హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం ప్రారంభమైన బీఏసీ (శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ) సమావేశం ముగిసింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఐదురోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే 17 అంశాలపై అసెంబ్లీలో చర్చించాలని వైఎస్సార్ సీపీ కోరింది. 10 అంశాలపై చర్చించాలని టీడీపీ కోరింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం(రేపు) కాల్మనీ-సెక్స్రాకేట్పై ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. కాగా, ఈ బీఏసీ సమావేశంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు హాజరు కాగా, వైఎస్ఆర్ సీపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ముగిసిన బీఏసీ సమావేశం
Published Thu, Dec 17 2015 9:37 AM | Last Updated on Mon, Jul 23 2018 6:55 PM
Advertisement
Advertisement