
'నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం'
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రానికి 950 టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదని ఆరోపించారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో ఉదయం చర్చ జరిగింది.