హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సోమవారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత కర్పూలు, ఆ తర్వాత అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్తారు.
ఉదయం 9.30 గంటలకు కర్నూలులో, 11.30 గంటలకు నంద్యాలలో జరిగే వైఎస్ఆర్ జనభేరి సభలలో పాల్గొంటారు. ఆ తర్వాత అనంతపురం జిల్లా మడకశిరలో మధ్యాహ్నం ఒంటి గంటకు, 3 గంటలకు హిందూపురం, సాయంత్రం 4.30 గంటలకు తాడిపత్రిలో జరిగే వైఎస్ఆర్ జనభేరి సభలలో పాల్గొని వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు.
రేపు కర్నూలు, అనంతలో వైఎస్ జగన్ ప్రచారం
Published Sun, May 4 2014 2:47 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement