జోరుగా ఫ్యాన్ గాలి | ysrcp will achieve majority seats in seemandhra! | Sakshi
Sakshi News home page

జోరుగా ఫ్యాన్ గాలి

Published Tue, May 6 2014 2:06 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

జోరుగా ఫ్యాన్ గాలి - Sakshi

జోరుగా ఫ్యాన్ గాలి

సీమాంధ్రలో మరో 24 గంటల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ వస్తుందని నెట్ ప్రపంచంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

వైఎస్సార్ కాంగ్రెస్‌కు బంపర్ మెజారిటీ
నెట్‌లో హల్‌చల్ చేస్తున్న తాజా సర్వేల ఫలితాలు
 
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో మరో 24 గంటల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ వస్తుందని నెట్ ప్రపంచంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎన్‌టీవీ-నీల్సన్, టీవీ5-ఎఫ్‌ఎంఆర్‌ఎస్‌లు వేర్వేరుగా నిర్వహించిన సర్వేల ఫలితాలు యూట్యూబ్, వివిధ వెబ్‌సైట్లు, బ్లాగ్‌లు, సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో.. ఈ సర్వే ఫలితాలు లీకుల పేరిట వెబ్‌సైట్లలో హల్‌చల్ చేస్తున్నాయి.
 
 టీవీ5 - ఎఫ్‌ఎంఆర్‌ఎస్
 
 ఏప్రిల్ 29న 1.75 లక్షల శాంపిల్స్‌తో ఈ సర్వే నిర్వహించినట్లు నెట్‌లో పేర్కొన్నారు. సీమాంధ్రలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్‌కు 120 నుంచి 125 శాసనసభ స్థానాలు వస్తాయని; 25 లోక్‌సభ స్థానాలకు గాను ఆ పార్టీకి 20 నుంచి 22 లోక్‌సభ స్థానాలు వస్తాయని టీవీ5-ఎఫ్‌ఎంఆర్‌ఎస్ నిర్వహించిన సర్వేలో తేలినట్లు చెప్పారు. టీడీపీ-బీజేపీ కూటమికి 48 నుంచి 53 శాసనసభ స్థానాలు, 3 నుంచి 5 పార్లమెంటు స్థానాలు వస్తాయని లెక్కగట్టారు. కాంగ్రెస్, ఇతరులకు కలిపి 2 నుంచి 4 అసెంబ్లీ సీట్లు, 0 నుంచి 1 పార్లమెంటు స్థానం రావచ్చని అంచనా వేశారు. వైఎస్సార్ సీపీకి 49.3 శాతం, టీడీపీ-బీజేపీ కూటమికి 42.1 శాతం, కాంగ్రెస్, ఇతరులకు 8.6 శాతం ఓట్లు అసెంబీ స్థానాల్లో వస్తాయని లెక్కగట్టారు. లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ సీపీకి 48.6 శాతం, టీడీపీ-బీజేపీ కూటమికి 42.5 శాతం, కాంగ్రెస్, ఇతరులకు 8.9 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు.
 
 ఎన్‌టీవీ - నీల్సన్ సర్వే...
 
 ఏప్రిల్ 25న ఈ సర్వే చేశారు. ఈ సర్వే ఫలితాల ప్రకారం.. వైఎస్సార్ కాంగ్రెస్‌కు 117 నుంచి 123 అసెంబ్లీ సీట్లు వస్తాయని, టీడీపీ, బీజేపీకి క లిపి 52 నుంచి 58 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 0-2, ఇతరులకు 0-3 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అలాగే వైఎస్సార్ సీపీకి 16 నుంచి 19 పార్లమెంటు సీట్లు వస్తాయని, టీడీపీకి 6 నుంచి 9 సీట్లు వస్తాయని లెక్కగట్టారు. కాంగ్రెస్‌కు వస్తే ఒకటి వస్తుందని, లేకపోతే లేదని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీకి అసెంబ్లీ స్థానాల్లో 48.5 శాతం, పార్లమెంటు స్థానాల్లో 48 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. టీడీపీ-బీజేపీ కూటమికి అసెంబ్లీలో 41 శాతం, పార్లమెంటు స్థానాల్లో 41.5 శాతం ఓట్లు వస్తాయని లెక్కగట్టారు. కాంగ్రెస్ 6 శాతం ఓట్లు, ఇతరులకు 4.5 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement