'ప్రత్యేకం' కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం | man-attempts-suicide-for-special-status-to-andhra-pradesh | Sakshi
Sakshi News home page

'ప్రత్యేకం' కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Published Wed, Aug 26 2015 9:51 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

man-attempts-suicide-for-special-status-to-andhra-pradesh

తాడేపల్లిగూడెం:  పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని చేబ్రోలు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం సుందరపు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి వంటిపై కిరోసిస్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశాడు.

స్థానికులు మంటలను ఆర్పి అతడ్ని చికిత్స కోసం తాడేపల్లి గూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రసాద్ చేబ్రోలులోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. ప్రత్యేక హోదా రావడం లేదనే మనస్ధాపంతో ఆత్మహత్మకు పాల్పడినట్టు దుర్గాప్రసాద్ చెబుతున్నాడు. ప్రస్తుతం దుర్గాప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement