మద్యం మత్తులో భార్యను చంపిన భర్త | A man kills wife in hyderabad | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

Apr 27 2016 3:18 PM | Updated on Sep 4 2018 5:21 PM

తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి మద్యం మత్తులో కట్టుకున్న భార్యను హతమార్చాడు.

తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి మద్యం మత్తులో కట్టుకున్న భార్యను హతమార్చాడు. దీంతో నాలుగేళ్ల చిన్నారి అనాధలా మారింది. తల్లి లేని ఆ చిన్నారి గుక్కపట్టి ఏడుస్తుండటం గమనించిన బంధువులు ఆ చిన్నారిని తల్లి మృతదేహంతో సహా తీసుకెళ్లి తండ్రి ఇంటి ముందు ఆందోళన చేశారు. వరంగల్ జిల్లా మల్కాపురానికి చెందిన ఓ జంట నగరంలో నివాసముంటున్నారు.

 

ఈ క్రమంలో మద్యానికి బానిసైన భర్త భార్యను హతమార్చి పరారాయ్యాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు నాలుగేళ్ల వర్షితను మల్కాపురం తీసుకెళ్లి అతని ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement