ప్రభుత్వ నిర్వాకం వల్లే ప్రజలకు ఈ దుస్థితి | Indrasena Reddy Fires on State Govt | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్వాకం వల్లే ప్రజలకు ఈ దుస్థితి

Published Fri, Sep 23 2016 3:24 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

ప్రభుత్వ నిర్వాకం వల్లే ప్రజలకు ఈ దుస్థితి

ప్రభుత్వ నిర్వాకం వల్లే ప్రజలకు ఈ దుస్థితి

రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే హైదరాబాద్‌కు ప్రస్తుతం ఈ దుస్థితి పట్టిందని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు.

బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే హైదరాబాద్‌కు ప్రస్తుతం ఈ దుస్థితి పట్టిందని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు. నగరాన్ని ముంచింది వర్షాలు కాదని, రాష్ర్ట ప్రభుత్వమేనని గురువారం విమర్శించారు. భవిష్యత్‌లో వర్షాల వల్ల హైదరాబాద్‌కు, ప్రజలకు ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు హైకోర్టు జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆ కమిషన్ ఇచ్చే సూచనలను తప్పకుండా పాటించాలన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని, స్కైవేలు, ఫ్లై ఓవర్లతో మొత్తం స్వరూపాన్నే మార్చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement