![ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం మృతి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/41474052544_625x300.jpg.webp?itok=yzeqzvP8)
ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం మృతి
ప్రముఖ న్యాయవాది, దళిత నాయకుడు బొజ్జా తారకం శుక్రవారం రాత్రి మృతిచెందారు. దళిత, వామపక్ష ఉద్యమాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్లపై కేసులో నమోదుచేసి విచారణ జరపాలంటూ పౌరహక్కుల నేత బొజ్జా తారకం సుప్రీంకోర్టులో పోరాడి గెలిచారు. బొజ్జా తారకం మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. విరసం నేత వరవరరావు, 'కమిటీ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్' సభ్యుడు రవీంద్రనాథ్, ఇతర ప్రముఖులు బొజ్జా తారకం మృతిపై సంతాపం ప్రకటించారు.