Top Stories
ప్రధాన వార్తలు
ఈసీ అంఫైర్లా వ్యవహరించలేదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి? అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు.‘‘10-15 రోజులుగా మాచర్ల సెంటర్గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.’’ అని సజ్జల పేర్కొన్నారు. ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంఫైర్లా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.‘‘బాధితులు రీపోలింగ్ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్తో ఈసీ ఇన్ఫెక్ట్ అయ్యింది’’ అని సజ్జల పేర్కొన్నారు.
జాకీలు పెట్టి లేపినా.. లోకేష్కు అంత సీను లేదబ్బా!
తెలుగుదేశం పార్టీలో ఏదో అంతర్మథనం ఆరంభమైనట్లుగా ఉంది. శాసనసభ ఎన్నికలలో వచ్చే ఫలితాలపై టీడీపీలో టెన్షన్ ఏర్పడిన నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత పార్టీలో ఏమి జరిగే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది. ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న ఒక ప్రకటనలో నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో గెలుస్తామని చెబుతూనే ఆయన ఈ వ్యాఖ్య చేయడంతో పార్టీ క్యాడర్లో కన్ప్యూజన్ ఏర్పడింది. టీడీపీ గెలిచే అవకాశం ఉంటే లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేయవలసిన వెంకన్న ఇలా అనడంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. వెంకన్న ప్రకటనకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నా, ఇది అంత చిన్న విషయం కాదన్న భావన ఉంది.చంద్రబాబు జాతీయ అద్యక్షుడు అని చెప్పుకుంటున్నా, అది నామమాత్రమే అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా కింజారపు అచ్చన్నాయుడు ఉన్నారు. ఆయన పట్ల లోకేష్కు అంత సదభిప్రాయం లేదు. అచ్చెన్నను తప్పించాలని గతంలో కూడా ఆలోచన చేశారు. దానిని దృష్టిలో ఉంచుకుని ఏమైనా మాట్లాడారా? అనే సంశయం వస్తుంది. చంద్రబాబు వయసు రీత్యా ఇక పార్టీ అధ్యక్ష బాధ్యతలను కుమారుడికి అప్పగించాలని ఏమైనా అనుకుంటున్నారా? ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే చంద్రబాబుపై పార్టీలో నమ్మకం బాగా తగ్గుతుంది. అలాగని లోకేష్ నాయకత్వ పటిమపై కూడా క్యాడర్లో ఇంకా విశ్వాసం ఏర్పడలేదు.ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను ఎదుర్కోగల సత్తా లోకేష్ కు ఉందా అనే సంశయం ఉంది. లోకేష్ స్వయం ప్రకాశిత నేత కాదు. తండ్రిచాటు బిడ్డగానే రాజకీయంలోకి వచ్చారు. అలాగే ఇప్పటికీ కొనసాగుతున్నారు., అప్పడప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తున్నా, వాటికి గ్యారంటీ లేదని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కొన్నిచోట్ల చంద్రబాబు నాయుడు కొందరికి టిక్కెట్ హామీ ఇస్తే, లోకేష్ మరికొందరికి టిక్కెట్ హామీ ఇచ్చారట. వారి నుంచి డిపాజిట్ కూడా తీసుకున్నారని చెబుతారు. కానీ టిక్కెట్ పొందలేకపోయిన వారికి కొందరికి లోకేష్ డబ్బు తిరిగి ఇవ్వలేదని ప్రచారం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధికారంలోకి రాలేకపోతే ఇవి గొడవలుగా మారే అవకాశం ఉంటుంది.లోకేష్ ప్రసంగాలలోకానీ, పార్టీ నిర్వహణలో కానీ అంత సమర్థత చూపలేకపోతున్నారని చెబుతారు. అందుకే చంద్రబాబు ఇప్పటికీ పార్టీ పగ్గాలు వదలి పెట్టలేకపోతున్నారన్నది వారి అభిప్రాయం. మరో సంగతి ఏమిటంటే పోలవరం కాంట్రాక్టర్గా గతంలో వ్యవహరించిన రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు ఒక ఆరోపణ చేస్తూ చంద్రబాబు, లోకేష్ లు తమ వద్ద పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారని అనేవారు. దీనిపై ఇంతవరకు వీరు నోరు విప్పలేదు. డబ్బు లావాదేవీల సంగతి పక్కనబెడితే లోకేష్ గట్టివాడైతే 2014 ఎన్నికలలో పోటీచేసి ఉండేవారు. అప్పట్లో అధికారం రావడంతో పెత్తనం చేయడం ఆరంభించారు. తదుపరి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిల ద్వారా తండ్రి చంద్రబాబుపై ఒత్తిడి చేసి ఎమ్మెల్సీ పొంది, ఆ వెంటనే మంత్రి కూడా అయిపోయారు. అయినా తన శాఖలను నిర్వహణలో అంత పేరు తెచ్చుకోలేకపోయారు.కానీ అన్నీ శాఖలపై ఆధిపత్యాన్ని చెలాయించడం వివాదాస్పదం అయింది. చంద్రబాబు కూడా ఆయా సందర్భాలలో లోకేష్ ను కలిసి వచ్చారా అని అడిగేవారట. అంటే దాని అర్ధం ఏమిటో తెలుసు కదా! అంత అధికారం ఎంజాయ్ చేసినా, 2019 శాసనసభ ఎన్నికలలో ఆయన ఓటమి చెందడం బాగా అప్రతిష్ట అయింది. అయినా ఎమ్మెల్సీగా ఉండడంతో కౌన్సిల్ లో కొన్నిసార్లు అనుచితంగా ప్రవర్తించడం ద్వారా ప్రజల దృష్టి ఆకర్షించాలని ప్రయత్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియావారు ఆయనకు భారీ ఎలివేషన్ ఇచ్చి ప్రచారం చేశారు. అయినా ఆశించిన రీతిలో పార్టీలో నమ్మకం కలిగించలేకపోయారు.ఉపన్యాసాలలో తడబడడం, భాష సరిగా రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇవేమీ పెద్ద సమస్యలు కావు. కానీ ఒక విధానం లేకపోవడం, తండ్రి మాదిరి అబద్ధాలు చెప్పడం, అధికారులను బెదిరించడం, రెడ్ బుక్ అంటూ బ్లాక్ మెయిల్కు పాల్పడడం, కార్యకర్తలు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పోస్టు ఇస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వంటివి చేయడంతో ఈయనలో నాయకత్వ లక్షణాలు కొరవడ్డాయన్న భావన ఏర్పడింది. తన తండ్రి చంద్రబాబు బాటలోనే నడిచి అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, తానేదో చాలా గొప్పనాడిని అయిపోయినట్లు మాట్లాడడం చేస్తుడడంతో విశ్వసనీయత తెచ్చుకోలేకపోయారు. యువగళం పేరుతో పాదయాత్ర చేసినా, అందులో ఒక చిత్తశుద్ది కనిపించలేదు. పేద ప్రజలతో పూర్తిగా కలవలేకపోయారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోల్చి చూస్తే ఈయన దరిదాపులో కనిపించలేకపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయం ప్రకాశిత నేతగా ఎదిగితే, లోకేష్ ఏమో ఇంకా చంద్రబాబు కుట్ర రాజకీయాలపైనే ఆధారపడవలసి వస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అండతోనే రాజకీయాలలోకి వచ్చినా, ఆ తర్వాతకాలంలో ఒంటరిగా ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కున్నారు. పోరాటాలు చేశారు. సోనియాగాంధీ, చంద్రబాబుల కుట్రలను ఎదుర్కున్నారు. 2014 ఎన్నికలలో పార్టీ అధికారంలోకి రాకపోయినా, 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. జనంలోకి వెళ్లి పాదయాత్ర చేసి, పేద ప్రజలకు తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో చెప్పడానికి ప్రాధాన్యత ఇచ్చారు.చంద్రబాబు, లోకేష్ లు మాత్రం ఎంతసేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిను దూషించడం, అసభ్య భాష వాడడం చేశారు. ఆ తేడాను జనం గమనించి 2019 ఎన్నికలలో టీడీపీని ఘోరంగా ఓడించారు. లోకేష్ మంగళగిరిలోనే ఓటమిచెందారు. ఆ తర్వాత ఆయన అక్కడ కేంద్రీకరించి భారీ వ్యయం చేస్తూ, ఈసారి ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు రాయలసీమకు చెందినవారు. ఆయన చంద్రగిరి వదలి కుప్పం నుంచి గత మూడున్నర దశాబ్దాలుగా పోటీచేస్తున్నారు. లోకేష్ ధైర్యవంతుడు అయి ఉంటే తన తండ్రి పుట్టిన ప్రాంతమైన చంద్రగిరి నుంచి పోటీచేసి ఉంటే ఆయనపై టీడీపీలో విశ్వాసం పెరిగేది. కానీ ఆ పని చేయలేకపోయారు.ఈ పరిస్థితిలో లోకేష్ పార్టీ అధ్యక్షుడు కావాలని వెంకన్న వంటివారు కోరుకున్నారంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఇంకా అర్హత సంపాదించలేకపోయారని అనుకోవాలా? యూపీలో సమాజవాది పార్టీ నేత మూలాయం సింగ్ జీవించి ఉన్న రోజులలో ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సైకిల్ యాత్ర చేసి పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ ఎన్నికలలో అఖిలేష్ యాదవే ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేలంతా ఓపెన్ గానే చెప్పారు. ఆ స్థితి లోకేష్ కు లేకపోవడం ఒక బలహీనతగా కనిపిస్తుంది.టీడీపీలో 2009 లో జూనియర్ ఎన్.టీ.ఆర్ సేవలను చంద్రబాబు వాడుకుని ఆ తర్వాత వదిలివేశారు. ఆయనను కనీసం మహానాడుకు కూడా ఆహ్వానించలేదు. జూనియర్ ఎన్.టీ.ఆర్ పార్టీలో ఉంటే లోకేష్ అవకాశాలు పోతాయని చంద్రబాబు భయపడ్డారు. నిజానికి లోకేష్ రాజకీయాలలోకి వస్తారా అని అంతకుముందు రోజుల్లో ఎవరైనా చంద్రబాబును అడిగితే ఆ ప్రశ్న వేసినవారిపై రుసరుసలాడేవారు. ఆ దశ నుంచి ఇప్పుడు కుమారుడిని జాకీలుపెట్టి లేపే పనిలో చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా యజమానులు పడ్డారు. పార్టీని నడపడం తప్పుకాదు. ఆ స్థాయికి ఎదగాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ రాజకీయాలను ఒక స్టాండర్డ్లో చేయలేకపోతే ప్రజలలో విశ్వసనీయత రాదు. ఇప్పుడు అదే సమస్యను లోకేష్ ఎదుర్కుంటున్నారు.ఏతావాతా చెప్పేదేమిటంటే వెంకన్న వంటివారికి టీడీపీ గెలుపు మీద సంశయాలు ఉండి ఉండాలి. అంతేకాక లోకేష్ సమర్థత మీద అనుమానాలు ఉండాలి. అందుకే ఆయనను పార్టీకి పరిమితం చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు. కానీ లోకేష్ను ఒక్కసారి పార్టీ అధ్యక్షుడిగా చేస్తే పార్టీలో ఎలాంటి పరిణామాలు వస్తాయో చెప్పలేం. అప్పుడు కూడా చంద్రబాబు చాటు మనిషిగానే ఉంటే పెద్ద ఉపయోగం ఉండదు. స్వతంత్రంగా పనిచేసేంత శక్తి ఉందా అనే భయం పార్టీలో ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే ఒకరకంగా, రాకపోతే మరోరకంగా ఈ పరిణామాలు ఉంటాయి. వివిధ సర్వేలను గమనిస్తే టీడీపీ శాసనసభ ఎన్నికలలో గెలిచే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల ఫలితాల తర్వాత టీడీపీ సంక్షోభంలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
ఈడీ కేసీఆర్ ప్రస్తావన తేలేదు: కవిత లాయర్
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనల సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తావన తేలేదని కవిత తరపు న్యాయవాది మోహిత్రావు తెలిపారు. కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.ఈడీ రిపోర్టులో ఎక్కడ కూడా కేసీఆర్ పేరు రాయలేదన్నారు. బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని మాత్రమే ప్రస్తావించిందని తెలిపారు.రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసులరెడ్డికి లిక్కర్ కేసులో ఉన్నవారిని పరిచయం చేశానని చెప్పినట్లు ఈడీ తెలిపిందన్నారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేశారు.
టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ పేరు ఖరారు.. త్వరలోనే ప్రకటన..?
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. భారత్ హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి ఉన్నట్లు గంభీర్ స్వయంగా సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. గంభీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన షారుఖ్ ఖాన్కు కూడా ఈ విషయం తెలుసని సదరు వెబ్సైట్ వెల్లడించింది. హెడ్ కోచ్ పదవికి గంభీర్ దరఖాస్తు చేశాడా లేదా అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ఈ విషయం ముమ్మాటికి నిజమేనని సోషల్మీడియా సైతం కోడై కూస్తుంది. ఇదే విషయాన్ని ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ కూడా స్పష్టం చేశాడని తెలుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా, గంభీర్ల మధ్య డీల్ కుదిరిందని.. ఈ విషయమై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సదరు ఫ్రాంచైజీ ఓనర్ చెప్పినట్లు సమాచారం. రెండ్రోజుల కిందట ముగిసిన ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఈ డీల్ క్లోజ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ఫైనల్ ముగిశాక గంభీర్-జై షా చాలాసేపు బహిరంగంగా డిస్కస్ చేసుకోవడం జనమంతా చూశారు. ఆ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ పదవిపైనే చర్చ జరిగినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కాని ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. టీ20 వరల్డ్కప్ 2024తో భారత హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్ పదవి వీడేందుకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అతి త్వరలోనే ప్రకటన వెలువడేందుకు ఆస్కారం ఉంది. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా, గంభీర్ మెంటార్షిప్లో కేకేఆర్ ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. పదేళ్లకు ముందు ఇదే గంభీర్ కెప్టెన్గా కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. అంతకు రెండేళ్ల ముందు కూడా గంభీర్ ఓసారి కేకేఆర్కు టైటిల్ అందించాడు. ఘనమైన ట్రాక్ రికార్డుతో పాటు దేశం పట్ల గంభీర్కు ఉన్న కమిట్మెంట్ భారత్ హెడ్ కోచ్ పదవి రేసులో అతన్ని ముందుంచుతుంది.
ఆమెతో పెళ్లి.. విడాకులు.. అసలు కారణం వెల్లడించిన హీరో!
బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ చివరిసారిగా కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో కంగనా రనౌత్ అతనికి జంటగా నటించింది 2008లో జెనీలియాతో కలిసి జానే తూ...యా జానే నా చిత్రంలో తొలిసారిగా మెరిసన ఇమ్రాన్.. ప్రస్తుతం గూఢచారి అనే వెబ్ సిరీస్తో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అయితే 2011లోనే అవంతిక మాలిక్ను ఇమ్రాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇమారా అనే కూతురు కూడా జన్మించారు. అయితే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తన భార్య అవంతిక మాలిక్తో వివాహాబంధానికి గుడ్ బై చెప్పారు హీరో. అప్పట్లో ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ ఆమెతో విడాకులపై తొలిసారి స్పందించారు. విడిపోవడానికి గల కారణాలను వివరించారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.ఇంటర్వ్యూలో ఇమ్రాన్ మాట్లాడుతూ..'ఆ విషయంలోకి పెద్దగా వెళ్లాలనుకోవడం లేదు. గాసిప్స్కు ఆజ్యం పోయడానికి నేను సంకోచిస్తున్నా. అయితే నేను అంతర్గతంగా చాలా ఇబ్బందులు పడ్డా. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆరోగ్యకరమైన బంధం ఉండాలి. అప్పుడే ఇద్దరి మధ్య బంధం బలంగా తయారవుతుంది. అంతేకాదు ఒకరికొకరు మద్దతు ఉంటూ ఉత్తమంగా నిలుస్తారు. కానీ మా ఇద్దరి మధ్య అదే లోపించింది. అందుకే విడిపోవాల్సి వచ్చింది.' అని పంచుకున్నారు. కాగా.. అవంతికను 2011లో ఇమ్రాన్తో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఇమారా అనే కుమార్తెకు తల్లిదండ్రులయ్యారు. 2019లో వీరి వివాహాబంధానికి ముగింపు పలికారు.
400 బక్వాస్.. 200 సీట్లు రావడం కూడా కష్టమే: ఖర్గే ఎద్దేవా
లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో విజయం సాధిండం ఖాయమని బీజేపీ చెప్పుకుంటున్న ప్రచారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొట్టిపారేశారు. కొన్ని రాష్ట్రాల్లో అసలు ఉనికిలోనే లేని బీజేపీకి 400 సీట్లు రావడం బక్వాస్(అబద్ధమని) అని అన్నారు. 400 కాదు కదా కనీసం 200 సీట్లు కూడా దాటవని అన్నారు.అమృత్సర్లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి సీట్లు తగ్గుతాయని అన్నారు. అదే విధంగా, కాంగ్రెస్, ఇండియా కూటమి పుంజుకుంటుందని పేర్కొన్నారు.కాగా లోక్సభ ఎన్నికల్లో తమకు 400 సీట్లు వస్తాయని బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ చెబుతూ వస్తోంది. దీనిపై ఖర్గే స్పందిస్తూ... బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను ఆధారమేమిటని ప్రశ్నించారు. మీ(బీజేపీ) సీట్లు తగ్గుతున్నప్పుడు మావి(కూటమి) పెరుగుతున్నప్పుడు. 400 సీట్లు ఎలా వస్తాయి. అది పూర్తిగా అబద్దమని అన్నారు. అసలు బీజేపీ కేంద్రంలో ప్రభుత్వమే ఏర్పాటు చేయదని, ఎన్డీయే కూటమికి 200 సీట్లకు మించి రావని అన్నారు.తమిళనాడు, కేరళ, తెలంగాణలో బీజేపీ ఉనికిలో లేదని, కర్ణాటకలో అంత బలంగా లేదని మండిపడ్డారు. మహారాష్ట్రలోనూ కాషాయం బలహీనంగా ఉందన్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ఒడిశాలో గట్టి పోటీ ఉందన్న ఖర్గే.. ఆ పార్టీకి 400 సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, భారత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాటన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు. యువత డ్రగ్స్కు బానిసవ్వడంపై స్పందిస్తూ..దీనిని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉందన్న బీజేపీ ఆరోపణలను ఖర్గే ఖండించారు. 'మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టో చూడడు, చదవడు.. మందు చెప్పినం.. ఇందులో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తే కాంగ్రెస్ కార్యాలయం నుండి ఒక వ్యక్తిని పంపింస్తాం.. ఆయనకు అది వివరించడానికి సహాయం చేస్తాడు. పార్టీ మేనిఫెస్టో యువత, రైతులు, కూలీలు, బడుగు బలహీన వర్గాల కోసమే’నని అన్నారు.
రాజకీయాల్లోకి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్?
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారా? 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజన్ కాంగ్రెస్ చేరుతున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు. తాజాగా మరోమారు ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై వార్తలు వస్తున్నాయి. దీనిపైన రాజన్ స్పందించారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టడం కంటే నేను చేయగలిగిన చోట మార్గనిర్దేశం చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్రయత్నిస్తున్నాని తెలిపారు. ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నాను. నేను విద్యా వేత్తని. ‘మై బిజినెస్ ఈజ్ నాట్ కిస్సింగ్ బేబీస్’. కానీ ప్రజలు ఇప్పటికీ నా మాటల్ని నమ్మడం లేదు. పాలిటిక్స్ అంటే నా భార్యకు, నాకుటుంబానికి ఇష్టం లేదు. రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదన్నారు.అనంతరం భారత్, అమెరికా తదితర దేశాల్లోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, చిన్న పరిశ్రమల ముందున్న సవాళ్లు, ఆర్థిక అసమానతలపై రాజన్ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల్లో యుద్ధ భయాలతో పాటు ఇతర అంశాలే అందుకు కారణం. దీనికి తోడు అధిక వడ్డీ రేట్ల ప్రభావం ప్రపంచ వృద్ది ఆశించిన స్థాయిలో ఉండదని తెలిపారు.‘మై బిజినెస్ ఈజ్ నాట్ కిస్సింగ్ బేబీస్’ అంటే పరోక్షంగా రాజకీయాల్లో రావడం ఇష్టం లేదు.. సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పేందుకు ఇంగ్లీష్లో ఈ పదాన్ని సందర్భాన్ని బట్టి వాడుతుంటారు.
ఫలితాల తర్వాత నితీష్ ఏదైనా చేయొచ్చు: తేజస్వి
పాట్నా: లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బిహార్ సీఎం మరోసారి కూటమి మారడానికి రెడీ అవుతారని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ విషయమై మంగళవారం(మే28)న తేజస్వి మీడియాతో మాట్లాడారు. జూన్ 4 తర్వాత సీఎం నితీష్ తన పార్టీని కాపాడుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవచ్చని చెప్పారు.కాగా గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు వేర్వేరు పార్టీలో పొత్తులు పెట్టుకుని అధికారంలో కొనసాగారు. అయితే ఇటీవల ఓ ఎన్నికల ప్రచార సభలో నితీష్ మాట్లాడుతూ ఇక మీదట తాను బీజేపీతో తప్ప మరే పార్టీతో పొత్తు పెట్టుకోనని హామీ ఇచ్చారు. తాను ప్లేటు ఫిరాయించడం ఇదే చివరిసారన్నారు. కాగా గడిచిన పదేళ్లలో నితీష్ ఐదుసార్లు బీజేపీ, ఆర్జేడీలతో పొత్తులు మార్చారు.
కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరీక పోకడనా?: కేటీఆర్ కౌంటర్
KTR | హైదరాబాద్ : ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది అని కేటీఆర్ విమర్శించారు.సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణ ఉండదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కౌంటర్ ఇచ్చారు. అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణ, చార్మినార్ రాచరీక పోకడ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ అనేవి రాచరికపు గుర్తులు కాదని, వెయ్యేళ్ల సాంస్కృతి వైభవానికి చిహ్నాలు అని పేర్కొన్నారు.ఈ మేరకు ట్విటర్లో కేటీఆర్ స్పందిస్తూ..‘ ముఖ్యమంత్రి గారు..ఇదేం రెండునాల్కల వైఖరి..!ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన..!!మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం..!చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు..!!అవి రాచరికపు గుర్తులు కాదు..!వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు..!!వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు..!!!జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ?“కాకతీయ” కళాప్రభల కాంతిరేఖ రామప్పగోల్కొండ నవాబుల గొప్ప వెలుగే.. “చార్మినార్”అధికారిక గీతంలో కీర్తించి..!!అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..??చార్మినార్ అంటే.. ఒక కట్టడం కాదు..విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఐకాన్కాకతీయ కళాతోరణం అంటే.. ఒక నిర్మాణం కాదు..సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం..తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి.. వీటిని తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమే..!నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే..!!మీ కాంగ్రెస్ పాలిస్తున్న... కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులున్నాయి.. మరి వాటిని కూడా తొలగిస్తారా చెప్పండి..??భారత జాతీయ చిహ్నంలోనూ.. అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలున్నాయి..జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉంది..వాటి సంగతేంటో సమాధానం ఇవ్వండి..??కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా ?ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా ?ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు..రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా..?గత పదేళ్లుగా.. ప్రభుత్వ అధికారిక చిహ్నంపై.. యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది.. సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ఉంది..రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో.. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించంపౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా... మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తాం..!తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం..!!’ అని పేర్కొన్నారు.
Deepika Padukone : దీపికా పడుకోణె అమేజింగ్ లగ్జరీ కార్లు, విలువ ఎంతో తెలుసా?
బాలీవుడ్లో స్టార్ హీరోల హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా తానేంటో నిరూపించుకున్న అద్భుతమైన నటి దీపికా పదుకొణె. రెమ్యూనరేషన్ విషయంలో హీరోలతో పోటీ పడుతూ టాప్ నటుల్లో ఒకరిగా నిలిచింది. అందానికి తోడు నటనా నైపుణ్యంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో చోటు సంపాదించింది. అంతేనా మూడు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ టైమ్ మ్యాగజీన్ 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచింది. 2022లో టైమ్100 ఇంపాక్ట్ అవార్డు సొంతం చేసుకుంది.అద్భుతమైన నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ను పెళ్లాడి పవర్ కపుల్ స్టేటస్ను దక్కించుకుంది. త్వరలో దీపికా, రణ్వీర్ జంట త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. లగ్జరీ కార్లు, బంగ్లా లాంటి విలాసవంతమైన జీవనశైలి వారి సొంతం. ఈ నేపథ్యంలో దీపికా గ్యారేజ్ కొలువుదీరిని లగ్జరీ వాహనాలకు గురించి తెలుస్తే షాక్ అవ్వాల్సిందే,. ఎందుకంటే దీపికా మొత్తం కార్ కలెక్షన్ విలువ రూ. 10 కోట్లు. దీపికా పదుకొణె కార్ కలెక్షన్..ఆడి క్యూ7 – ధర రూ. 80 లక్షలుమెర్సిడెస్ మేబ్యాక్ S500 – రూ. 2.40 కోట్లురేంజ్ రోవర్ వోక్ – రూ. 1.40 కోట్లుమినీ కూపర్ కన్వర్టిబుల్ – రూ. 45 లక్షలుమెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్- రూ. 1.60 కోట్లుఆడి A8 L- రూ. 1.20 కోట్లుఆడి A6- రూ. 55 లక్షలుBMW 5 సిరీస్- రూ. 60 లక్షలుపోర్షే కయెన్- రూ. 1 కోటిప్రస్తుతం దీపికా పదుకొణె కల్కి 2898 ఏడీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అలాగే "సింగం ఎగైన్"లో అనే మూవీలోనూ నటిస్తోంది. ఇందులో పోలీసు యూనిఫాంలో యాక్షన్ సన్నివేశాల్లో ఫ్యాన్స్ను ఆకట్టుకుంది.
తప్పక చదవండి
- ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
- ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
- ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
- T20 World Cup 2024: సెమీస్కు చేరే జట్లు ఇవే..!
- ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
- పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
- నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
- స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
- రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్న కళానిధిమారన్
సినిమా
చిరుత హీరోయిన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్తోనే భయపెట్టేశారు!
ప్రస్తుతం అంతా ఓటీటీల యుగం నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త సిరీస్లు, సినిమాలు సినీ ప్రియులను అలరించేందుకు వస్తున్నాయి. ముఖ్యంగా హారర్, క్రైమ్ జానర్ లాంటి కథలు ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటికే ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతోంది. తాజాగా మరో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. నేహా శర్మ నటించిన తాజా వెబ్ సిరీస్ 36 డేస్ ఓటీటీలో సందడి చేయనుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే మర్డర్ మిస్టరీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్కు 'సీక్రెట్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ట్రైలర్లోనే ట్విస్టులు భయపెట్టేలా ఉన్నాయి. ఇవాళ విడుదల చేసిన ట్రైలర్తో ఈ సిరీస్పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశారు. ఈ సిరీస్లో పూరబ్ కోహ్లి, శృతి సేఠ్, చందన్ రాయ్ సన్యాల్, షరీబ్ హష్మి, అమృతా ఖాన్విల్కర్ కీలక పాత్రల్లో నటించారు. అయితే మర్డర్ మిస్టరీ సిరీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. నేహా శర్మ టాలీవుడ్లో చిరుత మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన మెరిసింది.
హీరామండి నటితో డేటింగ్.. స్పందించిన నటుడు..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. మనీషా కొయిరాలా, ఆదితిరావు హైదరీ, సోనాక్షి సిన్హా ప్రధానపాత్రల్లో నటించిన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. పాకిస్తాన్లో లాహోర్లో జరిగిన స్వాతంత్య్రానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ను తెరకెక్కించారు. అయితే సిరీస్లో షర్మిన్ సెగల్(ఆలంజేబ్) ప్రియుడిగా తహా షా బాద్షా నటించారు.అయితే తాజాగా అతను మరో నటితో డేటింగ్లో ఉన్నట్లు బాలీవుడ్లో రూమర్స్ మొదలయ్యాయి. హీరామండి నటి ప్రతిభా రంతాతో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో తనపై వస్తున్న వార్తలపై హీరామండి నటుడు తహా షా బాద్షా స్పందించారు. ఆమెతో పరిచయం కేవలం నటన వరకు మాత్రమేనని అన్నారు. ఆమెతో నా రిలేషన్ కేవలం షూట్ వరకే ఉంటుందని బాద్షా అన్నారు. ముందుగా నేను జీవితంలో స్థిరపడాలని.. ఆ తర్వాతే ప్రేమ, కుటుంబం గురించి ఆలోచిస్తానని వెల్లడించారు. కాగా.. ముంబయిలో ఇద్దరు కలిసి డిన్నర్ డేట్లో కనిపించడంతో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా వీటికి క్లారిటీ ఇచ్చేశాడు. హీరామండిలో తాజ్దార్ పాత్రలో మెప్పించాడు. షర్మిన్ సెగల్ ప్రియుడిగా.. స్వాతంత్ర్య ఉద్యమ కారుడిగా ఈ సిరీస్లో మెప్పించారు. ఇటీవల జరిగిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా తాహా షా బాదుషా సందడి చేశారు. ప్రతిభా రంతా హీరామండిలో షామా పాత్రలో కనిపించింది.
బాలీవుడ్ నటికి సర్జరీ.. ఇప్పుడెలా ఉందంటే?
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇటీవలే సర్జరీ చేయించుకుంది. తన గర్భాశయంలో భారీ కణతి ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ఇది జరిగి 10 రోజులు అవుతుండగా ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోంది. తాజాగా రాఖీ వైద్య పరిస్థితిని తెలుపుతూ ఆమె మాజీ భర్త రితేశ్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఆమె మళ్లీ మనలో ఒకరిగా తిరగనుంది. తను నడవగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది అని రాసుకొచ్చాడు. బాధలో ఉంటే నవ్వులాటగా ఉందా?ఈ వీడియోలో రాఖీ అడుగు తీసి అడుగు వేయడానికి కూడా చాలా కష్టపడుతోంది. ఆ నొప్పిని భరించలేకపోతోంది. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా రాఖీ సర్జరీ చేయించుకోబోతుందన్నప్పుడు చాలామంది వెటకారంగా మాట్లాడారు. తనను దూషించారు. అలాంటివారిపై రితేశ్ తీవ్రంగా మండిపడ్డాడు. ఒకరు బాధలో ఉంటే చూసి నవ్వడానికి మనసెలా వస్తుందో.. ఈ సమయంలో కూడా తనమీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మీరసలు మనుషులు కాదుఅవతలివారి కష్టాన్ని అర్థం చేసుకోవడానికి బదులు ఎగతాళి చేస్తున్నవాళ్లు అసలు మనుషులే కాదు అని ఆగ్రహించాడు. రాఖీ పొట్టలో నుంచి తీసిన గడ్డను సైతం చూపిస్తూ.. ఇది ఎంత పెద్ద కణతో చూశారా? రాఖీకి మేమంతా ఉన్నాం అని చెప్పుకొచ్చాడు. అయితే రాఖీ రెండో మాజీ భర్త మాత్రం ఇదంతా డ్రామానే అని కొట్టిపారేశాడు. లీక్డ్ వీడియోల కేసులో నుంచి తప్పించుకోవడానికే ఆపరేషన్ అని డ్రామా ఆడుతోందని విమర్శించాడు. View this post on Instagram A post shared by Ritesh Kumar (@riteshsinghofficialbb15) చదవండి: సన్ ఫ్లవర్లా స్టార్ హీరోయిన్.. ఆ డ్రెస్సు ఎంతకు అమ్మిందంటే?
రష్మికకు ఫ్యాన్స్ రిక్వెస్ట్.. అదేంటో తెలుసా?
పుష్ప సినిమాతో నేషనల్ క్రష్గా మారిపోయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ నెల 29న పుష్ప-2 రెండో సింగిల్ కూడా రిలీజ్ చేయనున్నారు. పుష్ప మూవీతో వచ్చిన క్రేజ్తో దేశవ్యాప్తంగా కూడా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా రష్మిక టాలీవుడ్ మూవీ గంగం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైంది.అయితే రష్మికకు సౌత్తో పాటు నార్త్లోనూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. తాజాగా రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ప్రీ రిలీజ్కు ఈవెంట్కు హాజరైన రష్మిక ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. రష్మిక ఈవెంట్లో మీరు చాలా అందంగా కనిపించారు..మిమ్మల్ని చూసినందుకు మాకు చాలా సంతోషం కలిగింది.. కానీ మీరు తెలుగులో మాట్లాడటంతో మాకు అర్థం కాలేదు. నార్త్లోనూ మీ అభిమానులు మీ మాటలు వినడానికి ఎంతో ఇష్టపడతారు. అలాంటి వారికోసం ఇంగ్లీషులో మాట్లాడాలని ట్విటర్ వేదికగా రష్మికను కోరారు. దయచేసి మా అభ్యర్థనను పరిశీలించవలసిందిగా కోరుతున్నాం అంటూ పోస్ట్ చేశారు. అయితే దీనికి రష్మిక సైతం రిప్లై ఇచ్చింది.రష్మిక ట్వీట్ రాస్తూ..' మీరు ఎక్కడి నుంచి వచ్చినా.. మీరందరూ నన్ను అర్థం చేసుకునేలా ఇంగ్లీషులో మాట్లాడేందుకు నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. చాలామంది వారి స్థానిక భాషలోనే మాట్లాడాలని కోరుకుంటారు. వారి భాషపై ఉన్న గౌరవంతో అలా మాట్లాడుతా. దక్షిణాదితో పాటు మీలాంటి ఫ్యాన్స్ కోసం ఇంగ్లీషులో మాట్లాడేందుకు నేను నా వంతు ప్రయత్నం చేస్తా' అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరలవుతోంది. I try my best to talk in English so that everyone of you understand me no matter where you are from..❤️ but I am just uncomfortable with the fact that many people who want me to speak in their language will think that I am disrespectful of the language or that I don’t know the…— Rashmika Mandanna (@iamRashmika) May 28, 2024
ఫొటోలు
హీరోయిన్ మూడో పెళ్లి.. తెలుగులోనూ నటించింది (ఫోటోలు)
11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్ కపుల్.. కుమారుడి కోసం (ఫొటోలు)
Janhvi Kapoor: మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్లో జాన్వీ బిజీ బిజీ..క్రికెట్ థీమ్ నెక్లెస్..!
తెల్లచీరలో రాయంచలా మెరిసిపోతున్న ఈ బ్యూటీ గుర్తుందా!
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరో ఆశిష్ (ఫొటోలు)
క్రీడలు
టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ పేరు ఖరారు.. త్వరలోనే ప్రకటన..?
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. భారత్ హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి ఉన్నట్లు గంభీర్ స్వయంగా సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. గంభీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన షారుఖ్ ఖాన్కు కూడా ఈ విషయం తెలుసని సదరు వెబ్సైట్ వెల్లడించింది. హెడ్ కోచ్ పదవికి గంభీర్ దరఖాస్తు చేశాడా లేదా అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ఈ విషయం ముమ్మాటికి నిజమేనని సోషల్మీడియా సైతం కోడై కూస్తుంది. ఇదే విషయాన్ని ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ కూడా స్పష్టం చేశాడని తెలుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా, గంభీర్ల మధ్య డీల్ కుదిరిందని.. ఈ విషయమై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సదరు ఫ్రాంచైజీ ఓనర్ చెప్పినట్లు సమాచారం. రెండ్రోజుల కిందట ముగిసిన ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఈ డీల్ క్లోజ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ఫైనల్ ముగిశాక గంభీర్-జై షా చాలాసేపు బహిరంగంగా డిస్కస్ చేసుకోవడం జనమంతా చూశారు. ఆ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ పదవిపైనే చర్చ జరిగినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కాని ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. టీ20 వరల్డ్కప్ 2024తో భారత హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్ పదవి వీడేందుకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అతి త్వరలోనే ప్రకటన వెలువడేందుకు ఆస్కారం ఉంది. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా, గంభీర్ మెంటార్షిప్లో కేకేఆర్ ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. పదేళ్లకు ముందు ఇదే గంభీర్ కెప్టెన్గా కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. అంతకు రెండేళ్ల ముందు కూడా గంభీర్ ఓసారి కేకేఆర్కు టైటిల్ అందించాడు. ఘనమైన ట్రాక్ రికార్డుతో పాటు దేశం పట్ల గంభీర్కు ఉన్న కమిట్మెంట్ భారత్ హెడ్ కోచ్ పదవి రేసులో అతన్ని ముందుంచుతుంది.
మేజర్ లీగ్ క్రికెట్కు లిస్ట్-ఏ హోదా
అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్కు లిస్ట్-ఏ హోదా లభించింది. ఈ విషయాన్ని ఐసీసీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. లీగ్ రెండో ఎడిషన్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఐసీసీ నిర్ణయం వెలువడటంతో ఎంఎల్సీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (యూఏఈ) తర్వాత లిస్ట్-ఏ హోదా పొందిన రెండో అసోసియేట్ సభ్య దేశ లీగ్గా ఎంఎల్సీ గుర్తింపు దక్కించుకుంది. ఎంఎల్సీ రెండో సీజన్ ఈ ఏడాది జులై 5 నుంచి ప్రారంభంకానుంది. ఎంఎల్సీలో ఈసారి గత సీజన్ కంటే ఎక్కువ మ్యాచ్లు జరుగనున్నాయి. గత సీజన్లో ఆరు జట్లు సింగిల్ రౌండ్ రాబిన్ ఫార్మట్లో మూడు వారాల పాటు 19 మ్యాచ్లు ఆడగా.. ఈ సీజన్లో అన్నే జట్లు గత సీజన్ కంటే 6 మ్యాచ్లు ఎక్కువగా ఆడనున్నాయి. ఎంఎల్సీని మరికొద్ది సీజన్లలో 10 జట్ల లీగ్గా ఎక్స్ప్యాండ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఎంఎల్సీలో బీసీసీఐ అనుబంధ ఆటగాళ్లు మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జట్ల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ లీగ్కు తొలి సీజన్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ లీగ్ను లిస్ట్-ఏ హోదా లభించడానికి ఇదీ ఒక కారణం. ఎంఎల్సీ అరంగేట్ర ఎడిషన్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఛాంపియన్గా నిలిచింది. ఈ జట్టుకు కీరన్ పోలార్డ్ నేతృత్వం వహించాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్తో పాటు లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, సీయాటిల్ ఆర్కాస్, టెక్సస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడం ఎంఎల్సీలో మిగతా ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. క్రికెట్లో లిస్ట్-ఏను వన్డే ఫార్మాట్ కింద పరిగణిస్తారు. అంతర్జాతీయ వన్డేలతో పాటు పలు దేశవాలీ టోర్నీలు కూడా ఈ జాబితా పరిధిలోకి వస్తాయి. లిస్ట్-ఏ పోటీలు గరిష్టంగా 8 గంటల పాటు సాగుతాయి. ఐసీసీచే అధికారికంగా వన్డే హోదా పొందని దేశాలు ఆడే అంతర్జాతీయ మ్యాచ్లు కూడా లిస్ట్-ఏ కిందికే వస్తాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్, టీ20 క్రికెట్తో పాటు లిస్ట్-ఏ క్రికెట్ ఐసీసీచే గుర్తించబడిన మూడు ప్రధాన ఫార్మాట్లలో ఒకటి.
ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత-ఏ జట్టు
భారత-ఏ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 31-నవంబర్ 10 మధ్యలో ఆస్ట్రేలియా-ఏతో రెండు నాలుగు రోజుల మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్కు ముందు జరుగనుంది. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు టీమిండియాతో కూడా ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 15-17 మధ్యలో జరుగనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత-ఏ జట్టు ఆడే రెండు మ్యాచ్లకు ఫస్ట్ క్లాస్ హోదా లభించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది.ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు రెగ్యులర్ సభ్యులు కొందరు ఈ సిరీస్లో పాల్గొంటారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడనుందని సీఏ తెలిపింది. ఈ పర్యటన కోసం జట్ల ఎంపిక జరగాల్సి ఉంది. భారత్-ఏతో సిరీస్ పక్కా అయిన విషయాన్ని మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.ఆస్ట్రేలియాలో భారత-ఏ జట్లు పర్యటన వివరాలు..తొలి నాలుగు రోజుల మ్యాచ్- భారత్-ఏ, ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు క్వీన్స్ల్యాండ్ వేదికగా జరుగనుంది.రెండో నాలుగు రోజుల మ్యాచ్- భారత్-ఏ, ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 7 నుంచి నవంబర్ 10 వరకు మెల్బోర్న్ వేదికగా జరుగనుంది.టీమిండియాతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్- నవంబర్ 15 నుంచి 17 వరకు పెర్త్లో జరుగనుంది.బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్ ఇలా..తొలి టెస్ట్- నవంబర్ 22-28 వరకు (పెర్త్లో)రెండో టెస్ట్- డిసెంబర్ 6-10 వరకు (అడిలైడ్లో)మూడో టెస్ట్- డిసెంబర్ 14-18 వరకు (బ్రిస్బేన్లో)నాలుగో టెస్ట్- డిసెంబర్ 26-30 వరకు (మెల్బోర్న్లో)ఐదో టెస్ట్- 2025 జనవరి 3 నుంచి 7 వరకు (సిడ్నీలో)స్వదేశంలో జరిగిన గత రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో ఈసారి సిరీస్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది.
T20 World Cup 2024: సెమీస్కు చేరే జట్లు ఇవే..!
ఐపీఎల్ 2024 సీజన్ ముగిసి రెండు రోజులైనా పూర్తి కాకముందే క్రికెట్ సర్కిల్స్ను పొట్టి ప్రపంచకప్ ఫీవర్ పట్టుకుంది. ప్రపంచకప్ ప్రారంభానికి మరో మూడు రోజులు ఉండగానే అభిమానులతో పాటు విశ్లేషకులు వరల్డ్కప్ మోడ్లోకి వచ్చారు. ఈసారి తమ టీమ్ గెలుస్తుందంటే తమ టీమ్ గెలుస్తుందని అభిమానులు నెట్టింట డిబేట్లకు దిగుతున్నారు. విశ్లేషకులు, మాజీలు గెలుపు గుర్రాలపై అంచనాలు వెల్లడిస్తున్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు మాజీ క్రికెటర్లు వరల్డ్కప్ సెమీస్కు చేరే జట్లపై తమ అంచనాలను వెల్లడించారు. వీరిలో అందరూ భారత్ తప్పక సెమీస్కు చేరుతుందని చెప్పడం విశేషం.టీ20 వరల్డ్కప్ 2024 సెమీఫైనలిస్ట్ల విషయంలో మాజీల అంచనాలు ఇలా..అంబటి రాయుడు- భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాబ్రియాన్ లారా- భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్పాల్ కాలింగ్వుడ్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్సునీల్ గవాస్కర్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్క్రిస్ మోరిస్- భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియామాథ్యూ హేడెన్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాఆరోన్ ఫించ్- భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్మొహమ్మద్ కైఫ్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్టామ్ మూడీ- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాశ్రీశాంత్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్కాగా, టీ20 వరల్డ్కప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈసారి ప్రపంచకప్లో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్లుగా విభజించబడి పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాక్, ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా దేశాలు.. గ్రూప్-బిలో నమీబియా, స్కాట్లాండ్, ఒమన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా.. గ్రూప్-సిలో ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-డిలో నెదర్లాండ్స్, నేపాల్, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి.
బిజినెస్
ఆరు ఉపగ్రహాలను ప్రయోగించనున్న స్టార్టప్ సంస్థ
బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ పిక్సెల్ తయారుచేస్తున్న ఉపగ్రహాలను 2024 చివరినాటికి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం స్పేస్ఎక్స్కు చెందిన రైడ్షేర్ మిషన్లు, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)ను ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది.ఈ సందర్భంగా పిక్సెల్ సీఈఓ అవైస్ అహ్మద్ మాట్లాడుతూ..‘కంపెనీకు స్పేస్ఎక్స్, పీఎస్ఎల్వీ రెండింటిలోనూ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. అయితే, ఇది ఉపగ్రహాల సంసిద్ధత, ప్రయోగ షెడ్యూల్పై ఆధారపడి ఉంటుంది. సంస్థ వద్ద ప్రస్తుతం ఏటా 40 పెద్ద ఉపగ్రహాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం పరిశోధకుల బృందం ఆరు ఉపగ్రహాలపై పని చేస్తోంది. వీటిని ఈ ఏడాది చివరినాటికి అంతరిక్షంలోని ప్రవేశపెట్టనున్నాం. 2024లో మరిన్ని ఉపగ్రహాలను తయారుచేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: మోదీ ప్రధాని అయినా, అవ్వకపోయినా అందులో మార్పులేదుఈ ఏడాది జనవరిలో పిక్సెల్ బెంగుళూరులో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘మెగాపిక్సెల్’ అనే ఫెసిలిటీని ప్రారంభించింది. ఇందులో ఆరు హైపర్స్పెక్ట్రల్ ఇమేజరీ ఉపగ్రహాలను ప్రయోగాలు జరుపుతున్నారు. ఇవి వ్యవసాయం, ఎనర్జీ, అటవీ, పర్యావరణ పర్యవేక్షణతో సహా వివిధ పరిశ్రమలకు ఉపయోగపడుతాయని కంపెనీ వర్గాలు చెప్పాయి. 2022లో పిక్సెల్ స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ను ఉపయోగించి ‘శకుంతల’ (టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్-2) ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్న కళానిధిమారన్
స్పైస్జెట్ సంస్థ నుంచి రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్నట్లు ఆ సంస్థ మాజీ ప్రమోటర్ కళానిధి మారన్ తెలిపారు. ఇటీవల మారన్ నుంచి రూ.450 కోట్లు పరిహారం కోరతామని స్పైస్జెట్ వెల్లడించిన నేపథ్యంలో మారన్, ఆయన కంపెనీ కేఏఎల్ ఎయిర్వేస్ ఈ మేరకు ప్రకటన వెల్లడించారు.స్పైస్జెట్కు గతంలో ప్రమోటర్గా వ్యవహరించిన కళానిధి మారన్ సంస్థలో తన 58.46 శాతం వాటాను ప్రస్తుత ప్రమోటర్ అజయ్సింగ్కు బదిలీ చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా తనకు రావాల్సిన వారంట్స్, షేర్లు జారీ చేయలేదని మారన్ ఆరోపించారు. ఈ వ్యవహారం కోర్టుకెళ్లింది. దీనిపై మధ్యవర్తిత్వ కోర్టు, దిల్లీ సింగిల్ బెంచ్ తీర్పులను అనుసరించిన స్పైస్జెట్.. మారన్, ఆయనకు చెందిన కేఏఎల్ ఎయిర్వేస్కు రూ.580 కోట్లు అసలు, రూ.150 కోట్లు వడ్డీ చొప్పున రూ.730 కోట్లు చెల్లించింది.స్పైస్జెట్, కంపెనీ ప్రస్తుత ప్రమోటరు అజయ్సింగ్ మారన్కు రూ.580 కోట్లను వడ్డీతో పాటు చెల్లించాలని గతంలో జారీ చేసిన ఆదేశాలను సమర్థించిన ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ మే 17న దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పక్కనపెట్టింది. దాంతో కళానిధి మారన్, ఆయన సంస్థ కేఏఎల్ ఎయిర్వేస్కు చెల్లించిన రూ.730 కోట్ల మొత్తం నుంచి రూ.450 కోట్లు రీఫండ్ ఇవ్వాలని కోరనున్నట్లు స్పైస్జెట్ తెలిపింది.దాంతో మారన్ దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాససం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేయనున్నట్లు తెలిపారు. ఎఫ్టీఐ కన్సల్టింగ్ ఎల్ఎల్పీ నిర్ణయించిన రూ.1323 కోట్ల నష్టాన్ని సైతం స్పైస్జెట్ నుంచి కోరనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
మరో బిజినెస్లోకి అదానీ గ్రూప్.. గూగుల్, అంబానీకి చెక్ పెట్టేనా?
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఊహించని విధంగా వృద్ది సాధిస్తోన్న ఈ-కామర్స్,పేమెంట్స్ విభాగంలో అడుగుపెట్టనుంది. దీంతో అదే రంగంలో మార్కెట్ను శాసిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్, మరో దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి గట్టి పోటీ ఇవ్వనుందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.ఇప్పటికే అందుకు కావాల్సిన లైసెన్స్ కోసం అప్లయి చేసినట్లు సమాచారం. ఆ లైసెన్స్ యూపీఐ వంటి చెల్లింపులతో పాటు, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు అదానీ గ్రూప్ ప్రతినిధులు పలు బ్యాంక్లతో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ చర్చలు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది.జాతీయ మీడియా కథనాల ప్రకారం..తన సేవలు వినియోగదారులకు మరింత చేరువయ్యేలా అదానీ గ్రూప్ ప్రభుత్వ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాం ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) చర్చలు జరుపుతోంది.చర్చలు సఫలమైందే అదానీ గ్రూప్కు చెందిన అదానీ వన్ యాప్లో ఓఎన్డీసీ వినియోగదారులకు సేవలు అందుతాయి. ఓఎన్డీసీలో ఏదైనా కొనుగోలు చేసిన యూజర్లు అదానీ వన్ ద్వారా పలు ఆఫర్లు పొందవచ్చు. ఇప్పటికే ఈ యాప్ యూజర్లకు హోటల్, ఫ్లైట్ రిజర్వేషన్తో సహా ఇతర ట్రావెల్ సంబంధిత సేవల్ని వినియోగించడం ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లు పొందవచ్చు
అప్పుల్లో ఉన్నా అస్సలు తగ్గని అనిల్ అంబానీ.. కొత్త కారులో
భారతదేశంలోని అత్యంత సంపన్నులైన ముఖేష్ అంబానీ తన రెండో కొడుకు ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరపడానికి సిద్ధమయ్యారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ బాష్ 29 మే నుంచి జూన్ 1 మధ్య జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇటలీకి బయలుదేరారు. తాజాగా ముఖేష్ అంబానీ సోదరుడు 'అనిల్ అంబానీ' బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారులో విమానాశ్రయంలో కనిపించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అనిల్ అంబానీ బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారులో నుంచి దిగటం చూడవచ్చు. కారు నుంచి బయటకు వచ్చిన తరువాత ఫోటోగ్రాఫర్ల వైపు కూడా చూడకుండా ముంబైలోని కలీనా విమానాశ్రయంలోకి వెళ్లారు. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరుతో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి ఇది అనిల్ అంబానీ కొనుగోలు చేశారా అని పలువురు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.బీవైడీ ఎలక్ట్రిక్ కారు డైనమిక్, ప్రీమియం, పర్ఫామెన్స్ అనే మూడు వేరియంట్లలో.. ఆర్కిటిక్ బ్లూ, అరోరా వైట్, అట్లాంటిస్ గ్రే, కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అనిల్ అంబానీ కనిపించిన కారు ప్రీమియం వేరియంట్ అని తెలుస్తోంది.బీవైడీ సీల్ ఎలక్ట్రిక్ కారు 61.44 కిలోవాట్, 82.56 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి వరుసగా 510 కిమీ, 650 కిమీ రేంజ్ అందిస్తాయి. వీటి ధరలు వరుసగా రూ. 41 లక్షలు, రూ. 53 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తాయి. View this post on Instagram A post shared by The Viral Cinema - Sajal Jain (@theviralcinema)
వీడియోలు
మహిళల అశ్లీల వీడియోలు సీక్రెట్ గా రికార్డ్...
ఎమ్మెల్సీ కవిత బెయిల్.. తీర్పు రిజర్వ్
తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదు..
ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు
ఈసీకి చంద్రబాబు వైరస్
విభజనకు పదేళు ఏపీకి ఎవరేం చేశారు ?
ఎలక్షన్ కమిషన్ నిబంధనలపై పేర్ని నాని రియాక్షన్
హైకోర్టులో పిన్నేల్లికి భారీ ఊరట..
పసుపు పూసుకున్న పోలీసులు
బాబు పై భక్తి చాటుకున్న పోలీసులు
ఫ్యామిలీ
Anant - Radhika Cruise Party : షకీరా ఆట పాట, ఫీజు తెలిస్తే ఫ్యూజులెగిరిపోతాయ్!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రేయసి రాధికా మర్చంట్ను జూలై 12, 2024న వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో గుజరాత్లోని జామ్నగర్లో స్టార్-స్టడెడ్ ప్రీ-వెడ్డింగ్ వేడుకను నిర్వహించారు. ఇపుడిక రెండోసారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం. బిలియనీర్ స్టేటస్కి తగ్గట్టుగా ఈసారి ఇటలీలో క్రూయిజ్ షిప్లో నిర్వహిస్తుండటం విశేషం.నాలుగు రోజుల ఈవెంట్ల గురించిన వివరాలతో నిండిన రెండవ ప్రీ-వెడ్డింగ్ ఇన్విటేషన్, ప్లాన్, ఫోటోలు ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా నిలిచాయి. తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది. పాపులర్ పాప్ సింగర్, పాటల రచయిత షకీరా అనంత్ రాధిక క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తాజా నివేదికల ప్రకారం ఈ ఈవెంట్ కోసం రూ.10-15 కోట్లు చార్జ్ చేయనుందని తెలుస్తోంది.కాగా ఇటలీలో మే 29 నుండి జూన్ 1, 2024 వరకు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ల రెండో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. వెల్కం డిన్నర్, మే 30, 2024న 'రోమన్ హాలిడే' , 'లా డోల్స్ ఫార్ నియెంటె', 'టోగా పార్టీ'. ఆ తర్వాత, మే 31, 2024న ఆకాష్ అంబానీ శ్లోకా మెహతా కుమార్తె, వేద తొలి ఏడాది పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. కొన్నిఇప్పటికే సల్మాన్ఖాన్, అలియా, రణబీర్దంపతులు, రణ్వీర్ సింగ్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యామిలీ ఇటలీకి పయనమైన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలతోపాటు, పలువురు ప్రముఖులు దాదాపు 800మంది పాల్గొనే అవకాశం ఉంది. అయితే జామ్నగర్ ఈవెంట్ కోసం రూ.1259 కోట్లు, కేవలం కేటరింగ్కే ఏకంగా రూ. 210 కోట్లు ఖర్చు చేసిన అంబానీ కుటుంబం ఈ సారి ఎంత వెచ్చిస్తోంది అనే చర్చ జోరుగా సాగుతోంది.
రోజూ బ్రేక్ఫాస్ట్గా ఓట్స్ తీసుకుంటున్నారా..?
ప్రజలు తమ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి ఎక్కువగా వినియోగించే తృణధాన్యాల్లో ఒకటి ఓట్స్. పైగా శరీరానికి పుష్కలమైన ఫైబర్స్ అందుతాయని దీనికే ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా డైటీషియన్లు, జిమ్ శిక్షకులు ఫైబర్ కంటెంట్ ఉండే ఓట్స్ని తీసుకోమని సూచిస్తారు. జీర్ణక్రియకు, బరువు తగ్గడానికి, చెడు కొలస్ట్రాల్ని తగ్గించడానికి తోడ్పడే ఓట్స్ని తీసుకోవడం మంచిదే అయినప్పటికీ దీన్ని డైట్లో భాగం చేసుకునేటప్పుడూ ఈ జాగ్ర త్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని అంటున్నారు నిపుణలు. లేదంటే దుష్పభావాలు తప్పవంటున్నారు.రోజు ఎందుకు తినకూడదు..నిపుణులు అభిప్రాయం ప్రకారం వోట్స్ కొన్ని రకాల దుష్ప్రభావాలను కలిగిస్తుందని పరిశోధనల్లో తేలింది. వారి ప్రకారం ఇది శరీరానికి విషపూరితం కావొచ్చని అంటున్నారు. శాస్త్రవేత్తలు 2017 నుంచి 2023 మధ్యకాలంలో జరిపిన అధ్యయనంలో చాలామంది అమెరికన్ల ఉపయోగించే ఓట్స్లో క్లోమరోమెక్వాట్ అనే విషపూరిత రసాయనం ఉన్నట్లు గుర్తించారు. ఆ పరిశోధనల్లో సుమారు 92% వోట్స్ ఆధారిత వాటిల్లో క్లోర్మెక్వాట్ గుర్తించదగిన స్థాయిల్లో ఉన్నట్లు కనుగొన్నారు. కొన్ని పెద్దపెద్ద బ్రాండ్ ఓట్స్లలో కూడా ఈ విషపూరిత రసాయనం ఉన్నట్లు గుర్తించారు. ఇది పునరుత్పత్తి అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది మానవులకు హాని కలిగించే అవకాశాలు ఎక్కుగా ఉన్నట్లు అని పరిశోధన వెల్లడించింది. బరువు పెరిగేందుకు..ఓట్స్ బరువు తగ్గడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నప్పటికీ..ఇవి ఎక్కువగా తీసుకుంటే మాత్రం వ్యతిరేక పరిణామాలు చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ప్రతిరోజూ ఎక్కువగా ఓట్స్ తీసుకుంటే పెద్ద మొత్తంలో బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని అంటన్నారు. అలాగే చాలామంది దీన్ని చక్కెర, నట్స్, చాక్లెట్ చిప్స్, ఉప్పుతో కలిపి తీసుకుంటారు. ఇలా తీసుకుంటే ప్రయోజనాల కంటే, సమస్యలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. పొట్ట ఉబ్బరం..కొందరికి అదేపనిగా తృణధాన్యాలు తీసుకుంటే పొట్ట ఉబ్బరం కలిగిస్తాయి. అందువల్ల డైటీషియన్లు ఎప్పడూ కొద్ది మొత్తంలోనే తీసుకోమని సూచిస్తారు. దీన్ని జీర్ణశయాలు లేదా పెద్ద ప్రేగలలోని బ్యాక్టీరియాను వినియోగించుకోవటంతో గ్యాస్ ఫామ్ అయ్యి పొట్ట ఉబ్బరానికి దారితీస్తుంది.గ్లూటెన్ సున్నితత్వం..ఇవి గ్లూటెన్ రహితంగా ఉన్నప్పటికీ..తరుచుగా గోధుమ, బార్లీ మాదిరిగా ప్రాసెస్ చేయబడతాయి. ఇది ఉదరకుహార వ్యాధి లేదా గ్లూటెన్ సెన్సిటివిటీకి దారితీస్తంది. క్రమం తప్పకుండా ఓట్స్ తింటుంటే ప్రతికూల ప్రతి చర్యలకు దారితీస్తుంది. డైలీ తినాలనుకునేవారు పూర్తిగా గ్లూటెన్ రహిత ఓట్స్ని ఎంచుకోవాని చెబుతున్నారు. కడుపు వాపుఇవి ఒక్కోసారి గ్యాస్టిక్ వాపుని కలుగజేస్తాయి. ఆహారంలో ఆకస్మిక మార్పు వల్ల కలిగే ప్రభామే ఈ కడుపు వాపు. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే వోట్స్ తీసుకునే మొత్తాన్ని తగ్గించాలి. మోతాదుకి మించి ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తపడాలి. ఫైటిక్ యాసిడ్లుఈ ఓట్స్లో ఫైటిక్ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కాల్షియం, జింక్ వంటి ఖనిజాల శోషణను నిరోధిస్తుంది. ఓట్స్ని నానబెట్టడం లేదా పులియబెట్టడం వల్ల వాటిలో ఫైటిక్ యాసిడ్ కంటెంట్ తగ్గుతుంది.(చదవండి: భారతీయ యువతికి లండన్ ప్రతిష్టాత్మక అవార్డు! కింగ్ చార్లెస్ని..)
డయాబెటిక్ రోగులకు భారీ ఊరట : ‘సెల్ థెరపీ’తో చైనా శాస్త్రవేత్తల ఘనత
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచంలోని ప్రతీ పది మందిలో ఒకరు డయాబెటిస్తో బాధపడుతున్నారు. అందుకే షుగర్ వచ్చిందంటే అనేక రోగాలకు మూలం అని చాలామంది భయపడిపోతారు. కానీ చైనాకు చెందిన శాస్త్రవేత్లలు ఈ భయాలకు చెక్ పెట్టారు. అదేంటో తెలుసుకుందాం!డయాబెటీస్కు 11 వారాల్లోనే సెల్ థెరపీతో పూర్తిగా చెక్ చెప్పవచ్చని చైనా శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. వైద్య చరిత్రలో గొప్ప ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, మధుమేహంతో బాధపడుతున్న రోగికి వినూత్న సెల్ థెరపీ పద్ధతిలో పూర్తిగా నయం చేసి చైనా శాస్త్రవేత్తలు వైద్య ప్రపంచంలో రికార్డు సృష్టించారు. షాంఘై చాంగ్జెంగ్ హాస్పిటల్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మాలిక్యులర్ సెల్ సైన్స్ అండ్ రెంజీ హాస్పిటల్ టీం అభివృద్ధి చేసిన చికిత్సను సెల్ డిస్కవరీ జర్నల్లో ప్రచురించారు.25 సంవత్సరాలుగా టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న 59 ఏళ్ల వ్యక్తి. తీవ్రమైన సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. 2017లో కిడ్నీ మార్పిడి చేయించుకునాడు. అయినా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన ప్యాంక్రియాటిక్ ఐలెట్ పనితీరు మెరుగు పడలేదు. దీంతో ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడి ఉన్నాడు. ఇతను జూలై 2021లో సెల్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు. కేవలం 11 వారాల తర్వాత, ఇన్సులిన్ తీసుకునే అవసరం లేకుండా పోయింది. అలాగే ఏడాదిలోపే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి నోటి ద్వారా తీసుకునే మందుల అవసరం కూడా పూర్తిగా తొలిగి పోయిందని తెలిపారు. ప్రస్తుతం అతడికి డయాబెటిస్ పూర్తిగా నయమైందనీ, గడిచిన 33 నెలలుగా ఇన్సులిన్ తీసుకోవట్లేదని ప్రకటించారు. షాంఘై చాంగ్జెంగ్ హాస్పిటల్లోని ప్రముఖ పరిశోధకుడు యిన్ హావో నేతృత్వంలోని బృందం, ఓన్ పెరిఫిరయల్ బ్లడ్ మోనోన్యూక్లియర్ సెల్స్తో ఉపయోగించిఈ ప్రయోగం చేసింది. ఇవే సీడ్ సెల్స్గా రూపాంతరం చెందాయి. అంతేకాదు కృత్రిమంగా ప్యాంక్రియాటిక్ ఐలెట్ కణజాలాన్ని పునర్నిర్మించాయి.ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో మధుమేహ వ్యాధిగ్రస్తులు చైనాలో ఉన్నారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం, దేశంలో 140 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు, వారిలో 40 మిలియన్ల మంది జీవితకాల ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడి ఉన్నారు.ఈ సెల్ థెరపీ విధానం విజయవంతమైతే దీర్ఘకాలిక ఔషధాల భారం నుండి విముక్తి లభిస్తుందని, ఆరోగ్యం, జీవన నాణ్యతను మెరుగుపడుతుందనీ, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను కూడా తగ్గిస్తుందని అక్కడి వైద్య నిపుణులు భావిస్తున్నారు.
Cannes 2024: పింకీ గౌన్లో అదితిరావు ప్రెటీ లుక్స్ (ఫోటోలు)
న్యూస్ పాడ్కాస్ట్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
విపక్షాలది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి.. ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
పోకిరీకి చెప్పుతో దేహశుద్ధి
యశవంతపుర: ఐ లవ్ యూ అని మహిళకు పదే పదే మెసేజ్లు పంపి వేధిస్తున్న పోకిరీని ఆమె పాదరక్షతో దేహశుద్ధి చేసింది. ఈ సంఘటన బాగలకోట జిల్లా ఇళకల్ పట్టణంలో జరిగింది. యాసిన్ అనే యువకుడు నివేదిత అనే మహిళను ప్రేమించాలని వాట్సాప్లో సందేశాలు పంపసాగాడు. ఇద్దరూ పెళ్లయి కుటుంబాలు ఉన్నవారే. కానీ యాసిన్ బుద్ధి పెడదారి పట్టింది. తనను ప్రేమించాలని ఆమెను వెంటపడసాగాడు. దీంతో ఆదివారం ఆక్రోశానికి గురైన మహిళ యాసిన్ ఇంటికి వచ్చి అతన్ని చెప్పుతో చితకబాదింది. తప్పయిపోయిందని పోకిరీ దండాలు పెట్టాడు. స్థానికులు ఆమెకు సర్దిచెప్పి పంపారు.
వెబ్సైట్లో ఫొటోలు పెట్టి...
గచ్చిబౌలి: పోర్న్ వెబ్సైట్లో ఫొటోలు పెట్టడం, వాట్సప్లో అసభ్య మెసేజ్లు పంపి ఐటీ ఉద్యోగిని వేధిస్తున్న ఓ నిందితుడిని ముంబైలో అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ కుమార్ తెలిపారు. ఈస్ట్ ముంబై, గారెగాన్, జయజయప్రకాష్ నగర్కు చెందిన అభిõÙక్ మోహన్ కీర్తికర్ (42) ముంబైలో ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. అక్కడే ఓ కంపెనీలో పని చేసే ఐటీ ఉద్యోగిని పరిచయమైంది. ఆ ఉద్యోగినితో పరిచయం పెరగడంతో ప్రేమించాలని ప్రపోజ్ చేయగా.. ఆమె తిరస్కరించింది. అప్పటి నుంచి ఆమెను రోజూ వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని ఓ ఎంఎన్సీ కంపెనీలో ఐటీ ఉద్యోగినిగా పని చేస్తోంది. వివిధ ఫోన్ నెంబర్ల ద్వార వాట్సాప్లో అసభ్యకర మెసేజ్లు పంపడం, పోర్న్ వెబ్సైట్లలో ఆ ఉద్యోగిని ఫొటోలు, ఫోన్ నెంబర్లు పెట్టి వేధిస్తున్నాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యంగా ఫోన్లో మాట్లాడడంతో తీవ్ర మనో వేదనకు గురైంది. ఈ క్రమంలో బాధితురాలు ఫిబ్రవరిలో గచి్చ»ౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు అభిõÙక్ మోహన్ కీర్తికర్ ను ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చారు. సోమవారం కూకట్పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇతను చాలా మంది యువతులకు మాయమాటలు చెప్పి దగ్గర కావడం, చెప్పినట్లు వినకపోతే అసభ్య మెసేజ్లు పెట్టి వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
బిర్యానీ తినేందుకు వెళ్తుండగా...
బన్సీలాల్పేట్: అర్ధరాత్రి బిర్యానీ తినేందుకు బైక్పై వెళ్తున్న బావబామ్మర్దులను మృత్యురూపంలో వచ్చిన మినీ బస్సు(స్వరాజ్ మజ్దా) కబళించింది. ఈ ప్రమాదంలో మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గాంధీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు సీఐ రాజు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సూరగాయని యజ్ఞ నారాయణ (25) బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. వాషింగ్ మిషన్ మెకానిక్గా పనిచేస్తూ పద్మారావునగర్ గంగపుత్రకాలనీలో నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా కెమెరామెన్గా పనిచేసే అతని బావమరిది కూరేటి సాయిపవన్ (32) గుంటూరు నుంచి అతన్ని కలిసేందుకు వచ్చాడు. ఆదివారం అర్ధరాత్రి అదే కాలనీలో ఉండే చీకటి సుబ్రమణ్యంతో కలిసి వీరు బిర్యానీ తినడానికి పల్సర్ బైక్పై ముషీరాబాద్కు వెళ్లారు. అక్కడ బిర్యానీ హోటల్ మూసివేసి ఉండడంతో ట్యాంక్బండ్పై ఉన్న హోటల్కు వెళదామని బయలుదేరారు. కవాడిగూడ హోటల్ మారియెట్ చౌరస్తా వద్దకు రాగానే..అదే సమయంలో లోయర్ ట్యాంక్బండ్ నుంచి వేగంగా వచి్చన మినీ బస్సు సిగ్నల్ను దాటేసి ముందువెళ్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో యజ్ఞ నారాయణ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన సాయిపవన్ను ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుబ్రమణ్యంకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మినీబస్సు డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. సుబ్రమణ్యం ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పోక్సో కేసు.. కర్నూలు కోర్టు సంచలన తీర్పు
కర్నూలు: ఏడేళ్ల బాలికపై జరిగిన అత్యాచార కేసులో కర్నూలు జిల్లా మహిళా స్పెషల్ సెషన్ కోర్టు సంచలమైన తీర్పునిచ్చింది. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష తోపాటు రూ. 20 వేల రూపాయలు జరిమానా విధించింది. కాగా, 2021, ఆగస్ట 13వ తేదీన కర్నూలు జిల్లా హోళగుంద మండలం బి. హల్లీ గ్రామానికి చెందిన బోయ రంగన్న అనే వ్యక్తి ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలడంతో కోర్టు యావజ్జీవ కారాగార శిక్షవిధించింది .