మరో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు | 9 people, including 2 Nigerian nationals, held by police | Sakshi
Sakshi News home page

మరో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

Jul 19 2017 5:53 PM | Updated on Oct 17 2018 5:28 PM

డ్రగ్స్‌ కేసులో మరో తొమ్మిదిమందిని సికింద్రాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌ : నగరంలో మరో డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు అయింది. సికింద్రాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం తొమ్మిదిమందిని అరెస్ట్‌ చేశారు. కూకట్‌పల్లికి చెందిన రఘువంశీధర్‌ రెడ్డి, మల్లికార్జునరావు, మహేంద్రహిల్స్‌ నివాసి అభినవ్‌ మహేందర్‌, అలాగే బెంగళూరుకు చెందిన క్రిస్టోఫర్‌లతో పాటు అరెస్ట్‌ అయినవారిలో ఇద్దరు నైజీరియన్లు ఉన్నారు.

వీరందర్ని ఇవాళ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌.12లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 300 గ్రాములు కొకైన్‌, 42 గ్రాముల పిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులు వాడిన నిస్సాన్‌ సన్నీ కారు (AP10BE9509)ను జప్తు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement