పంచ్ దొంగ అంజిరెడ్డి, మండల పరిషత్ కోఅçప్షన్ సభ్యుడు మహమూద్, నాయకులు గొరిగ రవి, మడ్లపల్లి సునీత, కోళ్ల రవిగౌడ్, బక్క నాగరాజు, ఉడుత రవి, దూడల యాదగిరి, లోనె శ్రవణ్కుమార్, దొంగ మహిపాల్రెడ్డి, కావటి రాజయ్య, అల్లిబిల్లి నర్సయ్య, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. అంతియయాత్రలో పాల్గొన్న పొన్నాల రఘునాథపల్లి: ఖిలాషాపూర్లో సోమవారం నిర్వహించిన మాజీ డీజీపీ పేర్వారం రాములు తల్లి వీరమ్మ (94) అంతిమ యాత్రలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. తన సొంత గ్రామమైన ఖిలాషాపూర్లో ఆమెతో చిన్ననాటి నుంచి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరమ్మ కుమారుడు రాములుతో ఎంత సఖ్యత ఉండేదో లక్ష్మయ్యతో అంతే అభిమానంగా ఉండేది. ఉన్నత విద్యాభ్యాసం చేసినా, వృత్తి పరంగా పేర్వారం, రాజకీయంగా పొన్నాల ఏ స్థాయికి ఎదిగినా ఎప్పటిలాగే కలిసి ఉండేవారు. ఈ సందర్భంగా అంతిమ యాత్రలో పొన్నాల కొద్ది సేపు పాడె మోశారు. -
సీఎం అబద్ధాల కోరు: పొన్నాల
సాక్షి, న్యూఢిల్లీ: యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి (యాక్సిడెంటల్ సీఎం) అయిన కేసీఆర్ ఒక అబద్ధాల కోరు అని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాయమాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నారని, మోసపూరిత విధానాలతో వచ్చే ఎన్నికల్లోనూ ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్లోని అంతర్గత రాజకీయాలను అధిగమించేందుకు ఫ్రంట్ పేరుతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఫ్రంట్ ప్రతిపాదనను డీఎంకే నేత స్టాలిన్ ఆదిలోనే తిప్పికొట్టారని, కాంగ్రెస్యేతర ప్రత్యామ్నాయంతో దేశా నికి ఉపయోగం లేదని స్టాలిన్ సహా మమతా బెనర్జీ కూడా తేల్చి చెప్పారన్నారు. కేసీఆర్ బీజేపీకి, ప్రధాని మోదీకి కోవర్టుగా మారి కాంగ్రెస్ను ఓడించేందుకు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. నవీన్ పట్నాయక్, సీతారాం ఏచూరి లాం టి నేతలు ఇప్పటికే కేసీఆర్ ఫ్రంట్ ప్రతిపాదనను తిప్పికొట్టారని గుర్తుచేశారు. తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న కేసీఆర్.. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తేనే కేసీఆర్ సీఎం అయ్యారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. -
నియంతగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికలలో కేవలం 34 శాతం ప్రజల మద్దతుతో అందలం ఎక్కి, అధికారంలోకి వచ్చాక తన స్వలాభం కోసం పాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నియంతలా చరిత్రలో నిలిచిపోతారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలను అవమానపర్చేలా ప్రధాని మోడీ మాట్లాడుతుంటే తెలంగాణ ఉద్యమకారుడినని చెప్పుకునే కేసీఆర్ కనీసం నోరు మెదపకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. సోమవారం గాంధీభవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పొన్నాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని బలంగా కాంక్షించిన ప్రజలు టీఆర్ఎస్ పాలనలో మోసానికి, దగాకు గురయ్యామని అభిప్రాయపడుతున్నారని అన్నారు. మిగులు సంపన్న రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించకుండా తాను మాత్రం జమీందారీ, దొర తరహాలో కోట్ల రూపాయలతో బంగ్లా కట్టుకుని ఉంటున్నారని అన్నారు. అప్పులు చేయడంలో, రైతుల ఆత్మహత్యల్లో, రాజకీయ ఫిరాయింపుల్లో, కుటుంబ పాలనలో, న్యాయస్థానాల చేత మొట్టికాయలు తినడంలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్1 చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు శిక్ష వేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వేలకోట్ల రూపాయల అవినీతిపై చర్చకు ప్రభుత్వం సిద్ధం కావాలని పొన్నాల డిమాండ్ చేశారు. -
ప్రశ్నిస్తే భయమెందుకు: డీకే అరుణ
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నిజంగానే బాగుంటే, ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తున్న ట్లయితే ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇంటికో ఉద్యోగమని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందన్నారు. ఉద్యోగాలపై ఎవరైనా ప్రశ్నిస్తుంటే వారిని జైల్లో పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన విషయంలో కేసీఆర్, కేటీఆర్లు చెబుతున్నవన్నీ అబద్ధాలేనన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన: పొన్నాల సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రజాస్వామ్యం ముసుగులో ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నారని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ విఫలమవ్వడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఓయూలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఘటనా స్థలానికి వెళ్లిన నేతలను అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించడం కేసీఆర్ నియంతృత్వానికి నిదర్శనమన్నారు. ప్రజలకు స్వేచ్ఛలేదు: మల్లు రవి సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారని, ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తుంటే జైల్లో పెట్టిస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఆత్మగౌరవం కోసం సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ధర్నాలు చేసుకునేందుకు కోర్టుల నుంచి అనుమతులు పొందాల్సిన దుస్థితి నెలకొందని, కోర్టులు అనుమతించినా ప్రభుత్వం పోలీసులతో అణచివేస్తోందని, కేసీఆర్ పాలన ఎంతో కాలం సాగదని హెచ్చరించారు. -
అనుమానంతోనే ఆ కేసులు..!
కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య (మనసులో మాట) అక్రమాస్తులు తదితర అంశాలపై సీబీఐ పెట్టిన కేసులు ఏవీ నిలబడవని మాజీమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అంటున్నారు. కేవలం అనుమానాలు ఆధారంగా మాపై ఆరోపణలు చేశారని, వైఎస్ జగన్తోపాటు కొందరిపై కేసులు కూడా పెట్టించారనీ, కానీ అవేవీ నిలవవని చెప్పారు. క్యాంప్ ఆఫీసులో వైఎస్సార్ని కలిసిన సందర్భంలో రెండుసార్లు జగన్ తారసపడ్డారు తప్పితే ఏదైనా పని విషయంలో కూడా ఆయన నాకు ఎన్నడూ ఫోన్ చేయలేదం టున్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఫోన్ చేయడమూ తప్పే, కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడమూ తప్పే.. అన్నారు. వైఎస్ మరణానికి ముందు, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఘటనలపై పొన్నాల అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. జీవితంలో బాగా సంతోషం కలిగించిన సందర్భం? ఒక లక్ష్యంతో నేను అమెరికాలో ఉద్యోగం మాని దేశానికి తిరిగి వచ్చాను. గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగులకు, నైపుణ్యం లేని వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తే బాగుం టుంది అని ఉండేది. ముఖ్యంగా ఫౌల్ట్రీ రంగంలో అవకాశాల కల్పన. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో ఫౌల్ట్రీ ప్రారంభించాం. ఆరోజుల్లో దేశంలో అయిదారు లక్షల మంది ఈ రంగంలో పనిచేసేవారు. మావంటి వారి కృషి వల్లే ఈ రోజు దేశంలో పది కోట్లమంది ప్రజలు పౌల్ట్రీ రంగంలో అవకాశాలు పొందుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డితో మీ అనుబంధం గురించి చెబుతారా? 1978లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లో హోమంత్రిగా ఉన్న ప్రభాకరరెడ్డి ద్వారా వైఎస్తో పరిచయం కలిగింది. మా మామగారితో తనకున్న పరిచయం వల్ల ఆయన నన్నూ దగ్గరకు తీసుకున్నారు. తర్వాత వైఎస్సార్ మంత్రి అయ్యారు. 1985లో పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా నాకు ఎమ్మెల్యే సీటు ఇప్పించారు. అప్పుడే శ్రీశైలం ఘటన జరిగింది. శ్రీశైలం ఘటన అంటే? 1985లో అనుకుంటాను. వైఎస్ తన కుటుంబంతోపాటు శ్రీశైలం వెళుతూ మమ్మల్ని ఆహ్వానించారు. ఫ్యామిలీస్తో వెళ్లాం. దర్శనం చేసు కున్నాక, లుంగీ, పైన బనియన్ కట్టుకుని ఉన్న ఒక వ్యక్తి మావద్దకు వచ్చి వైఎస్ కాళ్లకు దండం పెట్టాడు. మీరెప్పటికైనా ముఖ్యమంత్రి కావాలి సర్ అని వైఎస్ని ఉద్దేశించి చెప్పాడు. వైఎస్ నవ్వి ముందుకు నడుస్తూ, ‘‘అలాంటి అవకాశం మనకు వస్తే ఈ రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఏర్పాట్లు చేయగలుగు తామా’’ అన్నారు. సీఎం కాగానే సాగునీరు కల్పించాలి అని అంటున్నారంటే రాయల సీమలో నీటి కష్టం ఆయనపై ఎక్కువ ప్రభావం వేసిందనుకున్నాను. దాదాపు 20 ఏళ్ల తర్వాత 2004లో సీఎం కాగానే జలయజ్ఞం, 86 ప్రాజెక్టులు, శాశ్వత ప్రాతిపదికన గోదావరి–కృష్ణ జలాలను వాడుకునేటటువంటి మహోన్నత యజ్ఞం ప్రారంభించారు. ప్రపంచంలోనే విశిష్టమైన ఆ ఘటనలో అవకాశం దక్కడం నా అదృష్టం. జలయజ్ఞం నేపథ్యం ఏమిటి? జలయజ్ఞం అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? కర్నూలులో జరిగిన ఒక మీటింగులో వైఎస్ నన్ను మాట్లాడమన్నారు. అప్పుడు నేను సాగునీటి కల్పన గురించి మాట్లాడాను. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మనం ఇంత గొప్ప ప్రాజెక్టును చేపడుతున్నాము. భావితరాల కోసం, రైతాంగాన్ని ఆదుకోవడం కోసం శాశ్వత ప్రాతిపదికన దీన్ని తీసుకువస్తున్నాం. వ్యవసాయ అభివృద్ధి కోసం దీన్ని ఒక యజ్ఞంలా చేయాలి చేద్దాం అని మాట్లాడాను. వెంటనే వైఎస్ తన స్పీచ్ మొదలెట్టి ఇది జలయజ్ఞం అని పేరుపెట్టేశారు. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. నెహ్రూ అప్పట్లో ఈ ప్రాజెక్టును ఆధునిక దేవాలయమని పిలిచారు. కాని 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇదే ప్రాజెక్టు తరగని బంగారు గనిలా మారింది. ఎందుకంటే ఒక కారుకు 9 వేల కోట్ల రూపాయల పంటను అందిస్తోంది. అంటే సమాజానికి, దేశానికి, ప్రాంతానికి ఎంత సంపదను ఇది సృష్టించి ఇస్తోందో చూసినట్లయితే ఇది ఆధునిక దేవాలయంతోపాటు తరగని బంగారు గనిలా తయా రైంది. మామూలు బంగారు గని అయితే బంగారు తోడేశాక కొంతకాలానికి వట్టిపో తుంది. కాని ఇది తరగని గనిలాగా ప్రతి ఏటా, ప్రతి కారుకూ వేల కోట్ల సంపద నిస్తోంది. కాబట్టే ఇది తరగని బంగారు గని అని వైఎస్ చెప్పారు. 145 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినా అధిష్టానం జగన్కి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? అధిష్టానానికి మా అభిప్రాయాలు చెబుతూనే చివరి నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఇవ్వడం రివాజు. జగన్కి మద్దతు తెలిపాం. సంతకాలు పెట్టాం. కానీ అధిష్టానం ఎందుకో మరోలా ఆలోచించింది. ఆ విషయం తెలిసినప్పుడు బాధపడ్డాం. జగన్నే సీఎంగా చేసి ఉంటే చరిత్ర మరోలా ఉండేది కదా? అవకాశాలు కల్పించి ఉంటే ఆయనకు ఇక ఆకాశమే హద్దు కదా. కేసీఆర్ దీక్ష బూటకం అని చాలామంది అంటున్నారే? ఆ దీక్ష బూటకం అని నేనే చెప్పాను. 750 కేలరీల ద్రవాహారాన్ని తీసుకుని దీక్షలో ఉన్నాడాయన. లక్ష్యసాధన కోసం కేసీఆర్ ఏం చేసినా మేం కాదనలేదు. నాకు తెలిసి ప్రాణానికి ఏమాత్రం ముప్పులేని దీక్షనే కేసీఆర్ చేశారు. కానీ ఆయన ప్రాణానికి ముప్పు వస్తుందేమో అని చిదంబరం తదితరులు అనుకున్నారు. ఆయన ద్రవాహారం తీసుకున్నా రన్నది నిజం. కానీ ఆ దీక్ష ఉద్యమానికి తోడ్పడింది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే జగన్పై ఏ కేసులూ ఉండేవి కాదు కదా? మంత్రులుగా మామీద కూడా కేసులు పెట్టారు కదా మరి. పైగా పలానా డాక్యు మెంట్లో పలానా తప్పు ఉంది ఇదెలా వచ్చింది అంటూ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్షీ్మ నారాయణే మమ్మల్ని పిలిపించి వివరణలను అడిగారు. మేం చెప్పాం. వాళ్లు అనుమా నాలు వ్యక్తం చేస్తే, వాస్తవాలు చెప్పాం. సీబీఐ పెట్టిన కేసులపై మీ అభిప్రాయం? అవి నిలబడవు. నాపై చార్జిషీట్ పెట్టలేదు. అనుమానాలు ఆధారంగా మాపై ఆరోపిం చారు. అందుకే మా కేసులు నిలవవు అని అప్పుడే తెలుసు. ఇక జగన్పై కూడా ఇలాగే కేసులు పెట్టి ఉంటారనుకుంటున్నాను. కోర్టులోనే అవి తేలాలి. మిమ్మల్ని కలవడానికి జగన్ ఎప్పుడైనా సచివాలయానికి వచ్చారా? ఆయనతో మాట్లాడటమే రెండు మూడు సందర్భాల్లో జరిగింది. అది కూడా సెక్రటే రియట్లో కాదు. క్యాంప్ ఆఫీసులో ముఖ్య మంత్రిని కలిసిన సందర్భంలో రెండుసార్లు జగన్ తారసపడ్డారు. ఏదైనా పని విష యంలో కూడా ఆయన నాకు ఎన్నడూ ఫోన్ చేయలేదు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఫిరాయింపులపై మీరేమంటారు? ఫిరాయింపులు జరగకూడదు. ఎవరు చేసినా, ఎవరు చేయించినా తప్పు తప్పే..! ఓటుకు కోట్లు కేసుపై మీ అభిప్రాయం? ఫోన్ చేసిన వారిదీ తప్పు. ఫోన్ ట్యాపింగ్ చేయించినవారిదీ తప్పు. ఇప్పుడు ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ అవసరాలకు చేసే పనులు, కక్షపూరితంగా చేసే పనులు అన్నిపార్టీల్లో ఉన్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీనే ఎందుకు వేలెత్తి చూపుతారు? అయితే ఇలాంటి పనులు మంచివి కాదనే నా అభిప్రాయం. (పొన్నాల లక్ష్మయ్యతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రజల ఒత్తిడితోనే జనగామ జిల్లా ఏర్పాటు
అధికారికంగా ప్రకటించే వరకు అప్రమత్తంగా ఉండాలి పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కోర్టు నుంచి చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ జనగామ : ప్రజాస్వామ్య దేశంలో ఒత్తిడి ఓ ఆయుధమని, ప్రజలు పాలకులపై తిరగబడితే తప్ప పనులు కావని జనగామ జిల్లా ఏర్పాటుతో తేలిపోయిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య అన్నారు. జిల్లా సాధన కోసం జరిగిన ఉద్యమంలో జాతీయ రహదారులను దిగ్బంధించిన ఘటనలో పొన్నాలతో పాటు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగం గా బుధవారం పొన్నాల లక్ష్మయ్య జనగామ కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత జనగామ జిల్లాకు ప్రభుత్వం నుంచి వచ్చిన సానుకూల ప్రకటనతో ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాబూజగ్జీవ¯ŒSరామ్, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం పొన్నాల మాట్లాడుతూ.. ఎవరి దయాదాక్షిణ్యాలతో కాకుండా..పాలకుర్తి సోమన్న, జీడికల్ సీతారాములు, కొమురవెల్లి మల్లన్న, కొడవటూరు సిద్ధేశ్వరుడు, బెక్కల్ రామలింగేశ్వరస్వామి కరుణతో జనగామ జిల్లా ఏర్పడిందన్నారు. జనగామ జిల్లా కోసం సాగిన ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర కీలక భూమిక పోషించిందన్నారు. ఐదు మండలాల్లో ప్రత్యేక కార్యాచరణతో ఇక్కడి ప్రజల ఆకాంక్షను బలంగా వినిపించామని పేర్కొన్నా రు. గత ఐదు నెలల నుంచి సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా స్పందిం చడంలేదని, ప్రజాస్వామ్య దేశంలో ఇతంటి దారుణ పరిస్థితి మరెక్కడా ఉండదని అన్నారు. పట్టణంలో 85 రోజుల పాటు 144 సెక్ష¯ŒS అమ లు చేసి సాగించిన నిర్భంధకాండను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. కరువు ప్రాంతమైన జనగామను సస్యశ్యామలం చేసేందుకు మద్దూరు, నర్మెట, చేర్యాల రిజర్వాయర్లను నిర్మిస్తే వాటిని సిద్దిపేటకు తరలించ డం బాధాకరమన్నారు. జిల్లాల పేరుతో జనగామను మూడు ముక్కలు చేస్తున్నారని మం డిపడ్డారు. జిల్లాపై అధికారిక ప్రకటన వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించా రు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మ¯ŒS జంగా రాఘవరె డ్డి, మున్సిపల్ మాజీ చైర్మ¯ŒS వెన్నెం వెంకటనర్సింమారెడ్డి, నాయకులు చెంచారపు శ్రీనివాస్రెడ్డి, బుచ్చిరెడ్డి, అన్వర్, చిర్ర సత్యనారాయణరెడ్డి, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సు« దాకర్, బనుక శివరాజ్ యాదవ్, కొత్త కరుణాకర్రెడ్డి, రాందయాకర్, మదార్ షరీఫ్, జమా ల్ షరీఫ్, రంగ రాజు ప్రవీణ్, మేకల రాంప్రసాద్, పన్నీరు రాధిక, వెన్నం శ్రీలత, వంగాళ కళ్యాణి మల్లారెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, జెడ్పీటీసీ నాచగోని పద్మ తదితరులు పాల్గొన్నారు. -
'ఇచ్చిన మాట నిలబెట్టుకో కేసీఆర్'
హైదరాబాద్: జిల్లా కేంద్రంగా చేస్తానంటూ జనగామ ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోవాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. జనగామను జిల్లాగా చేస్తానని గత ఎన్నికల సందర్భంగా హామీని ఇచ్చిన కేసీఆర్ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నాడని ప్రశ్నించారు. జిల్లా కోసం ప్రజలు, అన్ని పార్టీల నేతలు రాజకీయాలకు అతీతంగా పోరాడుతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. జనగామకు సాంకేతికంగా, శాస్త్రీయంగా, పరిపాలనాపరంగా, భౌగోళికంగా, వనరులు, విస్తీర్ణం వంటి వాటిలో జిల్లా అయ్యే అన్ని అర్హతలున్నాయని పొన్నాల అభిప్రాయపడ్డారు. -
జనగామలో 144 సెక్షన్ ఎత్తేయండి: పొన్నాల లక్ష్మయ్య
డీజీపీకి పొన్నాల వినతి సాక్షి, హైదరాబాద్: జనగామలో విధించిన 144 సెక్షన్ను ఎత్తివేయాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. జనగామకు చెందిన నేతలు, ప్రతినిధులతో కలసి రాష్ట్ర డీజీపీకి హైదరాబాద్లో గురువారం వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జనగామను జిల్లా కేంద్రంగా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సీఎం ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, జనగామను జిల్లా చేయాలని ప్రజలు శాంతియుతంగా, రాజ్యాం గబద్ధంగా పోరాడుతున్నారని పొన్నాల చెప్పా రు. శాంతిభద్రతల సమస్య పేరుతో జనగామ లో 2 నెలలుగా 144 సెక్షన్ విధించడంతో ప్ర జలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పా రు. ప్రజల ఇబ్బందులను నేరుగా ముఖ్యమంత్రికి చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. కనీసం అధికారులైనా ప్రజల ఇబ్బందులను గుర్తించి పరిష్కరించాలని కోరారు. -
గులాబీ గూటికి పొన్నాల?
త్వరలోనే టీఆర్ఎస్లో చేరనున్న టీపీసీసీ మాజీ చీఫ్ సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేపట్టిన ‘రాజకీయ పునరేకీకరణ’కు మరో రాష్ట్రస్థాయి నాయకుడు ఆకర్షితుడయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య త్వరలోనే ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. గతంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాలకు సన్నిహితుడైన ఓ కాంట్రాక్టు సంస్థ అధినేత ఆయనకు, టీఆర్ఎస్ నాయకత్వానికి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఆ కాంట్రాక్టర్ ఇటీవల హైదరాబాద్లోని తన ఫామ్హౌస్లో ఇచ్చిన విలాసవంతమైన విందుకు టీఆర్ఎస్ ముఖ్యులతో పాటు పొన్నాల హాజరైనట్లు సమాచారం. ఈ సందర్భంగా టీఆర్ఎస్లో చేరితే తన భవిష్యత్కు కచ్చితమైన హామీ ఇవ్వాలన్న పొన్నాల డిమాండ్ మేరకు టీఆర్ఎస్ సీనియర్ నేతలు కె.కేశవరావు, డి.శ్రీనివాస్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వచ్చే మార్చిలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని పొన్నాల కోరినట్లు సమాచారం. అయితే పార్టీలో చేరిన వెంటనే రాజ్యసభ సభ్యత్వం కట్టబెడితే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... అందుకు ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తన కోడలు వైశాలికి వరంగల్ జిల్లా నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కూడా పొన్నాల కోరినట్లు సమాచారం. ‘పొన్నాల పార్టీలో చేరుతామని మూడు నెలల కిందే వర్తమానం పంపారు. ఆయనతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. ఆయనకు పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చారు..’’ అని టీఆర్ఎస్ ముఖ్యుడొకరు చెప్పారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత పొన్నాల గులాబీ కండువా కప్పుకోన్నుట్లు తెలిసింది. వరంగల్లో టీడీపీ, కాంగ్రెస్ ఖాళీ వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఇప్పటికే టీఆర్ఎస్లో చేరిపోయారు. టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి టీఆర్ఎస్లో చేరడంతో ఆ జిల్లాలో టీడీపీకి ప్రధాన నాయకుడే లేకుండా పోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్తో పాటు అనేక మంది నేతలు టీఆర్ఎస్లో చేరారు. గత సాధారణ ఎన్నికలకు ముందే కొండా సురేఖ, ఆమె భర్త మురళి టీఆర్ఎస్లో చేరగా ఇటీవలే మాజీ మంత్రి బస్వరాజు సారయ్య గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక పొన్నాల కూడా చేరితే... వరంగల్ జిల్లాలో చెప్పుకోదగ్గ కాంగ్రెస్ నేతల్లో గండ్ర వెంకట రమణారెడ్డి ఒకరే. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, ఖమ్మం జిల్లాలో మినహా ఎక్కడా కాంగ్రెస్ కి చెప్పుకోదగ్గ నేతలే లేకపోవడం గమనార్హం. ‘ఈ పరిణామం రాష్ట్రంలో కాంగ్రెస్కి ఏ మాత్రం మింగుడుపడడం లేదు. కానీ అధిష్టానవర్గం నిద్రపోతుంటే మేం మాత్రం ఏం చేయగలం. పార్టీ నిండా మునుగుతున్నా... రాజకీయానుభవం లేని ఓ మాజీ ఐఏఎస్ అధికారి అభిప్రాయాలకే విలువ ఇస్తున్నారు. చేష్టలుడిగి చూస్తున్న పీసీసీ, సీఎల్పీ నాయకత్వాన్ని మార్చే ప్రయత్నం చేయడం లేదు...’ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. నేను పార్టీ మారడం లేదు: పొన్నాల ఇదిలా ఉండగా.. తాను పార్టీ మారడం లేదని పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. శనివారం అర్ధరాత్రి ఆయన సాక్షితో మాట్లాడుతూ.. తాను టీఆర్ఎస్ నేతలతో మాట్లాడలేదని, వారిని ఎలాంటి పదవులూ కోరలేదని వివరణ ఇచ్చారు. మరికొందరితోనూ టీఆర్ఎస్ ముఖ్యుల చర్చలు టీడీపీకి చెందిన మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీఆర్ఎస్... ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్య నేతలపై దృష్టి సారించింది. ఉత్తర తెలంగాణలో కరీంనగర్, ఖమ్మం, దక్షిణ తెలంగాణలో నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలను చేర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇద్దరు టీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే త్వరలోనే గులాబీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. -
'ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదు'
వరంగల్: ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేకపోయిందని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసి, 15నెలలుగా వారిని పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. రైతాంగం సమస్యలు తీర్చడంలో రాష్ట్రం వెనకంజలో ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పినా ప్రభుత్వానికి సోయిలేదన్నారు. కరువు మండలాలను ప్రకటించడంలో ప్రభుత్వానికి శ్రద్ధ లేదని తెలిపారు. రుణ మాఫి, కొత్త రుణాలపై స్పష్టత లేదన్నారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు స్వర్గం చూపిన టీఆర్ఎస్ ఇప్పుడు నరకం చూపిస్తుందన్నారు. ఆరవై ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటిపాలన చూడలేదని పొన్నాల ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు. ఉప ఎన్నిక ఎందుకు తెచ్చారో టీఆర్ఎస్ స్పష్టం చేయాలన్నారు. ఉప ఎన్నికతో టీఆర్ఎస్ పార్టీ ప్రజాధనం దుర్వినియోగం చేస్తుందని ఆయన అన్నారు. -
‘సమగ్ర సర్వే ఏమైంది’
సాక్షి, న్యూఢిల్లీ: సర్వ రోగ నివారణి అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే ఏమైందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సమగ్ర సర్వేకు ముందే దాదాపు 90 శాతం ఆధార్ నమోదు పూర్తయిందన్నారు. ఈ సర్వే ద్వారా నిజమైన లబ్ధిదారులు తేలుతారని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పటివరకు దళితులకు మూడెకరాల భూమి ఎందుకు పంచివ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఇద్దరు చంద్రులు గురుశిష్యులే
వరంగల్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులిద్దరూ గురుశిష్యులేనని టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హన్మకొండలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏడాది పాలనపై ప్రతిపక్షాలు, ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే.. ఒకరు ఓటుకు నోటు.. మరొకరు ఫోన్ ట్యాపింగ్ అంటూ వివాదం సృష్టించారన్నారు. తెలంగాణ బిల్లులో సెక్షన్-8 చేర్చినప్పుడు వ్యతిరేకత వ్యక్తం చేయలేదనీ, ఇపుడు ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్లను ట్యాపింగ్ చేయలేదని చెప్పే దమ్ము సీఎం కేసీఆర్కు ఉందా? అన్నారు. ఇద్దరు సీఎంలు తమ పదవులకు రాజీనామా చేసి క్షమించమని ప్రజలను కోరాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం ఈ తతంగం చేస్తున్నారని విమర్శించారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారుమయం చేసుకుంటున్నారని, ప్రజలు తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. -
'గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి'
హబ్సిగూడ (హైదరాబాద్): రానున్న గ్రేటర్ ఎన్నికలలో కలసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. ఆదివారం హబ్సీగూడాలో ఏర్పాటుచేసిన ఉప్పల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ మేరకు పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖుల్ని చేసేందుకు ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జ్లుగా వ్యవహరిస్తున్న పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి ఎమ్మెల్యే డి.కే.అరుణ, ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పూటకొక మాట మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసగిస్తున్నారని పొన్నాల విమర్శించారు. మాజీ మంత్రి డికే.ఆరుణ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని ఆయనకు ప్రజా సంక్షేమం పట్టడం లేదని ఆరోపించారు. -
'రైతుల ఆత్మహత్యలపై..నిమ్మకు నీరెత్తినట్లు టీఆర్ఎస్'
వరంగల్: తెలంగాణలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టనున్న రైతు భరోసాయాత్ర చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. ఓ పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అధికార టీఆర్ఎస్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందని ఆయన విమర్శించారు. తాము చేపట్టే రైతు భరోసాయాత్ర రాజకీయాల కోసం కాదు, రైతులలో ఆత్మస్థైర్యం నింపడం కోసమేనని పొన్నాల చెప్పారు. ఆర్టీసీ ఒప్పంద కార్మికులకు తమ పార్టీ అండగా ఉంటుందని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. -
కేసీఆర్ది తుగ్లక్ పాలన: పొన్నాల
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్గా పనిచేయడం తన అదృష్టం అని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆదివారం ఎంఎల్ఏ ఉత్తమ్ కుమార్రెడ్డి టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గాంధీభవన్లో మాట్లాడిన ఆయన ఉత్తమ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని చెప్పారు. అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేసీఆర్ ది తుగ్లక్ పాలన అని, ఆయనకు పరిపాలన అనుభవం లేదని ఎద్దేవా చేశారు. కాగా, గాంధీభవన్లో మాజీ మంత్రులు గీతారెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిని కాంగ్రెస్ నేతలు సన్మానించారు. -
టీపీసీసీపై నేడు ఉత్తర్వులు?
ఢిల్లీలోనే జానారెడ్డి, పొన్నాల సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్కు నాయకత్వ మార్పు ఖాయమైనా ఆదివారం రాత్రిదాకా ఏఐసీసీ నుంచి ఉత్తర్వులు వెలువడలేదు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీతో పాటు ఢిల్లీ, పంజాబ్ వంటి మరో ఆరు రాష్ట్రాలకు కలిపి మార్పులు చేస్తూ ఒకేసారి అధికారిక ప్రకటన వెలువడవచ్చునని సీనియర్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత కె.జానారెడ్డి వంటి నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. పొన్నాలను అందుబాటులో ఉండాలంటూ అధిష్టానం సూచించింది. సీఎల్పీ నాయకుడిగా ఉన్న కె.జానారెడ్డి కూడా అధిష్టానం సూచనల మేరకు ఢిల్లీలోనే ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షునిగా ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షునిగా మల్లు భట్టి విక్రమార్క పేర్లలో మార్పులేమీ ఉండవని పార్టీ ఉన్నతవర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ముఖ్యనేతలను ఏఐసీసీలోకి తీసుకోవడం, త్వరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ పదవులివ్వనున్నట్టుగా తెలుస్తోంది. మార్పును వ్యతిరేకిస్తున్న సీనియర్లు టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యను తొలగించి, ఆ స్థానంలో ఉత్తమ్కుమార్ రెడ్డి నియామకాన్ని పార్టీలోని కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. బీసీలకు పార్టీలో స్థానం లేకుండా చేయడాన్ని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ వంటివారు వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. వి.హనుమంతరావు దీనిపై ఇప్పటికే పలువురు పార్టీ అధిష్టాన పెద్దలను కలిసి వ్యతిరేకతను తెలిపారు. నల్లగొండ జిల్లాలో ఉత్తమ్కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ మార్పును, ఉత్తమ్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు
- పొన్నాలను పరామర్శించిన కొప్పుల హైదరాబాద్: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కసరత్తు ప్రారంభించింది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి అభ్యర్థి ఎంపికపై ఈ మూడు జిల్లాల అధ్యక్షులతో, పార్టీ ముఖ్య నాయకులతో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫోనులో మాట్లాడారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గ విషయంలోనూ ఆ మూడు జిల్లాల ముఖ్యులతో చర్చిస్తున్నారు. ఈ ఎన్నికలకు పార్టీ పరంగా అభ్యర్థులను పోటీకి నిలపడం ఇదే మొదటిసారి. ఈ రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను పోటీకి నిలపనున్న విషయాన్ని ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజుకు పొన్నాల లక్ష్మయ్య వివరించారు. పొన్నాలను గురువారం కొప్పుల రాజు పరామర్శించిన సందర్భంగా ఈ ఎన్నికల విషయం చర్చకు వచ్చింది. -
ఇది ట్రైలరే... సినిమా ముందుంది!
పొన్నాలకు మంత్రి కేటీఆర్ చురకలు హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు చూస్తున్నది ట్రైలర్ మాత్రమేనని మున్ముందు సినిమా చూపిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. బంజారాహిల్స్లో ఓ కార్యక్రమంలో శనివారం పాల్గొనేందుకు వచ్చి న ఆయన మీడియాతో మాట్లాడుతూ పొన్నాల తలపెట్టిన పాదయాత్ర వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. ఆయన మోకాళ్ల యాత్ర చేపట్టినా, తలకిందుల యాత్ర చేపట్టినా తమకు నష్టం లేదని వెల్లడించారు. లక్ష్మయ్య భవిష్యత్లో ఇంకా చాలా యాత్రలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దేశంలోనే కాంగ్రెస్ అంతర్థానం అయిపోయిందని అన్నారు. సచివాలయం మార్పుపై అవసరమైతే అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. 13న తెలంగాణ పల్లె ప్రగతి మెదక్ జిల్లా కౌడిపల్లిలో ప్రారంభమవుతుందని అన్నారు. -
గాంధీభవన్ టు రాజ్భవన్
హైదరాబాద్: వాస్తు పేరుతో చారిత్రక కట్టడాలున్న సచివాలయాన్ని మార్చాలనే తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమబాట చేపడతామని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నిప్రాంతాల ప్రజలకు అం దుబాటులోఉన్న సచివాలయాన్ని మార్చాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గాంధీభవన్ నుంచి రాజ్భవన్దాకా పాదయాత్రను ఈనెల 7న నిర్వహించనున్నట్టుగా పొన్నాల ప్రకటించారు. ఈ నిర్ణయంపై ప్రధాన ప్రతిపక్షపార్టీగా ఇప్పటికే నిరసనలను వ్యక్తం చేశామన్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ఈ నిర్ణయంపై ప్రజల్లో పోరాడుతామన్నారు. గాంధీభవన్ నుంచి రాజ్భవన్దాకా పార్టీ ముఖ్యనేతలంతా పాదయాత్రగా వెళ్లి గవర్నరుకు వినతిపత్రాన్ని ఇవ్వనున్నట్టుగా పొన్నాల ప్రకటించారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈనెల 6న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో గ్రూపులవారీగా చర్చలను నిర్వహించాలని పొన్నాల నిర్ణయించారు. హైదరాబాద్ వంటి చారిత్రక నగరాన్ని సీఎం కేసీఆరే స్వయంగా చెత్త నగరమంటూ మాట్లాడితే పెట్టుబడులు పెట్టేవారు ఎలా వస్తారని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తామంటూ మాట్లాడినవారే గతంలో అడ్రస్ లేకుండా పోయారని, అది కేసీఆర్ తరం కాదని పొన్నాల అన్నారు. -
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం:పొన్నాల
హైదరాబాద్: సచివాలయాన్ని ఎర్రడ్డకు, చెస్ట్ ఆస్పత్రిని అనంతగిరికి తరలించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేసీఆర్ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గాంధీభవన్ నుంచి రాజ్ భవన్ వరకు శనివారం పాద యాత్ర నిర్వహించనున్నట్లు పొన్నాల చెప్పారు. సచివాలయ మార్పును ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్కు వినతిపత్రం ఇవ్వనున్నామని పొన్నాల తెలిపారు. హైదరాబాద్ చెత్తసిటీ అంటూ సీఎం మాట్లాడటం సరైందికాదన్నారు. ఈ వ్యాఖ్యలు పెట్టుబడులకు అనుకూలమైన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయని పొన్నాల విమర్శించారు. హైదరాబాద్ బెస్ట్ సిటీ అవార్డును కేటీఆర్ తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నందునే హైదరాబార్ అభివృద్ధి గురించి చెబుతూ కేసీఆర్ ప్రజలని మభ్యపెడుతున్నారని పొన్నాల తెలిపారు. -
'4 సార్లు రూటు మార్చిన కేసీఆర్'
హైదరాబాద్: సచివాలయంలో తన చాంబర్కు వెళ్లడానికే తెలంగాణ సీఎం కేసీఆర్ 4 సార్లు రూటు మార్చారని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కేసీఆర్ను భయంకరమైన అభద్రతాభావం వెన్నాడుతోందని పొన్నాల వ్యాఖ్యానించారు. తప్పులు ఎత్తిచూపుతున్న తనవల్ల, ప్రతిపక్షాల వల్లే కేసీఆర్కు అభద్రతాభావం వెన్నాడుతోందని అన్నారు. కేసీఆర్ది అహంకార పాలన అంటూ పొన్నాల ధ్వజమెత్తారు. వాస్తుదోషం, వ్యక్తిగత మొక్కులకు ప్రజాధనం ఖర్చుచేయడం సరికాదన్నారు. మూఢనమ్మకాల ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిర్ణయాలను, విధానాలను కోర్టులే తప్పుపడుతున్నాయని పొన్నాల చెప్పారు. -
'తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుంది'
హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ బలోపేతమవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గాంధీభవన్లో మంగళవారం దిగ్విజయ్ అధ్యక్షతన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేల వలసల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు వ్యూహాలతో పాటు పార్టీ బలోపేతంపై సీనియర్ నేతలతో కసరత్తు జరిపారు. పార్టీ సీనియర్లు అంతకు ముందు దిగ్విజయ్ సింగ్కు విమానాశ్రయంలో పార్టీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకర్ల అడిగిన ప్రశ్నకు దిగ్విజయ్ సింగ్ సమాధానమిస్తూ ఢిల్లీలో బీజేపీకి సమర్థ నాయకత్వం లేకపోవటం వల్లే కిరణ్ బేడీని తీసుకున్నారని అన్నారు. -
పార్టీ పటిష్టతపై దృష్టిసారిద్దాం
టీపీసీసీ ఆఫీసు బేరర్ల సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 35 లక్షల మందిని పార్టీలో సభ్యులుగా చేర్పించే లక్ష్యాన్ని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన హైదరాబాద్లోని గాంధీభవన్లో పార్టీ ఆఫీసు బేరర్ల సమావేశం శనివారం జరిగింది. ఈ నెల 20, 21, 22 తేదీల్లో జరిగే పార్టీ ముఖ్యుల మేధోమధన సమావేశాలు, పార్టీ సభ్యత్వంపై సమీక్ష, ఢిల్లీ ఎన్నికల్లో టీపీసీసీ పాత్ర, జీహెచ్ఎంసీ ఎన్నికలు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు షబ్బీర్ అలీ, పి.నర్సింహ్మా రెడ్డి, నాగయ్య, ప్రధానకార్యదర్శులు జెట్టి కుసుమకుమార్, సి.శ్రీనివాస్, కుమార్రావు, వేణుగోపాల్రావు, హరి రమాదేవి, లక్ష్మణ్కుమార్, గోలేటి దామోదర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 20న నాలుగు బృందాలు, 22న నాలుగు బృందాలతో ఏఐసీసీ నేతలు దిగ్విజయ్సింగ్, కొప్పుల రాజు, రామచంద్ర కుంతియా తదితర ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. ఒక్కొక్క బృందంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యనేతలు సుమారు 15 మంది ఉంటారు. ప్రతీ బృందంతో ఏఐసీసీ నేతలు రెండు గంటలపాటు సమావేశమవుతారు. పార్టీ సైద్ధాంతికత, సంస్థాగత నిర్మాణం, క్రమశిక్షణా రాహిత్యం-సవరణ, ఎన్నికల్లో టికెట్ల పంపిణీ, పార్టీ క్షేత్రస్థాయి పాత్ర, భవిష్యత్తులో పార్టీ ఎదగడానికి అనుసరించాల్సిన వ్యూహం, సామాజిక మీడియాను ఉపయోగించుకునే విధానం, క్షేత్రస్థాయి సమస్యలు, రాజకీయ ప్రణాళిక, రాజకీయ విధానం వంటి ముఖ్యమైన అంశాలపై అభిప్రాయాలను వీరు తీసుకోనున్నారు. దీని కోసం 8 బృందాలను ఖరారు చేశారు. వాటికి సమన్వయ బాధ్యతలను కూడా ఆఫీసు బేరర్లకు అప్పగించారు. 35 లక్షల లక్ష్యం దాటుతాం: షబ్బీర్ తెలంగాణలో 35 లక్షల సభ్యత్వ లక్ష్యాన్ని పెట్టుకున్నామని, క్షేత్రస్థాయి స్పందన అంతకంటే ఎక్కువగానే ఉందని షబ్బీర్ అలీ తెలిపారు. సమావేశం వివరాలను మీడియాకు వివరిస్తూ 11 ముఖ్య అంశాలపై రాష్ట్రస్థాయి పార్టీ ముఖ్యులతో రెండురోజుల పాటు సమావేశం జరుగుతుందన్నారు. తెలంగాణ మేధావులు, ప్రొఫెసర్లు, సామాజిక ఉద్యమకారులతోనూ ఏఐసీసీ నేతలు ప్రత్యేకంగా భేటీ అవుతారని వెల్లడించారు. ఢిల్లీకి జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణవాసుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేయడానికి కొందరు పార్టీ ముఖ్యులను పంపిస్తున్నట్టుగా చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
కంటోన్మెంటూ మాదే జీహెచ్ఎంసీ మాదే
-
కంటోన్మెంటూ మాదే జీహెచ్ఎంసీ మాదే
కంటోన్మెంట్ ఎన్నికల్లోనే కాదు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని మంత్రి హరీష్రావు దీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నారని, ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిందన్నారు. కాకతీయ ఉత్సవాలు కూడా చేయించలేక.. వాటికోసం మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డి కాళ్లు పట్టుకున్న చరిత్ర టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా చెల్లని రూపాయికి గీతలెక్కువ పొన్నాలకి మాటలెక్కువ అని విమర్శించారు. -
రామోజీ ఫిలింసిటీపై కేసున్నా.. క్లీన్చిట్టా?
-
రామోజీ ఫిలింసిటీపై కేసున్నా.. క్లీన్చిట్టా?
సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ పొన్నాల ధ్వజం సీఎం హోదాలో ముందే తీర్పా? గోబెల్స్కన్నా అతిపెద్ద అబద్ధాలకోరు సాక్షి, హైదరాబాద్: రామోజీ ఫిలింసిటీలో అసైన్డ్ భూములు ఉన్నాయనే ఆరోపణలపై కోర్టులో కేసు ఉన్నా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు క్లీన్చిట్ ఇవ్వడంపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. కేసు ఉన్నా సీఎం హోదాలో ముందే తీర్పు ఇవ్వడం ఏమిటని విమర్శించారు. ఈ విషయం కేసీఆర్కు తెలియదా? అని ప్రశ్నించారు. అన్ని విషయాల్లో అసత్యాలు చెప్పి మోసం చేసినట్టుగానే రామోజీ ఫిలింసిటీ విషయంలోనూ కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. సోమవారం పొన్నాల గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ను అతిపెద్ద అబద్ధాలకోరుగా అభివర్ణించారు. అబద్ధాలు చెప్పనని ఆయన అనడమే అసలు అబద్ధమని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్ను కూడా కేసీఆర్ మించిపోయాడన్నారు. దళిత ముఖ్యమంత్రి హామీ నుంచి రామోజీ ఫిలింసిటీ వరకు కేసీఆర్ మాట్లాడని అంశమే లేదన్నారు. ఎన్నో మాటలు చెప్పి, హామీలు ఇచ్చి అసలు విషయం వచ్చేసరికి మాటమార్చడం, పచ్చి అబద్ధాలు చెప్పడం కేసీఆర్ నైజమని ఆరోపించారు. అబద్ధాలను ప్రచారం చేయడం గురించి గోబెల్స్ను, తప్పుల గురించి శిశుపాలుడిని ప్రస్తావించుకున్నట్టుగానే ఈ రెండు అంశాలను కలిపి మాట్లాడుకోవాలంటే భవిష్యత్తులో కేసీఆర్ను ఉదాహరణగా మాట్లాడుకుంటారని పొన్నాల ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పనితీరు అధ్వానం... పింఛన్లు, ఆహారభద్రత కార్డులు ఇప్పించడానికి ముఖ్యమంత్రి స్వయంగా మూడురోజులపాటు వరంగల్లో ఉండాల్సి వచ్చిందంటే ప్రభుత్వ పనితీరు, పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో తేలిందని పొన్నాల విమర్శించారు. సీఎం తన పర్యటనలో ఔటర్ రింగురోడ్డు, పట్టణంలోని అండర్గ్రౌండ్ డ్రైనేజీ వంటి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. వరంగల్లో సమస్యలను పరిష్కరించినట్టుగానే కేసీఆర్ రాష్ట్రమంతటా పర్యటించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అయిన మూడోరోజే గజ్వేల్కు వెళ్లిన కేసీఆర్... 5 వేల ఇళ్లు కట్టిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైందని పొన్నాల ప్రశ్నించారు. అలాగే దళితులకు మూడెకరాల భూమి, పేదలకు ఇళ్లు, ఇంటికో ఉద్యోగం వంటి హామీల అమలు సంగతి ఏమైందో చెప్పాలన్నారు. ఈ హామీలను అమలు చేయకుండానే కేసీఆర్ కొత్తగా నోటికొచ్చిన హామీలను ఇస్తున్నారని ఆరోపించారు. రైతు ఆత్మహత్యలు పట్టించుకోవేం... కొత్త రాష్ట్రంలో 200 రోజుల్లోనే 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించలేదని పొన్నాల విమర్శించారు. ఆసరా పింఛన్ల కోసం మండుటెండల్లో రెవెన్యూ కార్యాలయాల ముందు నిలబడి గుండెపోటుతో కొందరు చనిపోయారని, మరికొందరు సొమ్మసిల్లి పడిపోయారని, ఇంకా కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని పొన్నాల విమర్శించారు. ఒక్క సిరిసిల్లలోనే వారం వ్యవధిలో నలుగురు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తామనే హామీని అమలు చేయాలని ఉద్యమాలు చేస్తుంటే కేసీఆర్ స్పందించడంలేదని విమర్శించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థులు, యువకులే ఇప్పుడు సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ఎదుట చేస్తున్న పోరాటాలు కనిపించడంలేదా? అని నిలదీశారు. కేవలం ఎన్నికలు ఉన్నాయనే కారణంతోనే కేసీఆర్ ఆర్భాటం చేస్తున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో అద్దంకి దయాకర్, బండ ప్రకాశ్, నాయిని రాజేందర్రెడ్డి, కె.మల్లేశ్ పాల్గొన్నారు. పీజేఆర్కు నివాళి సీఎల్పీ మాజీ నేత పి.జనార్ధన్రెడ్డి జయంతి సందర్భంగా గాంధీభవన్లో సోమవారం ఆయనకు పొన్నాల నివాళులర్పించారు. పేదల హృదయాల్లో చిరస్థాయిగా పీజేఆర్ నిలిచిపోయారని పొన్నాల కొనియాడారు. పేదల పక్షాన ఉంటూ వారి సంక్షేమానికి పోరాడటమే పీజేఆర్కు అర్పించే నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్రెడ్డి, పార్టీ నేతలు నిరంజన్, కుమార్రావు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న ప్రజలకు పొన్నాల సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. -
జీవన్రెడ్డిని పరామర్శించిన పొన్నాల
సాక్షి, హైదరాబాద్: మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సీఎల్పీ ఉపనేత టి.జీవన్రెడ్డిని శుక్రవారం టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని పొన్నాల, మాజీమంత్రి శ్రీధర్బాబు అభిలషించారు. అలాగే, శుక్రవారం పుట్టినరోజు జరుపుకొన్న దామోదర రాజనర్సింహకు వారు శుభాకాంక్షలు తెలిపారు. -
సభాసంఘాన్ని ఆహ్వానిస్తున్నా: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: ‘రాంపూర్ వద్ద ఉన్న నాభూములకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరగలేదు. ప్రభుత్వం ఈ అంశంపై వేసిన సభా సంఘాన్ని ఆహ్వానిస్తున్నా..’ అని పీసీసీ అధ్యక్షుడు పొన్నాలలక్ష్మయ్య పేర్కొన్నా రు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ వద్ద పొన్నాల దళితుల అసైన్డు భూములను కబ్జా చేశారని వచ్చిన ఆరోపణలపై బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడి చర్చ జరగడం, అసైన్డు, ఇతర భూముల అన్యాక్రాంతాన్ని నిగ్గు తేల్చేందుకు సభాసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పొన్నాల స్పందిస్తూ.. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఇదంతా చేస్తున్నారని, సభా సంఘానికి అన్ని వివరాలు అందిస్తానన్నారు. రాజకీయకక్ష సాధింపులకే.. ప్రభుత్వం కావాలనే పొన్నాలపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్కు చెందిన దళితనేతలు మల్లురవి, చంద్రశేఖర్, విజయరామారావు, అద్దంకి దయాకర్ ఆరోపిం చారు. సభాసంఘాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే, ఎన్నిరోజుల్లో లెక్కలు తేలుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
రూ. లక్ష కోట్లు ఎలా ఖర్చు చేస్తారు?
బడ్జెట్పై కేసీఆర్కు పొన్నాల ప్రశ్న సంగారెడ్డి: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడిపండు చందంలా ఉందని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శుక్రవారం కాంగ్రెస్పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మార్చి నెలకు కేవలం నాలుగు నెలలు మాత్రమే గడువు వుందని, ఈ సమయంలో రూ.లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఎలా ఖర్చు చేస్తారన్న విషయాన్ని ప్రజలకు వెల్లడించాలని కోరారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో భూము లు అమ్మితేనే రూ.లక్షల కోట్ల ఆదాయం రాలేదని, అలాంటప్పుడు ఇన్ని కోట్లు ఖజానాకు ఎలా వస్తాయన్న విషయాన్ని కూడా తెలియజేయాలని పేర్కొన్నారు. -
టీ పీసీసీలో ‘సభ్యత్వ’ జగడం!
గాంధీభవన్లో సమావేశం రసాభాస రెబెల్స్కూ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వాలన్న వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేసిన ఓడిపోయిన అభ్యర్థులు సర్దిచెప్పిన జానారెడ్డి, షబ్బీర్ అలీ సాక్షి, హైదరాబాద్: సభ్యత్వ నమోదును ఉద్యమ స్థాయిలో చేపట్టి, దేశంలోనే అత్యధికంగా సభ్యత్వాలు చేయించాలనుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి... ఆ పార్టీ నాయకుల మధ్య తగాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఎవరి అధీనంలో ఉండాలనే దగ్గరి నుంచే తగాదాలు మొదలయ్యాయి. దీనితో సభ్యత్వ నమోదుపై గురువారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఈ నెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆరు రోజుల పాటు విస్తృతంగా పార్టీ సభ్యత్వాలను చేపట్టాలని ఏఐసీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోనూ ఏర్పాట్లు జరిగాయి. దీనిపై చర్చించేందుకు గురువారం గాంధీభవన్లో టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు... ఈ సమావేశంలో ‘సభ్యత్వ నమోదు పుస్తకాలు ఎవరి అధీనంలో ఉండాలి? పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి అభ్యర్థులను ఓడగొట్టిన వారి సంగతి ఏమిట’నే అంశాలపై వాదోపవాదాలు జరిగాయి. పార్టీ అభ్యర్థులపై పోటీ చేసిన, పార్టీకే చెందిన రెబెల్స్కు కూడా సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వాలని ఎంపీ వి.హనుమంతరావు తన ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేసి ఓటమికి కారణమైన వారిని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని నిలదీశారు. అయినా వెనక్కితగ్గని వీహెచ్.. ‘అంతా మీ ఇళ్ల ముందు క్యూ కట్టాలా..?’ అని ఎదురు ప్రశ్నించడంతో సమావేశం కాస్తా రసాభాసగా మారింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వారే నియోజకవర్గ ఇన్చార్జులుగా ఉన్నప్పుడు సభ్యత్వ నమోదుకు కూడా వారే బాధ్యులని... అందరికీ సభ్యత్వ పుస్తకాలు ఇస్తే ఎలాగని ప్రతాప్రెడ్డి, కొమిరెడ్డి రాములు, హరినాయక్, అనిల్ జాదవ్, భార్గవ్ దేశ్పాండే తదితరులు మండిపడ్డారు. ఎంపీ అయి ఉండీ పాల్వాయి గోవర్ధన్రెడ్డి తన కుమార్తెను రెబెల్గా పోటీ చేయించారని, అక్కడ కూడా సభ్యత్వ పుస్తకాలు ఇస్తారా? అని పోతంశెట్టి వెంకటేశ్వర్లు నిలదీశారు. అయితే.. తాను పార్టీ బలోపేతం గురించి మాట్లాడుతున్నానని వీహెచ్ పేర్కొనడంతో... ఆగ్రహించిన పలువురు నేతలు బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో సీఎల్పీ నేత జానారెడ్డి, షబ్బీర్ అలీ జోక్యం చేసుకుని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. నేటి నుంచి సభ్యత్వ నమోదు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. గురువారం గాంధీభవన్లో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘నెహ్రూ జయంతి రోజైన 14వ తేదీ నుంచి ఇందిరాగాంధీ జయంతి అయిన 19వ తేదీ వరకు ఆరు రోజుల పాటు కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపడుతున్నాం. డిసెంబర్ 31వ తేదీ వరకూ సభ్యత్వాలను నమోదు చేస్తాం. పార్టీ నేతలు, కార్యకర్తలు సామాజిక, పార్టీ కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరకు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న ఈ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి’’ అని పొన్నాల పిలుపునిచ్చారు. -
బంగారు కాదు... బాధల తెలంగాణ తీసుకోచ్చాడు
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సమస్యను పరిష్కరించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ విఫలమయ్యారని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ సమస్య అధికమైందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లకుండా కేసీఆర్ 5 నెలలుగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. విద్యుత్ సమస్యపై కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల 350 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పొన్నాల గుర్తు చేశారు. అధికారంలోని వచ్చిన నాటి నుంచి కేసీఆర్ .... బంగారు తెలంగాణ తీసుకు వస్తానని చెబుతూ బాధల తెలంగాణ తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు నిలదీస్తాయనే ఉద్దేశ్యంతో ఉన్నపళంగా ఛత్తీస్గఢ్ వెళ్లి... అక్కడి ప్రభుత్వంతో విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారని కేసీఆర్ను పొన్నాల ధ్వజమెత్తారు. -
పొన్నాల ఎదుటే కాంగ్రెస్ వర్గాల వాగ్వాదం
హైదరాబాద్: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గందరగోళంగా మారింది. తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఇరు వర్గాల నాయకులు వాగ్వాదానికి దిగారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి మళ్లీ పార్టీలో ఎలా స్థానం కల్పిస్తారంటూ కొత్తగూడెం కార్యకర్తలు పొన్నాలను నిలదీశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అరుపులు, కేకలతో సమావేశం దద్దరిల్లింది. -
కేసీఆర్ ను విమర్శిస్తే సూరీడుపై ఉమ్మేసినట్లే
కరీంనగర్: విద్యుత్ సమస్యల పరిష్కారంలో కేసీఆర్ సర్కారు విఫలమైందన్న తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం రాజయ్య ఖండించారు. అసలు విద్యుత్ కష్టాలు రావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణమైతే.. కేసీఆర్ ను విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అర్ధంలేని వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నేతలకు తగదని సూచించారు. అసలు కేసీఆర్ పై లేనిపోని వ్యాఖ్యలు చేస్తే ఆ సూరీడుపై ఉమ్మేసినట్లేనని రాజయ్య తెలిపారు. రైతుల ఆత్మహత్యల గురించి పదేళ్లుగా మాట్లాడని కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ధర్నాలకు దిగడం అర్ధరహితమన్నారు. కేసీఆర్ చేసిన మోసానికి రైతుల ఆత్మహత్యలే నిదర్శనమని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించిన సంగతి తెలిసిందే. తాము రైతులకు భరోసా ఇచ్చి ఆందోళన చేపట్టామని, ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. రైతుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ వైఫల్యం కారణమని, విద్యుత్ సమస్య పరిష్కరించి రైతుల ఆత్మహత్యలు అరికట్టేవరకు కాంగ్రెస్ కార్యకర్తలు నీ గుండెల్లో నిద్రపోతారని కేసీఆర్ను పొన్నాల హెచ్చరించారు. -
'కేసీఆర్.. నీ గుండెల్లో నిద్రపోతాం'
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నిమిషాల్లోనే ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల మాఫీ అంశాలపై సంతకం చేశారని, కేసీఆర్ మాత్రం ప్రమాణస్వీకారం చేసిన ఆరు వారాల తర్వాత రుణమాఫీపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కరీంనగర్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న రైతు భరోసా యాత్రలో ఆయన మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ చేసిన మోసానికి నిదర్శనమని ఆయన అన్నారు. తాము రైతులకు భరోసా ఇచ్చి ఆందోళన చేపట్టామని, ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. రైతుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ వైఫల్యం కారణమని, విద్యుత్ సమస్య పరిష్కరించి రైతుల ఆత్మహత్యలు అరికట్టేవరకు కాంగ్రెస్ కార్యకర్తలు నీ గుండెల్లో నిద్రపోతారని కేసీఆర్ను పొన్నాల హెచ్చరించారు. ఆంధ్రాలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ వచ్చాక ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. -
బాధల తెలంగాణగా మార్చేశారు: పొన్నాల
బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బాధల తెలంగాణగా మార్చారని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న రైతు భరోసా యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల కష్టాలను కాంగ్రెస్ నేతలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజలకు అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. వ్యవసాయానికి కనీస విద్యుత్ కూడా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రోజులో కనీసం ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు కొత్త రుణాలు కూడా మంజూరు చేయాలన్నారు. -
అమరులను అవమానించినట్లు కాదా?
ప్రభుత్వాన్ని నిలదీసిన టీపీసీసీ చీఫ్ పొన్నాల సాక్షి, హైదరాబాద్: ‘కేవలం 462 మందినే తెలంగాణ అమరవీరులుగా గుర్తించినట్లు ప్రకటించడం వారిని అవమానించినట్లు కాదా? వారి కుటుంబాలను మోసం చేసినట్లు కాదా?’ అని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారమిక్కడ గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ తొలి కేబినెట్ భేటీలో 1969 నుంచి ఇప్పటివరకు ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను గుర్తిస్తామని, వారికి ఇళ్లస్థలాలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలతో పాటు రూ. 10 లక్షల పరిహారాన్ని చెల్లిస్తామని పేర్కొంది’ అని గుర్తుచేశారు. తెలంగాణను సాధించుకున్నా అవగాహన లేమి, అనుభవరాహిత్య ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అమరుల గుర్తింపులో సర్కారు గందరగోళానికి తెరతీసిందన్నారు. ఉద్యమం 60 ఏళ్లదని చెప్పే సీఎం, పరిహారం మాత్రం 462 కుటుంబాలకే ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వద్ద వారి వివరాలు లేకుంటే.. వాటిని ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. ‘మేమేం విషయాన్ని ప్రశ్నించినా.. రాజకీయం చేస్తున్నారంటూ అధికార పక్షం మాట్లాడుతోంది. విపక్షాలు, ఉద్యమకారులు ప్రశ్నిస్తే.. ఉద్యమిస్తే.. కోర్టులు మందలిస్తే.. కేంద్రం స్పందిస్తే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. రైతుల రుణమాఫీ, వాహనాల నంబర్ ప్లేట్లు, ఎంసెట్ కౌన్సెలింగ్, ఫాస్ట్ పథకం, మెట్రోరైలు వంటివాటిలో అస్పష్టతే.. గందరగోళమే’ అని విమర్శించారు. ఎవరు అడగకుండానే బతుకమ్మ పండుగకు రూ. పది కోట్లు మంజూరు చేశారని ఇతర విషయాల్లో ఆసక్తి ఎందుకు లేదని పొన్నాల ప్రశ్నించారు. -
పొన్నాలను అధిష్ఠానమే తప్పిస్తుంది: పాల్వాయి
పొన్నాల లక్ష్మయ్య ఇప్పటికీ పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత తనదేనని చెప్పిన పొన్నాల.. ఇంకా ఎందుకు ఆ పదవిలో ఉన్నారని ఆయన అడిగారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పొన్నాలను అధిష్ఠానమే ఆ పదవి నుంచి తప్పిస్తుందని చెప్పారు. వాస్తవానికి దిగ్విజయ్ సింగ్ కూడా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం లేదని పాల్వాయి విమర్శించారు. అధిష్ఠానానికి తెలియకుండానే జిల్లా నాయకులను పొన్నాల సస్పెండ్ చేస్తుంటే దిగ్విజయ్ స్పందించట్లేదని మండిపడ్డారు. పీసీసీ బాధ్యతలను అధిష్ఠానం యువతరానికి అప్పగించాలని, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆయన అన్నారు. -
సీఎంకు పాలనా అనుభవం లేదు: పొన్నాల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు పాలనా అనుభవం ఏమాత్రం లేదన్న విషయం మరోసారి తేలిపోయందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఫాస్ట్ పథకంతో పాటు నెంబరు ప్లేట్ల మార్పు అంశంలో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో ఈ విషయం స్పష్టం అయ్యిందన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టప్రకారం, రాజ్యాంగబద్ధంగానే ఫాస్ట్ పథకం ఉండాలని అన్నారు. రుణమాఫీ విషయంలో షరతులు విధించకూడదని, కుటుంబానికి ఒక రుణమే మాఫీ చేస్తామనడం సరికాదని తెలిపారు. అలాగే ఆదర్శ రైతుల వ్యవస్థలో ఏమైనా లోపాలుంటే సరిచేయాలి గానీ, ఏకంగా ఆ వ్యవస్థనే రద్దుచేయడం సరికాదని పొన్నాల తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా కేసీఆర్ వ్యవహరించాలని సూచించారు. -
విలీనం ఘనత కాంగ్రెస్ పార్టీదే: పొన్నాల
-
విలీనం ఘనత కాంగ్రెస్ పార్టీదే: పొన్నాల
హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేసిన ఘనత, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్దేనని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గాంధీభవన్లో బుధవారం జరిగిన తెలంగాణ విలీన దినోత్సవంలో ఆయన పాల్గొని జాతీయజెండా ఎగరేశారు. ఈ కార్యక్రమంలో జానారెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాల వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, వాళ్ల కుటుంబాలను ఆదుకుంటామన్న హామీని తెలంగాణ సర్కారు నిలబెట్టుకోవాలని పొన్నాల చెప్పారు. సెప్టెంబర్ 17 విలీనదినాన్ని అధికారికంగా నిర్వహించాలని గతంలో చెప్పిన కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి టీఆర్ఎస్ సాధించిన విజయాలు శాశ్వతం కావని, పోరాటాల చరిత్ర ఉన్న తెలంగాణ గతంలో పాలకులను తరిమికొట్టిన వాస్తవాన్ని టీఆర్ఎస్ మరిచిపోరాదని తెలిపారు. -
భయపడలేదు.. భయపడేదీ లేదు: పొన్నాల
ఓడిపోయినంత మాత్రాన మేమెప్పుడూ భయపడలేదు, భయపడేది లేనే లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం సాగిస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఓటమికి పీసీసీ అధ్యక్షుడిగా తానే బాధ్యత వహిస్తానన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. మెదక్ లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొన్నాల ఏమన్నారంటే.. ''గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్రపతి పాలన ఉంది. రాజకీయ పార్టీలన్నీ పార్టీలుగానే పోటీపడ్డాయి. అప్పుడు అధికార, ప్రతిపక్షాలేమీ లేవు. ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ తెలంగాణలో, టీడీపీ ఆంధ్రలో, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్న రెండు పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. సీపీఐ, సీపీఎం, ఎంఐఎం మూడూ కూడా అధికార పక్షమైన టీఆర్ఎస్కు పూర్తి మద్దతు పలికాయి. వాళ్ల విధానాలను వ్యతిరేకిస్తూనే పోటీ మాత్రం పెట్టలేదు. అంటే గతంలో ఏకపార్టీగా ఉన్న టీఆర్ఎస్కు ఇప్పుడు మూడు పార్టీలు మద్దతు తెలిపాయి. పార్లమెంటు పరిధిలో బలమైన మాదిగ సామాజికవర్గం ఈసారి బీజేపీకి మద్దతు పలికింది. టీడీపీ-బీజేపీ అధికారపక్షాలై ఉండి, వాళ్ల మద్దతు ఉన్నా కూడా కాంగ్రెస్ కంటే వెనకబడ్డారు. గత మూడుసార్లుగా ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ చేతిలో ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా ఇక్కడ ప్రచారంలో ఉన్నారు. అధికారబలం, అంగబలం, అర్థబలం ఎన్నికల్లో పనిచేస్తాయి. ఇది నగ్నసత్యం. ఈ పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే గట్టిపోటీ ఇవ్వగలిగింది. ప్రజలపక్షాన తన వాదన వినిపించింది'' అని ఆయన చెప్పారు. -
మరో బషీర్బాగ్ ఉద్యమం తప్పదు
* టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల * బషీర్బాగ్ మృతులకు టి.కాంగ్రెస్ నేతల నివాళి సాక్షి, హైదరాబాద్ : రుణమాఫీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించకుంటే బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నో హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. బషీర్బాగ్ కాల్పుల ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ నేతలు పొన్నాల, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ 14 ఏళ్ల క్రితం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిందని, కరెంటు చార్జీలను తగ్గించమని అడిగిన పాపానికి ప్రజలను పిట్టల్లా కాల్చిన చరిత్ర చంద్రబాబు సర్కారుదని అన్నారు. కేసీఆర్ సైతం చంద్రబాబు తరహా పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. డీఎస్ మాట్లాడుతూ 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్ను అమలు చేయడంతోపాటు రుణాలనూ రద్దు చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రుణమాఫీ అంశాన్ని నాన్చుతోందన్నాని విమర్శించారు. జానారెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం బాధాకరమన్నారు. హామీల అమలుకు పోరాటం: రఘువీరా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలుకు విద్యుత్ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో పోరాటం చేస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. బషీర్బాగ్లో పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్రెడ్డిలకు గురువారం ఆయన నివాళులర్పించారు. వామపక్షనేతల నివాళి... బషీర్బాగ్ కాల్పుల ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద గురువారం సీపీఐ నేత నారాయణ, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం నాయకులు రాఘవులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు నివాళులర్పించారు. విద్యుత్ కష్టాలు తీర్చాలంటూ ఉద్యమించిన వారిపై కాల్పులు జరిపించిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా, ఆయన సహచరుడు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని వారు గుర్తుచేశారు. ఈ మూడు నెలల కాలంలోనే వారిద్దరూ పాలనలో విఫలమయ్యారని విమర్శించారు. హామీలు విస్మరిస్తే మరో ఉద్యమం విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజాసమస్యలపై కలసికట్టుగా పోరాడాలని పది వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈమేరకు గురువారమిక్కడ డిక్లరేషన్ను ప్రకటించాయి. విద్యుత్ ఉద్యమం జరిగి 14 ఏళ్లయిన సందర్భంగా ఆనాటి కాల్పుల్లో మరణించిన ముగ్గురు అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ‘ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం’ అనే అంశంపై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయా పార్టీల నేతలు పాల్గొన్నారు. -
అహంభావంతో పాలిస్తే మేలు జరగదు: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సమస్యల పరిష్కారం కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రశేఖరరావుకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సూచించారు. అరవయ్యేళ్ల తెలంగాణ కల సాకారమైనా ఒంటెద్దు పోకడలు, అహంభావంతో పాలనసాగిస్తే ఇక్క డి ప్రజలకు మేలు జరగదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు బుధవారం పొన్నాల ఒక లేఖ రాశారు. దానిని గాంధీభవన్లో మీడియాకు విడుదల చేశారు. ప్రధానమైన అంశాలపై అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలని కేసీఆర్కు సూచించారు. రిజర్వుబ్యాంక్ను ఒప్పించేందుకే రైతుల రుణమాఫీ ఉత్తర్వులను ఇస్తున్నామనే భావనను ప్రభుత్వం కలిగిస్తోందని చెప్పారు. విద్యుత్ లేక, అప్పులు దొరకక రెండు నెలల్లోనే 130 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పగ్గాలను చేపట్టి 70 రోజులు దాటినా ఒక్క అంశంపైనా స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. గత కేబినెట్ భేటీలో 43 అంశాలపై చర్చించినా ఒక్కటి కూడా కార్యరూపం దాల్చకపోవడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు బూచిని చూపిస్తూ సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారా అని అన్నారు. -
రైతులకు కరెంటు ఇవ్వకపోగా.. లాఠీదెబ్బలా
విద్యుత్ సమస్యపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే రైతులు ఆందోళన చేస్తున్నారని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ముందుగా ఇచ్చిన హామీ మేరకు రైతులకు కరెంట్ ఇవ్వడంపై దృష్టి సారించకుండా వారిపై లాఠీఛార్జ్ చేయించడం అమానుషమని ఆయన మండిపడ్డారు. రైతులకు భరోసా ఇవ్వాలని కోరిన ప్రతిపక్షాలను కేసీఆర్ విమర్శించడం ఆయన అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల్లోనే 120 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కేసీఆర్ సర్కార్ మానవత్వం లేకుండా రైతులపై రాక్షతత్వాన్ని ప్రదర్శిస్తోందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ఐదు లక్షల కోట్ల హామీలు ఇచ్చారని, వాటిని ఎలా అమలు చేయాలో ఆలోచించకుండా మళ్లీ వేల కోట్ల రూపాయల హామీలిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. -
టీ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు
* పార్టీ పగ్గాలు చేపట్టే దిశగా జానా పావులు * ఎమ్మెల్యేలు, ఓడిపోయిన అభ్యర్థులతో 4న భేటీ * చర్చనీయాంశమైన జానా చర్యలు * పొన్నాల గుర్రు... హస్తినకు ఫిర్యాదు?! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు మొదలైంది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నాయకత్వంపట్ల మొదటి నుంచీ అసంతృప్తితో ఉన్న సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి.. పార్టీ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకునేదిశగా పావులు కదుపుతున్నారు. టీపీసీసీ కార్యక్రమాలను స్వయంగా నిర్వహించేందుకు రంగంలోకి దిగారు. అందులో భాగంగా వచ్చే నెల 4న పార్టీ ఎమ్మెల్యేలతోపాటు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులందరితోనూ సమావేశం ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించడం, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణను రూపొందిం చడం, ప్రజాసమస్యలను శాసనసభా వేదికగా పరిష్కరించేందుకు కృషి చేయడం వంటి అంశాలు ఎజెం డాగా ఖరారు చేశారు. టీపీసీసీకి రథసారథిగా పొన్నాల లక్ష్మయ్య కొనసాగుతున్నా, ఆయన ప్రమే యం లేకుండా జానారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. జానా చర్యలతో కాంగ్రెస్లో ఆధిపత్య పోరుకు తెర తీసినట్లయిందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. హైకమాండ్ ఆశీస్సులతోనే...? సాధారణ ఎన్నికలకు ముందు టీపీసీసీ అధ్యక్ష పగ్గాలు ఆశించి భంగపడ్డ జానారెడ్డి.. అప్పటి నుంచి పొన్నాల నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని పార్టీలో ప్రచారం జరిగింది. కొద్దిరోజుల క్రితం జానారెడ్డి సీఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్కు దీటుగా రాష్ట్రంలో సరైన నాయకత్వాన్ని ప్రజల ముం దుంచడంలో కాంగ్రెస్ విఫలమైందని చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చాయి. ఈ విషయాన్ని అధిష్టానం పెద్దల దృష్టికి పొన్నాల తీసుకెళ్లినట్లు తెలిసింది. తాజాగా జానారెడ్డి సమావేశ ఏర్పాట్లను పొన్నాల జీర్ణించుకోలేకపోతున్నారు. వారం క్రితం జానారెడ్డి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతోపాటు హైకమాండ్ పెద్దలందరినీ కలిసి వచ్చిన తర్వాతే ఈ సమావేశ నిర్వహణకు సిద్ధం కావడంతో హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. తనను పలుచన చేసేందుకే జానా చర్యలున్నాయని పొన్నాల భావిస్తు న్నట్లు సమాచారం. 4వ తేదీ సమావేశం గురించి కొందరు విలేకరులు పొన్నాల దృష్టికి తీసుకెళ్లగా.. ‘‘అది గెట్ టుగెదర్ సమావేశమని మాత్రమే నాకు తెలుసు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బ లోపేతం అజెండాగా సమీక్ష నిర్వహిస్తున్నట్లు నాకు తెలియదు. ఆయన కూడా చెప్పలేదు’’ అని బదులిచ్చారు. -
ప్రధాని మోడీకి అంత హడావిడి ఎందుకు?
పోలవరం బిల్లు రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఈ బిల్లుపై ప్రధాని మోడీకి అంత హడావిడి ఎందుకని ఆయన ప్రశ్నించారు. పోలవరాన్ని అడ్డుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. ఒక ఎంపీగా ఉండి తెలంగాణ తెచ్చానన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు 12 మంది ఎంపీలతో పాటు తాను ముఖ్యమంత్రిగా ఉండి కూడా పోలవరాన్ని ఎందుకు అడ్డుకోలేదని పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు. 1956కు ముందున్న తెలంగాణ కావాలని కేసీఆర్ డిమాండ్ చేశారని, అందుకే ఇప్పుడు పోలవరాన్ని ఆపాలని కేంద్రాన్ని కోరలేకపోతున్నారని చెప్పారు. 1956 కంటే ముందు భద్రాచలం డివిజన్ ప్రాంతాలు గోదావరి జిల్లాల్లోనే ఉండేవన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
కలసి పంచుకుందాం..!
* జెడ్పీ పీఠాల కైవసంపై కాంగ్రెస్, టీడీపీ నిర్ణయం * రంగారెడ్డి టీడీపీకి .. వరంగల్, మహబూబ్నగర్ పీఠాలు కాంగ్రెస్కు.. * జానారెడ్డితో పొన్నాల.. చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీలు సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చైర్మన్లు, మండలాధ్యక్షుల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వ్యూహం మార్చాయి. ఎక్కువ స్థానాలు సాధించినా.. ఇతర పార్టీలతో పొత్తులేని కారణంగా పీఠాలను దక్కించుకోలేపోయామని గ్రహించి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో కలిసిపోవాలని నిర్ణయించాయి. అందులో భాగంగా రంగారెడ్డి జెడ్పీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతిచ్చేలా.. దీనికి ప్రతిగా మహబూబ్నగర్, వరంగల్ జెడ్పీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు టీడీపీ సహకరించేలా ఒప్పందం కుదర్చుకున్నాయి. ఈ వ్యూహం ఫలిస్తే అధికార టీఆర్ఎస్ ఎత్తుగడలను తిప్పికొట్టవచ్చని భావిస్తున్నాయి. జానారెడ్డితో పొన్నాల మంతనాలు.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం సాయంత్రం సీఎల్పీ నేత కె.జానారెడ్డితో ఇదే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధికార, అర్థ బలాన్ని తట్టుకుని సొంతంగా కాంగ్రెస్ ఒక్క జెడ్పీ పీఠాన్ని కూడా దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదని అభిప్రాయపడినట్లు సమాచారం. పూర్తి మెజారిటీ ఉన్న నల్గొండ జిల్లాలోనూ టీఆర్ఎస్ ‘ఆకర్ష్’తో కాంగ్రెస్ను దెబ్బకొట్టాలని యోచిస్తున్నందున.. ఆ పార్టీ ఎత్తుగడను తిప్పికొట్టేందుకు టీడీపీ మద్దతు కూడగట్టాల్సిన అవసరముందని వారు భావించారు. టీడీపీతో కలిస్తే ఆ పార్టీ రెండు, కాంగ్రెస్ మూడు జెడ్పీలను దక్కించుకునే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జెడ్పీ ఎన్నికల్లో తమకు మద్దతిస్తే మిగతా జిల్లాల్లో కాంగ్రెస్కు సహకరిస్తామని టీడీపీ తెలంగాణ నేతలు చేసిన ప్రతిపాదన తమకు సమ్మతమేనంటూ పొన్నాల, జానారెడ్డిలు టీటీడీపీ నేతలకు సమాచారం పంపారు. దీంతో టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, రేవూరి ప్రకాష్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, రేవంత్రెడ్డి, వేం నరేందర్రెడ్డి, ప్రకాష్గౌడ్ తదితరులు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిసి కాంగ్రెస్ ప్రతిపాదనను ముందుంచారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. ‘టీఆర్ఎస్కు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రసక్తే లేదు. ఆ పార్టీని ఎదుర్కొనేందుకు కలిసొచ్చే పార్టీలతో ముందుకెళ్లండి. రంగారెడ్డి జెడ్పీ పీఠం దక్కించుకునేందుకు సహకరిస్తే మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్కు మద్దతివ్వండి. లేదంటే ఆయా జిల్లాల్లో ఎన్నికలను బహిష్కరించండి..’ అని బాబు స్పష్టం చేసినట్లు సమాచారం. -
వాచ్డాగ్లా వ్యవహరించాలి: పొన్నాల
కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పొన్నాల దిశానిర్దేశం సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఈ హామీలన్నీ అమలు చేసేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దిశానిర్ధేశం చేశారు. హామీల అమలుకు సంబంధించి కార్యకర్తలు వాచ్డాగ్లా వ్యవహరించాలని సూచించారు. పార్టీకి అనుబంధంగా ఉన్న 13 సంఘాల నేతలతో గాంధీభవన్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ పరిస్థితిని విడివిడిగా సమీక్షించారు. ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇన్చార్జి రామచంద్ర కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు. ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను పరిశీలించేందుకు అనుబంధ సంఘాల నేతలకు టీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రతులను అందజేశారు. గతంలో కాంగ్రెస్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేలా చూడడంతో పాటు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నేరవేరే విధంగా ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. కొంత సమయం తీసుకుని ఆందోళన బాట పట్టాలని సూచించారు. విద్యార్థులు, మహిళలు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలకు టీఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చిందని, వాటిమీద ఇప్పటినుంచే దృష్టి పెట్టాలన్నారు. ఓటమితో కుంగిపోకుండా పార్టీకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు అనుబంధ సంఘాలు కృషిచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టపరచాలన్నారు. నేతల మధ్య సమన్వయం లేక పార్టీ ఓటమి పాలయ్యిందని, కొందరు నేతలు ఇంకా తాము అధికారంలోనే ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారని కుంతియా అన్నట్టు తెలిసింది. ప్రజలు ప్రతిపక్ష పాత్రనిచ్చారని, వారి ఆకాంక్షల మేరకు కార్యకర్తలు నడుచుకోవాలని సూచించినట్టు సమాచారం. -
స్థానికంగా టీడీపీతో కలుద్దాం!
* హంగ్ జెడ్పీ, మున్సిపాలిటీలనూ కైవసం చేసుకుందాం * తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక పీఠాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా హంగ్ ఫలితాలొచ్చిన చోట్ల టీడీపీ సహకారం తీసుకోవాలని భావిస్తోంది. అదే సమయంలో మజ్లిస్ పార్టీ సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఏఐసీసీ రాష్ర్ట వ్యవహారాల సహాయ ఇన్చార్జి రామచంద్ర కుంతియా అధ్యక్షతన సోమవారం సాయంత్రం గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, శాసనసభ, శాసనమండలి ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, డి.శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్అలీ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్ తదితరులు హాజరైన ఈ సమావేశంలో జిల్లా, మున్సిపల్, మండల ఎన్నికల ఫలితాలు, అనంతరం అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. కాంగ్రెస్కు మెజారిటీ స్థానాలున్న చోట ఇబ్బంది లేనప్పటికీ, హంగ్ ఫలితాలొచ్చిన చోట మాత్రం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కుంతియా సూచించారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. వరంగల్, మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఎన్నికల్లో హంగ్ ఫలితాలొచ్చినందున ఆయా జెడ్పీ పీఠాలను ఏ విధంగా దక్కించుకోవచ్చని అనే అంశంపై నేతల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. హంగ్ ఫలితాలొచ్చిన జిల్లాల్లో జెడ్పీలను కైవసం చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకుంటున్నారని పలువురు నేతలు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అధికార పార్టీ ధాటికి తట్టుకోలేక కాంగ్రెస్ జె డ్పీ చైర్మన్ అభ్యర్థులు సైతం చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధికారిక పలుకుబడిని, ఆర్థిక శక్తిని తట్టుకోవాలంటే హంగ్ ఫలితాలొచ్చిన చోట్ల టీడీపీ సహకారం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సైతం హంగ్ ఫలితాలొచ్చిన చోట్ల ఎవరికి మద్దతివ్వాలనే అంశాన్ని స్థానిక నేతలకే వదిలేసినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అత్యధిక పీఠాలను దక్కించుకోవాలంటే మజ్లిస్ సహకారం తప్పనిసరైనందున ఆ పార్టీ పెద్దలతోనూ మాట్లాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒకరిద్దరు నేతలు టీడీపీ సాయం తీసుకునే విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ అంతిమంగా ఆ పార్టీ సహకారంతో తీసుకుంటేనే బాగుంటుందనే సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. ఈ ఎన్నికలు ఆలస్యమయ్యే కొద్దీ క్యాంపు రాజకీయాలు ఎక్కువుతాయనే ఆందోళన సమావేశంలో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తక్షణమే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ర్ట ఎన్నికల కమిషన్ను కోరుతూ తీర్మానించింది. కాంగ్రెస్ను ఎలా బలోపేతం చేద్దాం నేడు అనుబంధ సంఘాలతో చర్చించనున్న పొన్నాల సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంగళవారం పార్టీ అనుబంధ సంఘాలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం, మేనిఫెస్టో హామీల అమలుపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను ఇందులో చర్చించనున్నారు. అలాగే ఎన్ఎస్యూఐ, యువజన, మహిళా కాంగ్రెస్ విభాగాలతోపాటు మొత్తం 12 అనుబంధ సంఘాల నేతల పనితీరును సమీక్షించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ సమీక్షలో ఒక్కో అనుబంధ సంఘ నేతలతో అరగంటకుపైగా చర్చించనున్నారు. -
సీఎల్పీ భేటీ నుంచి కోమటిరెడ్డి వాకౌట్
* పొన్నాల రాజీనామా చేయాలని డిమాండ్ * రేణుకా చౌదరిపై రాంరెడ్డి మండిపాటు * టీఆర్ఎస్కు అనుకూలమనే ప్రచారం సరికాదన్న డీఎస్, జానా సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షం తొలి సమావేశం బుధవారం హాట్హాట్గా జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో, బయటా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సమావేశమైన నేతలు ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతోపాటు పరోక్షంగా చురకలంటించుకున్నారు. సీఎల్పీ భేటీ ప్రారంభమైన వెంటనే మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చారు. ‘‘ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణం పొన్నాల లక్ష్మయ్యే. ఆయన కూడా 30వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. అలాంటి వ్యక్తి రాజీనామా చేయకుండా ఇంకా టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలాంటి వ్యక్తి అధ్యక్షత వహించే ఈ సమావేశంలో నేనెందుకు ఉండాలి? నిరసన తెలిపి బయటకు వచ్చేశా’’అని మీడియాకు వివరించారు. ఆ తరువాత మరో మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సైతం రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తీరును సమావేశంలో తప్పుపట్టినట్లు తెలిసింది. ‘‘ఎన్నికల్లో కష్టపడి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచులను గెలిపించుకునేది మేము. పార్టీలో మాత్రం ఆమె మాటే చెల్లుబాటవుతోంది. ఇదేం పద్ధతి? ఇలాంటి నిర్ణయాలవల్లే పార్టీకి ఈ దుస్థితి వచ్చింది’’అని రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డిసహా ఖమ్మం నేతలు రాంరెడ్డికి మద్దతుగా మాట్లాడారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మాట్లాడుతూ ‘‘ఎన్నికల్లో ఓడిపోయినా మన నాయకుల మైండ్ సెట్ మారలేదు. ఇంకా అధికారంలో ఉన్నామని, బుగ్గకార్లలో తిరుగుతున్నామనే భావనలోనే ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా వాస్తవంలోకి రావాలి. కలసికట్టుగా పనిచేస్తూ పార్టీని బతికించుకోవాలి’’అని సూచించారు. వైదొలగుదామనుకున్నా.. జానారెడ్డి మొన్నటి ఎన్నికల తర్వాత రాజకీయాలనుంచి తప్పుకుందామని అనుకున్నానని, అయితే పార్టీ పరిస్థితి చూశాక నిర్ణయం మార్చుకున్నానని జానారెడ్డి సమావేశంలో తెలిపారు. పార్టీని బలోపేతం చేసి ఒకటిరెండేళ్లలో రిటైర్ అవుతానని జానా చెప్పగా డీఎస్ జోక్యం చేసుకుని అవన్నీ ఇప్పుడెందుకని వారించినట్లు తెలిసింది. ఇదెక్కడి వివుర్శ? డీఎస్, జానారెడ్డి సైతం తాము టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంటున్నామని సొంత పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారంటూ వాపోయారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీలో తెలంగాణకు భాగసామ్యం కల్పించకూడదని, విద్యుత్లో వాటా ఇవ్వొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని, దీనిపై తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. హిమాచల్ప్రదేశ్ దుర్ఘటనలో మృతి చెందిన తెలుగు విద్యార్థుల కుటుంబాలకు సానుభూతి తెలపడంతోపాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సంతాపం చెబుతూ తీర్మానం చేశారు. -
పొన్నాల టికెట్లు అమ్ముకున్నారు.. తప్పించండి
కాంగ్రెస్ పార్టీ నేతల లోపం వల్లే తెలంగాణ ప్రాంతంలో పార్టీ ఓటమి చవిచూసిందని కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి మండిపడ్డారు. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య టికెట్లు అమ్ముకున్నారని, ఆయన్ను తప్పించాలని డిమాండ్ చేశారు. కేవలం తమ నేతల వైఫల్యం వల్లే టీడీపీకి తెలంగాణలో ఓట్లు పడ్డాయన్నారు. పార్టీ ఓటమికి అసలైన కారణం దిగ్విజయ్ సింగ్, పొన్నాల లక్ష్మయ్యలేనని, వాళ్లిద్దరినీ తక్షణం పదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవిభజన తర్వాత టీపీసీసీని ఏర్పాటు చేయడంలో దిగ్విజయ్ ఆలస్యం చేశారని, ఆయన పూర్తిగా కేవీపీ డైరెక్షన్లో నడిచారని ఆరోపించారు. తెలంగాణ బిల్లు రూపకల్పనలో కేసీఆర్ పాత్ర ఉండాలన్న తన సలహాను దిగ్విజయ్ పట్టించుకోలేదని చెప్పారు. ఇక తెలంగాణ ప్రాంతంలో టిక్కెట్ల కేటాయింపు, పార్టీ నేతలను కలుపుకోవడంలో పొన్నాల ఘోరంగా విఫలమయ్యారని, ఆయన టిక్కెట్లు అమ్ముకున్నారని తీవ్రంగా విమర్శించారు. ఓటమికి కారణమైన పొన్నాల తక్షణమే పార్టీకి క్షమాపణ చెప్పి పదవి నుంచి తప్పుకోవాలని అన్నారు. దిగ్విజయ్, జైరాం రమేష్ లాంటి కొందరు పెద్దలు సోనియగా గాంధీ చుట్టూ చేరి కాంగ్రెస్ పార్టీని నాశనం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి తనకు కావాలంటే తనకు కావాలంటూ బయల్దేరిన జానారెడ్డి లాంటి ఆశావహులు కూడా ఈ ఓటమికి కారణమేనని పాల్వాయి గోవర్ధనరెడ్డి అన్నారు. -
ఓటమి చవిచూసిన ప్రముఖులు
-
పొన్నాల సొంతూళ్లో టీడీపీ గెలుపు
రఘునాథపల్లి (వరంగల్), న్యూస్లైన్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వగ్రామమైన వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం ఎంపీటీసీ స్థానంలో కాంగ్రెస్ పరాజయం పాలైంది! ఈ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది. పొన్నాల సోదరుడు రామ్మోహన్ భార్య రాణిసంయుక్తపై టీడీపీ అభ్యర్థి భూశెట్టి కుమార్ 295 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. -
కేసీఆర్ మానసికస్థితి బాగాలేదేమో: పొన్నాల
జనగామ, న్యూస్లైన్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు చెప్పే మాటలను ప్రజలు ఎంతమాత్రమూ నమ్మరని, ఆయన చెప్పేవన్నీ వినడానికి బాగున్నా..ఆచరణ సాధ్యం కానివని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. వరంగల్ జిల్లా జనగామలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్లో చీలికలు తెచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఆయన మానసిక పరిస్థితి బాగా లేదన్న విషయం బయటపడుతుందని చెప్పారు. ప్రతినియోజకవర్గంలో లక్ష ఎకరాల భూమి లేకున్నా.. లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని, దళిత కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీ, మైనార్టీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామంటూ సాధ్యంకాని విషయాలు చెబుతున్నారని విమర్శించారు.ప్రజలను మభ్యపెట్టేందుకో లేక అవగాహన లేకనో చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభులత్వం ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యోగులు చేసిన ప్రతిపాదనలనే జీవోలుగా మారుస్తామన్నారు. -
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన: పొన్నాల
గవర్నర్కు టీపీసీసీ చీఫ్ పొన్నాల లేఖ సాక్షి, హైదరాబాద్: స్థానికత ఆధారంగానే ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన గవర్నర్కు లేఖ రాశారు. ఆప్షన్ల ప్రకారమే రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపులుంటాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు అయోమయంలో ఉన్నారన్నారు. ఉద్యోగుల విభజనకు ఆప్షన్లు ఒక్కటే ప్రామాణికం కాదని ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం-2014లో ఇతర మార్గాలనూ సూచించిందని గుర్తు చేశారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరిగితేనే తెలంగాణ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని పొన్నాల పేర్కొన్నారు. అలాగే, ప్రస్తుత సచివాలయాన్ని రెండుగా భాగాలుగా విభజించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లకు కేటాయించాలని తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలె త్తే అవకాశం ఉందని తెలిపారు. ఒకే కంపౌండ్లో రెండు రాష్ట్రాల సచివాలయాలు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఉండడం వల్ల ప్రభుత్వాల పనితీరుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. -
ఊరూరా గోదావరి నీళ్లు
రోడ్ షోలో టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జనగామ, న్యూస్లైన్ : నియోజకవర్గంలోని ప్రతీ ఊరుకు గోదావరి జలాలు అందించేందుకు కృషిచేస్తానని టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామలోని పలు వార్డుల్లో సోమవారం ఆయన సినీనటి, మాజీ ఎంపీ జయప్రద, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డితో కలిసి రోడ్షో నిర్వహించారు. ఈ సం దర్భంగా పొన్నాల మాట్లాడుతూ తాను జనగామ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నట్లు తెలిపా రు. పట్టణాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు జనగామను జిల్లాగా చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇతర దేశాలకు వెళ్లే వారికోసం పట్టణంలో ప్రత్యేక హెల్స్డెస్క్ ఏర్పా టు చేస్తానని, గూగుల్ పాఠాలు త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నియామకాల్లో దామాషా పద్ధతిని అవలంభిస్తామని, పార్టీ మేని ఫెస్టోను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థం ఐదు ఎకరా ల్లో స్మృతి వనం ఏర్పాటు, వారి కుటుంబాలకు ఇళ్లు.. పింఛన్.. ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. జయశంకర్ పేరున *100కోట్ల నిధులతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యమ సమయంలో ఇబ్బందులు పడ్డ వారికి సేవలందించనున్నట్లు వివరించారు. మోసపూరిత టీఆర్ఎస్కు ఓటెయ్యొద్దని, తెలంగా ణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందు కు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. తెలంగాణ ప్రజల గుండెల్లో సోనియా పదిలం తెలంగాణ గుండెల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోని యాగాంధీ పదిలంగా ఉన్నారని.. ఇక్కడి ప్రజ ల కు కాంగ్రెస్పైనే విశ్వాసముందని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇద్దరు ఎంపీలున్న టీఆర్ఎస్తో తెలంగాణ రాలేదని.. కేవలం సోనియాగాంధీ వల్లే వచ్చిందన్నారు. కేసీఆర్వి మోసపూరిత రాజకీయాలని.. సోనియాది ఇచ్చిన మాటకు కట్టుబడే నైతిక విలువలతో కూడి న రాజకీయమని పేర్కొన్నారు. అమరుల త్యాగాలను గుర్తించి సోనియా తెలంగాణ నిర్ణయం తీసుకుందని వివరించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏనాడు మాట మీద నిలబడలేదని విమర్శించారు. 2004లో తమతో పొత్తు.. 2009లో మహాకూటమి పొత్తులో నూ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. తమతో పొత్తు ఉన్న సమయంలో టీఆర్ఎస్ 26 సీట్లు, పొత్తు లేనప్పుడు 10 సీట్లు వస్తే.. ఇప్పుడు ఎవరితో పొత్తులేకుండా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పా టు చేయడం కలేనని అన్నారు. బీజేపీ కూడా రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదానికి అడ్డం కులు సృష్టించిందన్నారు. తెలంగాణలో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశా రు. సమావేశంలో ఎంపీ రాపోలు ఆనందభాస్క ర్, టీ పీసీసీ అధికార ప్రతినిధులు బక్క నాగరా జు, మొగుళ్ల రాజిరెడ్డి, మార్కెట్ చైర్మన్ వై.సుధాక ర్, ఎండీ.రజీయొద్దీన్, జెల్లి.సిద్ధయ్య పాల్గొన్నారు. -
హీరోయిన్లంతా ఆ నియోజకవర్గంలోనే!
ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి బాధ్యతల్లో ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలోని మొత్తం అభ్యర్థులందరి గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకోవాలి. కానీ, తన సొంత నియోజకవర్గంలో గెలవడమే అనుమానంగా కనిపించడంతో ముందు తన విషయం చూసుకోడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆయనెవరో కాదు.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య.ఆయనిప్పుడు చాలా జోరుగా ప్రచారం చేస్తున్నారు. పలువురు సినీ తారలను ప్రచార పర్వంలోకి దించుతున్నారు. విజయం కోసం చెమటోడుస్తున్నారు. కానీ అదంతా పార్టీలోని ఇతర అభ్యర్థుల విజయం కోసం కాదు.. తన సొంత గెలుపు కోసమే!! తెలంగాణలో ఇప్పటి వరకు ఇతర సెగ్మెంట్లలో ఎక్కడా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయని పాత తరం నటీమణులు విజయశాంతి, జయసుధ , జయప్రద.. వీళ్లంతా ఇప్పుడు వరంగల్ జిల్లా జనగాం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి సిద్దమయ్యారు. టీఆర్ఎస్కు రాజీనామా చేసి ఇటీవలే కాంగ్రెస్లో చేరిన విజయశాంతి మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రాములమ్మ కూడా పొన్నాల నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్లో కాంగ్రెస్ తరపున మళ్లీ బరిలోకి దిగిన నటి జయసుధ, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ మిత్రపక్షమైన ఆర్ఎల్డీ తరపున లోక్సభకు పోటీ చేస్తున్న ఎంపీ జయప్రద కూడా జనగాం నియోజకవర్గంలో ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఇలా గెలుపు కోసం పొన్నాల పడుతున్న పాట్లు ఆయన్ను విమర్శల పాల్జేస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ అయిన పొన్నాల.. అభ్యర్ధులందరి బాధ్యత తీసుకోవాల్సింది పోయి, కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కావడాన్ని అంతా తప్పు పడుతున్నారు. హీరోయిన్లందరినీ కేవలం జనగాంకే పరిమితం చేసి, తామందరి అవకాశాలను దెబ్బతీస్తున్నారని కూడా ఇతర అభ్యర్థులు వాపోతున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న స్ధానాలేవో గుర్తించి వాటిపై ఆయన దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. -
కేసీఆర్.. విచారణకు సిద్ధమా?: పొన్నాల
వరంగల్, న్యూస్లైన్: తనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధమా అని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావును టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సవాల్ చేశారు. నీపై భూ ఆక్రమణలు, మహిళల అక్రమ రవాణా, దొంగనోట్లు, నకిలీ పాప్పోర్టు, నీ బిడ్డ సినిమావాళ్ల దగ్గర, కొడుకు రియల్ ఎస్టేట్ వాళ్ల వద్ద వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయని చెప్పారు. హన్మకొండలో గురువారం విలేకరులతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలపై లోకాయుక్త, సీబీఐ విచారించి.. క్లీన్చిట్ ఇచ్చాయని, అయితే కేసీఆర్పై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఆయన విచారణకు సిద్ధపడి నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. -
మొరుగుతున్న కాపలాకుక్క: పొన్నాల
మద్దూరు, న్యూస్లైన్: తెలంగాణ వస్తే కాపలా కుక్కలా పడిఉంటానన్న టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ఇప్పుడు ఇష్టానుసారంగా మొరుగుతున్నాడని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన వరంగల్ జిల్లా మద్దూరు రోడ్షోలో మాట్లాడారు. పార్టీలోని దళిత, గిరిజన, మైనార్టీ నేతలను అవమాన పరిస్తే పొలిట్బ్యూరోలో ఉన్న వారంతా బయటకు వెళ్లిపోతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడిని, ఉపముఖ్యమంత్రిని మైనార్టీ వారిని చేస్తాన్న కేసీఆర్.. ఆ మాట తప్పి తానే ముఖ్యమంత్రినని చెప్పుకుంటున్న ఆయన.. రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాడా అని ప్రశ్నించారు. -
పిచ్చోడు.. బుడ్డర్ఖాన్.. అలీబాబా చాలీస్ చోర్!
సార్వత్రిక ఎన్నికల పుణ్యమాని చాలా రోజుల తర్వాత మళ్లీ నాయకుల తిట్ల పురాణం వినే భాగ్యం తెలుగు ప్రజలకు కలిగింది. సాధారణంగా నోటి దురుసు ప్రదర్శించే విషయంలో కాస్త వెనకబాటులో ఉండే నాయకులు కూడా ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా స్వరం పెంచేశారు. ప్రధానంగా టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కేంద్రంగానే ఈ తిట్లన్నీ సాగుతున్నాయి. కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ కేసీఆర్ను నోటికొచ్చినట్లు తిడుతున్నారు. కిలాడీ, అలీబాబా చాలీస్ చోర్, కాపలా కుక్క, బుడ్డర్ఖాన్, పిచ్చోడు.. ఇలా ఎవరికి తోచిన స్థాయిలో వాళ్లు కేసీఆర్ను తిట్టిపోస్తున్నారు. కే అంటే కిలాడీ అని.. కేసీఆర్ అంటే మాట తప్పే పెద్ద కిలాడీ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడ్డాక కాపలా కుక్క(వాచ్డాగ్) లా పని చేస్తానని చెప్పిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు మొరగడమేంటని విమర్శించారు. కేసీఆర్ బుడ్డర్ఖాన్లా మాట్లాడుతున్నారని మరో సందర్భంలో పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. నిత్యం ఫాం హౌస్లో పడుకునే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసిందెప్పుడని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక అలీబాబా చాలీస్చోర్.. టీఆర్ఎస్కు ఓటువేస్తే దొంగోడి చేతికి తాళం చెవి ఇచ్చినట్లే’ అని మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్వి మాయ మాటలు.. నమ్మి మోసపోవద్దని కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. కేసీఆర్ బిడ్డకోసీటు, కొడుక్కో సీటు, అల్లుని కో సీటు ఇచ్చి.. తానూ రెండుసీట్లు తీసుకున్నాడు.. ఇది కుటుంబ పాలనకు నిదర్శనమన్నారు. ఇక విమర్శల విషయంలో ఎప్పుడూ పెద్దగా ధైర్యం చేయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ విషయంలోకి వచ్చేసరికి రెచ్చిపోయి మాట్లాడారు. తనను జైలుకు పంపుతానని కేసీఆర్ అంటున్నాడని, 'మరోసారి పిచ్చిమాటలు మాట్లాడితే పిచ్చాస్పత్రికి పంపిస్తా జాగ్రత్త’ అని ఆయన అన్నారు. ఇలా దాదాపు ప్రతి ఒక్కళ్లూ కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని తమ తిట్లపురాణాలకు మరింత పదును పెడుతున్నారు. -
కేసీఆర్.. బుడ్డర్ఖాన్ మాటలు కట్టిపెట్టు!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బుడ్డర్ఖాన్లా మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. నిత్యం ఫాం హౌస్లో పడుకునే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసిందెప్పుడని ప్రశ్నించారు. ఏనాడూ పార్లమెంట్లో తెలంగాణపై ఒక్క మాట కూడా మాట్లాడని కేసీఆర్ తనవల్లే తెలంగాణ వచ్చిందని చెప్పడం విడ్డూరమన్నారు. ఆదివారం పొన్నాల గాంధీభవన్లో, అలాగే తెలంగాణ ఇంగ్లిష్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఎ విజన్ ఆఫ్ తెలంగాణ’ అనే అంశంపై జరిగిన మీట్ దిప్రెస్లోనూ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘ఆయనెవరో (కేవీపీ రామచంద్రరావును ఉద్దేశించి) కేసీఆర్కు డబ్బులిస్తానన్నాడట. తెలంగాణ ఉద్యమాన్ని బంద్ పెట్టమని అప్పుడెప్పుడో చెప్పిండట. ఆ విషయాన్ని కేసీఆర్ ఈ ఎన్నికల సమయంలో చెప్తుండు. నిజంగా డబ్బులు ఆఫర్ చేస్తే ఆనాడే ఎందుకు బయటపెట్టలేదు? ఇప్పుడీ నాటకాలెందుకు? విశ్వసనీయత లేకుండా బుడ్డర్ఖాన్ మాదిరిగా మాట్లాడితే నమ్మేదెవరు? అసలు నువ్వు తెలంగాణ కోసం ఉద్యమం చేసిందెప్పుడు? ఫాంహౌస్లో పడుకోవడం తప్ప నువ్వు చేసిందేమిటి? ఫాంహౌస్లో ఒక్క చెట్టుకు 300 క్వింటాళ్ల టమోటాలు పండిస్తానన్నట్లుగానే నీ మాటలున్నాయి. ఏయ్ కేసీఆర్... ఇప్పటికైనా నీ మాటలు కట్టిపెట్టు. చేతైనె తే పార్టీ విధానాలు, సిద్ధాంతాలపై మాట్లాడు’’అని పొన్నాల మండిపడ్డారు. ఐదేళ్లు పాలమూరు ఎంపీగా ఉన్న కేసీఆర్ జిల్లా గురించి, తెలంగాణ గురించి పార్లమెంట్లో ఒక్క అంశం కూడా ప్రస్తావించలేదన్నారు. ఐదేళ్ల కాలంలో పార్లమెంట్లో రెండుసార్లు మాత్రమే కేసీఆర్ పెదవి విప్పారని, ఆ రెండు కూడా తెలంగాణకు సంబంధం లేని ఇతర అంశాలేనని చెప్పారు. ఉద్యమ నాయకుడు ఇలాగే ఉంటాడా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ హాజరుపట్టీలో అతి తక్కువగా హాజరైన వారిలో కేసీఆర్ ఒకరని పేర్కొన్నారు. తెలంగాణకోసం మిలియన్ మార్చ్తోపాటు వివిధ ఆందోళనల్లో తాము పాల్గొన్నామని, కాంగ్రెస్ అధిష్టానంతోపాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని అన్నారు. అలాగే నాలుగు నెలలపాటు కేబినెట్ సమావేశాలకు హాజరుకాకుండా నిరసన తెలిపామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలను ఒప్పించి, ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిందన్నారు. కేసీఆర్ టికెట్లు అమ్ముకున్నదీ లేనిది పైసలు ఇచ్చిన వారికి, ఆయనకే తెలుసని అన్నారు. ఆయన టికెట్లు అమ్ముకున్నారన్న మాటకు తాను కట్టుబడి ఉంటానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఆస్తులపై విచారణ జరుపుతారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆస్తులపై ఆరోపణలు వస్తే కచ్చితంగా విచారణ ఉంటుందని అన్నారు. కేవీపీ వల్లే తనకు టీపీసీసీ అధ్యక్షపదవి వచ్చిందనడంలో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్లో టీఆర్ఎస్ నేతల చేరిక: టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఆగిరి వెంకటేశ్, తెలంగాణ జాగృతి సంస్థ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు ఇందిరా శోభన్ సహా పలువురు టీఆర్ఎస్ నేతలు ఆదివారం కాంగ్రెస్లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వినయ్కుమార్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
నేడు పొన్నాల పర్యటన
సాక్షి, హన్మకొండ :తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జిల్లాలో పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. ఆదివారం ఒకేరోజు భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో హెలి కాప్టర్ ద్వారా పర్యటించనున్నారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం.. పొన్నాల లక్ష్మయ్య ఆదివారం ఉదయం హెలికాప్టర్లో భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రం బాంబులగడ్డ వద్దదిగి పట్టణంలో ఎన్నికల ప్రచారం సభలో పాల్గొం టారు. అక్కడి నుంచి పరకాల నియోజకవర్గం గీసుగొండ మండల కేంద్రానికి చేరుకుని ప్రసంగిస్తారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గం ఇదే మండలంలోని ఇల్లందకు చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి హన్మకొండ ఆర్ట్స్ కాలేజీకి చేరుకుని రోడ్డు మార్గంలో కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి చేరుకుంటారు. తర్వాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కల్యాణి పంక్షన్ హాల్లో కాంగ్రెస్ సభలో మాట్లాడతారు. ఈ మేరకు స్థానిక నియోజకవర్గాల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ‘దొంతి’ సస్పెన్షన్ నర్సంపేట నియోజకవర్గంలో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న దొంతి మాధవరెడ్డిని కాంగ్రెస్ నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్లు పీసీసీ ప్రకటించింది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాధవరరెడ్డికి మొదటి జాబితాలో టిక్కెట్ కేటాయించిన పార్టీ తర్వాత వెనక్కితీసుకుంది. దీంతో మాధవరెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన డీసీసీ అధ్యక్షపదవికి, కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాజీ నామా ఇంకా పీసీసీగానీ, డీసీసీగానీ చేరకపోవడం తో సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. -
ఏనాడైనా ఉద్యమంలో పాల్గొన్నావా..?
మహబూబ్నగర్ అర్బన్,న్యూస్లైన్: చం ద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వనందుకు తెలంగాణ పల్లవి ఎత్తుకున్న కేసీఆర్ ఏనాడూ ఉద్యమంలో పాల్గొనలేదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దుయ్యబట్టారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జిల్లాకు 21న రానున్న నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలనకు పట్టణానికి వచ్చిన పొన్నాల శనివారం స్థానిక షాలీమార్ ఫంక్షన్హాల్లో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సాగర హారం, మిలియన్మార్చ్, సకల జనుల సమ్మెలో పాల్గొనకుండా ఫామ్హౌజ్లో ఉండి ఏం చేశావని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటు ఎందుకు గుర్తుకు రాలేదని ఎద్దేవా చేశారు. మహబూబ్నగర్ ఎంపీగా గెలిచి ఇక్కడి ప్రజలను విస్మరించిన కేసీఆర్ కనీసం లోక్సభలో కూడా వారి సమస్యల గురించి ప్రస్తావించలేదని అన్నారు. పార్లమెంటు ఒక్కో ఎంపీ సగటున 76 శాతం హాజరైతే నీవు 13 శాతమే రోజులు మాత్రమే ఎందుకు వెళ్ళావని దెప్పి పొడిచారు. ఐదేళ్ళలో 2జీ స్ప్రెక్ట్రమ్పై ఒక సారి, ఓ మంత్రిపై దాడి జరిగిందని ఒకసారి మాత్రమే మాట్లాడారని వివరించారు. తెలంగాణను అడుగడుగునా అడ్డుకున్న టీడీపీ నాయకులను చే రదీసి ఉద్యమకారులను కించపరుస్తున్నారని అన్నారు. ‘దళితుణ్ణి సీఎం, మైనార్టీలను డిప్యుటీ సీఎం చేస్తానని ప్రగల్భాలు పలికిన నీ పార్టీ నుంచి ఆయా వర్గాల నేతలు విజయరామారావు,చంద్రశేఖర్ అతాస్ రెహమాన్,సయ్యద్ ఇబ్రాహీంలను ఎక్కడికి పంపావని’ అన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న దురాశతో సోనియాగాంధీపై విమర్శలు చేస్తున్నారని,వాస్తవాలు మాట్లాడుతున్న తనపై కూడా వ్యక్తిగత దూషణలు చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వద్దని అన్న నరేంద్రమోడీ ఏం మొఖం పెట్టుకొని ఈ ప్రాంతంలో ప్రచారానికి వస్తున్నారన్నారు. అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి,ఐఏసీసీ కార్యదర్శి ఆర్సీ కుంతియా, మాజీ మంత్రులు డీకే అరుణ, పి.చంద్రశేఖర్, నాయకులు కొత్వాల్, విఠల్రారావు తదితరులు పాల్గొన్నారు. -
నేను క్లీన్.. మరి నువ్వో..!
* కేసీఆర్ను ప్రశ్నించిన పొన్నాల * సీబీఐ నాకు క్లీన్చిట్ ఇచ్చింది * నీపై ఉన్న కేసుల సంగతేంటి? సాక్షి, హైదరాబాద్: సీబీఐ, లోకాయుక్త సంస్థలు తనకు క్లీన్చిట్ ఇచ్చాయని, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఉన్న ఆరోపణలకు ఏ సంస్థ క్లీన్చిట్ ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఆయనపై ఇప్పటికీ అక్రమ పాస్పోర్టులు, మనుషుల అక్రమ రవాణా కేసులున్నాయని గుర్తు చేశారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ ముందుగా ఆయనపై ఉన్న ఆరోపణలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్లో గురువారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఒకసారి దేవత, మరోసారి బలిదేవత అంటూ కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు నీచ, నికృష్టమైనవని విమర్శించారు. మోసానికి, వంచనకు, అవకాశవాదానికి ఆయన ప్రతిరూపమని విమర్శించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న కేసీఆర్ ఆ తర్వాత మహాకూటమితో జతకట్టారని, 2009లో ఫలితాలు రాకముందే బీజేపీ పంచన చేరిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. యూపీఏ ప్రభుత్వం 2009లో తెలంగాణను ప్రకటిస్తే అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు... కేసీఆర్ కు గురువేనన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీతో పనైపోవడంతో.. ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకమైన మూడో కూటమికి మద్దతిస్తానని కేసీఆర్ కొత్త పల్లవి ఎత్తుకున్నారని పొన్నాల మండిపడ్డారు. మూడో కూటమిలో ఉన్న సీపీఎం, టీఎంసీ, అన్నాడీఎంకే, సమాజ్వాదీ పార్టీలు పార్లమెంట్లో తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన విషయాన్ని కేసీఆర్ మరిచిపోయాడన్నారు. సీమాంధ్ర ఉద్యోగులంతా వెళ్లిపోవాల్సిందేనని, ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘ఉద్యోగులకు ఆప్షన్ విషయాన్ని కమలనాథన్ కమిటీ పరిశీలిస్తోంది. ఈ విషయంలో తెలంగాణ ఉద్యోగుల అభిప్రాయమే కాంగ్రెస్ అభిప్రాయం. ఇందులో మరొక దానికి తావులేదు’అని పొన్నాల పేర్కొన్నారు. కొప్పులతో కాంగ్రెస్కు నష్టం: మానవతారాయ్ ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చుతున్నారని ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకుడు, ఓయూ జేఏసీ నేత మానవతారాయ్ ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడే తనలాంటి వారికి టికెట్ రాకుండా రాజు అడ్డుకున్నారన్నారు. గాంధీభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పరిస్థితి, అభ్యర్థుల గురించి సోనియా, రాహుల్కు కొప్పుల తప్పుడు సమాచారమిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రాకు చెందిన కొప్పులకు గాంధీభవన్లో పనేముందని ప్రశ్నించారు. జైపూర్ డిక్లరేషన్కు భిన్నంగా టికెట్ల కేటాయింపు జరిగిందని, సోనియా దృష్టికి తీసుకెళతానని మానవతారాయ్ చెప్పారు. -
తెలంగాణలో వద్దు.. కేంద్రంలో ముద్దు!
ఎన్నికల తరువాత టీఆర్ఎస్ మద్దతుపై పొన్నాల లక్ష్మయ్య సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో టీఆర్ఎస్ మద్దతు తీసుకునే ప్రసక్తే లేదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేంద్రంలో మాత్రం అవకాశాన్ని బట్టి టీఆర్ఎస్ను యూపీఏలో భాగస్వామ్యం కావాలని కోరతామని చెప్పారు. గాంధీభవన్లో మంగళవారం పొన్నాల మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు పచ్చి అవకాశవాది అని విమర్శించారు. 2004లో కాంగ్రెస్కు, 2009లో ఎన్డీయేకు మద్దతు పలికిన కేసీఆర్ ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అంటూ మూడు నాల్కల ధోరణితో మాట్లాడుతుండు’’అని దుయ్యబట్టారు. సీపీఎం, ఎస్పీ, డీఎంకే, అన్నాడీఎంకే, జేడీయూసహా థర్డ్ఫ్రంట్లో ఉన్న పార్టీలన్నీ తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడినవేనని, అలాంటి పార్టీలతో టీఆర్ఎస్ ఎట్లా జతకడుతుందని ప్రశ్నించారు. -
అప్పుడే అస్త్రసన్యాసం..!
* దారీతెన్నూ లేని తెలంగాణ కాంగ్రెస్ పయనం * ప్రత్యర్థులపై ప్రచార దాడికీ దిక్కు లేని దైన్యం * జాడ లేని టీపీసీసీ ప్రచార కమిటీ * 30 మంది అధికార ప్రతినిధులున్నా ఫలితం సున్నా పసునూరు మధు: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విచిత్రమైన దైన్యాన్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ ఎన్నికల ప్రయాణం దారీతెన్నూ లేకుండా సాగుతోంది. చూస్తే సీఎం ఆశావహులేమో డజన్ల కొద్దీ ఉన్నారు. కానీ ప్రత్యర్థులపై కనీసం మూకుమ్మడిగా ఎదురుదాడి చేయలేక, ఉమ్మడిగా భారీ సభలు పెట్టి తెలంగాణ తెచ్చారన్న పేరును సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేయక, విపక్షాలను కట్టడి చేసే వ్యూహాలను కూడా రచించలేక... తెలంగాణ కాంగ్రెస్ పూర్తిగా దిగాలు పడి కన్పిస్తోంది. అసలు పార్టీలో జోష్ అన్నదే ఎక్కడా కన్పించడం లేదు. జిల్లాలవారీగా భారీ బహిరంగ సభలు నిర్వహించే శక్తి, సామర్థ్యాలు నేతల్లో కరువయ్యాయి. జనాన్ని సమీకరించే నాయకులు, ప్రజాకర్షణ కలిగిన నేతలే లేకుండా పోయారు. చివరికి 10 మంది రాష్ట్రస్థాయి నేతలు ఒక్కతాటిపైకి వచ్చి ప్రత్యర్థి పార్టీలను కనీసం ఎండగట్టలేని దుస్థితిలో ఉన్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ జాడ కాగడాతో వెదికినా కన్పించడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 30 మంది అధికార ప్రతినిధులను నియమించినా, వారంతా ఏమయ్యారో ఎవరికీ తెలియదు. తెలంగాణ ఇస్తే 16 ఎంపీ, 100 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపించి సోనియాగాంధీకి కానుకగా ఇస్తామని మూడేళ్లుగా బీరాలు పలికిన నాయకులంతా ఇప్పుడు కనీసం తాము గెలిస్తే అదే పదివేలనే రీతిలో తమ తమ నియోజకవర్గాలకే పరిమితమై చెమటోడుస్తున్నారు. తెలంగాణలో పార్టీని గెలిపించడం అసలు వీరి వల్ల అవుతుందా అని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు తల పట్టుకుంటోంది. కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు తదితరులను రంగంలోకి దించి తెలంగాణ అంతటా ప్రచారం చేయిస్తున్నా ఫలితం కన్పించకపోవడంతో అయోమయంలో పడింది. వీళ్ల వల్ల కాదు! తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేసి రాష్ట్రమంతటా కాంగ్రెస్కు ఊపు తేవాలని తొలుత భావించిన పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ సైతం ఇప్పుడు స్థానిక నేతల నిర్వాకం కారణంగా పునరాలోచనలో పడ్డారని సమాచారం. భారీ బహిరంగ సభలు నిర్వహించాలంటే ఆ స్థాయిలో జనాన్ని సమీకరించాలని, ఆ సత్తా తెలంగాణ నేతలకు లేదని భావనకు వచ్చారు. తెలంగాణలో చెరో మూడు భారీ బహిరంగ సభలు, జిల్లాలవారీగా రోడ్షోలు నిర్వహించాలనుకున్నా ఇప్పుడు వాటిని కుదించుకున్నారు. కరీంనగర్లో బుధవారం జరిగే బహిరంగ సభకు హాజరై అక్కడితో సరిపెట్టాలని సోనియా భావిస్తున్నారు. ఈ నెల 21 లేదా 25న మాత్రమే తెలంగాణలో పర్యటించి వెళ్లాలని రాహుల్ యోచిస్తున్నారు. ఇంట్లోనే పొన్నాల బ్యాటింగ్ గులాబీ దళపతి కేసీఆర్ హెలికాప్టర్లో తెలంగాణ అంతటా కలియదిరుగుతున్నారు. జిల్లాలవారీగా భారీ బహిరంగ సభలతో కాంగ్రెస్ పాలనను ఎండగడుతున్నారు. టీ కాంగ్రెస్ నేతలపై దుమ్మెతిపోస్తున్నారు. కానీ తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది తామేనంటున్న కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పటిదాకా కనీసం ఒక్క బహిరంగ సభ కూడా నిర్వహించలేకపోయారు. తెలంగాణ ముఖ్య నేతలుగా చెప్పుకునే వారంతా సొంత నియోజకవర్గాలకు, జిల్లాలకే పరిమితమయ్యారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల కూడా కేసీఆర్పై కేవలం ప్రెస్మీట్ విమర్శలతో సరిపెడుతున్నారు. రాష్ట్రమిచ్చాక తొలిసారిగా, అందులోనూ ఎన్నికల వేళ సోనియా తెలంగాణలో అడుగుపెడుతుంటే ఆమె సభకు భారీ ఎత్తున ఏర్పాట్లుంటాయని అంతా అనుకుంటారు. కానీ టీ కాంగ్రెస్ నేతలు మాత్రం జనాన్ని తరలించడం తమ వల్ల కాదని, డబ్బులు ఖర్చు చేయలేమని అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో తొలి బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో జరిపి సోనియాకు కృతజ్ఞతలు చెబుతామని ఈ నేతలంతా ఫిబ్రవరిలో ప్రకటించడం తెలిసిందే. కానీ ఆ మైదానం నిండాలంటేనే 6 లక్షల పై చిలుకు జనం రావాలి. అదనంగా చుట్టుపక్కల మరో రెండు లక్షల మందిని సమీకరిస్తే తప్ప సభ విజయవంతం కాదని భయపడ్డ నేతలు, ఆ ప్రయత్నాన్ని విరమించుకుని కరీంనగర్లో సభ పెడుతున్నారు. పైగా సోనియా రాష్ట్రంలో పర్యటించినప్పుడల్లా గాంధీభవన్ నుంచి మీడియా ప్రతినిధులను ప్రత్యేకంగా తీసుకెళ్లి భారీగా ప్రచారం పొందేవాళ్లు. సభ విఫలమైతే లేనిపోని విమర్శలొస్తాయని భావించారో ఏమో గానీ, ఈసారి మాత్రం సభకు తమంతగా మీడియాను తీసుకెళ్లకూడదని నిర్ణయించారు. ‘సీఎం’లు కలిసి మాట్లాడే సీన్ లేదు! దామోదర రాజనర్సింహ, కె.జానారెడ్డి, డి.శ్రీనివాస్, పొన్నాల, ఉత్తమ్కుమార్రెడ్డి, వి.హన్మంతరావు... ఇలా తెలంగాణ కాంగ్రెస్లో సీఎం అభ్యర్థులకు కొదవే లేదు. కానీ వీరంతా కలిసి ఒకే వేదికపై కూర్చుని మాట్లాడే సీన్ మాత్రం కన్పించడం లేదు. ఎవరికి వారే తామే గొప్ప అనే భావనలో ఉన్నారు. ముఖ్యంగా పొన్నాలకు టీపీసీసీ పగ్గాలు అప్పగించాక వీరు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకే కనీసం 16 మంది ఎంపీ అభ్యర్థులనైనా ఒకే వేదికపై కూర్చోబెట్టి కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టాలని టీపీసీసీ భావించింది. అందరినీ మంగళవారం గాంధీభవన్కు రావాల్సిందిగా ఆదేశించింది. ఉదయం పదింటికి వారంతా మీడియాతో మాట్లాడతారని విలేకరులకు సమాచారమిచ్చింది. కానీ తీరా చూస్తే ఆ సమయానికి గుత్తా సుఖేందర్రెడ్డి, వివేక్ మాత్రమే వచ్చారు. మరో గంటకు రాజయ్య, మధు యాష్కీ వచ్చారు. దాంతో ఆ నలుగురితోనే ప్రెస్మీట్ పెట్టి చాలించారు! ‘రెబల్స్’పై వేటు వేయలేని దుస్థితి ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ వేసిన నేతలపై చర్యలు తీసుకోలేని దుస్థితిలో టీపీసీసీ పెద్దలున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసి నాలుగు రోజులైనా వారిపై ఇప్పటికీ చర్యలూ తీసుకోలేదు. ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించే అధికారమున్నా మిన్నకుంది.పైగా వరంగల్ డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి వంటి తిరుగుబాటు అభ్యర్థులైతే తామే కాంగ్రెస్ను బహిష్కరిస్తున్నామంటూ పేర్కొంటూ పార్టీకి, పదవులకు రాజీనామా చేసేశారు! -
కేసీఆర్ టికెట్లు అమ్ముకోలేదా: పొన్నాల
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మరోసారి మండిపడ్డారు. టీఆర్ఎస్ టికెట్లు అమ్ముకున్న విషయం వాస్తవం కాదా.. తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పి, మాట తప్పిన విషయం నిజం కాదా.. అవకాశవాదంతో కేంద్రంలో మంత్రి పదవిని తీసుకోలేదా అంటూ నిలదీశారు. ఇంతకుముందు ఎన్నికలలో మహాకూటమి పేరుతో టీడీపీతో పొత్తు పెట్టుకుని, ఇంకా ఫలితాలు రాకముందే బీజేపీ నాయకులతో మంతనాలు జరిపిన కేసీఆర్.. ఈసారి మైనారిటీ ఓట్ల కోసం థర్డ్ ఫ్రంట్తో కలుస్తానని చెప్పడం భావ్యమేనా అంటూ పొన్నాల నిలదీశారు. అయితే, ఎన్నికల తర్వాత మాత్రం ఒకవేళ యూపీఏలోకి టీఆర్ఎస్ వస్తామంటే అప్పుడు పరిశీలిస్తామని ఆయన చెప్పారు. -
శ్రవణ్ రాక.. టీ కాంగ్రెస్లో కాక
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే విభేదాలు భగ్గుమన్నాయి. టీఆర్ఎస్ నుంచి వచ్చిన శ్రవణ్ను టీ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమించడాన్ని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. షబ్బీర్ అలీ పదవిని తీసి శ్రవణ్కు ఇవ్వడం సరికాదని, ఈ విషయంలో పొన్నాల పునరాలోచించకపోతే అందరం రాజీనామా చేసి తమ నిరసన తెలియజేస్తామని సీనియర్ నాయకుడు నిరంజన్ హెచ్చరించారు. దాసోజు శ్రవణ్తో పాటు కట్టెల శ్రీనివాస యాదవ్ కూడా టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వెంటనే పొన్నాల వారికి పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో శ్రవణ్ను టీ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమించారు. ఇదే ఇప్పుడు పార్టీలో విభేదాలకు కారణమైంది. -
కేసిఆర్ది మాటల గారడి
నేడు మేనిఫెస్టో విడుదల అమరుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ రఘునాథపల్లి, న్యూస్లైన్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు మాటల గార డి చేస్తున్నాడని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. శుక్రవారం తన స్వగ్రామమైన వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడని, మైనార్టీలకు ఉప ముఖ్యమంతి పదవి ఇస్తానని చెప్పిన కేసీఆర్.. తెలంగాణ రాగానే సీఎం పదవి కోసం మాట మార్చాడని దుయ్యబట్టారు. రాష్ట్రం తామే తెచ్చామని టీఆర్ఎస్ నేతలు చె ప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇద్దరు ఎంపీలున్నవారికి రాష్ట్రాన్ని తెచ్చే బలం ఉంటుందా? అని ప్రశ్నించారు. సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారన్నారు. నియోజకవర్గంలో లక్ష ఎకరాల భూములే లేనప్పుడు కేసీఆర్ లక్ష ఎకరాలకు సాగు నీరు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో 15 ఎంపీ, 100 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసి బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోను శనివారం విడుదల చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇస్తామని, జయశంకర్ ట్రస్ట్ పేర వంద కోట్ల నిధి ఏర్పాటు చేస్తామని, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులకు పగటి పూటనే ఉచిత విద్యుత్ ఇవ్వనున్నామన్నారు. రుణమాఫీ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆకలి.. అవమానం.. అమెరికా గతాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టిన పొన్నాల ‘ఆకలికి ఓర్చుకున్నా.. అవమానాలు భరించా.. ఆ కసితో కష్టపడి చదవి అమెరికా వెళ్లాను. ఇప్పుడు తెలంగాణ పీసీసీఅధ్యక్షుడి స్థాయికి ఎదిగాను’ అని పొన్నాల లక్ష్మయ్య తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ‘జీవితంలోనే కాదు .. పార్టీలోనూ అవమానించారు. అన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డా’ అంటూ ఆయన కంటతడిపెట్టారు. స్థానిక సంస్థల పోలింగ్ సందర్భంగా స్వగ్రామం ఖిలాషాపురంలో ఓటు వేశాక అందరినీ ఆప్యాయంగా పలకరించారు. కుటుంబ సభ్యులతో కలసి తన పెంకుటింట్లో కొద్దిసేపు విలేకరులతో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. -
ఆ చేత్తో సీటు..ఈ చేత్తో రెబెల్కు బీఫాం
మహేశ్వరం సీటుపై కాంగ్రెస్ వింత వాదన షరతుతో కూడిన బీ.ఫాం ఇచ్చామన్న పొన్నాల సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు రాజకీయ పార్టీల మధ్య స్నేహపూర్వకంగా పోటీ గురించి మనకు తెలుసు... పొత్తు కుదిరినా కొన్నిచోట్ల అవగాహనతో పోటీ చేసిన సందర్భాలూ చూశాం. ఈ ఎన్నికల్లో మాత్రం షరతుల తో కూడిన పోటీ అనే కొత్త నిర్వచనాన్ని వింటున్నాం. అది కూడా 128 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ నుంచి ఈ మాట వెలువడడం విస్మయం కలిగిస్తోంది. పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వయంగా ఆయనకు బీ.ఫాం అందజేశారు. ఇక్కడి నుంచి సీపీఐ అభ్యర్థిగా మాజీ ఎంపీ అజీజ్పాషా ఇదివరకే నామినేషన్ వేశారు. ఇదే విషయాన్ని గురువారం విలేకరులు పొన్నాలతో ప్రస్తావించగా ఆయన వింత వాదన వినిపించారు. ‘పొత్తులో భాగంగా మహేశ్వరం స్థానాన్ని సీపీఐకి కేటాయించిన మాట వాస్తవమే. హైకమాండ్ ఆదేశాల మేరకు మల్రెడ్డికి బీ.ఫాం ఇచ్చాం. ఇది షరతులతో కూడినదే. ఉపసంహరణ గడువులోపు దీనిపై నిర్ణయం తీసుకుంటాం’అని బదులిచ్చారు. వేరే పార్టీకి కేటాయించిన స్థానంలో మీ పార్టీ బీ.ఫాం ఇవ్వడం అనైతికం కాదా? అని ప్రశ్నించగా ఆయన ఆగ్ర హంతో, ‘అనైతికమని అంటే ఎలా? ఇది మోసం కానేకాదు. ముందే చెప్పాను కదా! కండీషన్స్తో కూడిన బీ.ఫాం ఇచ్చామని...’అని రుసరుసలాడారు. మీ సొంత జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డికి కేటాయించిన సీటును మరొకరికి ఇవ్వడం వెనుక మీ హస్తమే ఉందని ఆరోపణలు వస్తున్నాయి కదా అని అడిగితే ‘హైకమాండ్ నిర్ణయం మేరకే వేరే పేరు ప్రకటించాను’అని బదులిచ్చారు. కోదాడ సీటును సీపీఐకి కేటాయించలేదా? అని ప్రశ్నిస్తే ‘ సీపీఐకి 7 అసెంబ్లీ, 1 ఎంపీ సీటు మాత్రమే కేటాయించాం. అందులో కోదాడ లేదు’అని పేర్కొన్నారు. పాపం..సీపీఐ!: పొత్తు చర్చలు మొదలైనప్పటి నుంచి సీపీఐ నేతలకు కాంగ్రెస్ పార్టీ వరుసగా షాకులిస్తోంది. ప్రారంభంలో 22అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలను ప్రతిపాదించిన సీపీఐ నేతలు తెలంగాణ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా 17 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానం ఇచ్చినా సరిపెట్టుకుంటామని పేర్కొన్నారు. రెండుపార్టీల నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపిన మీదట 1 ఎంపీ 12 అసెంబ్లీ స్థానాలపైఅంగీకారానికి వచ్చారు. ఆ ప్రతిపాదనతో ఢిల్లీ వెళ్లొచ్చిన పొన్నాల సీపీఐ నేతలతో సమావేశమై 10అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానం ఇచ్చేందుకు హైకమాండ్ సుముఖంగా ఉందన్నారు. ఏమైందో ఏమో...రెండ్రోజులు తిరగకుండానే ఖమ్మంపార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాలు మాత్రమే సీపీఐకి కేటాయించాలని హైకమాండ్ నిర్ణయించినందున తానేమీ చేయలేనని నిస్సహా యత వ్యక్తం చేశారు. ఇక లాభం లేదనుకున్న సీపీఐ నేతలు నేరుగా ఢిల్లీని కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరపగా.. ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో హుస్నాబాద్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైనందున దానిని సీపీఐకి కేటాయించడం సాధ్యం కాదని, ఏడు స్థానాలు మాత్రమే ఇస్తామని షరతు విధించింది. పొత్తు చర్చల్లో కాంగ్రెస్ నేతలు వేస్తున్న పిల్లి మొగ్గలతో తీవ్ర అసంతృప్తికి గురైన సీపీఐ నేతలు చేసేదేమీలేక ఏడు సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. తీరా నామినేషన్లు ముగిసే సమయానికి చూస్తే ఆ ఏడు నియోజకవర్గాల్లోనూ ఐదింట్లో కాం గ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు వేయడం, అందులోనూ మహేశ్వరం నియోజకవర్గంలో నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీయే స్వయంగా బీ.ఫాం ఇవ్వడాన్ని కమ్యూనిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
జయమెవరిదో..!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బరిలో ఉన్న జనగామ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదృష్టం కలిసి వచ్చి టీపీసీసీ చీఫ్ అయిన పొన్నాలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుందన్న ఉత్కంఠ కన్నా జనగామ ముఖచిత్రం ఎలా ఉండబోతుందన్న విశ్లేషణలే ఎక్కువయ్యాయి. హింగె మాధవరావు, జనగామ: పొన్నాల లక్ష్మయ్య మరోసారి ఎన్నికల బరిలో దిగారు. నాలుగుసార్లు గెలిచిన పొన్నాల ఈసారి టీపీసీసీ అధ్యక్షుడిగా బరిలోకి దూకారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే గా, పదేళ్లు మంత్రిగా పనిచేసిన ఆయన సహజంగా ఉండే వ్యతిరేకతను దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణవాదం, తెలంగాణ ఏర్పాటు, అభివృద్ధి అంశాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. పొన్నాలను గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. మరోవైపు జనగామ నియోజకవర్గ అభివృద్ధికి పొన్నాల చేపట్టిన కార్యక్రమాలేవీ కార్యరూపం దాల్చకపోవడం ఆయనకు ప్రతికూల అంశంగా మారింది. నియోజకవర్గంలో ఐదు రిజర్వాయర్లు, నాలుగు పెద్ద జలాశాయాల ద్వారా దేవాదుల నీటిని ఇక్కడికి తరలించే బృహత్తర కార్యక్రమం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దీనికితోడు కాంగ్రెస్ కార్యదర్శులు ఇద్దరు రెబెల్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వీరు ఉపసంహరించుకుంటారా పోటీలో కొనసాగుతారా అనేది ఆసక్తికరంగా ఉంది. దూసుకెళ్తున్న ముత్తిరెడ్డి టీ పీసీసీ చీఫ్పై గెలవాలన్న పట్టుదలతో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పొన్నాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనలేదని.. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతూ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. కసిగా ‘కొమ్మూరి’ గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పొన్నాల చేతిలో ఓటమికి గురై.. ఫలితం విషయంలో వివాదం చోటుచేసుకున్న కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఈసారి ఎలాగైనా పొన్నాల ను ఓడించాలనే కసితో ఉన్నారు. ఇక వైఎస్సార్ సీపీ నుంచి బరిలో ఉన్న వజ్రోజు శంకరాచారి వైఎస్సార్ సంక్షేమ పథకాలే ఎజెండాగా ముందుకు వెళ్తున్నారు. వైఎస్ అభిమానులు తనకు అండగా ఉంటారన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ పథకాలే తనను గెలిపిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకుడు మండలి శ్రీరాములు ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గం జనగామ ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 9, సీపీఎం-2, టీడీపీ-1, పీడీఎఫ్-1, సీపీఐ-1 తొలి ఎమ్మెల్యే: సయిద్ ఏ హుస్సేన్ (పీడీఎఫ్) ప్రస్తుత ఎమ్మెల్యే: పొన్నాల లక్ష్మయ్య (కాంగ్రెస్) రిజర్వేషన్: జనరల్ నియోజకవర్గ ప్రత్యేకతలు: రాజకీయ చైతన్యం గల నియోజకవర్గం. మైనార్టీ ఓట్ల ప్రభావం. బీసీ ఓటర్లు అధికం. ప్రస్తుతం బరిలో నిలిచింది: 24 ప్రధాన అభ్యర్థులు వీరే.. పొన్నాల లక్ష్మయ్య (కాంగ్రెస్) కొమ్మూరి ప్రతాప్రెడ్డి (బీజేపీ) ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (టీఆర్ఎస్) వజ్రోజు శంకరాచారి (వైఎస్సార్సీపీ) - జనగామలో మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తా. - కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పగలే నిరంతరాయంగా 7 గంటల కరెంటు సరఫరాకు చర్యలు తీసుకుంటా. - ఐటీఐఆర్లో జిల్లాకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తా. - నియోజకవర్గంలోని రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేస్తా. - జనగామకు దేవాదుల గోదావరి జలాలు తెప్పిస్తున్న ఘనత కాంగ్రెస్దే - పొన్నాల లక్ష్మయ్య - రైతులకు సాగునీరు అందిస్తా.. గోదావరి నీళ్లను ప్రతి ఇంటికీ అందించి తాగునీటి సమస్యను పరిష్కరిస్తా. - జనగామలోని.53/1 సర్వే నెంబర్లో గత 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న వాళ్లకు ఆర్నెళ్లల్లో - ఇళ్ల పట్టాలు ఇప్పిస్తా.. - వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తా.. మౌలిక వసతులను కల్పిస్తా . జనానికి అందుబాటులో ఉంటా. - విద్యాభివృద్ధికి, పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపుతా.. - కొమ్మూరి ప్రతాప్రెడ్డి నే.. గెలిస్తే.. - మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా - వైఎస్ ఆశయ సాధన కోసం పాటుపడతా.. - రైతాంగానికి సాగునీరందించేందుకు పనిచేస్తా.. తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతా - ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తా.. - ఇళ్లు.. పింఛన్లు.. రేషన్కార్డులు.. తదితర సమస్యల పరిష్కారం కోసం పాటుపడతా. - వజ్రోజు శంకరాచారి - చిన కోటూరు రిజర్వాయర్ నుంచి వస్తున్న కలుషిత నీటి నుంచి ప్రజలకు ఊరట కల్పిస్తా. జనగామలోని తాగునీటి సమస్యను పరిష్కరిస్తా. - ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా. - ఆయకట్టుకు సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటా - అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తా, అభివృద్ధికి జనం మద్దతుతో కృషి చేస్తా. - ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇదేనా ‘సత్తా’..! ఆయనో మాజీ ఐఏఎస్ అధికారి... ప్రస్తుతం ఓ పార్టీకి అధినేత... ‘అవినీతిని నిర్మూలిద్దాం. సమగ్ర అభివృద్ధికి పాటుపడి సత్తా చాటుదాం’ అనేది ఆయన నినాదం. కానీ తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో సీడీపీ(నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం) నిధులు పైసా ఖర్చు చేయలేదు. పదవీకాలం ముగియనుండడంతో ఈ నిధులిక ఖర్చుచేసే అవకాశం కూడా లేదు. సీడీపీ కింద ప్రతి నియోజకవర్గానికి ఏటా రూ.కోటి విడుదల చేస్తుంది. ఇందులో సగం నిధులు ఎమ్మెల్యే సొంతంగా గుర్తించిన పనులకు వినియోగించాలి. మిగతా సగం నిధులు ఇన్చార్జి మంత్రి అనుమతితో ఖర్చు చేయాలి. కూకట్పల్లి శాసనసభ్యుడు, లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఎమ్మెల్యే కోటా కింద రూ.49.75లక్షలు, ఇన్చార్జి మంత్రి కోటా కింద రూ.49.75 లక్షల చొప్పున మొత్తం రూ.99.5 లక్షలు విడుదలయ్యాయి. వీటిని ఖర్చు చేయకపోవడంతో ఖజానాలో మూలుగుతున్నాయి. జేపీ ఎమ్మెల్యే కోటాలో 9 పనులను, ఇన్చార్జి మంత్రి కోటాలో మరో 16 పనులను ప్రతిపాదించినా వాటి పురోగతిని పట్టించుకోలేదు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా -
తుపాకీ రాముడు.. బుడబుక్కలోడు!
జనగామ/పాలకుర్తి, న్యూస్లైన్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు తుపాకీరాముడని, ఆయనిచ్చే ఎన్నికల హామీలు ఆచరణ సాధ్యం కావని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా జనగామ, పాలకుర్తిలో జరిగిన సభల్లో మాట్లాడారు. వర్రుబోతు కేసీఆర్ మాటలను నమ్మవద్దన్నారు. ఆయన ఇచ్చే హామీలకు ప్రతీ ఏటా రూ.5లక్షల కోట్లు అవసరమని, కానీ ప్రభుత్వ బడ్జెట్ రూ.80వేల కోట్లు మాత్రమే ఉంటుందని.. ఇందులో నుంచే ఉద్యోగుల జీతాలు ఇవ్వాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి పనులూ చేయలేదన్నారు. తెలంగాణ ఉద్యమానికి గండి కొట్టిన, ఉద్యమాన్ని అడ్డుకున్న నేతలకు పార్టీ టికెట్లు ఇచ్చాడని విమర్శించారు. కేసీఆర్ తానే తెలంగాణ తెచ్చానని మాటలు చెబుతూ.. ఎన్నికలు రాగానే బుడబుక్కలోడి వేషాలేస్తున్నాడని పొన్నాల విమర్శించారు. ఇద్దరు ఎంపీలున్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చామని చెబితే నమ్మే వారెవరూ లేరన్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలైన బీజేపీ, టీడీపీ, సీపీఎంలతో కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపించారు. సకల జనుల సమ్మె జరుగుతున్న సమయంలో కేసీఆర్ ఫాం హౌస్లో పడుకున్నాడని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ 100 అసెంబ్లీ, 15 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని పొన్నాల ధీమా వ్యక్తం చేశారు. సోనియా, కాంగ్రెస్, తెలంగాణ ఈ మూడు అంశాలే తమ ప్రచారాస్త్రాలని ఆయన చెప్పారు. -
పొన్నాలకు వ్యతిరేకంగా అర్చకుల సర్పయాగం
హైదరాబాద్, న్యూస్లైన్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు వ్యతిరేకంగా బుధవారం ఆ ప్రాంత అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో పాశుపత సహిత మూల మంత్రయుక్త మహా సర్పయాగం నిర్వహించారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంవీ సౌందరరాజన్, కార్యనిర్వాహక అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అర్చక సమస్యలను తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుతామని హామీ ఇచ్చి మోసం చేసినందుకు నిరసనగా ఈ యాగాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. 2007లో సవరించిన చట్టాన్ని అమలు పర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు కొత్త వాగ్దానాలతో తెలంగాణ ప్రాంతంలోని 11,220 దేవాలయాల అర్చక ఉద్యోగులను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వరంగల్ జిల్లా హన్మకొండ పశ్చిమ నియోజవర్గంలో 1952 నుండి బ్రాహ్మణులకు స్థానం ఉండేదని, గత శాసనసభ ఎన్నికల్లో కొండపల్లి దయాసాగర్ బ్రాహ్మణ అభ్యర్థిని ఓడించిన వారికి ఇప్పుడు టికెట్ ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు తమ మేనిఫెస్టోలలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాయని పేర్కొన్నారు. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారికి తగిన బుద్ది చెప్పేందుకు సమయం ఆసన్నమైందని చెప్పారు. -
నిస్సారథ్యం
* తెలంగాణ కాంగ్రెస్లో అంతా కంగాళే * నేతల్లో నిస్తేజం, కార్యకర్తల్లో నిరాశ * వైఎస్లా నడిపించే నాయకుడు లేక దిగాలు * ప్రతిదానికీ బేలగా అధిష్టానం వైపు చూపులు * సీఎం ఆశావహుల గెలుపే అనుమానాస్పదం! పసునూరు మధు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు మరో మూడు వారాలే ఉంది. ఈ పరిస్థితుల్లో మామూలుగానైతే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తున్న పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్ దూసుకుపోవాలి. కానీ వాస్తవంలో మాత్రంఆ పార్టీలో అంతా రివర్స్ గేరులో నడుస్తోంది. సర్వత్రా నిస్తేజం. ఎటుచూసినా నీరసపూరిత వాతావరణం. పార్టీలో చేరేందుకు పలువురు ఉత్సాహం చూపుతున్నా, వారిని అక్కున చేర్చుకునే దిక్కు కూడా లేని అయోమయం. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలు పెట్టి కూడా జాబితాల ప్రకటనలో ఆద్యంతం అంతులేని గందరగోళం. చిన్నాచితకా విషయాలకు కూడా అధిష్టానం కేసి బేలగా చూడాల్సిన నిస్సహాయత. అసలు పార్టీ బరువు బాధ్యతలను పూర్తిగా భుజాన వేసుకుని ముందుకు నడిపే నాయకుడంటూ ఎవరూ కన్పించని దైన్యం. వెరసి విచిత్రమైన నిస్సహాయత తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పట్టి పీడిస్తోంది! ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చిన పార్టీగా కాంగ్రెస్, ఉద్యమ చాంపియన్గా టీఆర్ఎస్ తెలంగాణలో ప్రధానంగా పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ప్రభావం ఇక్కడ నామమాత్రమే. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఇతర పార్టీల నేతలను ఆకర్షించడం మొదలుకుని అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం దాకా అన్ని విషయాల్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. కానీ కాంగ్రెస్లో మాత్రం పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిని నియమిస్తే ఇలాంటి ఇబ్బందులు తొలగిపోతాయని మొన్నటిదాకా భావించారు. కానీ టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించిన తరవాత కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం తొలగలేదు. వ్యక్తిస్వామ్యం నడుస్తున్న నేటి రాజకీయాల్లో పార్టీ ఎలాంటిదనేది మాత్రమే కాకుండా నాయకుడెవరనేది కూడా ప్రధానాంశంగా మారింది. తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ను కేసీఆర్ అన్నీ తానై నడిపిస్తున్నారు. పార్టీ తరఫున సీఎం అభ్యర్థి కూడా ఆయనేనని జనమూ భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ విషయం మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. గెలిస్తే ఎవరు సీఎం అవుతారనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నే. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా తమ సారథి ఎవరనే విషయంలో స్పష్టత లేదు. పొన్నాల, ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, డి.శ్రీనివాస్, వి.హన్మంతరావు, మర్రి శశిధర్రెడ్డి... ఇలా కనీసం ఓ డజను మంది కాంగ్రెస్ నేతలు తామే సీఎం అవుతామనే భావనలో ఉన్నారు. 2004, 2009 ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో ఇలాంటి అయోమయానికి తావే లేని పరిస్థితి! సీఎం అభ్యర్థిని అధిష్టానం ప్రకటించకపోయినా, ఇప్పట్లాగే అప్పుడూ ఎంతోమంది నేతలు రేసులో ఉన్నామని భావించినా, కాంగ్రెస్ గెలిస్తే వైఎస్సే ముఖ్యమంత్రి అని పార్టీ కార్యకర్తలతో పాటు రాష్ట్ర ప్రజలంతా ముందే అంచనాకు వచ్చారు. పదేళ్ల టీడీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు, కాంగ్రెస్ను గెలిపిస్తే వైఎస్ సీఎం అవుతారనే భావనతోనే ఆ మేరకు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో పార్టీకి సమర్థ సారథి మాట అటుంచి, కనీసం పార్టీలో చేరాలని ఆశ పడుతున్న ఇతర పార్టీల నేతలకు భరోసా ఇచ్చే నాయకుడు కూడా కరువయ్యాడు. కాంగ్రెస్లో చేరాలంటే ఎవరిని కలవాలో, ఎవరి సమక్షంలో చేరితే టికెట్లు వస్తాయో, రాకపోయినా మున్ముందు భవిష్యత్తు ఉంటుందోననే అనేకానేక సందేహాలు వారిని తీవ్రంగా వేధిస్తున్నాయి. పొన్నాలతో సహా, తాము సీఎం రేసులో ఉన్నామని ప్రచారం చేసుకునే నేతల్లోనూ ఏ ఒక్కరిపైనా ఇతర పార్టీల నేతలకు నమ్మకం లేని పరిస్థితి! వారిని నమ్ముకుంటే పని కాదనే ఉద్దేశంతో చాలామంది తమ ఢిల్లీ పరిచయాల సాయంతో అధిష్టానం పెద్దలను కలిసి, వారి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.కనీసం టికెట్లు రావని నిరాశ పడుతున్న పార్టీ నేతలను బుజ్జగించే దిక్కు కూడా లేకపోవడం చూస్తే తెలంగాణలో నాయకత్వ లోపం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సొంతింటిని చక్కదిద్దులేని నాయకులు ఇక, సీఎం రేసులో ఉన్నామని భావిస్తున్న పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సొంత నియోజకవర్గాల్లోనే ఎదురుగాలి తరహా వాతావరణం నెలకొని ఉండటం మరో వైచిత్రి! కచ్చితంగా గెలుస్తామనే ధీమా కూడా వారిలో కన్పించడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య 2009లో కేవలం 236 ఓట్ల తేడాతో గట్టెక్కారు. ఈసారి కూడా ఆయన పరిస్థితి అంతకంటే ఏమీ మెరుగు పడలేదు. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను తట్టుకుని గెలవాలంటే చెమటోడ్చక తప్పని పరిస్థితి. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ది అంతకంటే దారుణమైన పరిస్థితి. 2009 సాధారణ ఎన్నికల తో పాటు 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా పీసీసీ అధ్యక్షుని హోదాలో ఉంటూ కూడా ఘోర పరాజయం పాలయ్యారాయన. ఈసారి తన గెలుపు ఖాయమని ఆయన చెబుతున్నా నిజానికి పరిస్థితి అంతా ఆశాజనకంగా లేదు. ఇక నిన్నటిదాకా తెలంగాణ కాంగ్రెస్కు అన్నీ తానై పార్టీని ముందుకు నడిపించి, టీపీసీసీ చీఫ్గా పొన్నాల నియామకం తరవాత ఒక్కసారిగా సెలైంట్ అయిన కుందూరు జానారెడ్డి కూడా సొంత నియోజకవర్గం నాగార్జునసాగర్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి ఆయనను ముప్పుతిప్పలు పెట్టారు. హోంమంత్రిగా ఉంటూ కూడా గెలవడానికి నానా తంటాలు పడ్డారు. చివరికి స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. ఈసారి కూడా జానా గెలుపు అంత తేలిక కాదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక టీపీసీసీ ప్రచార సారథి దామోదర రాజనర్సింహకు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన సినీ నటుడు బాబూమోహన్ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. 2009లో కూడా బాబూమోహన్ దెబ్బకు దామోదర కేవలం 2,000 పై చిలుకు ఓట్లతో బయటపడ్డారు. -
'ఏ అంశంపైనైనా బహిరంగ చర్చకు సిద్ధం'
-
పొన్నాలకు అంత సీన్ లేదు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో కిరణ్ సర్కార్లో పదవులను అనుభవించిన మంత్రులు.. ఇప్పుడెలా గొప్పవారయ్యారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు తనను విమర్శించే స్థాయి లేదన్నారు. ‘పొన్నాల నన్ను విమర్శించేంత వాడయ్యాడా? నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే అక్రమ ప్రాజెక్టును నిర్మించారు. వాటి విజయ యాత్రకు కూడా వెళ్లావు. అలాంటి వ్యక్తుల చేతుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని పెడతామా?’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. పొన్నాలకు అప్పనంగా టీపీసీసీ పదవి వచ్చిందని వ్యాఖ్యానించారు. జగిత్యాలకు చెందిన డాక్టర్ సంజయ్ బుధవారం తన అనుచరులతో టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. మంచి నాయకత్వముంటేనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివద్ధి చెందుతుందన్నారు. ‘విజన్ ఉన్నవాడే తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపించాలి. అప్పుడే అభివద్ధి సాధ్యం. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఊరికే ఇవ్వలేదు. ఉద్యమం ద్వారానే రాష్ర్టం సాకారమైంది. ఉద్యమాన్ని నడిపించిన టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే తెలంగాణ అభివద్ధి సాధ్యమవుతుంది’ అని కేసీఆర్ అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం...ఇక అభివద్ధి చేసుకుందాం’ అని పిలుపునిచ్చారు. కాగా, మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ టికెట్ను లక్ష్మికే ఇవ్వాలంటూ ఆమె మద్దతుదారులు బుధవారం ఇక్కడి తెలంగాణ భవన్ ముందు ఆందోళనకు దిగారు. అయితే ఆ సమయంలో కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో ఈ విషయాన్ని అధినేత దష్టికి తీసుకెళతామని పార్టీ కార్యాలయ సిబ్బంది వారికి నచ్చజెప్పారు. -
మోసం.. దగా.. అబద్ధాలు: పొన్నాల
* టీఆర్ఎస్ పునాదులివే: టీ-పీసీసీ చీఫ్ పొన్నాల ధ్వజం * కేసీఆర్కు అహకారం ఎక్కువైంది * అమరవీరుల కుటుంబాలను అవమానిస్తావా? * తెలంగాణ ప్రజలు తగిన శాస్తి చేస్తారు సాక్షి, హైదరాబాద్: అబద్ధాల పునాదులు, మోసం, దగా, కుట్ర, నమ్మక ద్రోహం వంటి వాటితో నిర్మించిందే టీఆర్ఎస్ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. నిత్యం అబద్దాలాడుతూ గుడ్డిగా ఓట్లు దండుకోవాలనుకునే ఆ పార్టీ అధినేత కేసీఆర్ గురించి మాట్లాడాల్సిందేముందని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కమ్మ, రెడ్లు రాజ్యమేలగా లేనిది.. తన సామాజికవర్గం రాజ్యమేలితే ఏముం దంటూ కేసీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు తగిన శాస్తి చేస్తారన్నారు. అమరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందని కాంగ్రెస్ చెబుతుంటే.. టీఆర్ఎస్ మాత్రం అమరవీరులను చులకన చేస్తోందని దుయ్యబట్టారు. వారి కుటుంబాలకు టిక్కెట్లు ఇవ్వాలంటే దక్షిణాదిలోని సీట్లన్నీ కావాలని ఆ పార్టీ హేళనగా మాట్లాడుతోందని, 1200 మంది అమరుల కుటుంబాలకు ఏనాడూ సాయం చేయని నైజం కేసీఆర్దని మండిపడ్డారు. కేసీఆర్నుద్దేశించి పొన్నాల ఇంకా ఏమన్నారంటే.. నాకు, నా కుటుంబ సభ్యులకు పదవులు వద్దు. తెలంగాణ వచ్చాక కాపలా కుక్కలా ఉంటానని ఆనాడు అనలేదా? ఇప్పుడేమో నా కుటుంబ సభ్యులు ఉద్యమంలో లేరా.. ఎవరి కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావట్లేదని ప్రశ్నిస్తావా? నీ కుటుంబం ఒక్కటే తెలంగాణ కుటుంబమా? టీఆర్ఎస్లో సమర్థులెవరూ లేరా? * తెలంగాణ వస్తే దళితుడిని సీఎం, మైనారిటీని డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పావు. ఇప్పుడేమో వారు ఆ పదవులకు సమర్థులుకారనే విధంగా మాట్లాడుతూ అవమానపర్చడం నీ అహంకారానికి నిదర్శనం కాదా? * ఉద్యమంలో నీ కుటుంబం ఒక్కరోజు జైల్లో ఉన్నందుకే టిక్కెట్లు ఇస్తున్నామని చెబుతున్నావు. మరి వేలాది మంది ఉద్యమకారులు వందలాది కేసులు మోసి ఉద్యమాన్ని నడిపించారు. వారికి టిక్కెట్లు అవసరం లేదా? ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన చెరుకు సుధాకర్లాంటి నేతలను అవమానిస్తావా? * ఉద్యమం పేరుతో దందాలు చేస్తూ.. కోట్లు సంపాదిస్తున్నావని... దళిత, బడుగు వర్గాల యువకులను ఆత్మహత్యలకు ప్రోత్సహించావని కొండా సురేఖ దంపతులు గతంలో నీపై చేసిన వ్యాఖ్యలను అంగీకరిస్తున్నావా? * జలయజ్ఞంలో భాగంగా 48 ప్రాజెక్టులపై బహిరంగ చర్చ పెడితే ఏ ఒక్కనాడూ స్పందించని నీవు.. ఇంతకాలం నిద్రపోయి ఎన్నికలు రాగానే పోలవరం, పులిచింతల, దుమ్ముగూడెం అంటూ సాంకేతిక అంశాలను ముందుపెట్టి రాజకీయాలు చేస్తావా? తెలంగాణ వచ్చినందున నీ దుకాణం బందవుతుందన్న భయంతోనే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నావు. -
గెలుపోటములకు నాదే బాధ్యత: పొన్నాల
సామాజిక న్యాయానికి పెద్దపీట: పొన్నాల కాంగ్రెస్ నేతలంతా టీఆర్ఎస్తో పొత్తు వద్దనే చెప్పారు ‘బంగారు తెలంగాణ’ కోసమే ఇంకా తలుపులు తెరిచి ఉంచాం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో గెలుపోటములకు తానే పూర్తి బాధ్యత వహిస్తానని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని, ఆ కోణంలో అంశంపైనే తొలి సంతకం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. సోనియాగాంధీ పట్టుదలవల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందే తప్ప టీఆర్ఎస్తో కాదని అన్నారు. క్షేత్రస్థాయి మొదలు రాష్ట్రస్థాయి వరకు కాంగ్రెస్ నాయకులంతా టీఆర్ఎస్తో పొత్తు వద్దని ముక్తకంఠంతో చెప్పినా ‘బంగారు తెలంగాణ’ కోసమే కలిసొచ్చే పార్టీలతో పొత్తు కోసం తలుపులు తెరిచి ఉంచామని పేర్కొన్నారు. గురువారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పొన్నాల మాట్లాడారు. * తెలంగాణ ఏర్పాటుకు రెండు అంశాలే కారణం. అసువులు బాసిన అమరుల త్యాగాలవల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది పడితే, ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతోపాటు సోనియాగాంధీ చేసిన కృషివల్లే తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. దేశంలో 27 కొత్త రాష్ట్రాలు కావాలనే డిమాండ్లతో ఉద్యమాలు జరుగుతున్నాయి. అయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మాత్రం ఇచ్చింది. పార్లమెంట్లో టీఆర్ఎస్కు ఇద్దరు సభ్యులే ఉన్నారు. వారిద్దరిమధ్యా సమన్వయం లేదు, ఈ నేపథ్యంలో టీఆర్ఎస్వల్లే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని చెబితే ఎవరు నమ్ముతారు? * తెలంగాణ రాష్ట్ర లక్ష్యంతో పార్టీ పెట్టిన వాళ్లు ఇప్పుడు పునర్నిర్మాణం అంటున్నారు. పునర్నిర్మాణం అనే పదానికి అసలైన అర్థమేమిటో మీకు (మీడియా) తెలుసు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో గత పదేళ్లలో మన రాష్ట్రం ఎంతో ముందుంది. జాతీయ సగటు ఆదాయంకంటే 20 శాతం పెరిగింది. ‘బంగారు తెలంగాణ’ సాధించే దిశగా కాంగ్రెస్ ప్రణాళికా బద్ధంగా ముందుకెళుతోంది. 25 ఏళ్ల కోసం ప్రణాళికను రూపొందిస్తున్నాం. 50 వేల ఎకరాల్లో ఐటీఐఆర్ కారిడార్ను ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా 15.5 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 50 లక్షల ఉద్యోగాలు పరోక్షంగా రాబోతున్నాయి. * రాజకీయ లబ్ధి కోసం ఒక పార్టీ పదేపదే రెచ్చగొడుతోంది. తద్వారా రాజకీయ అనిశ్చితి ఏర్పడితే పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. * కాంగ్రెస్ నుంచి ఎవరూ టీఆర్ఎస్లోకి వెళ్లడం లేదు. కొండా సురేఖ దంపతులు పార్టీలు తిరిగి వచ్చారు. జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటామని రాసిచ్చారు. వారు కోరిన వెంటనే మున్సిపల్ అభ్యర్థులకు సంబంధించి బి.ఫారాలు వారి చేతికిచ్చాం. ఆ తరువాత గంటకే టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. * ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జనాభా ఎక్కడా లేనివిధంగా 87.2 శాతం తెలంగాణలో ఉంది. కచ్చితంగా తెలంగాణ ఏర్పాటు సామాజిక కోణంతో ముడిపడి ఉంది. అధికారంలోకి వస్తే తప్పకుండా సామాజిక న్యాయం దిశగానే చర్యలు తీసుకుంటాం. 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కృషిచేస్తాం. * ఉద్యోగుల ఆప్షన్ల విషయంలో తెలంగాణ బిల్లులో పొందుపర్చిన అంశాల మేరకు వ్యవహరిస్తాం. పోలవరం డిజైన్ మార్పు విషయంలోనూ అంతే. బిల్లులో ఆ రెండు అంశాలకు సంబంధించి పరిష్కార మార్గాలున్నాయి. పోలవరం మాదిరిగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరాం. * వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు వస్తాయనే నమ్మకం ఉంది. -
‘కేసీఆర్-వంద అబద్ధాలు’
-
కేసీఆర్.. కాస్కో
-
పొన్నాల అవినీతిపై విచారణ చేయాలి
ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి అవినీతికి పాల్పడ్డారని, ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త ఆర్.ఎస్.నరోత్తం మంగళవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐతో విచారణ జరిపించి అవినీతి నిరోధక చట్టం, ఇతర చట్టాల ద్వారా ఆయనను శిక్షించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. పొన్నాల లక్ష్మయ్యను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. -
కేసీఆర్.. కాస్కో
అస్త్రశస్త్రాలతో ఎదురుదాడికి సిద్ధమవుతున్న టీపీసీసీ ‘కేసీఆర్-వంద అబద్ధాలు’ పుస్తకానికి రూపకల్పన డీఎస్, దామోదర్, జానారెడ్డితో విడివిడిగా సమావేశమైన పొన్నాల విభేదాలను పక్కనపెట్టి సమన్వయంతో ముందుకెళ్దామని ప్రతిపాదన టీఆర్ఎస్ దూకుడుకు చెక్ పెట్టాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిపై యుద్ధానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సన్నద్ధమైంది. ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు ప్రధాన లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. టీఆర్ఎస్ను స్థాపించినప్పటినుంచి ఇప్పటివరకు కేసీఆర్ చెప్పిన మాటలు, వాటిని మార్చుకున్న తీరును ఎండగడుతూ... ‘కేసీఆర్-వంద అబద్ధాలు’ పేరిట ప్రత్యేకంగా బుక్లెట్ రూపొందిస్తున్నారు. పార్టీ పెట్టినప్పుడు తన కుటుంబ సభ్యులెవరికీ పార్టీలో చోటు ఉండబోదని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మాటతప్పి కుటుంబ సభ్యులందరినీ పార్టీలోకి తీసుకువచ్చిన వైనాన్ని ఇందులో వివరించనున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని ప్రకటించి మాటతప్పిన తీరును పుస్తకంలో చేర్చనున్నారు. అధికార దాహం, రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ ఏ పార్టీతోనైనా జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, 2004, 2009 ఎన్నికల్లో కేసీఆర్ అనుసరించిన తీరు, 2009 ఎన్నికల ఫలితాలు వెలువడకముందే బీజేపీ పంచన చేరిన వైనాన్ని కూడా వివరించనున్నారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని, ఆయన విశ్వసనీయతలేని వ్యక్తి అనే అంశం ప్రజలకు అర్థమయ్యేందుకు ఆయన ఆడిన అబద్ధాలే నిదర్శనంగా పుస్తకాన్ని రూపొందిస్తున్నారు. వారం రోజుల్లో పుస్తకాన్ని రూపొందించి విడుదల చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య భావిస్తున్నారు. సీనియర్లతో చెక్ టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంతోపాటు కేసీఆర్ నైజాన్ని ఎండగట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ రంగంలోకి దింపాలని పొన్నాల నిర్ణయించారు. అందులో భాగంగా ఆయన మంగళవారం పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి కె.జానారెడ్డి నివాసాలకు వెళ్లి వారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం యత్నించి భంగపడిన ఆయా సీనియర్ నేతలు పొన్నాలతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పొన్నాల వారితో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా ఆయా నేతలను కలిసినట్లు పొన్నాల చెబుతున్నప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహంతోపాటు టీఆర్ఎస్ దూకుడు ఏ విధంగా బ్రేకు వేయాలనే అంశంపైనా చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినందున ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించి సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలందరిపైనా ఉన్నందున విభేదాలను తాత్కాలికంగా పక్కనపెట్టి గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని పొన్నాల ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఛాంపియన్గా టీఆర్ఎస్ ప్రజల్లోకి వెళుతున్నందున దానిని అడ్డుకుంటూ అసలు సిసలైన ఛాంపియన్ కాంగ్రెస్సేననే అంశాన్ని, ఇచ్చిన మాట కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు సీమాంధ్రను ఫణంగా పెట్టిన విషయాన్ని, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేందుకు సోనియాగాంధీ చేసిన కృషిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అదే సమయంలో ఇచ్చిన మాటమీద నిలబడే వ్యక్తి సోనియాగాంధీ అయితే అవసరానికి అబద్ధాలాడుతూ రాజకీయ పబ్బం గడుపుకునే వ్యక్తి కేసీఆర్ అనే అంశాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యేలా సోదాహరణంగా వివరించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఇకపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక్కోరోజు ఒక్కొక్కరు చొప్పున గాంధీభవన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించి టీఆర్ఎస్ను, కేసీఆర్ను ఎండగడతారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. -
భువనగిరి పార్లమెంట్కు పొన్నాల?
* జనగాం నుంచి పొన్నాల కోడలు పోటీ * నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి * మిర్యాలగూడ నుంచి జానా తనయుడు కె. రఘువీర్రెడ్డి * హుజూర్నగర్ నుంచి ఉత్తమ్కుమార్రెడ్డి * కోదాడ నుంచి ఆయన సతీమణి పద్మావతి * నల్గొండ కాంగ్రెస్ కమిటీ నుంచి పీసీసీకి అందిన జాబితా సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈసారి లోక్సభ సీటుపై కన్నేశారు. నల్లగొండ జిల్లా భువనగిరి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ జిల్లా జనగాం శాసనసభ నియోజకవర్గం నుంచి కోడలు వైశాలిని బరిలో దింపాలని భావిస్తున్నారు.టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్కుమార్రెడ్డి ఈసారి కూడా నల్లగొండ హుజూర్నగర్ నుంచే పోటీ చేయనున్నారు. ఆయన సతీమణి పద్మావతిని కోదాడ నుంచి పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కుందూరు జానారెడ్డి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయనుండగా.. ఆయన తనయుడు కె.రఘువీర్రెడ్డిని మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి బరిలో దింపనున్నారు. నల్లగొండ జిల్లా పరిధిలోని శాసనసనభ, లోక్సభ నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావాదుల జాబితాను స్థానిక డీసీసీ రూపొందించి మూడు రోజుల కిందట పీసీసీకి పంపింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ అధ్యక్షతన ఈనెల 13న జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) ముందుకు ఈ జాబితా చేరింది. మరో రెండ్రోజుల్లో ఈ జాబితా ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ముందుకు వెళ్లనుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అభ్యంతరం వ్యక్తం చేస్తే తప్ప పొన్నాల పేరు దాదాపుగా ఖరారైనట్లేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. పొన్నాల ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జనగాం అసెంబ్లీ స్థానం నియోజకవర్గ పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పొన్నాల ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ పొన్నాలకు ఎంపీ టిక్కెట్ ఖరారైతే.. జనగాం నుంచి ఆయన కోడలు వైశాలిని బరిలో దింపుతున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నుంచి ఆమె పేరును కూడా సిఫారసు చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు నల్లగొండ డీసీసీ జాబితాలోని వివరాలిలా ఉన్నాయి. నల్లగొండలో ‘గుత్తా’ధిపత్యమే! నల్లగొండ లోక్సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి పేరును మాత్రమే సూచించారు. భువనగిరికి మాత్రం మొదట పొన్నాల లక్ష్మయ్య పేరును చేర్చారు. ఆ తర్వాత వరుసగా సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఆర్.సర్వోత్తమ్రెడ్డి, టి.దేవేందర్రెడ్డి(డీసీసీ అధ్యక్షుడు) పేర్లను సిఫారసు చేశారు. కెప్టెన్ దంపతుల హవా హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉత్తమ్కుమార్రెడ్డి పేరును మాత్రమే సిఫారసు చేశారు. పక్కనే ఉన్న కోదాడ నియోజకవర్గం నుంచి ఆయన సతీమణి పద్మావతి పేరును పంపారు. ఇక్కడ ఇంకెవరూ పోటీ లేకపోవడంతో వీరు పేర్లు దాదాపుగా ఖరారైనట్లే. తండ్రికి సాగర్.. తనయుడికి మిర్యాలగూడ! నాగార్జునసాగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జానారెడ్డి, ఆయన తనయుడు కె.రఘువీర్ పేర్లు జాబితాలో ఉన్నాయి. జానారెడ్డి వద్దనుకుంటే తప్ప ఆయన పేరు దాదాపుగా ఖరారైనట్లే. ఆయన కుమారుడు రఘువీర్ పేరును మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కూడా డీసీసీ సిఫారసు చేయడం గమనార్హం. ఈ నియోజకవర్గం నుంచి డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రేపాల శ్రీనివాస్, తిప్పన విజయసింహారెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, పీసీసీ కార్యదర్శి కంచర్ల చంద్రశేఖరరెడ్డి, స్థానిక నేత పగిడి రామలింగారెడ్డి పేర్లు కూడా సిఫారసు చేయడం గమనార్హం. రాష్ట్ర ప్రెస్ అకాడమి ఛైర్మన్గా పనిచేసిన తిరుమలగిరి సురేందర్ సైతం జర్నలిస్టు కోటాలో తనకు అవకాశమివ్వాలని తాజాగా కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. సూర్యాపేట దామోదర్రెడ్డికే సూర్యాపేట నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్రెడ్డి పేరును మాత్రమే సిఫారసు చేశారు. దీంతో దామోదర్రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లే. ఎస్సీ నియోజకవర్గమైన నకిరేకల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, స్థానిక నాయకుడు కొండేటి మల్లయ్య, తుంగతుర్తి నుంచి గుడిపాటి నర్సయ్య, సురేందర్, ప్రీతమ్ (ఎన్ఎస్యూఐ నాయకుడు), కె.పరమేశ్, అరుణ్ పేర్లను సిఫారసు చేశారు. మరో ఎస్సీ నియోజకవర్గం తుంగతుర్తి సీటు ఇస్తామని హామీ లభించిన తర్వాతే తెలంగాణ మాల మహానాడు నాయకుడు, తెలంగాణ రాజకీయ జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కాంగ్రెస్లో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. దేవరకొండ (ఎస్టీ) నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలూనాయక్, పీసీసీ ఎస్టీ విభాగం ఛైర్మన్ జగన్లాల్ నాయక్, స్థానిక నాయకులు స్కైలాప్ నాయక్, రమేశ్ నాయక్ పేర్లను పంపారు. ఆలేరు భిక్షమయ్యగౌడ్కే ఆలేరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ పేరును మాత్రమే సిఫారసు చేశారు. భువనగిరి నుంచి మాత్రం చింతల వెంకటేశ్వరరెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, లింగం యాదవ్, కె.అనిల్ పేర్లు పీసీసీకి చేరాయి. కోమటిరెడ్డికి చెక్? నల్లగొండ జిల్లాలో నాలుగు గ్రూపులుండగా జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్రెడ్డి వాటికి నాయకత్వం వహిస్తున్నారు. కోమటిరెడ్డి మినహా మిగిలిన ముగ్గురి నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరి పేరును మాత్రమే సిఫారసు చేసిన డీసీసీ.. నల్లగొండ నుంచి మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు స్థానిక మైనారిటీ నేత హఫీజ్ఖాన్ పేరును కూడా పంపడం గమనార్హం. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి లోక్సభ సీటుపై పొన్నాల కన్నేశారు. కోమటిరెడ్డి వర్గంలోని ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బాలూనాయక్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచి వారితోపాటు ప్రత్యామ్నాయ పేర్లను కూడా పీసీసీకి సూచించారు. కోమటిరెడ్డి వర్గానికి చెక్ పెట్టేందుకే జానారెడ్డి వర్గం ఈ మేరకు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. -
పొన్నాలపై కేసు నమోదు
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందన్న ఆనందంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అత్యుత్సాహం ఆయనకు చేటు తెచ్చిపెట్టింది. ఎన్నికల కోడ్ అమలులో ఉందన్న విషయాన్ని మర్చిపోయారో ఏమో గానీ, ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన పొన్నాల లక్ష్మయ్య.. అక్కడినుంచి భారీ ఊరేగింపుగా వరంగల్ జిల్లాకు వెళ్లారు. అయితే కోడ్ అమలులో ఉన్నప్పుడు కాన్వాయ్ తీసుకెళ్లడం, ఇలాంటి ఊరేగింపులు నిర్వహించడం నిషేధం. దాంతో పొన్నాల లక్ష్మయ్య మీద ఎన్నికల నిబంధనలను అతిక్రమించినందుకుగాను కేసు నమోదైంది. దాంతో పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందన్న సంబరం కాస్తా ఆవిరైనట్లు అయిపోయింది. -
పొత్తు కోసం వెంపర్లాడం: పొన్నాల లక్ష్మయ్య
టీఆర్ఎస్తో సరిపోతుందో లేదో చూస్తాం: పొన్నాల సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ సహా ఎవరితోనూ పొత్తుల కోసం వెంపర్లాడబోమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్తో టీఆర్ఎస్ సరిపోతుందో లేదో చూశాకనే ఆ పార్టీతో పొత్తు విషయమై ఆలోచిస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత బుధవారం ఢిల్లీనుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన గాంధీభవన్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్పై ఘాటైన వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు. బడుగు, బలహీనవర్గాలు, దళితులకు కాంగ్రెస్ పార్టీయే న్యాయం చేస్తుందని, పీసీసీ తాజా కమిటీల ఎంపికే దీనికి తార్కాణమని పొన్నాల చెప్పారు. సోనియాగాంధీ చిత్తశుద్ధి, పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యింది తప్ప వేరొకరెవరూ కారణం కాదని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ఆవిర్భావం ఎలా జరిగిందో ప్రపంచమంతటికీ తెలుసు. ఒప్పందం చేసుకున్న వారు ఎలా వ్యవహరిస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఇద్దరు ఎంపీలున్న పార్టీ (టీఆర్ఎస్)తో తెలంగాణ సాధ్యమయ్యేదేనా? పేరుకు ఇద్దరున్నా అందులో ఒకరు సరిగాలేనే లేరు. ఇలాంటి పార్టీతో 545 మంది సభ్యులున్న లోక్సభలో తెలంగాణ ఆమోదం పొందేదా?’’ అని ప్రశ్నించారు. పొత్తులపై టీఆర్ఎస్ ఏర్పాటుచేసిన కమిటీతో తమకు సంబంధం లేదన్నారు. పొత్తు కోసం ఆ పార్టీయే తగిన ప్రతిపాదనలతో ముందుకు వస్తే.. ఆ ప్రతిపాదనలు తమకు సరిపోతాయో లేదో, పొత్తు అవసరమా, కాదా? అన్న అంశాలు లోతుగా విశ్లేషించాక చర్చలు జరుపుతామని పొన్నాల తేల్చి చెప్పారు. ‘‘విలీనమని చెప్పిన ఆయన (కేసీఆర్) మాట తప్పాడు. ప్రజలు కూడా దీన్ని గమనించారు..’ అని పేర్కొన్నారు. తమతో పొత్తు కోసం టీఆర్ఎస్ ఒక్కటే కాదని, అనేక పార్టీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణానికి తనంతటి నాయకుడు లేనేలేడని కేసీఆర్ అనుకుంటే తామేం చేస్తామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీపీసీసీ ఏర్పాటుపై సీనియర్లలో అసంతృప్తి లేదని చెప్పారు. దిగ్విజయ్ ఈనెల 13, 14, 15 తేదీల్లో హైదరాబాద్లో ఉంటారని, తొలిరోజున టీపీసీసీ ఎన్నికల కమిటీతో సమావేశమవుతారని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించి ఘన విజయం చేకూర్చడమే తమ లక్ష్యమని చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంటు పదవి అనేక రాష్ట్రాల్లో ఉందని, తెలంగాణకు కొత్తగా పెట్టలేదని సమావేశంలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి కుంతియా తెలిపారు. కేంద్ర మంత్రి బలరాంనాయక్, షబ్బీర్ అలీ, దానం నాగేందర్, రాజయ్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫున స్వాగతం: బుధవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయూనికి చేరుకున్న పొన్నాల, ఉత్తమ్కుమార్ల బృందానికి పార్టీ నేతలు పలువురు స్వాగతం పలికారు. హజ్ టెర్మినల్ వద్ద కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడటంతో తోపులాట నెలకొంది. ఒక దశలో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పొన్నాల బృందం అక్కడి నుంచి ర్యాలీగా గన్పార్క్కు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం గాంధీభవన్కు చేరుకున్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత గాంధీభవన్లో ప్రత్యేక పూజలు జరిపారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల ఆటపాటలతో గాంధీభవన్ కోలాహలంగా మారింది. సీనియర్ నేతలు మాత్రం ఎక్కడా కన్పించలేదు. టీపీసీసీ ఎంపిక తీరుపై తీవ్ర నిరసనతో ఉన్నందునే సీనియర్ లెవ్వరూ రాలే దని సమాచారం. కార్యకర్తల కొట్లాట పొన్నాల విలేకరుల సమావేశానికి ముందు కార్యకర్తలు కొట్లాటకు దిగారు. సమావేశ మందిరంలోనికి పార్టీ ప్రస్తుత అధికార ప్రతినిధి గడ్డం శ్రీనివాస్యాదవ్, ఆయన అనుచరులు రాబోగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి ఓడి పోయిన పల్లె లక్ష్మణ్గౌడ్ అనుచరులు అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన శ్రీనివాస్యాదవ్ అనుచరులు లక్ష్మణ్గౌడ్ అనుచరులపై చేయిచేసుకున్నారు. లక్ష్మణ్గౌడ్ అనుచరులు శ్రీని వాస్యాదవ్పై పిడిగుద్దులు కురిపించారు. ఇరువర్గాలు కుర్చీలు విసురుకున్నాయి. దానం నాగేందర్ జోక్యం చేసుకుని శ్రీనివాస్యాదవ్ను సముదాయించారు. ఇలావుండగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి పొన్నాలకు స్వాగతం పలుకుతూ శంషాబాద్ విమానాశ్రయంలో ర్యాలీ నిర్వహించినందుకు ఆర్జీఐఏ పోలీస్స్టేషన్లో బుధవారం రాత్రి కేసు నమోదైంది. -
పొన్నాల.. నెరవేరిన కల
సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడిగా పనిచేయాలనేది పొన్నాల లక్ష్మయ్య చిరకాల వాంఛ. గత దశాబ్ద కాలంగా పొన్నాల పీసీసీ పీఠం కోసం ఢిల్లీలో ఎక్కని గడప లేదు. కలవని నేత లేరు. నాలుగోసారి తన ప్రయత్నాన్ని సఫలం చేసుకున్నారు.2003 నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు పీసీసీ అధ్యక్ష నియామకం చేపట్టారు. 2003లో డి.శ్రీనివాస్, 2005లో కె.కేశవరావు, 2008లో మళ్లీ డి.శ్రీనివాస్ 2011లో బొత్స సత్యనారాయణ కు పీసీసీ పగ్గాలు అప్పగించారు. వీరంతా ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావటం విశేషం. బొత్స తూర్పుకాపు సామాజికవర్గ నేతకాగా, మిగిలిన ముగ్గురూ మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందినవారు. తాజాగా ఐదోసారి కూడా మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యను పీసీసీ అధ్యక్షుడిగా నియమించటం గమనార్హం. తెరపైకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి... విశ్వసనీయ సమాచారం మేరకు.. తొలుత జానారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ మూడు రోజుల కిందటే నిర్ణయించింది. అయితే.. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంగా నియమిస్తానంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన చేశారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు దూరమవుతుండటాన్ని గమనించిన రాహుల్గాంధీ ఆయా వర్గాలకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే జానారెడ్డిని పక్కనపెట్టి పొన్నాలను నియమించినట్లు ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే.. రెడ్డి సామాజికవర్గాన్ని పూర్తిగా పక్కనపెట్టారనే సంకేతాలు వెళితే తెలంగాణలో రాజకీయంగా పట్టున్న ఆ సామాజికవర్గమంతా కాంగ్రెస్పై తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని భావించిన అధిష్టానం పెద్దలు కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించి.. పార్టీకి విధేయుడైన కెప్టెన్ ఉత్తమ్కుమార్రెడ్డిని ఆ పదవిలో నియమించినట్లు తెలిసింది. కాగా తెలంగాణలో జరిగే ఎన్నికలకు పార్టీ పరంగా అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని పొన్నాల హైకమాండ్ పెద్దలకు ప్రతిపాదించినట్లు చెప్తున్నారు. -
'సోనియాను దెయ్యమని తిట్టినా.. తెలంగాణ ఇచ్చింది'
వరంగల్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని దెయ్యమని కేసీఆర్ తిట్టినా .. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. టీఆర్ఎస్ ను విలీనం చేయమని ఎవరూ కేసీఆర్ ను అడగలేదని పొన్నాల ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని కేసీఆరే స్వయంగా చెప్పిన విషయాన్ని పొన్నాల స్పష్టం చేశారు. సీమాంధ్రలో పార్టీ పరిస్థితి ప్రతికూలంగా మారే అవకాశమున్నా.. తెలంగాణ ఏర్పాటుకు ధైర్యంతో సోనియా తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ మాట మార్చి.. ఎదో కుంటిసాకులు చెప్పడం తగదని, విలీన నిర్ణయం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పొన్నాల వ్యాఖ్యానించారు. కేసీఆర్ రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని.. అయితే సోనియాను విమర్శించే నైతికత కేసీఆర్కు లేదని పొన్నాల మండిపడ్డారు. -
జైరాం రమేశ్ వ్యాఖ్యలను ఖండించిన పొన్నాల
హైదరాబాద్: టీఆర్ఎస్పై కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఖండించారు. రాజకీయాల్లో మాటలు విలువలకు తగ్గట్టుగా ఉండాలని సూచించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. అదే విధంగా కేసీఆర్ కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయాలని అన్నారు. టీఆర్ఎస్ను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే సంకుచిత పార్టీగా జైరాం రమేశ్ నిన్న వర్ణించారు. అలాంటి పార్టీకి అండగా ఎలా ఉంటారని తెలంగాణ జేఏసీ నేతలను ప్రశ్నించారు. -
‘సమ్మక్క-సారక్క’ వెబ్సైట్ ప్రారంభం
నేడు సోనియా పేరిట సమ్మక్క, సారక్కలకు నిలువెత్తు బంగారం (బెల్లం): పొన్నాల సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంప్రదాయ జాతర ‘సమ్మక్క-సారక్క’కు సంబంధించిన ప్రత్యేక వెబ్సైట్ను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మంగళవారం ఈ పోర్టల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ www.sammakka sarakka.co.in వెబ్సైట్లో జాతర విశిష్టతను తెలియజేసే చరిత్ర, భక్తుల కోసం గూగుల్ రూట్ మ్యాప్, అత్యవసర ఫోన్ నంబర్లు, జిల్లా అధికార యంత్రాంగం, ఆర్టీసీ బస్ల రాకపోకలు తదితర వివరాలను పొందుపరిచినట్లు పొన్నాల చెప్పారు. జాతర ఏర్పాట్ల కోసం రూ. 100 కోట్లు కేటాయించామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 15 వరకు సాగే ఈ జాతరకు కోటి మంది హాజరవుతారని భావిస్తున్నట్లు తెలిపారు. ‘అడవి చేసే అమ్మల జాతర’ పేరుతో సమ్మక్క సారక్క దేవతలపై 40 వేల పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసినట్లు చెప్పారు. కాగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయడం ద్వారా ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చనున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) సమ్మక్క సారక్కలకు బుధవారం సమర్పించనున్నట్లు పొన్నాల చెప్పారు. -
ఐటీ పార్కుకు మోక్షం
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ ఐటీ పార్కుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ నెల 16న ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి, ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మంగళవారం హైదరాబాద్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. పార్కు నిర్మాణానికి ఇప్పటికే కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్ వద్ద పదెకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ నిర్మాణం పూర్తయితే ఐటీ కంపెనీలకు ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. -
మీసేవ ఆన్లైన్, కెపాసిటీ బిల్డింగ్ పోర్టల్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: మీసేవ ఆన్లైన్ పోర్టల్, మీసేవ కెపాసిటీ బిల్డింగ్ పోర్టల్ను రాష్ట్ర ఐటీ శాఖా వుంత్రి పొన్నాల లక్ష్మయ్యు, రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరా రెడ్డితో కలిసి శుక్రవారం ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీసేవను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేసిన అధికారులను సత్కరించడంతోపాటు, తహసీల్దార్లకు లాప్టాప్లు అందజేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. 25 వేల గ్రామాలకు ఫైబర్ బ్రాడ్బాండ్ను అందుబాటులోకి తెస్తున్నామని, 4 జీ సర్వీసెస్ అందుబాటులోకి వస్తే మన రాష్ట్రంలోని 12 పట్టణాలకు సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి పొన్నాల చెప్పారు. త్వరలో మారుమూల ప్రాంతాల్లో మీసేవ ద్వారా బ్యాంకింగ్ సేవలను అందిస్తామన్నారు. ఆధార్ను కూడా మీసేవకు అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, మంత్రి రఘువీరా రెడ్డి మాట్లాడుతూ ‘మీ సేవ’ ద్వారా పౌరులకు అందుతున్న సేవలను కొనియాడారు. రెవెన్యూ విభాగాన్ని మీసేవకు అనుసంధానించినట్లు చెప్పారు. -
కిరణ్లాంటి వారుంటారనే ఆర్టికల్ 3: పొన్నాల
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను అడ్డుకోడానికి సీఎం కిరణ్కుమార్ రెడ్డిలాంటి వారు ఉంటారని ముందుగా ఊహించిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో పొందుపర్చారని రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం ఆయన పార్లమెంటు వెలుపల ఈ మేరకు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుకు రాజకీయ, రాజ్యాంగ ప్రక్రియలు ఉంటాయని, రాజకీయ ప్రక్రియలో ఆందోళనలు, దీక్షలు, అనుకూల, వ్యతిరేక అగ్రనేతలను మెప్పించడాలూ ఉంటాయన్నారు. అందులో భాగంగానే సీఎం కిరణ్ దీక్ష చేసినట్లుగా అభివర్ణించారు. రాజ్యాంగ ప్రక్రియలో తెలంగాణ ఏర్పాటు ఖాయమన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని, అన్ని పార్టీలను సంప్రదించాకే ఆ బిల్లును రూపొందించారని చెప్పారు. బిల్లుపై అసెంబ్లీ, శాసన మండలి అభిప్రాయాలను కేంద్రానికి పంపడం, మళ్లీ జీవోఎం సమీక్షించి పార్లమెంటులో పెట్టడం సాధారణ ప్రక్రియేనని తెలిపారు. అలాగే హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు వాటా అడగడం సహేతుకం కాదన్నారు. -
పొన్నాలకు పొగపెడుతున్న కోడలు
-
నేను చేసిన తప్పేంటి: పొన్నాల
‘గేమ్’ భూ కేటాయింపులు నా పరిధిలో లేవు సాక్షి, హైదరాబాద్: గేమింగ్ యానిమేషన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ (గేమ్) పార్కు భూ కేటాయింపుల్లో తనకేమీ సంబంధంలేదని ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టంచేశారు. దానిలో తాను చేసిన తప్పేమిటో చెప్పాలన్నారు. టీడీపీ, టీఆర్ఎస్ నేతలు తనపై ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. గురువారమిక్కడ పొన్నాల విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఏపీఐఐసీ స్వాధీనంలో ఉన్న ఆ భూమిలో కొంత భాగాన్ని గతంలో బయోడైవర్సిటీ, మెట్రోరైలు, ట్రాన్స్కోలకు కేటాయించగా.. మరికొంత భూమిని గేమ్ పార్కు నిర్మాణానికిచ్చారు. శంకుస్థాపన నిర్ణయం కూడా సీఎం, అధికారులు తీసుకున్నారు. అలాంటప్పుడు నన్ను టార్గెట్ చేయడమేంటి?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేయడం ద్వారా ఆ భూమిని వారికి కావాల్సిన పారిశ్రామికవేత్తకు దక్కేలా టీడీపీ, టీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేసినట్లు కన్పిస్తోందన్నారు. -
బీడు.. గోడు
బీడు భూముల్లో బంగారం పండించేలా చేస్తామని భీమాలిఫ్ట్-2ను ఆశగా చూపారు. అప్పటి భారీనీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య 2006లో దీనికి భూమిపూజ చేశారు. మెల్లగా ఓ ఏభైశాతం పూర్తి చేశారు. అక్కడితో సరి..పనులు నిలిచి పోయాయి. ఇక మిగిలినవి హామీలే. ఇలా ఏళ్లు గడుస్తున్నాయి. సీజన్లు నడుస్తున్నాయి. అన్నదాతలకు మాత్రం సాగునీరు కలగానే మారుతోంది. ప్రభుత్వ ఉదాశీనతకు ...ప్రజాప్రతినిధుల అలక్ష్యానికి సాక్ష్యంగా నిలుస్తోంది. వనపర్తిరూరల్, న్యూస్లైన్ : వనపర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు కొత్తకోట శంకర సముద్రం నుంచి పెబ్బేరు మండలం రంగ సముద్రం రిజర్వాయర్కు నీరు పారే రాజీవ్ భీమాలిఫ్ట్-2, శంకర సముద్రం ప్రధాన ఎడమకాల్వలో నీరు పారితే వనపర్తి మండలం పెద్దగూడెం, కడుకుంట్ల, కిష్టగిరి, మెంటపల్లి, రాఘవేంద్రకాలనీ, నీచహళ్లి గ్రామాల్లోని 35వేల సుమారు ఎకరాలరు సాగునీరు అందుతుంది. 2006 ఏప్రిల్ 04వ తేదిన అప్పటి రాష్ట్ర భారీ, మధ్య తరహా నీటి పారుదల శాఖ మంత్రి పొన్నల లక్ష్మయ్య కాల్వ నిర్మాణంను పెద్దగూడెం గ్రామ శివారులో భూమిపూజ చేశారు. 50శాతం పనులు పూర్తయిన తర్వాత కాల్వ నిర్మాణం నిర్లక్ష్యానికి గురైంది. దీంతో ఎనిమిదేళ్లు కావస్తున్నా నేటికీ చుక్కనీరు పారడంలేదు. భీమా కాల్వలో నీరొస్తాయి మా పొలాల్లో పంటలు పండుతాయని ఎదురుచూస్తున్న ఈ నాలుగు గ్రామాల్లోని వందలాది మంది రైతుల ఆశలు అడి ఆశలుగానే మిగిలాయి. వనపర్తికి అతిసమీపంలో కృష్ణానది ఉన్నా ఇక్కడి ప్రజలకు వ్యవసాయానికి నీరులేక రైతులు అల్లాడుతున్నారు. ఉన్న ఒక్క అవకాశాన్ని వినియోగించుకునేందుకు నాయకులు సహకరించటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ ఉన్న నీటిని బట్టి సాగు చేస్తూ మిగతా భూమిని బీడు గా వదిలేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరుబావుల తవ్వటానికి రూ.వేలల్లో వెచ్చించాల్సి వస్తోందని అలా వెచ్చించినా అవి ఎన్నాళ్లు పని చేస్తోందో తెలియని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఈ కాల్వ నిర్మాణంపై రైతులు, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు స్పందించి అధికారులపై వత్తిడి తీసుకురావటానికి భీమా కార్యాలయాల్లో కనీసం ఒక్కటికూడా వనపర్తి మండలం, పట్టణంలో లేవు. అన్ని కార్యాలయాలు గద్వాలలో ఏర్పాటు చేయటం వలన అధికారులపై రైతులు వత్తిడి తీసుకువచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతులు ప్రజా ప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. అయినా స్పందన లేక పోవటంతో ఆశలు వదులుకుని ఉన్నంతలో వ్యవసాయం చేసుకోవటం లేకుంటే పట్టణం బస్సు ఎక్కటం లాంటి రెండు మార్గాలను అనుసరిస్తున్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్నా మాగోడుపట్టించుకోరా.. గత ఏడేళ్లుగా కాల్వనీళ్లొస్తాయి పుష్కలంగా పంటలు పండుతాయని ఎదురుచూస్తున్నాం. కానీ నీళ్లు వచ్చేలా లేవు. మాగోడు పట్టించుకోవాల్సిన వారు వినిపించుకునేలా లేరు. ఉన్న భూమినంతా సాగు చేసుకునేందుకు నీళ్లు చాలటం లేదు. కాల్వనీళ్లొస్తే మా గ్రామంలో ప్రతికుంటా పంట పండుతుంది. - చంద్రయ్య, రైతు, కడుకుంట్ల భూములంతా ప్లాట్లుగా మారిన తర్వాత కాల్వకు నీరిస్తారా భీమాకాల్వకు నీళ్లురావు మా భూముల్లో పంటలు పండించేలేదు. అని పలువురు రైతులు ఇప్పటికే భూములను ప్లాట్లుగా చేసి వ్యాపారులకు అమ్మేశారు. ఇంకా కొన్నాళ్లు పోతే అందరూ పొలాలను అమ్ముకుని పట్టణాలకు పోతారు. ఆ తర్వాత కాల్వ పనులు పూర్తిచేసి నీరు వదిలినా ప్రయోజనం ఎవరికి ఉంటుంది. - బజార్, రైతు, కడుకుంట్ల -
2014కు ఎంతో ప్రాధాన్యం
తెలంగాణ సాకారం కానుంది: పొన్నాల ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభం హైదరాబాద్, న్యూస్లైన్: ఈ ఏడాదికి ఎంతో ప్రాధాన్యం ఉందని మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 74వ అఖిల భారత పారిశ్రామికోత్పత్తుల ప్రదర్శన (నుమాయిష్)ను పొన్నాల బుధవారం ప్రారంభించి మాట్లాడారు. 2014 క్యాలెండర్ 1947 క్యాలెండర్ను పోలి ఉందని చెప్పారు. 1947లో బ్రిటీష్ పాలకుల నుంచి దేశానికి స్వాతంత్య్రం లభించగా, 2014లో తెలంగాణా ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రం సాకారం కానున్నదని చెప్పారు. రానున్న 25 ఏళ్లలో హైదరాబాద్ నగరపరిధిలో 50 వేల ఎకరాల్లో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. గడచిన తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. మెట్రోరైల్ ప్రాజెక్టు నగరానికే తలమానికంగా నిలుస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. వృధాగా సముద్రంలోకి పోయే నదీ జలాలను సాగు కోసం సద్వినియోగం చేసుకునేందుకు చేపట్టిందే జలయజ్ఞం కార్యక్రమమని పేర్కొన్నారు. మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, ఆయా ఉత్పత్తులకు విస్తృతమైన ప్రచారం, ఉపాధి కల్పనకు నుమాయిష్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు ఎస్. రాజేందర్, గౌరవ కార్యదర్శి అశ్విన్, సొసైటీ ప్రతినిధులు సుఖేష్రెడ్డి, హరినాథ్రెడ్డి, వనం వీరేందర్, నిరంజన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొన్నాల లక్ష్మయ్య మహిళలు అలెక్స్స్టాల్ పేరిట ఏర్పాటు చేసిన స్టాల్ను ప్రారంభించారు. అదే విధంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ను ఆ శాఖ డెరైక్టర్ జనరల్ కృష్ణంరాజు ప్రారంభించారు. -
20 ఏళ్లు సీఎం పదవి మీకే ఇచ్చేస్తాం: గంటా
మరో 150ఏళ్లు ఏలుకోవడానికేనా: పొన్నాల సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంతం వారికి ఇరవై ఏళ్లపాటు రాష్ట్ర సీఎం పదవిని పూర్తిగా అప్పగిస్తామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అంగీకరించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం అసెంబ్లీ లాబీల్లో తెలంగాణ ప్రాంత మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను కొందరు తెలంగాణ నేతలే తనకు ఇంతకు ముందు చెప్పారని, తాము కూడా అందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. దీనిపై పొన్నాల స్పందిస్తూ 20 ఏళ్లు మాకు సీఎం పదవి ఇచ్చి ఆ తర్వాత మరో 150 ఏళ్లు మీరే ఏలుకోవడానికేనా ఈ ప్రతిపాదన అని ప్రశ్నించారు. నాతోపాటు మరో ఆరుగురు కాంగ్రెస్కు గుడ్బై చెబుతారు ‘విభజన నిర్ణయాన్ని పక్కనపెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కేంద్రం ప్రకటిస్తే మేమంతా కాంగ్రెస్లోనే కొనసాగుతాం. అసెంబ్లీలో విభజన బిల్లును ఓడించాక కూడా కేంద్రం తెలంగాణ ఏర్పాటు దిశగా ముందుకెళితే కాంగ్రెస్కు గుడ్బై చెబుతాం. నాతోపాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడతారు. ఏ పార్టీలోకి వెళతామనేది అప్రస్తుతం.’ అని గంటా అసెంబ్లీ ఆవరణలో అన్నారు. -
కేబినెట్ సలహా మేరకే నడుచుకుంటా!
విభజనపై టీ కాంగ్ నేతలతో రాష్ట్రపతి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు చర్యలు తీసుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. తెలంగాణ అంశంపై 2000 సంవత్సరం నుంచీ తనకు పూర్తి అవగాహన ఉందని, అన్ని ప్రాంతాలు, వర్గాలు, పార్టీల నేతలతో మాట్లాడానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తాను రాజ్యాంగ, ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటానని చెప్పినట్టు ఆయనను కలిసిన అనంతరం నేతలు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సోమవారం రాత్రి రాజ్భవన్లో రాష్ట్రపతిని కలిశారు. వారికంటే ముందు అపాయింట్మెంట్ ఉన్న నేతలంతా రాష్ట్రపతిని త్వరగా కలిసి వెళ్లిపోవడంతో నిర్ణీత సమాయానికి 20 నిమిషాల ముందే టీ కాంగ్రెస్ నేతలు ఆయనను కలిశారు. ఆ సమయానికల్లా అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, మంత్రులు కె.జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, సారయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు పాల్వాయి గోవర్దన్రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ సహా సుమారు 20 మంది ప్రజాప్రతినిధులు మాత్రమే ప్రణబ్ను కలిశారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఆ తర్వాత రావడంతో వారు రాష్ట్రపతిని కలవకుండానే వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రణబ్ను కలిసిన అనంతరం నేతల తరపున ఉత్తమ్, పాల్వాయి మాట్లాడారు. తెలంగాణ అంశంపై 2000 నుంచీ తనకు లోతైన అవగాహన ఉందని, జరిగిన వాస్తవ పరిణామాలన్నీ తనకు తెలుసని ఆయన చెప్పారని వివరించారు. ‘‘దీనిపై రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, పార్టీలు, వర్గాల ప్రజలతో గతంలో అనేకసార్లు మాట్లాడాను. రాష్ర్టపతిగా ఈ విషయంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడంతో పాటు కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు చర్యలు తీసుకుంటాను’ అని ప్రణబ్ స్పష్టం చేయడంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపి వెనుదిరిగామన్నారు. రాష్ర్టపతితో డీఎస్ ప్రత్యేక భేటీ టీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో పాటుగా రాష్ర్టపతిని కలవలేకపోయిన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సోమవారం రాత్రి పదింటికి ఆయనతో ప్రత్యేకంగా భే టీ అయ్యారు. తెలంగాణ ఆవశ్యకతను ఆయనకు వివరించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు కూడా రాష్ట్రపతిని కలిసి, విభజన నిర్ణయం నేపథ్యంలో రాష్ర్టం ఇబ్బందుల్లో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలన్న విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారని అనంతరం మీడియాకు వెల్లడించారు. -
రాజధానిలో ఐటీ ప్రాంగణాలు ! : మంత్రి పొన్నాల లక్ష్మయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంతో గతంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం మేరకు హైదరాబాద్లో తమ క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు అమెజాన్, గూగుల్ ఇంటర్నేషనల్ కంపెనీలు అంగీకరించాయని, దీనివల్ల నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సంస్థలు అమెరికా వెలుపల మొట్టమొదటి క్యాంపస్ను హైదరాబాద్లోనే నిర్మించేందుకు అంగీకరించాయని ఆయన చెప్పారు. అమెజాన్ ఇంటర్నేషనల్ కంపెనీ హైదరాబాద్లో క్యాంపస్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో 2005 ఆగస్టు 11న అవగాహన కుదుర్చుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) నానక్రామ్గూడలో 10.57 ఎకరాలను ఆ కంపెనీకి కేటాయించింది. ఆ సంస్థ మొత్తం డబ్బును చెల్లించినా కోర్టు వివాదం వల్ల ఏపీఐఐసీ స్థలం అప్పగించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ పుణే, ముంబైలలో ప్రాంగణాల ఏర్పాటుకు ప్రయత్నాలు ఆరంభించింది. దీంతో ఐటీ శాఖ మంత్రి ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి ఇక్కడే క్యాంపస్ నిర్మించాలని,అవసరమైన అన్ని సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.మంత్రి హామీతో క్యాంపస్లను ఇక్కడే నిర్మించేందుకు ఆ సంస్థల ప్రతినిధులు అంగీకరించారు. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 76 వేల మందికి ఉపాధి లభించనుందని మంత్రి పొన్నాల పేర్కొన్నారు. గూగుల్కు ప్రత్యామ్నాయ స్థలం గూగుల్ కంపెనీకి హైదరాబాద్లో ప్రత్యామ్నాయ స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కోర్టు వివాదం వల్ల గతంలో కేటాయించిన స్థలం అప్పగించలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ స్థలం ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో గూగుల్ ఇక్కడే క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందని మంత్రి వివరించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి’అని తెలిపారు. -
డీఆర్సీకి ఏడాది
సాక్షి, కరీంనగర్ : జిల్లా సమీక్షా మండలి సమావేశం జరిగి రేపటికి ఏడాది పూర్తవుతుంది. గత సంవత్సరం అక్టోబర్ 31న జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. పొన్నాల కన్నా ముందు జిల్లా ఇన్చార్జి లుగా ఉన్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, ముఖేష్గౌడ్ డీఆర్సీ సమావేశాల పట్ల ఆసక్తి ఊపలేదు. జూపల్లి కృష్ణారావు ఒకే సమావేశానికి పరిమితమయ్యారు. ఆయన రాజీనామా చేసిన తరువాత జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ముఖేష్గౌడ్ అసలు తన ముఖమే చూపించలేదు. ఇదే విషయాన్ని విపక్షసభ్యులు తొలి సమావేశంలోనే పొన్నాల లక్ష్మయ్య దృష్టికి తెచ్చారు. తాను పక్క జిల్లా వాణ్నేనని, మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తానని గట్టిగా చెప్పినా ఆయన కూడా పాత మిత్రుల బాటలోనే నడిచారు. జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులకు దిశానిర్ధేశం చేయడం, ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించడం, తక్షణ సమస్యలను చర్చించడం, వాటికి పరిష్కారాలను సూచించడం కోసం ప్రతి మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు జిల్లాస్థాయి అంశాలపై సూచనలు చేసేందుకు ఇవి దోహదపడతాయి. గత ఏడాది కాలంలో జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు పడినా వాటికి పరిష్కారం చూపాల్సిన డీఆర్సీ నిర్వహణపై ఇన్చార్జి మంత్రి నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఆగస్టు 17న డీఆర్సీ సమావేశానికి ఏర్పాట్లు చేసిన అధికారులు.. పొన్నాల లక్ష్మయ్య సమయం ఇవ్వకపోవడం వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. వివిధ నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొనేందుకు గత నెల 27న జిల్లాకు వచ్చిన మంత్రి జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు. పనిలో పనిగా ప్రధాన శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. అక్కడే ఆయన డీఆర్సీ తేదీని ప్రకటించారు. ఆయన చెప్పిన ప్రకారం ఈనెల 18న ఈ సమావేశం జరగాలి. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జైత్రయాత్ర కోసం ఈ సమావేశాన్ని వాయిదా వేశారు. తర్వాత ఇన్చార్జి మంత్రి సమావేశం ఊసే మర్చిపోయారు. కేవలం మంత్రులకు తీరిక లేనందువల్ల కీలకమైన ఈ సమావేశాలు నెలల తరబడి జరగకపోవడం ప్రగతిపై ప్రభావం చూపుతోంది. అల్పపీడనం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు జిల్లా రైతాంగాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. అన్ని పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించారు. పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి తలుచుకుని చేసిన అప్పులు తీర్చేదెలాగో అర్థంకాక వారంలోనే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వేలాది మంది తమ రెక్కల కష్టం నీటిపాలై తల్లడిల్లుతున్నారు. వారికి అండగా నిలుస్తామన్న భరోసా నివ్వడానికైనా డీఆర్సీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. -
ఐటీఐఆర్కు విద్యుత్తు.. 3,348 మెగావాట్లు: పొన్నాల లక్ష్మయ్య
రోజుకు 45.2 కోట్ల లీటర్ల నీరు అవసరం అందుకే 25 ఏళ్ల ప్రణాళిక: మంత్రి పొన్నాల లక్ష్మయ్య సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఐటీ పెట్టుబడుల ప్రాంతాని(ఐటీఐఆర్)కి 3,348 మెగావాట్ల విద్యుత్తు, రోజుకు 45.2 కోట్ల లీటర్ల నీరు అవసరమవుతుందని మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఎల్లంపల్లి, కంతనపల్లి ప్రాజెక్టుల ద్వారా గోదావరి నీటిని తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. అందుకే 25 ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించామని వివరించారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఐటీఐఆర్ వర్క్షాప్లో పొన్నాల ప్రసంగించారు. ఐటీఐఆర్లో మౌలిక వసతుల కోసం రెండు దశలలో కలిపి 25 ఏళ్లలో రూ. 13,093 కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపారు. రూ. 85 కోట్లతో ఫలక్నుమా-ఉందానగర్-ఎయిర్పోర్టుకు ఎంఎంటీఎస్ రైలు మార్గ విస్తరణ, రూ. 440 కోట్లతో నాలుగు రేడియల్ రోడ్ల విస్తరణ, రూ. 417 కోట్లతో విద్యుత్తు ఉపకేంద్రాల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. రెండు విడతల్లో కలిపి రవాణా, ఇతర మౌలిక సదుపాయాలన్నీ అభివృద్ధి చేస్తామన్నారు. ఐటీఐఆర్ అమలును ఏపీఐఐసీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. కరీంనగర్, నె ల్లూరుకు ఐటీ ప్రస్తుతం టైర్-1 కింద హైదరాబాద్, విశాఖ.. టైర్-2 కింద విజయవాడ, కాకినాడ, తిరుపతి, వరంగల్లు నగరాల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధిపరుస్తున్నామని, తదుపరి విడతలో టైర్-3 నగరాలైన కరీంనగర్, నెల్లూరులో ఐటీని విస్తరిస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఉద్యమాలు ఐటీ అభివృద్ధికి ఆటం కం కలిగించలేదన్నారు. గ్రామపంచాయతీలను మండలాలు, జిల్లాకేంద్రాలతో అనుసంధానించే జాతీయ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ 12 నెలల్లోగా పూర్తవుతుందని తెలిపారు. మొబైల్ ద్వారా తెలుగులో ఎస్ఎంఎస్ సౌకర్యం తొందర్లోనే అందుబాటులోకి తేనున్నామని చెప్పారు. సమావేశంలో ఐటీ కార్యదర్శి సంజయ్జాజు, ఏపీఐఐసీ ఎండీ జయేష్రంజన్, ఇట్స్ఏపీ కార్యదర్శి బిపిన్ చంద్ర, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ అధ్యక్షుడు శివరాంప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ఐటీఐఆర్కు 10 కోట్ల గ్యాలన్ల గోదావరి జలాలు రాష్ట్రరాజధాని రూపురేఖలను సమూలంగా మార్చనున్న ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) ప్రాంతానికి రోజూ 10 కోట్ల గ్యాలన్ల గోదావరి జలాలను సరఫరా చేసేందుకు జలమండలి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇందుకోసం గోదావరి రెండోదశ ప్రాజెక్టును 2020లో కాకుండా 2017 చివరినాటికి పూర్తిచేసి నీటిని సరఫరా చేస్తామని జలమండలి ఉన్నతాధికారులు వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర ఐటీ శాఖ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని తెలిపారు. కృష్ణా జలాల లభ్యత దృష్ట్యా కృష్ణా నాల్గవదశ ద్వారా ఐటీఐఆర్ ప్రాంతానికి నీటిని తరలించిన పక్షంలో జలవివాదాలు తలెత్తే ప్రమాదం ఉండడంతో ఈమేరకు నిర్ణయించామన్నారు. నీటిసరఫరా ప్రాజెక్టుపై త్వరలో కన్సల్టెం ట్ను నియమించుకొని సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. గోదావరి రెండోదశ ద్వారా నగరానికి 17.2 కోట్ల గ్యాలన్ల నీటిని తరలించినప్పటికీ ఐటీఐఆర్ పరిధిలోని కంపెనీలకు 10 కోట్ల గ్యాలన్ల కేటాయింపులే ఉంటాయని స్పష్టం చేశారు. మిగతా జలాలు నగర తాగునీటి అవసరాలకు మళ్లిస్తామని చెప్పారు. సుమారు 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐదు క్లస్టర్లుగా ఏర్పడనున్న ఐటీఐఆర్ పరిధిలో సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఉప్పల్-పోచారం, సైబరాబాద్-ఎయిర్పోర్ట్ (గ్రోత్కారిడార్-1), ఎయిర్పోర్ట్-ఉప్పల్(గ్రోత్కారిడార్-2) ప్రాంతాలు ఉన్నాయి. ఐటీఐఆర్ మొదటి దశ ప్రాజెక్టు 2018 నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. -
విశాఖ, తిరుపతిలో ఐటీఐఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు ప్రాంతాల్లో ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్)లు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ తరహాలోనే విశాఖపట్నంలో ఒకటి.. తిరుపతి, అనంతపురం, నెల్లూరు ప్రాంతాలను కలుపుతూ ‘తిరుపతి ఐటీఐఆర్’ ప్రాజెక్టులను ప్రభుత్వం నెలకొల్పనుందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నిర్దిష్ట క్లస్టర్లను గుర్తించి తిరుపతి ఐటీఐఆర్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఒక్కొక్క ప్రాంతంలో 4 వేల ఎకరాల చొప్పున మూడు ప్రాంతాల్లోనూ కలిపి మొత్తం 12 వేల ఎకరాల పరిధిలో ఐటీఐఆర్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. సోమవారం సచివాలయంలో మంత్రి పొన్నాల మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం, రేణిగుంట విమానాశ్రయం, బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో ఉన్న అనంతపురం జిల్లాలోని ప్రాంతాల్లో ఐటీ, అనుబంధ సంస్థల స్థాపనకు వసతుల కల్పన, అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. ఈ ఐటీఐఆర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై సర్వే నిర్వహించే బాధ్యతను ప్రైవేటు కన్సల్టెన్సీకి అప్పగించామని, ఈనెల 24, 25 తేదీల్లో సదరు సంస్థ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తుందని చెప్పారు. 26వ తేదీన సంబంధిత జిల్లా అధికారులతో చర్చిస్తుందన్నారు. అనంతరం సమగ్ర పథక నివేదిక(డీపీఆర్)ను కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించనున్నట్టు వివరించారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు.. పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలకు వీలు కల్పించే ఐటీఐఆర్లో ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల సంస్థలు, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మాన్యు ఫాక్చరింగ్ సంస్థలు ఏర్పాటవుతాయి. తొలి ఐదేళ్లలో మౌలిక వసతులు కల్పిస్తారు. రెండో విడతలో 15 నుంచి 20 ఏళ్ల కాలంలో ఐటీఐఆర్ను అభివృద్ధి చేస్తారు. ఉత్పత్తి యూనిట్లు, ప్రజావసరాలు, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన యంత్రాంగం, నివాస ప్రాంతం, పరిపాలన సేవలు భాగంగా ఉంటాయి. స్పెషల్ ఎకనమిక్ జోన్(ఎస్ఈజడ్)లు, ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్రీ ట్రేడ్ జోన్లు, వేర్హౌసింగ్ జోన్లు, ఎగుమతులకు సంబంధించిన యూనిట్లు, అభివృద్ధి కేంద్రాలు కూడా ఉంటాయి. -
సినీ రంగానికి పెద్దపీట: మంత్రి పొన్నాల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సినీరంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. శనివారం ఇక్కడి రవీంద్రభారతిలో ఢిల్లీ తెలుగు అకాడమీ 26వ వార్షికోత్సవం, నూరేళ్ల సినిమా సంబరాలు కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రాజధానికి దగ్గరలోని రాయదుర్గంలో యానిమేషన్, గేమింగ్ ట్రైనింగ్ సెంటర్ను త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి, రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ పి.విజయబాబు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి, సినీ నిర్మాత డి.రామానాయుడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ మోహన్కందా తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులతో కె.రాఘవ, సినీనటులు కోటా శ్రీనివాసరావులను సత్కరించారు. ఐఏఎస్ అధికారి చందనాఖన్, డాక్టర్ టి.చంద్రశేఖర్, మణిశర్మలకు ఉద్యోగ రత్న అవార్డును, ఎక్సలెన్సీ అవార్డును డాక్టర్ కె.శ్యాంసుందర్, డాక్టర్ జీవీపీ సుబ్బయ్య, డాక్టర్ శరత్రెడ్డిలకు అందజేశారు. నూరేళ్ల సినిమా అవార్డును డాక్టర్ డి.రామానాయుడు, మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి, హస్యనటులు గౌతంరాజు, సినీనటులు రాళ్లపల్లి, రావి కొండలరావు, కోట శంకర్రావు, సుబ్బరాయశర్మ, ఎన్టీ చౌదరి, అశోక్ కుమార్, రచయిత వడ్డేపల్లి కృష్ణలతో పాటు మరికొంత మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ తెలుగు అకాడమీ ప్రధాన కార్యదర్శి ఎన్.వి.ఎల్ నాగరాజు, చైర్మన్ కేఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
విభజనతోనే రెండు రాష్ట్రాల అభివృద్ధి: పొన్నాల
హన్మకొండ: విభజనతోనే రెండు రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తాయని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం వరంగల్ జిల్లా హన్మకొండలో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో తెలంగాణ 10 జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. సభలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ రెండు రోజులు ప్రయాణిస్తే గానీ హైదరాబాద్ చేరుకోని ఆంధ్ర ప్రాంత పేదలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటుండగా.. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, సీమాంధ్ర రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రంలో 250 ఏళ్లుగా వేరుగా ఉన్న తెలంగాణ ప్రజలు ఆందోళన చెందితే లేనిది.. 60 ఏళ్లు కలిసి ఉన్నందుకే సీమాంధ్రులు ఆందోళన చెందుతూ సమైక్యంగా ఉండాలని కోరడంలో అర్థం లేదన్నారు. జై ఆంధ్ర ఉద్యమంలో అసువులు బాసిన కాకాని వెంకటరత్నం చితాభస్మం సాక్షిగా నాయకులు రౌతు లచ్చన్న, వెంకయ్యనాయుడు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితర నాయకులు ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుకోవడం మరచిపోయారా అని నిలదీశారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని రక్షించుకుంటేనే బతుకు ఉంటుందని, కార్మికులు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారని తెలిపారు. ఎన్ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహమూద్ మాట్లాడుతూ తెలంగాణకు ప్రత్యేక ఎన్ఎంయూ శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ శాఖకు జిల్లాకు చెందిన లింగాల శ్రీరాములరెడ్డిని ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీన హైదరాబాద్లో ఆవిర్భావ సభ నిర్వహించి పూర్తి స్థాయి కమిటీని ప్రకటించనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ యాజమాన్యంతో ఇటీవల జరిగిన చర్చలలో చేసుకున్న ఒప్పందాలను తమ ఘనతగానే ఎంప్లాయూస్ యూనియన్ చెప్పుకోవడం విడ్డూరమని విమర్శించారు. -
వైఎల్పీ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టలేదా: పొన్నాల
ఎప్పుడో 2001లోనే నాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా ఉన్న యార్లడ్డ లక్ష్మీప్రసాద్ తెలంగాణ కోరుతూ రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టారని, మరిప్పుడు అదే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణపై ద్వంద్వ వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948 నుంచి 56 వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉందని, అప్పుడు బలవంతంగా తమను ఆంధ్రప్రదేశ్లో కలిపారని ఆయన అన్నారు. ఇప్పుడు మళ్లీ తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా గానీ రెండు చోట్లా అపారమైన అభివృద్ధి సాధించడానికి అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిగ్రీ కోర్సుల్లోను వృత్తినైపుణ్యం కోర్సును ప్రవేశపెట్టామని, త్వరలోనే అన్ని విశ్వవిద్యాలయాల అధికారులను సమావేశపరిచి వీటిపై అవగాహన కలిగిస్తామని పొన్నాల చెప్పారు. విద్యార్థులు డిగ్రీ చదివి కళాశాల నుంచి బయటకు వచ్చేసరికి వారు ఉద్యోగాలు చేయడానికి సంసిద్ధంగా ఉండాలన్నదేప తమ లక్ష్యమని ఆయన అన్నారు. -
యానిమేషన్ సిటీ ఏర్పాటుకు చర్యలు వేగవంతం
హైదరాబాద్లోని రాయదుర్గంలో యానిమేషన్,గేమింగ్ సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ఐటీ శాఖ ముమ్మర చర్యలు చేపట్టనుంది. ఇందుకు సంబంధించి ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గురువారం ఐటీ, ఏపీఐఐసీ అధికారులతో సమావేశమయ్యారు. గేమ్సిటీలో ఇంక్యుబేషన్ టవర్ నిర్మాణానికి సెప్టెంబరులోగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. లేఅవుట్ ప్లాన్ సిద్ధం చేసేందుకు టెండర్లు పిలవాలని, రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో ఐటీ లే-అవుట్ రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.