Indrasena Reddy
-
మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/ నల్లకుంట: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎస్.ఇంద్రసేన్రెడ్డి (81) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన సోమాజి గూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. కళాశాల రోజుల నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఇంద్రసేన్రెడ్డి 1960 దశకం మొదట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి యూని యన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.1972లో ఉమ్మడి ఏపీ యూత్కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆయన 1975లో జాతీయ యువ జన కాంగ్రెస్కు ఎంపికయ్యారు. ఏపీసీసీ ఉపా ద్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఇంద్ర సేన్రెడ్డి ఏఐసీసీ సభ్యుడిగా, ఏపీ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్గా, టి. అంజయ్య మంత్రివర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా, ఏపీఐడీసీ చైర్మన్గా పలు బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం సంతాపంమాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్రెడ్డి మృతి పట్ల ముఖ్య మంత్రి ఎ.రేవంత్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఎంతో సేవ చేసిన ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ తదితరులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. -
26న త్రిపుర గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి వెలువరించిన ఉత్తర్వులను (వారెంట్) త్రిపుర గవర్నర్ ఏడీసీ మేజర్ రోహిత్ సేధీ ఇంద్రసేనారెడ్డికి అందజేశారు. త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందజేశారు. ఇంద్రసేనారెడ్డి ఈ నెల 25వ తేదీ ఉదయమే హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. ఇంద్రసేనారెడ్డిని తోడ్కొని వెళ్లేందుకు ఈ నెల 24న త్రిపుర రాజ్భవన్ పేషీ సిబ్బంది హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. -
కాంగ్రెస్ నేత నిరంజన్ కు నిబద్ధత అనేది లేదు: ఇంద్రసేనారెడ్డి
-
ఎరువులను 24 గంటల్లో ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: మార్క్ఫెడ్ వద్ద నున్న కేంద్రం పంపించిన ఎరువుల ను 24 గంటల్లో రైతులకు ఇవ్వక పోతే...ఆ కార్యాలయాలను బీజేపీ కార్యకర్తలు ముట్టడించి ప్రజలకు పంపిణీ చేస్తారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 17న సభ కోసం సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్ ఇవ్వా లంటూ కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంటే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ–బీఆర్ఎస్ ఒకటేనంటూ దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితల మధ్య వ్యాపార సంబంధాలు, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్లు కలిసి పోటీ చేయడంపై చెప్పాలని డిమాండ్ చేశారు. -
స్వదేశీ అబ్బాయి.. విదేశీ అమ్మాయి
తెనాలి: ఆస్ట్రేలియా అమ్మాయి..తెనాలి అబ్బాయి ప్రేమించుకుని హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. కొల్లిపరకు చెందిన ఇంద్రసేనారెడ్డి ఎంఎస్ చేయడానికి ఆ్రస్టేలియా వెళ్లారు. చదువు పూర్తయ్యాక ఆ్రస్టేలియాలోని మెల్బోర్న్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆ దేశ పౌరసత్వమూ లభించింది. తన కంపెనీలోనే పనిచేస్తోన్న ఆ్రస్టేలియా యువతి సారా ఎలిజబెత్ కౌల్టర్ను ప్రేమించాడు. యువతి కూడా ప్రేమను అంగీకరించడంతో ఈ విషయాన్ని ఇరువురూ వారి కుటుంబాలకు చెప్పారు. హిందూ సంప్రదాయాన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో కొల్లిపరలో సంప్రదాయ వివాహానికి ఇంద్రసేనారెడ్డి చేసిన ప్రతిపాదనకు ఎలిజబెత్ సమ్మతించారు. దీంతో ఇంద్రసేనారెడ్డి తల్లిదండ్రులు కూసం శ్రీనివాసరెడ్డి, పద్మజ, బంధుమిత్రుల సమక్షంలో కొల్లిపరలోని జీవీఆర్ కళ్యాణమండపంలో శనివారం వైభవంగా వివాహం జరిగింది. కుమార్తె పెళ్లికి ఎలిజబెత్ తల్లిదండ్రులు జాన్ కౌల్టర్, అన్నెట్టీ దంపతులు, సోదరి, సోదరుడు, అతడి భార్య హాజరయ్యారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో పురుషులు షర్టు, పట్టు పంచెలు, మహిళలు చీరె, జాకెట్ ధరించారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
ఇంద్రసేనారెడ్డి ఏం చేస్తున్నారు?.. బీజేపీ హైకమాండ్ లైట్ తీసుకుందా?
ఎంత సీనియర్ నాయకుడికైనా కొంతకాలం తర్వాత రాజకీయంగా ముగింపు దశ వస్తుంది. ఒక్కసారి కాలపరిమితి ముగిసిపోతే తిరిగి వెనక్కి రావడం సాధ్యం కాదని అర్థం చేసుకోవాల్సిందే. ఇప్పుడిదే పరిస్థితి తెలంగాణ కమలం పార్టీలో ఓ సీనియర్ నేత ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా.. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ నేతను కాషాయ పార్టీ హైకమాండ్ పట్టించుకోవడంలేదట. గతం ఘనం.. వర్తమానం నిశబ్దం కొత్త నీరు వచ్చినపుడు పాత నీరు కొట్టుకుపోతుంది. కాంగ్రెస్ అయినా కమలం పార్టీ అయినా ఎందరో మహా మహులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కొందరు నాయకులకు ఎక్స్పైరీ డేట్ త్వరగా వచ్చేస్తుంది. మరికొందరికి ఆలస్యంగా వస్తుంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న నల్లు ఇంద్రసేనారెడ్డికి అదే పరిస్థితి ఎదురయ్యిందట. మూడు సార్లు ఎమ్మెల్యేగా.. 12 మంది ఎమ్మెల్యేలు గెలిచినపుడు అసెంబ్లీలో పార్టీ లీడర్గా ఆయన సేవలందించారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజ్నాథ్ సింగ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్న ఈ నేతను కమలదళం పెద్దలు లైట్ తీసుకుంటున్నారట. పెద్ద పదవుల్లో తోటి వాళ్లు ఇంద్రసేనారెడ్డి తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన దత్తాత్రేయకు కేంద్రమంత్రిగా, గవర్నర్గా అవకాశాలు వచ్చాయి. ఇటీవల వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ లక్ష్మణ్కు.. రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటరీ బోర్డు మెంబర్గా ప్రమోషన్ కల్పించారు. వెంకయ్య నాయుడితో పాటు విద్యార్థి దశ నుంచి ఇంద్రసేనారెడ్డి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేశారు. 73 ఏళ్ల వయస్సున్న ఇంద్రసేనారెడ్డికి పార్టీలో ఇక భవిష్యత్ లేదా? అన్న చర్చ సాగుతోంది. ఆయన సీనియారిటీ, అందించిన సేవలకు పార్టీ నుంచి ఎలాంటి గౌరవం లభించదా అనే డిస్కషన్ నడుస్తోంది. చదవండి: TS: ముందస్తు ఎన్నికలు?.. వణికిస్తున్న సర్వే రిపోర్టులు! గుర్తిస్తుందా? పదవులిస్తారా? ఇటీవల హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒకరోజు ముందు ఇంద్రసేనారెడ్డికి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించారు. పార్టీలో చేరికల కమిటీకి ఛైర్మన్గా ఇంద్రసేనారెడ్డిని నియమించారు. అయితే కొత్తగా పార్టీలో చేరేవారికి భరోసా ఇవ్వడం, చేరికల కమిటీ సభ్యులను ఒప్పించడం తన వల్ల కాదని ముక్కుసూటిగా చెప్పేశారాయన. ప్రస్తుతం పార్టీ కార్యాలయానికి మాత్రం నిత్యం టచ్లో ఉంటూ.. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ అవినీతిని బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యారు. మరి భవిష్యత్లో ఆయన సేవలను పార్టీ వాడుకుంటుందో ? వదిలేస్తుందో? కాలమే నిర్ణయిస్తుంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
సీఎం పత్రికా ముఖంగా చెప్పగలరా?
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్కు వచ్చి అక్రమంగా ఉంటున్న ముస్లింలకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందా? అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దమ్ము, ధైర్యముంటే సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో యూనివర్సిటీలను, జీహెచ్ఎంసీ, అంగన్ వాడీ, సింగరేణి, ఆర్టీసీలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. -
‘ఆ చట్టంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ లేదు’
సాక్షి, హైదరాబాద్ : కరీంనగర్లో నిన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ పట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నామని బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు ఇంద్రసేనారెడ్డి అన్నారు. తెలంగాణ వస్తే స్వేచ్ఛ ఉంటుందని భావించామని, కేసీఆర్ స్వేచ్ఛను హరించారని విమర్శించారు. సమగ్ర సర్వేతో అందరి వ్యక్తిగత వివరాలు సేకరించి, రాజకీయ ప్రత్యర్ధుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాకుండా వ్యాపారం కోసం కూడా పౌరుల వ్యక్తిగత సమాచారం వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నష్టం వచ్చినా భరించాలే.. పేద ప్రజలందరికీ ప్రభుత్వం వాహనాలు ఏర్పాటు చేయలేదు కాబట్టి, కేంద్రం ఆర్టీసీని ఏర్పాటు చేసిందని ఇంద్రసేనారెడ్డి గుర్తు చేశారు. తర్వాతి కాలంలో రాష్ట్రాలు ఆర్టీసీని ఏర్పాటు చేసుకున్నాయని వెల్లడించారు. ఆర్టీసీలో కేంద్రం 31శాతం పెట్టబడి పెట్టినా.. ఎక్కడా అజమాయిషీ చేయలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టం వచ్చినా, లాభం వచ్చినా మెజారిటీ షేర్ ఉన్న వాల్లే భరిస్తారని, ఇది కూడా ముఖ్యమంత్రికి తెలియదనుకోవడం సరైంది కాదని అన్నారు. ఆ హక్కు ప్రభుత్వానికి లేదు.. ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ మోటార్ వెహికల్ చట్టంలో ఎక్కడ చెప్పలేదని ఇంద్రసేనారెడ్డి అన్నారు. 1950 కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఆర్టీసీ ఆస్తులను అమ్మే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మెట్రోలో వచ్చే నష్టాన్ని సర్దుబాటు చేసుకోడానికి కొన్ని కమర్షియల్ స్థలాల్ని మెట్రో కు ఇచ్చారని, ఆర్టీసీకి కూడా అదేవిధంగా ఇవ్వాలని కదా అని ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా ఆర్టీసీ లు నష్టాలలో ఉన్నాయని, అయినప్పటికీ పేదవాడి సంక్షేమం కోసం నడుస్తున్నాయని వెల్లడించారు. గతంలో అనేక కార్పోరేషన్లను ప్రభుత్వంలో కలిపారని పేర్కొన్నారు. -
‘సీఎం అబద్ధాలు చెప్పారు’
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ సభలో సీఎం కేసీఆర్ అబద్ధాలు, అవాస్తవాలు తప్ప ఇంకొకటి మాట్లాడలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వృద్ధాప్యంతోనో, అహంకారంతోనో కేసీఆర్ లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. కార్పొరేషన్గా ఉన్న ఆల్విన్ ఉద్యోగులను గతంలో ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోలేదా? అని ప్రశ్నిం చారు. ఆర్టీసీ విషయంలో ఇదెందుకు సాధ్యం కాదని నిలదీశారు. -
సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి మొండి పట్టుదలకు పోకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను తీర్చి, సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంఘీభావంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడాన్ని, దురహంకార పద్ధతుల్లో్ల బీజేపీ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసులు అత్యుత్సాహంతో అమర్యాదకరంగా వ్యవహరించడం వల్లే లక్ష్మణ్ అస్వస్థతకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు. గవర్నర్ పదవిని కించపరుస్తూ సీఎం సీపీఆర్వో వ్యాసం రాసినందుకు ఆయనను తొలగించాలని అన్నారు. -
‘గవర్నర్పై కించపరిచే వార్తలు.. క్షమాపణ చెప్పాలి’
సాక్షి, హైదరాబాద్ : కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై ముఖ్యమంత్రి సీపీఆర్ఓ విషం కక్కేలా వార్తలు రాయించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిని కించపరిచే విధంగా వార్తలు రాయించిన సీపీఆర్ఓను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ రాజ్యాంగ బద్ధ పదవిని అవమానించడమేంటని అన్నారు. గవర్నర్ పదవిని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘గవర్నర్ పదవిని కించపరిచే విధంగా వ్యాసం ప్రచురించి.. ఆర్టికల్ చివరన ఇది నా సొంత అభిప్రాయం అని రాయించారు. ఇదంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగింది. గవర్నర్ పదవి పేరును షేక్ అంటూ రాయించడం అవమానించడమే అవుతుంది. గవర్నర్గా తమిళిసై ప్రమాణం చేసి 24 గంటలు గడవకముందే ఈ విధమైన వ్యాసాలు రాయించారు. ఇక సర్కారియా కమిషన్పై ఆర్టికల్ రాసిన వ్యక్తికి కనీస అవగాహన లేదు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చినపుడు ఎవరితో ప్రమాణ స్వీకారం చేయించావు. గవర్నర్తోనే కదా. గవర్నర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తలు వెలువడినందుకు క్షమాపణలు చెప్పాలి. పార్లమెంటు ఎన్నికల తరువాత బీజేపీకి ప్రజల్లో మద్దతు మరింత పెరిగింది. టీఆర్ఎస్పైన కార్యకర్తలకు నమ్మకం పోయింది. చాలా సందర్భంగా టీఆర్ఎస్లో అసమ్మతి బయటపడుతోంది. ఈటల, రసమయి, నాయిని, జోగురామన్న ఇలా ఒకరి తరువాత మరొకరు బయటపడుతున్నారు. -
సోనియా పర్యటనపై అనుమానాలు
సాక్షి, హైదరాబాద్: యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ పర్యటన అనేక అనుమానాలకు తావిస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేయని సోనియా తెలంగాణలోనే పర్యటించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నారు. సోనియా పర్యటిస్తున్న మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సామా సతీశ్పై అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇటీవల లంచం కేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపించిందన్నారు. ఈడీ నమోదు చేసిన అభియోగ పత్రంలో సామా సతీష్, షబ్బీర్ అలీల పేర్లు ఉన్నాయన్నారు. ఈ అవినీతి నెట్వర్క్కి, టెన్ జన్ప«థ్కి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. గిరిజన, మైనార్టీ రిజర్వేషన్లపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్కు ఓడిపోతాననే భయం పట్టుకుందని, దీంతో చలిజ్వరం వచ్చిందన్నారు. దీనికి విరుగుడుగా రాష్ట్ర ప్రజలు డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కర్రుకాల్చి వాతపెడతారన్నారు. -
రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్: ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను దివాళా తీయించిన ఘనత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుదేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఫలితంగా రాష్ట్ర ఖజానాలో నేడు చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. విద్యార్థులకు మెస్ చార్జీలు కూడా చెల్లించలేని దుస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుందన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్, షాదీముబారక్, కల్యాణలక్ష్మీ, రైతుబంధు పథకాల అమలుకు కూడా డబ్బుల్లేవన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇచ్చిన చెక్కులు సైతం బౌన్స్ అవుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యే పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారు. ప్రజల సొమ్మును దుబారా చేస్తూ కాలం వెళ్లదీసిన కేసీఆరే ఇందుకు బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కబంధహస్తాల్లో చిక్కుకుందని, మహాకూటమిని ప్రజలు నమ్మడం లేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో ‘మార్పుకోసం బీజేపీ’అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. సమావేశంలో బీజేపీ నేతలు కృష్ణసాగర్రావు, బాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
పూజారి మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం’
సాక్షి, హైదరాబాద్: వరంగల్లోని శివసాయి ఆలయ పూజారి మరణానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణ మని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. కొంతమంది దుండగులు దాడి చేయడం తో గాయపడిన పూజారికి సరైన వైద్యం అందించడం లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. శుక్రవారం ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో దేవాలయాలకు, పూజారులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, 8వ నిజాంలా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. ఇదే ఘటన మరో వర్గంపై జరిగితే ప్రభుత్వం ఊరుకునేదా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడటం బీజేపీకే సాధ్యమని, అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. రాష్ట్ర గవర్నర్ అందర్నీ కలుస్తారని, కానీ స్వామీజీలు కలుస్తామంటే కూడా గేటు బయట నుండే పంపిస్తారని, ఆయన తీరును ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ‘25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వండి’ వరంగల్లోని ఎల్బీనగర్లో ఇమామ్ దాడిలో మరణించిన పూజారి సత్యనారాయణశర్మ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అర్చక, పురోహితుల రక్షణకు చట్టం తీసుకురావాలని కోరా రు. సీఎస్ను కలిసిన వారిలో దర్శనం సంపాదకులు మరుమాముల వెంకటరమణశర్మ, బ్రాహ్మణ సం ఘాల ప్రతినిధులు ఉన్నారు. -
‘కొండగట్టు’ ఘటనపై హైకోర్టులో పిల్
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి సరైన వైద్యసేవలు అందించలేదని, మృతదేహాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్.ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఘటనలో 62 మంది మృతి చెందిన విషయం తెలి సిందే. కాలం చెల్లిన బస్సును నడిపేందుకు అనుమతి ఇచ్చిన జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావు, ఇతరుల గురించి మల్యాల పోలీసుల ఎఫ్.ఐ.ఆర్.లో ఉండేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కొండగట్టు ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా లేవని, బస్సులో 57 మంది ప్రయాణించేందుకు వీలుండగా 105 మం దితో కిక్కిరిసి వెళతూ ప్రమాదానికి గురైం దని వివరించారు. బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను అనుమతించరాదని, ప్రమాదాల్లో గాయడిన వారికి నాణ్యమైన వైద్యమందించేందుకు మల్టీస్పెషాలిటి హాస్పిటళ్లకు తీసుకువెళ్లేలా చేయాలని కోరారు. -
‘ముందస్తు’కు బీజేపీ సిద్ధం: ఇంద్రసేనారెడ్డి
పెద్దపల్లి రూరల్: ముం దస్తు ఎన్నికలకు తాము సిద్ధమని బీజేపీ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి ప్రకటించారు. పెద్దపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికలంటూ కేసీఆర్ సర్కార్ లీకులు ఇస్తోందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమన్నారు. సర్కార్ను సాగనంపడానికే ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. దళితుడికి ముఖ్యమంత్రి పదవి, లక్ష ఉద్యోగాలు, పంచాయతీ ఎన్నికలు వాయిదా, ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు, భూ రికార్డుల ప్రక్షాళన.. ఇలా ఏ హామీ సరిగా అమలు కావడం లేదని మండిపడ్డారు. -
సొంతింటి రాజసం!
‘‘యద్భావం.. తద్భవతి’’ అన్నది ఉపనిషత్తు. ‘నీ ఆలోచనలే నీవు’ అని దానర్థం. అంటే సానుకూల ఆలోచనలు, ఆచరణ మీదే మనిషి ఎదుగుదల ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే గొప్ప వ్యక్తులు, మహనీయుల జీవిత చరిత్ర, సూక్తులను అనుసరిస్తుంటాం. స్ఫూర్తిని పొందుతుంటాం! మరి, అనునిత్యం గొప్పవాళ్ల అడుగుజాడలను ఫాలో కావాలంటే? మన చుట్టూ ఉండే వాతావరణం ప్రేరేపితంగా ఉండాలి. అంటే ఇల్లన్నమాట. దీనర్థం ఇంటి నిర్మాణంలోనే రాజసం ఉట్టిపడాలి. గతంలో ప్యాలెస్లు, ప్రీమియం రెస్టారెంట్లకు మాత్రమే పరిమితమైన సబ్లిమినల్ ఆర్కిటెక్చర్స్ తాజాగా నివాస సముదాయాలకూ విస్తరించాయి. సాక్షి, హైదరాబాద్ : మానసిక చైతన్యాన్ని, ప్రేరణను కలిగించడం, అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని వెలికి తీయడం సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రత్యేకత. ఈ తరహా నిర్మాణాలు ఉన్నత స్థానానికి చేరుకోవాలనే కోరికను, ప్రోత్సాహాన్ని, ప్రేరణను కలిగిస్తాయన్నమాట. ఇందుకోసం ప్రాజెక్ట్లల్లో మహనీయులు, గొప్ప నాయకుల చిత్ర పటాలు, జీవిత చరిత్రలు, బొమ్మ లు, గుర్తులను పెడతారు. అనునిత్యం ఆయా వ్యక్తుల అడుగుజాడలు కళ్లముందు కదలాడుతుంటూ మన మెదడు పాజిటివ్ ఆలోచనలు చేస్తుంది. దీంతో మాటల్లో, చేతల్లోనూ ఉన్నతమైన భావాలు బహిర్గతమవుతాయి. మొత్తంగా మనిషి ఆరోగ్యకరమైన ఉన్నతికి తొలి అడుగుపడేది సొంతింటి నుంచే! సొంతిల్లే ప్రేరణ.. మనిషి ఎదుగుదలకు చుట్టూ ఉండే వాతావరణం, నివాస పరిసరాలు, భావోద్వేగాలకు సంబంధం ఉం టుందని విశ్లేష కుల మాట. ఉదాహరణకు మనం ఆసుపత్రికి వెళ్లినప్పుడు దయా గుణంతో, గుడికి వెళ్లినప్పుడు భక్తి భావంతో ఉంటాం. అదే ప్యాలెస్కు వెళ్లినప్పుడు రాజసంగా ఉంటాం. ఎందుకంటే? ప్యాలెస్లో మనం ఎటు చూసిన రాజుల చిత్ర పటాలు, జీవిత ^è రిత్రలు, గుర్తులు కనిపిస్తుంటాయి గనక! ప్యాలెస్ తరహా వాతావరణాన్ని నివాస సముదాయాల్లోనూ కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి హైదరాబాద్ నిర్మాణ సంస్థలు. కామన్ ఏరియాల వినియోగం.. సబ్లిమినల్ ఆర్కిటెక్చర్లో ఇంట్లో కాకుండా ప్రాజెక్ట్ కామన్ ఏరియా, ఓపెన్ స్పేస్, క్లబ్హౌజ్ వంటి ప్రాంతాల్లో స్ఫూర్తిదాయక వ్యక్తులు, మహనీయుల బొమ్మలు, జీవిత చరిత్రలు, గుర్తులుంటాయని అప్పా జంక్షన్కు చెందిన ఓ డెవలపర్ తెలిపారు. ఉదాహరణకు అప్పా జంక్షన్లో బ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ రాజక్షేత్రలో ఫోర్బ్స్ వంటి అంతర్జాతీయ మేగజైన్లో ప్రచురితమైన గొప్ప వ్యక్తుల కవర్ పేజీలను ఒకదగ్గర ఉంచుతాం. మధ్యలో అద్దాన్ని పెడతాం.అద్దంలో కవర్పేజీను పోల్చుకుంటూ మనమూ ఫోర్బ్స్ మేగజైన్ను చేరాలనే ప్రేరణ కలుగుతుందని’’ వివరించారు. సంపదకు, భౌగోళికతకు మధ్య సంబంధం ఉంటుందని విశ్లేషకుల మాట. ఉదాహరణకు ప్రపంచ బిలియనీర్లలో చాలా మంది మన్హటన్, న్యూయార్క్, సిలికాన్వ్యాలీలో ఉంటారు. మన దేశంలో అయితే ముంబైలో.. తెలుగు రాష్ట్రాల్లో అయితే బంజారాహిల్స్ లేదా జూబ్లిహిల్స్లోనే ఉంటారు. కారణం మనిషి ఉన్నతికి అదొక చిరునామా. పైగా మరింత ఎదుగుదలకు మార్గదర్శి కూడా అదే. రోజూ తిరిగే పరిసరాలు, మాట్లాడే వ్యక్తులు ఉన్నతంగా ఉంటే మనలోనూ ఉన్నతమైన భావాలు, ఆలోచనలు కలుగుతాయి. అప్పా జంక్షన్లో రాజక్షేత్ర... అప్పా జంక్షన్లో 1.8 ఎకరాల్లో రాజక్షేత్ర పేరిట సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టామని గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. మొత్తం 120 ఫ్లాట్లు. 1,180 నుంచి 1,850 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ప్రారంభ ధర రూ.60 లక్షలు. రాజక్షేత్రలో మహనీయులు చిత్ర పటాలు, గుర్రం, ఏనుగు, రథం వంటి చిత్రాలను గోడల మీద (మ్యూరల్ ఆర్ట్) చిత్రీకరిస్తాం. నివాసితులకు ప్యాలెస్ తరహా వాతావరణాన్ని కలిగించేందుకు ఫాల్స్ సీలింగ్ను కంపెనీయే చేపడుతుంది. 7 వేల చ.అ.ల్లో క్లబ్హౌజ్తో పాటూ గ్రాండ్ ప్రివ్యూ థియేటర్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. -
'నిరుద్యోగులను మోసం చేస్తున్న సీఎం'
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ కోసం చిత్తశుద్ధితో పని చేయకుండా నిరుద్యోగులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారు, ఎన్ని ఖాళీలున్నాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల ఖాళీల విషయంలో కోర్టుకు ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతున్నదని ఆరోపించారు. యువకులకు ఉద్యోగాలు ఇచ్చే చిత్తశుద్ధి లేకుండా, ముందుచూపు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా నోటిఫికేషన్లు ఇచ్చిందని మండిపడ్డారు. -
‘కేబినెట్ హోదా ఇష్టారాజ్యం కాదు’
సాక్షి, హైదరాబాద్: పలువురు ప్రభుత్వ సలహాదారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన పలు జీవోలను సవాలు చేస్తూ బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, యువజన సర్వీసులశాఖ ముఖ్య కార్యదర్శిలతోపాటు కేబినెట్ హోదా పొందిన బాలకిషన్, ఎ.కె.గోయల్, ఎ.రామలక్ష్మణ్, బి.వి.పాపారావు, కె.వి.రమణాచారి, జి.ఆర్.రెడ్డి, పేర్వారం రాములు, కె.ఎం.సహానీ, డాక్టర్ వేణుగోపాలచారి, రామచంద్రుడు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పిడమర్తి రవి, అల్లం నారాయణ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రభుత్వం తన ఇష్టారాజ్యంగా కేబినెట్ హోదా ఇవ్వడానికి వీల్లేదని ఇంద్రసేనారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇలా కేబినెట్ హోదా ఇవ్వడం రాజ్యాంగంలోని అధికరణ 164(1ఎ) విరుద్ధమని తెలిపారు. ఇదే విషయంపై పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్రెడ్డి పిల్ దాఖలు చేశారని, ఆ తరువాత ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీకి వెళ్లిన తరువాత ఆ పిల్ను ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరగా, ఇదే హైకోర్టు తిరస్కరించిందన్నారు. -
ఉద్యోగాలివ్వకుండా సీఎం కాలయాపన
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేసేందుకే జోనల్ వ్యవస్థపై సీఎం కె.చంద్రశేఖర్రావు దోబూచులాడుతున్నాడని బీజేపీ జాతీయ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. ఆదివారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అయోమయంలో ఉంటూ, నిరుద్యోగులను గందరగోళానికి గురిచేస్తోందన్నారు. తెలంగాణ వస్తే మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా 10 శాతం కూడా భర్తీ చేయలేదన్నారు. కొత్తజిల్లాలు ఏర్పాటైన ఏడాదికి జోనల్ వ్యవస్థపై కమిటీ అంటూ సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత జోనల్ వ్యవస్థ ఎందుకన్న కేసీఆర్.. ఇప్పుడెందుకు మాటమారుస్తున్నాడో నిరుద్యోగులు అర్థం చేసుకుంటున్నారని హెచ్చరించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం కాలయాపన చేసేందుకే కమిటీలు, నివేదికలను సీఎం ఏర్పాటు చేస్తున్నారన్నారు. -
'కొత్త జిల్లాలతో ఏం సాధించారు'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఏం సాధించారని బీజేపీ నాయకుడు ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. కొత్త కలెక్టరేట్లు ప్రారంభించి ఏడాది పూరైనా ఇప్పటివరకు నూతన భవనాలు ఎందుకు నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. కొత్త జిల్లా కార్యాలయాల్లో 50 శాతం మంది స్టాఫ్ కూడా లేదు. నాలుగు నెలలుగా పెద్దపల్లి జిల్లాకు కలెక్టర్ లేరు అయినా సీఎం పట్టించుకోవడం లేదు. పాలన చేరువ చేయడం కోసం జిల్లాల విభజన అన్న కేసీఆర్ సమస్యల పరిష్కారానికి మాత్రం ముందుకు రావడం లేదన్నారు. -
ఇంద్రసేనారెడ్డికి ‘క్యాపిటల్’ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన ప్రముఖులకు క్యాపిటల్ ఫౌండేషన్ ఏటా అందిస్తున్న వార్షిక అవార్డులను ఆదివారం ఢిల్లీలో ప్రదానం చేసింది. తెలంగాణకు చెందిన నెప్లస్ ల్యాబ్స్ సీఎండీ డాక్టర్ తూడి ఇంద్రసేనారెడ్డికి క్యాపిటల్ ఫౌండేషన్ ప్రొ.టి.శివాజీరావ్ జాతీయ అవార్డు దక్కింది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అవార్డు ప్రదానం చేశారు. గ్రామ్వికాస్ భారతి పేరుతో పర్యావరణ పరిరక్షణ, పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన చేపట్టిన కార్యక్రమాలకు, సేవ్ రివర్ పేరుతో మూసీనది ప్రక్షాళనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినందుకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఓయూలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన ఇంద్రసేనారెడ్డి, పుణేలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి ఫార్మకాలజీలో డాక్టరేట్ పూర్తి చేశారు. జర్మనీకి చెందిన హుంబోల్ట్ ఫౌండేషన్, అమెరికాకు చెందిన ఎన్ఐ హెచ్ల నుంచి ఫెలోషిప్ పొందారు. అనంతరం యూఎస్ఏ, భారత్లో నెప్లస్ అల్ట్రా ల్యాబ్స్ను స్థాపించారు. 2010లో బీజేపీలో చేరిన ఇంద్రసేనారెడ్డి తెలం గాణ బీజేపీ ఎన్ఆర్ఐ విభాగానికి కన్వీనర్గా కూడా వ్యవహరిస్తున్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ ప్రొఫెసర్ సి.సురేశ్ రెడ్డికి కూడా ఈ అవార్డు దక్కింది. ఎమ్మెస్సీలో గోల్డ్ మెడల్ సాధించిన సురేశ్రెడ్డి సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎలక్ట్రో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రసిద్ధ నిపుణులు. ఈయన ఏపీ అకాడమి ఆఫ్ సైన్స్లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కేంద్ర ఐటీ, న్యాయశాఖలో తీసుకొచ్చిన సంస్కరణలకు గుర్తింపుగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు క్యాపిటల్ ఫౌండేషన్ జస్టిస్ పీఎన్ భగవతి జాతీయ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. వివిధ పథకాలకు ఆధార్ను అనుసంధానించడం వల్ల ఎలాంటి వ్యక్తిగత సమాచారం బహిర్గతంకాదని కేవలం పేరు, చిరునామా, పుట్టినతేదీ మాత్రమే తెలుసుకోగలమన్నారు. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి క్యాపిటల్ ఫౌండేషన్ జస్టిస్ వీఆర్ కృష్ణ అయ్యర్ అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు జస్టిస్ ఏకే పట్నాయక్, ప్రధాన కార్యదర్శి వినోద్ సేతి, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతు ఆత్మహత్యల నివారణలో విఫలం
కేసీఆర్పై ఇంద్రసేనారెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రైతు ఆత్మహత్యలు నివారించడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రైతులకు భరోసానిచ్చి, అండగా నిలబడుతున్నామనే విశ్వాసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేకపోయిందని ఆరోపించారు. రైతు సమస్యలపై కమిషన్ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు చేసి ఏడాది దాటినా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్కు వ్యవసాయ అవార్డు ప్రకటించింది కేంద్రం కాదని.. ఓ ప్రైవేట్ విత్తన వ్యాపార సంస్థ అని స్పష్టం చేశారు. -
సర్కార్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోంది
కరీంనగర్: తెలంగాణ సర్కార్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయడం లేదన్నారు. శనివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని, మండల వ్యవస్థని బ్లాక్లుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు. నిధులు, విధుల విషయంలో స్పష్టత లేకుండా కేవలం పేరు మారిస్తే సరిపోదని, డ్రగ్స్, కల్తీ దందా నిరోదించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. డ్రగ్స్ దందాలో గతంలో ఎన్ని కేసులు నమోదు చేశారో, ఎన్ని చార్జీషీట్లు వేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. విజిలెన్స్ సెల్కి వెంటనే పూర్తి స్థాయి అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. -
రాజకీయాలకు అతీతం
రాష్ట్రపతి ఎన్నికలపై ఇంద్రసేనారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నిక రాజకీయాలకు అతీ తమైనదని, సీబీఐ విచారణకు భయపడి టీఆర్ఎస్, ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నదని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సరికాదని బీజేపీ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. గురువారం ఆయన పార్టీ నేతలు ప్రేమేందర్రెడ్డి, చింతా సాంబమూర్తి తదితరులతో కలసి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్సింగ్ మాటలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నదన్నారు. గతంలో అబ్దుల్ కలాం పోటీచేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు ఇచ్చిన విషయం గుర్తుచేసుకోవాలన్నారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఎస్.కె.సిన్హా ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూముల కుంభకోణంపై వార్తలు రాసిన పత్రికలపై మంత్రి కేటీఆర్ బెదిరింపులకు దిగడం మంచిదికాదని ఇంద్రసేనారెడ్డి అన్నారు. -
‘కేటీఆర్కు ఇదే మొదటిసారి కాదు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ మీడియాపై విరుచుకుపడటం, బెదిరించడం ఇదే మొదటిసారి కాదని.. గతంలోనూ ఇలాంటి జరిగాయని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి అన్నారు. మీడియా సంస్థలు రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నాయని, జర్నలిజం దిగజారిందని, సంచలనం కోసం ఆర్టికల్స్ రాస్తున్నాయని కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారని వివరించారు. అవసరం కోసం బెదిరించడం.. టీవీల ప్రసారాలను ఆపలేదా అని ప్రశ్నించారు. భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపితే బండారం బయట పడుతుందని, ప్రభుత్వం కూలిపోతుందని భయపడుతున్నారా అని నిలదీశారు. భూకుంభకోణంలో సీఎం పేషీ పాత్ర ఉందని ఆరోపణ చేసినా.. ఎస్కే సిన్హా నివేదికను ఎందుకు బయటపెట్టలేదన్నారు. గత ప్రభుత్వాలు తప్పుచేస్తే సరి చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక ఆర్డినెన్సు తెచ్చి గజం భూమిని కాపాడగలిగారా, చెప్పండి అని నిలదీశారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాదని ఇంద్రసేనారెడ్డి ఎద్దేవా చేశారు. భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ ఆపడానికే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది అని ఆయన అనడం దారుణమన్నారు. -
క్షమాపణ చెప్పేందుకు నామోషీ ఎందుకు?
క్షమాపణ చెప్పేందుకు నామోషీ ఎందుకు?ను ప్రశ్నించిన ఇంద్రసేనారెడ్డి సాక్షి, హైదరాబాద్: రైతులపై పెట్టిన కేసులను రద్దు చేసి క్షమాపణ చెప్పేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి నామోషీ ఎందుకని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఫ్రశ్నించారు. రైతులకు బేడీలు వేసే మూర్ఖులుంటారా అని ఇటీవల సీఎం కేసీఆర్ అన్నారని, అయితే తాము మూర్ఖులం కాదని నిరూపించుకునే అవకాశాన్ని ఎందుకు వదులు కుంటున్నారని నిలదీశారు. సోమవారం పార్టీ నాయకులు రఘునందన్రావు, సుధాకరశర్మ, జి.భరత్గౌడ్లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమస్యలను చూస్తేనే సీఎం కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద స్థానికులను అడ్డుపెట్టుకోవా లనుకోవడం సరికాదన్నారు. ఒకే అంశంపై అనుకూల, వ్యతిరేక వర్గాలకు అనుమతినిచ్చిన మూర్ఖత్వం కేసీఆర్ ఫ్రభుత్వానిదేనని అన్నారు. ఏపీ ప్రతిపక్షనేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీని కలవగానే ఏదో జరిగిందనే ప్రచారం సరికాదని ఒక ప్రశ్నకు ఇంద్రసేనారెడ్డి బదులిచ్చారు. ప్రధానిని లేదా ముఖ్యమంత్రిని ఎవరైనా కలవవచ్చునని అన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాధినేతలను విపక్షాలకు చెందిన వారు కలుస్తుంటారని దానిపై ఏవో అర్థాలు తీయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. -
ధర్నా చేసే హక్కు మాది.. రక్షణ ఇచ్చే బాధ్యత మీది
► బీజేపీ సీనియర్నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హైదరాబాద్: ధర్నా చౌక్ వద్ద జరిగిన ఘటనపై విచారణ జరిపించాలని బీజేపీ సీనియర్నేత నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రం లో ప్రజాస్వామ్యం లేదన్నారు. ' ప్రొటెస్ట్ చేసే హక్కు మాకుంది..ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని' స్పష్టం చేశారు. పోలీసులను, టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డం పెట్టి..ధర్నా చౌక్ ను వ్యతిరేకించే ఉద్యమాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. ధర్నా చౌక్ ఘటన ప్రభుత్వ దౌర్జన్యానికి, అరాచకానికి పరాకాష్ట అని దయ్యబట్టారు. స్థానికుల ధర్నాకు అనుమతి ఎలా ఇస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల సమస్యల కోసం ఎవరితో అయినా..కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. అమాయక రైతులపై కేసులు పెట్టి.. బెయిల్ రాకుండా కుట్ర పన్నారని విమర్శించారు. కేసీఆర్ డైరెక్షన్ లేకుండా రైతులపై కేసులు పెట్టారా అని అడిగారు. పోలీసులు ఆవేశంతో కేసులు పెట్టి, బేడీలు వేశారని చెప్పినపుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు కేసులు రద్దు చేయించడం లేదని ప్రశ్నించారు. రైతులకు క్షమాపణ చెప్పటానికి నామూషీ ఎందుకని. రైతులను ఇంక మోసం చేయలేరని పేర్కొన్నారు. -
మిర్చి ఎందుకు కొనడం లేదు?
- దళారులతో టీఆర్ఎస్ నేతల ఒప్పందం - బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి విమర్శ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద రూ.5 వేల చొప్పున క్వింటాల్ మిర్చిని కొనుగోలు చేయాలని చెప్పి వారం రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో చర్యలెందుకు తీసుకోవడం లేదని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. మిర్చిని ఆ ధరకు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం కొనడం లేదంటూ రైతుల నుంచి బీజేపీ నాయకులకు పలు ఫోన్ కాల్స్ వస్తున్నాయని అన్నారు. మిర్చి యార్డుల్లో క్రయవిక్రయాలు జరుగుతున్న తీరు తెన్నులను పరిశీలించేందుకు, రైతులను కలుసుకునేందుకు ప్రతిపక్షాలను, రైతు సంఘాలను ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదని ఆయన నిలదీశారు. మార్కెట్ యార్డును సందర్శించకుండా సోమవారం వరంగల్ మార్కెట్లో బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఇతర నాయ కులను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిం చారు. పార్టీ నాయకులు చింతా సాంబ మూర్తి, ఎన్.వి.సుభాష్లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యాపా రులు, దళారులతో టీఆర్ఎస్ నాయకులు ఒప్పందం చేసుకుని అతి తక్కువ ధరకు మిర్చి కొనుగోళ్లు జరిపిస్తున్నారని ఆరో పించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ను ప్రభుత్వం అరెస్ట్ చేసిందని చింతా సాంబమూర్తి విమర్శించారు. -
టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది
బీజేపీ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పతనం ప్రారంభమైం దని, వరంగల్ సభ దానికి సూచిక అని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరిగా చప్పట్లు, ఈలలు వేయడం సరి కాదన్నారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లా డారు. రైతులపై కుట్ర కేసు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిజంగా అనుకుంటే అందులో మొదటి ముద్దాయిగా సీఎం కేసీఆర్ను చేర్చాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా సంఘంగా ఏర్పడాలని సీఎం పిలుపునివ్వగా.. ఖమ్మం జిల్లా రైతులు దాన్ని పాటించారని అన్నారు. సీఎం చెప్పిన దాన్ని పాటిస్తే కేసు పెడతామంటే ఎలా అని ప్రశ్నించారు. మిర్చి ధర బాధ్యత కేంద్రానిదని, కేంద్రానికి లేఖలు రాసినా స్పందన లేదని మంత్రి హరీశ్, ఎంపీ కవిత, టీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నా రని ధ్వజమెత్తారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కందుల కొనుగోలుకు కేంద్రం రూ. 750 కోట్లు ఇచ్చిందో లేదో వెల్లడించాలని డిమాండ్ చేశారు. -
చెప్పేవన్నీ అబద్ధాలే
హైదరాబాద్: మిర్చి రైతుల విషయంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కవిత అబద్దాలు మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్.ఇంద్రసేనారెడ్డి అన్నారు. కేంద్రం సహకారంతో రైతులకు మంచి ధర అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ధరల విషయంలో పుకార్లు పుట్టించారనడాన్ని ఖండించారు. టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ కోసం మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడుందని ప్రశ్నించారు. రైతులకు న్యాయమైన ధర అందించడంలో, వ్యాపారస్తులను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మిర్చికి గిట్టుబాటు ధర అందించడంలో కేంద్రం సహకరించడం లేదన్న వాదన సరికాదన్నారు. ధరల్లో హెచ్చుతగ్గులుంటే జోక్యం చేసుకొని ధరల స్థిరీకరణ చేసే హక్కు కేంద్రానికి ఉందని, ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటుండగా తెలంగాణ ఎందుకు నిరాకరిస్తోందని నిలదీశారు. కందుల కొనుగోలు కోసం కేంద్రం రూ.750 కోట్లు విడుదల చేసి 50రోజులు దాటినా రైతులకు చెల్లించడంలేదని విమర్శించారు. మార్కెట్ యార్డుల ఆధునికీకరణ కోసం ఈనామ్ పథకం కింద ప్రతి మార్కెట్కు రూ.30 లక్షలు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు చేపట్టడం లేదని మండిపడ్డారు. ఆదివారం నిర్వహించే శాసనసభ సమావేశాల్లో మిర్చి, వేసంగి వరి రైతులకు భరోసా కల్పించేందుకు నిర్ణయం తీసుకోవాలని, రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటకు వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యక్రమాల కోసం కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని,. ప్రభుత్వ వాహనాలకు టీఆర్ఎస్ జెండాలు కట్టారని ఆరోపించారు. వరంగల్ సభలో కేసీఆర్ తిట్లపురాణం వల్లించడం తప్ప అభివృద్ధి ప్రస్తావన చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. వరంగల్ సభ ఆ పార్టీ పతనానికి ప్రారంభ సూచిక అని అన్నారు. మహానుభావుడు విద్యాసాగర్ రావు మృతి పట్ల బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ చింతల రామచంద్రారెడ్డి సంతాపం తెలిపారు. తెలంగాణలో ప్రతి చేనుకు నీరందించేందుకు కృషి చేసిన మహానుభావుడు అని కొనియాడారు. -
ఉచిత ఎరువులు ఉత్తుత్తి పథకమేనా?
బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి సాక్షి, హైదరాబాద్: దళిత సీఎం, కేజీ టు పీజీ విద్య, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల మాదిరిగానే రైతు లకు ఉచితంగా ఎరు వుల పథకం కూడా ఉత్తుత్తి హామీయేనా? అని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మాటల్లో నిజాయితీ కనిపించడం లేద న్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఏడాదే ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మూడేళ్లలో రైతులను ఆదుకునేందుకు అనేక పథకాలను తీసుకొచ్చినా వాటిని రాష్ట్రంలో అమలు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. శని వారం పార్టీ నాయకులు ప్రకాశ్రెడ్డి, ఎన్వీ సుభాష్, సుధాకరశర్మ,, దాసరి మల్లేశం లతో కలసి ఇంద్రసేనారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో నష్ట పోయే రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. -
కేసీఆర్ మాటల్లో నిజాయితీ లేదు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తాను రైతునన్న విషయం మర్చిపోయారా.. గత మూడేళ్లుగా బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక రైతుల పడుతున్న కష్టాలు సీఎంకు కనపడటం లేదా అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. ఆయన శనివారం విలేకరుతో మాట్లాడుతూ.. కేసీఆర్ మాటల్లో నిజాయితీ కనిపించడం లేదు.. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామన్న ప్రకటన కూడా ఇతర హామీల్లా దాటవేసేదేనా? పత్తి వద్దు, కందులు ముద్దు అని ప్రచారం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు కందులకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేక పోతుందో చెప్పాలి. మూడు నెలలుగా రైతులు అమ్మిన పంటకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. కేంద్రం పంపిన ఆత్మ పథకం నిధులు వెనక్కి మళ్లిపోవాల్సిన దుస్థితికి కారకులెవరు? కేంద్ర ప్రభుత్వం రైతులకు కేటాయించిన ఫసల్ బీమా యోజన నిధులు రైతులకు అందకుండా అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచాలు లేకుండా.. ప్రభుత్వంలో ఒక్క బిల్లుకు కూడా నిధులు విడుదల చేయడం లేదు. దీనిపై కమిషన్ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
శ్వేతపత్రం విడుదల చేయాలి
కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశంపై ఇంద్రసేనారెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్ల సమావేశం ద్వారా జిల్లాల్లో అభివృద్ధికి ఏ విధమైన దిశానిర్దేశం చేశారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘంగా సాగిన కలెక్టర్ల సమావేశంలో రైతులు మొదలుకుని సామాన్యుల వరకు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించిన దాఖలాలు కనిపించలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు పలు కేసుల్లో కోర్టులకు వెళ్లి తెచ్చుకున్న స్టేలపై సంబంధిత శాఖల ముఖ్యకార్యదర్శులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవాలన్న కేటీఆర్, హరీశ్ ఆదేశాలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేలా ఉన్నాయని తెలిపారు. దీనిపై హైకోర్టు సుమోటోగా కేసు పెట్టి, విచారించాలని డిమాండ్ చేశారు. -
'మంత్రులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి'
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు కోర్టుల స్టేలను తప్పు పడుతున్నారని, ఇది జ్యుడీషియరీలో జోక్యం చేసుకోవడమే అవుతుందని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టేల విషయంలో ప్రధాన న్యాయమూర్తిని కలవమని కార్యదర్శులకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇది కోర్టుల అధికారాన్ని ప్రశ్నించడమే అవుతుందని, మంత్రులు రాజ్యాంగానికి లోబడి పని చేయాలని చెప్పారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మంత్రుల వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తామని ఆయన చెప్పారు. కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఇచ్చిన దశ దిశ ఏంటో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. కొత్త జిల్లాలతో అభివృద్ది అన్నారు కానీ ఇప్పటికీ ఆ జిల్లాల్లో పూర్తి వసతులు ఏర్పడలేదన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారులను శాసిస్తున్నారని, పోస్టింగ్ల కోసం లంచాలు తీసుకుంటున్నారని, గ్రామసభలకు అర్దం లేకుండా పోయిందని, టీఆర్ఎస్ నేతలు చెప్తేనే పని అయ్యేలా పరిస్థితులు మారిపోయాయని, ఉపాధి హామీ నిధులను దారి మళ్ళిస్తున్నారని, ఐదారు నెలలుగా ఉపాధి హామీ కూలీలకు వేతనాలు ఇవ్వలేదని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. -
దిగ్విజయ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఇంద్రసేన
సాక్షి, హైదరాబాద్: సిమి ఉగ్రవాదుల ఎన్కౌంటర్పై కాంగ్రెస్ నేత దిగ్విజయ్సింగ్ అనుమానాలు వ్యక్తం చేసి, న్యాయ విచారణకు ఆదేశించాలని కోరడం సరికాదని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. ముస్లింలపై బీజేపీ వ్యతిరేక భావనతో ఉన్నందువల్లే ఎన్కౌంటర్ చేశారని దిగ్విజయ్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. భోపాల్లో కానిస్టేబుల్ మృతి, గతంలో సూర్యాపేటలో పోలీసులపై కాల్పులు జరిపి వారి మృతికి కారణమైన తీవ్రవాదులు తప్పించుకుని పారిపోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. -
ప్రభుత్వ నిర్వాకం వల్లే ప్రజలకు ఈ దుస్థితి
బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే హైదరాబాద్కు ప్రస్తుతం ఈ దుస్థితి పట్టిందని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు. నగరాన్ని ముంచింది వర్షాలు కాదని, రాష్ర్ట ప్రభుత్వమేనని గురువారం విమర్శించారు. భవిష్యత్లో వర్షాల వల్ల హైదరాబాద్కు, ప్రజలకు ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు హైకోర్టు జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆ కమిషన్ ఇచ్చే సూచనలను తప్పకుండా పాటించాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్ను విశ్వనగరం చేస్తామని, స్కైవేలు, ఫ్లై ఓవర్లతో మొత్తం స్వరూపాన్నే మార్చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. -
కేసీఆర్ ఎవర్ని చూసి భయపడుతున్నారు?
బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసిన కేసీఆర్.. ఈ రోజు ఎవర్ని చూసి భయపడుతున్నారో టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేయాలని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు అధికారికంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నాయం టూ చెప్పిన కేసీఆర్కు అప్పుడు మతపరమైన అంశం గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. ఆదివారం పార్టీ రాష్ట్రకార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అమిత్షా సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు. తెలంగాణ కోసం మజ్లిస్ ఏనాడూ పోరా టం చేయలేదని, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిందన్నారు. అలాంటి పార్టీతో లోపాయికారి ఒప్పందా లు చేసుకొని తెలంగాణ అస్తిత్వాన్ని తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు. -
అది స్వాతంత్య్ర పోరాటమా?: ఇంద్రసేనారెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారత్లో హైదరాబాద్ స్టేట్ విలీనం తర్వాత దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా పోరాటం చేశామంటున్న కమ్యూనిస్టులు.. అది స్వాతంత్య్ర పోరాటం ఎలా అవుతుందో చెప్పాలని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం, హైదరాబాద్ విలీనానికి సంబంధించి తనపై సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి చేసిన విమర్శలపై స్పందిం చారు. నిజాం వ్యతిరేక పోరాటం జరిపామంటున్న కమ్యూనిస్టులు, నిజాం పాలన లేని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ పో రాటాన్ని ఎందుకు కొనసాగించారో చెప్పాలన్నారు. హైదరాబాద్ స్టేట్ విలీనం తర్వాత కూడా ఎందుకు పోరాటాన్ని కొనసాగించారనే దానిపై కమ్యూనిస్టుల వద్ద సమాధానం లేదన్నారు. కమ్యూనిస్టుల నుంచి నుంచి నేర్చుకునే గతి పట్టలేదని వ్యాఖ్యానించారు. -
ఆ వ్యాఖ్య ఆయన అపరిపక్వతకు నిదర్శనం
బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ విమర్శ సాక్షి, హైదరాబాద్: నిజాం ఇచ్చిన తుపాకులతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేశారని బీజేపీ నాయకుడు ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. వీరోచిత సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి కమ్యూనిస్టులను దేశ ద్రోహులు అనడం హాస్యాస్పదమని బుధవారం పేర్కొన్నారు. ఆనాటి స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర లేని విషయాన్ని ఆ పార్టీ నేతలు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ఏకంగా ఆరెస్సెస్ను నిషేధించిన నాటి హోంమంత్రి సర్దార్ పటేల్ను నిస్సిగ్గుగా పొగడటం వారి రాజకీయ దివాళాకోరుతనానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. ఇంద్రసేనారెడ్డి కమ్యూనిస్టుల గురించి మాట్లాడే ముందు నాటి స్వాతంత్య్ర సమరయోధుల పాఠాలు నేర్చుకుంటే మంచిదని హితవు పలికారు. -
‘బీజేపీ వ్యాఖ్యలు అపరిపక్వతకు నిదర్శనం’
నిజాం ఇచ్చిన తుపాకులతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేశారని బీజేపీ నాయకుడు ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. వీరోచిత సాయుధపోరాట చరిత్రను వక్రీకరించి కమ్యూనిస్టులను ఆయన దేశద్రోహులు అనడం హాస్యాస్పదమన్నారు. ఆనాటి స్వాతంత్య్ర పోరాటంలో తమకు పాత్ర, సంబంధం లేని విషయాన్ని బీజేపీ నాయకులు కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిలో భాగంగా ఏకంగా తమ మాతృసంస్థ ఆరెస్సెస్ను నిషేధించిన నాటి హోంమంత్రి సర్దార్ పటేల్ను నిస్సిగ్గుగా అరువు తెచ్చుకుని పొగడడం వారి రాజకీయ దివాళా కోరుతనానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. ఇంద్రసేనారెడ్డి కమ్యూనిస్టుల గురించి మాట్లాడే ముందు నాటి స్వాతంత్ర సమరయోధుల నుంచి పాఠాలు నేర్చుకుంటే మంచిదని హితవు పలికారు. నాటి స్వతంత్ర పోరాటాన్ని గుర్తించి భారత ప్రభుత్వం అనేకమంది తెలంగాణ కమ్యూనిస్టులను తామ్రపత్రాలతో సన్మానించిన విషయాన్ని ఆయన తెలుసుకుంటే మంచిదన్నారు. భూస్వామ్య, రాచరిక వ్యవస్థకు ప్రతీకగా నిలిచిన నిజాం నవాబు సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వానికి లొంగడం ఎంత వాస్తవమో, ఆ తర్వాత అదే ప్రభుత్వం ఆయనను రాజ్ప్రముఖ్గా గౌరవించడం అంతే వాస్తవమన్నారు.అంతేకాకుండా కమ్యూనిస్టులకు వెల్లువెత్తిన ఆదరణకు తట్టుకోలేక కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై సైన్యాన్ని ఉసిగొల్పడంతో ఆత్మరక్షణ పోరాటం జరిగిందని గుర్తుచేశారు. ఆ తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కమ్యూనిస్టులు సాధించిన భారీ విజయం ప్రజా మద్దతుకు నిదర్శనమని పేర్కొన్నారు. -
మీ నాయనే తొడగొట్టి చెప్పిండు
బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ముకరంపుర: ‘మీ నాయనే తెలంగాణ విమోచన దినోత్సవంను అధికారికంగా నిర్వహించాలని ఉమ్మడి ఏపీ సీఎంగా రోశయ్య వ్యవహరించిన సమయంలో తొడగొట్టి చెప్పిండు’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి నిజామాబాద్ ఎంపీ కవితను ఉద్దేశించి అన్నారు. కరీంనగర్లో ఆదివారం నిర్వహించిన బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... సెప్టెంబర్17 తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహిస్తే హిందూ, ముస్లింల గొడవలొస్తాయని ఎంపీ కవిత పేర్కొనడం సరికాదన్నారు. అధికారం ఉందని ప్రజలను తప్పుదోవ పట్టించ డం తగదన్నారు. హైదరాబాద్ సంస్థానం నుంచి వేరుపడ్డ మహారాష్ట్ర, కర్ణాటక విమోచన దినోత్సవాన్ని అధికారికం గా నిర్వహిస్తున్నాయన్నారు. సెప్టెంబర్17 ప్రాముఖ్యత తెలిసేలా ఈ నెల 10 నుంచి 14 వరకు పోస్టుకార్డు ఉద్యమం చేపడతామన్నా రు. బీజేపీ కిసాన్మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్రావు పాల్గొన్నారు. -
చేసింది జానెడు.. చెప్పుకునేది బారెడు! : ఇంద్రసేనా
లెఫ్ట్పై ఇంద్రసేనారెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర చేసింది జానెడు.. చెప్పుకునేది బారెడు అన్నట్లుగా వారి వ్యవహారం ఉందని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ధ్వజమెత్తారు. కమ్యూనిస్టులు ఒక దశ వరకు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడారని, ఆ తర్వాత కలిసిపోయారని, సెప్టెంబర్ 17, 1948 తర్వా త హైదరాబాద్ విడిగా ఉంటే కమ్యూనిస్టు రాజ్యం వస్తుందని భారత్కు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. కమ్యూనిస్టులకు రజాకార్లతో, నిజాంతో కూడా సంబంధాలుండేవన్నారు. కమ్యూనిస్టులపై భారత్లోని మిగ తా ప్రాంతంలో నిషేధముంటే ఇక్కడమాత్రం వారికి అనుకూలంగా నిజాం నిషేధం ఎత్తేశారన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు చింతా సాంబమూర్తి, ప్రకాశ్రెడ్డి, దాసరి మల్లేశం తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్కు కన్నీటి గాథలు తెలియవా? గతంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం అంటూ కొండెక్కి జబ్బ లు చరుచుకున్న కేసీఆర్... అధికారంలోకి వచ్చాక దానిని నిర్వహించకపోవడం క్షమించరాని పాపమని ఇంద్రసేనారెడ్డి అన్నారు. నిజాం సమాధికి సలామ్ కొట్టి కీర్తిస్తున్న కేసీఆర్కు ఆనాడు రజాకార్లు ఆడబిడ్డలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన కన్నీటి గాథలు తెలియవా అని ప్రశ్నించారు. నిజాం హయాంలో దురాగతా లు, వాటికి వ్యతిరేకంగా పోరాడిన యోధుల చరిత్రను భవిష్యత్ తరాలకు చెప్పేందుకు సెప్టెంబర్ 17న బీజేపీ కార్యక్రమాలను చేపడుతుందన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న వరంగల్లో నిర్వహించే తిరంగాయాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారని ఆయన చెప్పారు. -
నయీం దందాపై సీబీఐ విచారణ జరిపించాలి
⇒ బీజేపీ జాతీయ నేత ఇంద్రసేనారెడ్డి హన్మకొండ: గ్యాంగ్ స్టర్ నయీం దందాలపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. హన్మకొండలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత వెలుగుచూస్తున్న అంశాల్లో ఐపీఎస్, డీఎస్పీ స్థాయి అధికారుల పేర్లు బయటకు వస్తున్నందున, నిష్పక్షపాతంగా, వాస్తవాలు ప్రజలకు తెలియజేసేలా సీబీఐ విచారణ చేయించాలన్నారు. రాష్ట్ర పోలీసుల విచారణపై సందేహాలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీ కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు సందర్శనకు ఇతరులకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం.. మంత్రుల సమావేశాలకు మాత్రం అనుమతిస్తోందని, ఇదేం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని, వరంగల్ లేదా కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నేతలు రావు పద్మ, చాడా శ్రీనివాస్రెడ్డి, రావు అమరేందర్రెడ్డి, దొంతి దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. -
చేనేతకు చేయూత జాతీయ అవసరం
సందర్భం స్వాతంత్య్ర పోరాటంలో ‘స్వదేశీ’ ఒక ప్రధాన సాధనంగా ఏ విధంగా మారిందో, నేడు పేదరికంపై పోరాటానికి చేనేత రంగం సైతం ఒక సాధనం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేయడం చెప్పుకోదగినది. తల్లి ఇచ్చే ప్రేమానుబంధాలను ఖాదీ, చేనేత ఉత్పత్తులు కూడా కలిగిస్తా యని చెప్పారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం ఆగస్టు 7న ‘జాతీయ చేనేత దినోత్సవం’గా పాటించాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరం చెన్నైలో జరి పిన మొదటి చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు. ప్రపంచంలో పర్యావరణం, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణల గురించిన ఆలోచనలు ప్రాధాన్యం సంతరించుకుంటున్న ప్రస్తుత తరుణంలో పర్యావరణ అనుకూ లమైన మన చేనేత ఉత్పత్తుల గురించి ప్రచారం చేయవలసిన అవసరం ఉన్నదని కూడా మోదీ సూచించారు. వ్యవసాయం తరువాత దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ -చేనేత. దీనికి జీవం పోయడం ద్వారానే దేశ ఆర్థికాభివృద్ధి, సూపర్ పవర్గా ఎదుగుదల సాధ్యమవుతాయి. ఇదంతా గ్రామాలలోనే ఉండడంతో మన గ్రామీణ ఆర్థిక వికాసానికి చేనేత పట్టుగొమ్మ అని చెప్పవచ్చు. అయితే దశాబ్దాలుగా ఈ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గుర యింది. దానితో పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత 15 ఏళ్లుగా చేనేత కార్మికుల సంఖ్య తగ్గుతున్న సంగతి ఆందోళన కలిగిస్తుంది. 1995 నాటి గణాంకాల ప్రకారం దేశంలో 65 లక్షల మగ్గాలు ఉండగా 2009-10 నాటికి 43.32 లక్షలకు తగ్గిపోయాయి. కోటి మందికి పైగా ఈ వృత్తిని నమ్ముకుని ఉన్నారు. అనుబంధంగా కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. చేనేత వారిలో 45.18 శాతం మంది ఓబీ సీలు. ఎస్సీలు 10.13 శాతం, ఎస్టీలు 18.12 శాతం, ఇతరులు 26.57 శాతం ఉన్నారు. ఆ వర్గాలలో సుమారు 78 శాతం మహిళలకు ఇదే ఆధారం. వారిలో 87 శాతం మంది గ్రామీ ణులు. వీరందరిదీ దుర్భర జీవన స్థితి. 54 శాతం మంది కచ్చా ఇళ్ళలో (గుడిసెలు, రేకుల షెడ్లు) నివసిస్తున్నారు. 31 శాతం మం దికి పాక్షిక పక్కా గృహాలు ఉన్నాయి. 15 శాతం మంది మాత్రమే పక్కా గృహాలలో ఉంటు న్నారు. 9.7 శాతం మందికి మాత్రమే అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డులు ఉన్నాయి. 36.9 శాతం మందికి బీపీఎల్ రేషన్ కార్డులు ఉన్నాయి. 34.5 శాతం మందికి ఏపీఎల్ రేషన్ కార్డులు ఉండగా, 18.9 శాతం మందికి అసలు రేషన్ కార్డులు లేవు. 29 శాతం చదువుకోనివారే. 12.7 శాతం మంది ప్రాథమిక విద్యను మధ్యలో ఆపివేయగా, 18.2 శాతం మంది ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 22.9 శాతం మంది మాధ్యమిక పాఠశాల విద్యనూ పూర్తిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలలో వీరి సగటు ఆదాయం సంవత్సరానికి రూ.29,314గా ఉండగా, పట్టణ ప్రాంతాలలో రూ. 31 వేలు ఉంది. జాతీయస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో రూ. 38,260, పట్టణ ప్రాంతాల్లో రూ. 33,038 సగటున ఉంది. కేవలం 14.4 శాతం మందికి మాత్రమే బ్యాంక్ల నుండి రుణాలు అందుతుండగా, 44.6 శాంతం మందికి మాస్టర్ వీవర్స్ నుండి, 13,4 శాతం మందికి వడ్డీ వ్యాపారుల నుండి రుణం లభిస్తున్నది. చేనేత పనివారి సంఖ్య తగ్గుతున్నా ఉత్పత్తి మాత్రం పెరుగుతూనే ఉంది. దేశంలో మొత్తం ఉత్పత్తి అవుతున్న వస్త్రాలలో 14 శాతం, అంటే 6,900 మిలియన్ల చదరపు మీటర్ల వస్త్రాలను వీరే ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తం జీడీపీలో వీరి వాటా 4 శాతంగా ఉంది. ఎగుమతులలో సహితం వీరి భాగస్వామ్యం గణనీయంగా ఉంది. కానీ ఈ రంగంలో వేతనాలు తక్కువగా ఉండడంతో చేనేత కార్మికులు ఇతర రంగాలకు వలస వెళ్లడం పెరుగుతున్నది. గృహ నిర్మాణం, దోభీలు, క్షురకులు వంటి ఇతర అసంఘటిత రంగా లలోని కార్మికులు చేనేత కార్మికుల కన్నా ఎక్కువగా వేతనాలు పొందుతున్నారు. వారికి రోజుకు కనీసం రూ. 250 నుండి రూ. 500 వరకు వేతనం లభిస్తున్నది. చేనేత వారికి మాత్రం రూ. 80 నుండి 100 మించి లభించడం లేదు. ఇంతటి కీలక ప్రాధాన్యం గల రంగానికి ప్రణాళికా పరంగా కేటాయింపులు కూడా అంతంత మాత్రమే. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన గల నరేంద్ర మోదీ ప్రభుత్వం చేనేతను పున రుజ్జీవింప చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. ఇందుకోసం విసృ్తతమైన కృషి జరగాలి. విధానపరమైన నిర్ణయాలను అమలు పరచడంతో పాటు, తగు బడ్జెట్ కేటాయింపులు జరపాలి. కోటి మంది నమ్ముకున్న ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం ఆర్థిక వ్యవస్థకు పెద్ద నష్టమే. ఇది గమనించాలి. ఆగస్టు 7 : జాతీయ చేనేత దినోత్సవం (వ్యాసకర్త : టి.ఇంద్రసేనారెడ్డి గ్రామ వికాస భారతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు) indrasena.reddy11@gmail.com -
'అసదుద్దీన్ కు మోదీ భయం పట్టుకుంది'
హైదరాబాద్: కుహనా లౌకిక వాదులు సంస్కృతి మరచి పుష్కరాలపై రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ ప్రభుత్వం ఇతర మతాలకు సబ్సిడీ ఇస్తే ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. హిందూ దేవాలయాల డబ్బును ప్రభుత్వం వాడుకున్నపుడు ఈ లౌకిక వాదులు ఎమయ్యారన్నారు. అసదుద్దీన్ కు ప్రధాని మోదీ భయం పట్టుకుందన్నారు. ముంబై అల్లర్లను అసదుద్దీన్ సమర్ధిస్తున్నారా అని ప్రశ్నించారు. ఏసీబీ సత్తయ్యను హత్య చేసిన వ్యక్తికి తెలంగాణ సర్కార్ పెరోల్ ఇవ్వడం దారుణమని, ఈ విషయాన్ని తమ పార్టీ ఖండిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
కరెంట్ సమస్యకు కేసీఆరే కారకుడు
బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరెంట్ సమస్య తీవ్రం కావడానికి సీఎం కేసీఆర్ నిర్వాకమే కారణమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే విద్యుత్తు శాఖకు మంత్రిని కేటాయించలేదని, కనీసం పూర్తిస్థాయి ఉన్నతాధికారులు కూడా లేకుండా చేశారని ఆరోపించారు. మూడుశాఖలు పర్యవేక్షించే అధికారిని కార్యదర్శిగా నియమించారని, ట్రాన్స్కో, జెన్కోల్లో ఉండాల్సిన సంఖ్యలో డెరైక్టర్లు కూడా లేరన్నారు. ప్రభుత్వ వినతి మేరకు కేంద్రం రెండు దఫాల్లో 335 మెగావాట్ల కరెంట్ను తెలంగాణకు సరఫరా చేసినప్పటికీ, బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో బురద జల్లుతున్నారన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తీరు మార్చుకుని కార్యాచరణకు సిద్ధం కావాలని హితవు పలికారు. -
సామాన్యునికి పట్టంగట్టిన ప్రధాని
ప్రధాని జన ధన్ యోజన పథకానికి మూడు రోజుల్లోనే మూడు కోట్ల మంది స్పందించారంటే ప్రజలు ఎంతగా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో అర్థం కావడం లేదా? సామాన్యుల ప్రయోజనాలే పరమ పవిత్ర కర్తవ్యంగా తలదాల్చిన ప్రధాని... అసాధ్యాలను సుసాధ్యం చేయగల నేతనని ఈ వంద రోజుల్లో రుజువు చేశారు. ‘‘ఈ దేశానికో గమ్యం ఉంది. అది ప్రపంచ సంక్షేమం కోసం పని చేయడం. ఇది స్వామి వివేకానంద చెప్పిన మాట. ఆ గమ్య సాధన క్రమంలోనే హిందుస్థాన్ అవతరించింది. భారత్ ఆవిష్కృతమైంది’’ -ప్రధాని నరేంద్ర మోడీ భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ తొలి వంద రోజుల పాలన పూర్తయింది. ఈ స్వల్ప వ్యవధిలో ఆయన పని తీరును అంచనా వేయడం దుస్సాహసమే. అయితే ఆయన తన లక్ష్యంగా ప్రకటించిన నవ్య భారత్ దిశగానే కచ్చితంగా దేశాన్ని నడుపుతున్నారనేది ఇప్పటికే స్పష్టమవుతోంది. ఈ కొద్ది రోజుల్లో ఆయన చేపట్టిన చర్యలే అందుకు సాక్ష్యం. ఆర్థిక అస్పృశ్యత నివారణకు జరుగుతున్న బృహత్తర కృషిని, ఆర్థిక క్రమశిక్షణ సాధనలోని ప్రగతిని ఆయన విమర్శకులు సైతం గుర్తించక తప్పదు. అలసత్వానికీ, జాప్యానికీ మారుపేరుగా నిలిచిన అధికార యంత్రాంగాన్ని సున్నితమైన వ్యాఖ్యలతో దారిలోకి తెస్తున్నారు. దానికి జవాబుదారీతనం, పారదర్శకత అలవడేట్టు చేసి భారతదేశ గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపజేసే దిశగా దృఢసంకల్పంతో కూడిన కృషి మొదలైంది. మందకొడితనానికి స్వస్తి... ప్రపంచం కుగ్రామంగా మారుతున్న నేపథ్యంలో ఇరుగుపొరుగు దేశాలతో, ఇతర ప్రపంచ దేశాలతో సత్సంబంధాలకు చాలా ప్రాధ్యానం ఉంది. ప్రమాణ స్వీకారానికి ‘సార్క్’ దేశాల అధిపతులను ఆహ్వానించడంతోనే ప్రధానిగా మోడీ తొలి రోజునే ఆ కృషికి శ్రీకారం చుట్టారు. బర్మా, బ్రెజిల్, నేపాల్ పర్యటనల నుండి నిన్నటి జపాన్ పర్యటన వరకు మోడీ సాధించిన వరుస దౌత్య విజయాలే వినూత్నమైన ఆయన విదేశాంగ విధాన సాఫల్యతకు తిరుగులేని సాక్ష్యం. ఒక్క పర్యటనతో జపాన్ నుండి రెండున్నర లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులనే గాక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సాధించడం అపూర్వం. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి అనే తీరుగా సాగిన గత ప్రభుత్వ పాలనలో నెలకొన్న విధానపరమైన స్తంభనతో అభివృద్ధి కుంటుపడింది. ప్రణాళికా సంఘం, ఆర్థిక సంఘం, మంత్రుల కమిటీలు ఇలా పలు అంచెలలో ఒకరు అవునన్నది మరొకరు కాదంటుండగానే కాలం గడచిపోయేది. విధానపరమైన జాప్యం, అలసత్వం వ్యాపించిపోయాయి. చివరికది నిష్క్రియాపరత్వంగా దిగజారి ప్రజలకు చేరాల్సినవేవీ చేరేవి కావు. ఈ దుస్థితిని సమూలంగా సంస్కరించడానికే మోడీ పలు వ్యవస్థాగతమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఎన్నడో నిరర్థకమైనదిగా మారిన ప్రణాళికా సంఘంతో పాటూ లెక్కకు మించి ఉన్న రకరకాల అధికారిక సంఘాలను, గ్రూపులను రద్దుచేశారు. సత్వర నిర్ణయాలు తీసుకునే వ్యూహ కల్పనలో భాగంగానే పలు చిన్న చిన్న మంత్రిత్వ శాఖల విలీనం వంటి చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో పని సంస్కృతిని పెంచడం కోసం... ప్రతి నెలా ఉత్తమ ఉద్యోగి, ప్రతి ఏటా ఉత్తమ ఉద్యోగి అవార్డులను ప్రవేశపెట్టారు. తనతో సహా మంత్రివర్గ సహచరులందరిలోనూ, ప్రతి మంత్రిత్వ కార్యాలయంలోనూ జవాబుదారీతనం, పారదర్శకతల సంస్కృతిని ప్రవేశపెట్టారు. వడి వడిగా.. అభివృద్ధి దిశగా... ఆర్థికాభివృద్ధి శుష్క ప్రవచనాలతో జరిగేది కాదు. ప్రజలకు కావలసింది... తమ బతుకులు బాగుపడటంతో పాటు, దేశం పటిష్టంగా, సురక్షితంగా ఉండటం. అందుకు హామీని ఇవ్వగల సుస్థిర ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్నుకున్నారు. ఆ బాధ్యతను భుజస్కంధాలకెత్తుకున్న ప్రధాని మోడీ... విధాన పరమైన లోపాలకు తావు లేకుండా పారిశ్రామికాభివృద్ధిని, మొత్తంగా జాతీయ ఉత్పత్తిని త్వరితగతిన పెంపొందింపజేయడానికి చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడం వల్ల కీలకమైన దేశ రక్షణ రంగంలో సైతం లక్షల కోట్ల విలువైన పనులు మూలన పడ్డాయి. మోడీ ప్రభుత్వం చక చకా 30 వేల కోట్ల రూపాయల పనుల ఫైళ్లను ఖరారు చేసి దేశ రక్షణ పట్ల దృఢ సంకల్పాన్ని ప్రదర్శించింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం కొన్ని కీలక రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం ఈ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నిర్ణయాలలో ఒకటి. అలా అని స్వావలంబన లక్ష్యాన్ని విస్మరించలేదు. రక్షణ రంగం సహా భారత్ తన కాళ్లపై తాను నిలిచేలా అన్ని రంగాలలోనూ చర్యలను చేపట్టారు. మన దేశం పెద్ద అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా వృద్ధి చెందేందుకు మార్గం సుగమమైంది. దిగొచ్చిన ధరలు... గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అంతకు ముందు 4.1 శాతంగా ఉన్న స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఇప్పుడు 5.7 శాతానికి చేరింది. మరీ ముఖ్యంగా సామాన్యుల జీవితాలను దుర్భరంగా మారుస్తున్న నిత్యావసర వస్తువుల ధరలను కట్టడి చేయగలిగారు. ఉల్లి, టమోట, ఆలుగడ్డ తదితర కాయగూరలను నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి తేవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం, ఎగుమతి-దిగుమతి విధానంలో మార్పులు చేయడం వంటి చర్యలను చకచకా చేపట్టడం వల్లనే అది సాధ్యమైంది. అక్రమ నిల్వదారులపట్ల చేపట్టిన కఠిన వైఖరి సైతం సత్ఫలితాలను ఇచ్చింది. ఆదర్శ గ్రామాలు ఎలాగంటే... బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో స్మార్ట్ సిటీస్, ఆదర్శ గ్రామాలు, జన ధన్ యోజన, అందరికీ విద్యుత్ తదితరమైన ముఖ్య వాగ్దానాలను చేసింది. తక్షణమే వాటిని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వందకుపైగా స్మార్ట్ నగరాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అధునాతన సౌకర్యాలు కల్పించడానికి సన్నాహాలు చేస్తోంది. కిక్కిరిసిన పెద్ద నగరాలపై వలసల భారాన్ని తగ్గించడం, నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం అనే ప్రధాన లక్ష్యాలతో స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. పార్లమెంటు సభ్యులు తమకు కేటాయించిన నిధులతో ప్రతి ఏటా ఒక ఆదర్శ గ్రామాన్ని తయారు చేయాలని నిర్దేశించారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి శ్రామికులు వలస పోవాల్సిన స్థితిని నివారించడం సాధ్యమవుతుంది. అలాగే నానాటికీ ‘సాగుబడి’ క్షీణించిపోయే స్థితిని వెనక్కు మరల్చగలగడం సాధ్యమని నిపుణుల అంచనా! వచ్చే ఐదేళ్లలో అన్ని గ్రామాలకు విద్యుత్ను సరఫరా చేసేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘పవర్ టు ఆల్’ అనే పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టింది. గాంధీ జయంతి నాడు ప్రారంభించే ఈ పథకానికి ఎంపికైన మూడు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఆర్థిక అంటరానితనానికి చెల్లు చీటి నేటికీ గ్రామీణ ప్రాంతాలలో నూటికి 60 శాతం మందికి బ్యాంక్ ఖాతాలు లేవు. ఈ ఆర్థిక అంటరానితనం ఫలితంగానే ప్రభుత్వ సహాయం అత్యవసరమైన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరడం లేదు. దీనిని రూపుమాపే లక్ష్యంతోనే ప్రధాని యుద్ధ ప్రాతిపదికపై జన ధన్ యోజన పథకాన్ని అమలు చేయిస్తున్నారు. మూడు రోజుల్లోనే సుమారు 3 కోట్ల ఖాతాలు తెరిచారంటేనే ప్రజలు ఇలాంటి అవకాశం కోసం ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతుంది. జన ధన్ యోజన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు మాత్రమే అందేలా చేస్తుంది, పేదలకు చేరాల్సిన నిధులను కాజేసే స్వార్థపర శక్తుల ఆట కట్టిస్తుంది. అవినీతిని రూపుమాపడానికి, దొంగనోట్ల చెలామణీని అరికట్టడానికి, నల్లధనాన్ని వెలికి తీయడానికి కూడా బ్యాంకు ఖాతాల ద్వారానే లావాదేవీలు జరగడం అవసరం. ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రకటించినా అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నది ఈపీఎఫ్ పెన్షన్ను రూ.500 నుంచి 1000 రూపాయలకు పెంచడం. దీని వల్ల దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. పాలకులైనా, అధికారులైనా, ప్రభుత్వాలైనా... ఇలా ఎవరైనా విశ్వసించాల్సింది ఈ దేశ పౌరుల్నే. అందుకే నరేంద్ర మోడీ ఈ దేశ పౌరులే పెద్ద గెజిటెడ్ అధికార్లుగా భావించారు. దేశ పౌరులు తమకు తాముగా ఇచ్చే స్వయం ప్రకటిత అఫిడవిట్లు చెల్లుబాటవుతాయని చెప్పారు. ప్రధాని నోట ఏ మాట వచ్చినా అది సామాన్యులను ఉద్దేశించినదే. అందుకు ఆగస్టు 15న ఆయన ఎర్రకోట నుండి చేసిన ప్రసంగమే తిరుగులేని సాక్ష్యం. పర్యావరణాన్ని కాపాడండి, పరిశుభ్రతను పాటించండి. విద్యుత్ను పొదుపు చేయండి, మీ పిల్లలకు (మీ కుమారులకు) ఏది ఒప్పో ఏది తప్పో చెప్పి నియంత్రించేలా చూడండి అని ఆయన కోరినది కోట్లాది మంది దేశ ప్రజలనే. సామాన్య ప్రజల ప్రయోజనాల పరిరక్షణే పరమ పవిత్ర కర్తవ్యంగా తలదాల్చిన తొలి ప్రధాని... అసాధ్యాలను సుసాధ్యం చేయగల నేతనని ఈ వంద రోజుల్లో చేసి చూపారు. అంతకు మించి చేయాల్సింది ఏముంది? -నల్లు ఇంద్రసేనారెడ్డి ,మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు -
'నా ఇంటికి ఎన్యుమరేటర్ రాలేదు'
హైదరాబాద్: ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో సర్వే చేస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు ఎందుకు చేపట్టలేదని బీజేపీ సీనియర్ నేత ఇంద్రాసేనా రెడ్డి ప్రశ్నించారు. దూర ప్రాంత వాసులు ఇబ్బంది పడుతూ వెళ్లినా.. వారికి నమోదు జరగలేదన్నారు. మంగళవారం మరోమారు సమగ్ర సర్వే పై విరుచుకుపడ్డ ఇంద్రసేనా రెడ్డి.. అసలు ప్రభుత్వం ఏలక్ష్యంతో సమగ్ర సర్వే చేపట్టందన్నారు. అసలు తన ఇంటికి ఎన్యుమరేటర్ రాలేదని ఎద్దేవా చేశారు. పారిశ్రామికవాడల్లో నివసిస్తున్న వారి వివరాలను సేకరించకపోవడమే కాకుండా హైదరాబాద్ నగరంలో ఉంటున్న కిరాయిదారుల వివరాలను కూడా తీసుకోలేదన్నారు. సమగ్ర సర్వే పత్రాలను ఓల్డ్ సిటీలో అమ్ముతున్నారని ఇంద్రసేనా రెడ్డి విమర్శించారు. ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని సవాల్ విసిరారు.ఈ తరహా పిచ్చి పనులతో బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ఆయన మండిపడ్డారు. -
'సమగ్ర సర్వేపై కర్ఫ్యూకు మించిన షరతులు'
హైదరాబాద్:తెలంగాణ వ్యాప్తంగా సర్కారు చేపట్టనున్న సమగ్ర సర్వేపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సర్వేతో ప్రజలకు ఇబ్బందులకు గురౌతారని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. అసలు ఈ సర్వేకు కర్ఫ్యూకు మించిన షరతులు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం పంతానికి పోయి ప్రజలకు ఇబ్బందులు కల్గించవద్దని హితవు పలికారు. సర్వేకు కర్ఫ్యూ సమయంలో విధించే ఆంక్షలను చేపట్టడం తగదన్నారు. అసలు ఇంటర్ విద్యార్థులతో సమగ్ర సర్వే చేయించడాన్ని ఆయన తప్పుబట్టారు. వారితో సర్వే చేయిస్తే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఎలా వస్తాయని ఇంద్రసేనా రెడ్డి ప్రశ్నించారు. ప్రజలకు వచ్చిన అనుమానాలను నివృత్తి చేయడానికి కేటాయించిన ఫోన్ నంబర్లు పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు.అత్యవసర సర్వీసుల నిలుపుదలపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. -
ఒక రోజు సోషల్ సర్వే సాధ్యమా?
హైదరాబాద్:ఈ నెల 19 నుంచి తెలంగాణ ప్రభుత్వం జరప తలపెట్టిన సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నిర్వహణ విమర్శలకు తావిస్తోంది. 625 చ.కి.మీ. మేర విస్తరించిన జీహెచ్ఎంసీలో దాదాపు 20 లక్షల ఇళ్లున్నట్లు అంచనా వేసిన అధికారులు సర్వే నిర్వహణకు దాదాపు లక్షమంది సిబ్బంది సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఒకే రోజు సోషల్ సర్వే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఇంద్రసేనా రెడ్డి.. ఒక్క రోజులో ఇంటింటా సర్వే సాధ్యపడే అంశం కాదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు అహంకార పూరితంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. కేసీఆర్ మాట్లాడుతున్న తీరు జిన్నాలా ఉందని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్ కు ఓయూలో అడుగుపెట్టే ధైర్యం ఉందా?అని ప్రశ్నించారు. ఆయనకు చేతనైతే మాటల కాదు.. చేతల్లో చూపించాలని ఇంద్ర సేనా రెడ్డి విమర్శించారు. మరో పదిరోజుల్లో తెలంగాణలో సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నిర్వహణకు గ్రేటర్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. జీహెచ్ఎంసీ, పోలీసులు, ఇతర ప్రభుత్వ సిబ్బందిని సర్వే సేవలకు వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేశారు. -
'కేసీఆర్.. జిన్నాలా మాట్లాడుతున్నారు'
తెలంగాణను పాకిస్థాన్లా, తనను తాను మహ్మద్ అలీ జిన్నాలా భావిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ మాటలు అహంకారపూరితంగా ఉన్నాయన్నారు. ఒక్కరోజులో సామాజిక సర్వే చేయడం అంటే మానవ సాధ్యమేనా అని ఆయన ప్రశ్నించారు. తన తప్పులను ఆయన కేంద్రం మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ విషయంలో సాధ్యాసాధ్యాలు ఆయనకు ఎన్నికల ముందు తెలియదా అంటూ ఇంద్రసేనారెడ్డి నిలదీశారు. ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టే ధైర్యం కేసీఆర్కు ఉందా అని ప్రశ్నించారు. మాటలు కాదు..చేతలు కావాలని తెలిపారు. -
ఒక్కో స్థానానికి ముగ్గురి పేర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల వారీగా పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ దృష్టి పెట్టింది. కిషన్రెడ్డి చైర్మన్గా ఉన్న పార్టీ తెలంగాణ ప్రాంత ఎన్నికల కమిటీ శుక్రవారం సమావేశమై ఈ అంశంపై చర్చిం చింది. తెలంగాణలోని 17లోక్సభ, 119 అసెంబ్లీ స్థానాలకు పార్టీ జిల్లా కమిటీల నుంచి అందిన ప్రతిపాదనలపై చర్చించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి మూడేసి పేర్లను జాతీయ పార్టీకి సూచించాలని నిర్ణయించారు. నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్ లోకసభ స్థానాలకు ఒక్కొక్క అభ్యర్ధి పేరే జిల్లా కమిటీల నుంచి అం దినట్టు సమాచారం. మెదక్ లోకసభ స్థానం నుంచి నరేంద్రనాథ్, నిజామాబాద్ నుంచి యెండల లక్ష్మీనారాయణ, మహబూబ్నగర్ నుంచి నాగం జనార్దన్రెడ్డి పేర్లపై సమావేశంలో ఏకాభిప్రాయం వచ్చిందని సమాచారం. ఎన్నికల కమిటీ నుంచి వారికి ఉద్వాసన వెంకయ్యనాయుడుపై విమర్శలు చేసిన శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్లను పార్టీ ఎన్నికల కమిటీ నుంచి తొలగించారు. అలాగే, మరోనేత రామచంద్రరావును కూడా తప్పించారు. వీరి స్థానంలో మురళీధరరావు, యెండల, దత్తాత్రేయ, లక్ష్మణ్, విద్యాసాగర్రావు, ఇంద్రసేనారెడ్డి, ఆచారి, చింతా సాంబమూర్తి, పద్మజారెడ్డి తదితరులు సభ్యులుగా ఉన్నారు. -
సీఎం కిరణ్ రైతు వ్యతిరేకి
ఇబ్రహీంపట్నం, న్యూస్లైన్: సీఎం కిరణ్ రైతు వ్యతిరేకి గా మారారని బీజేపీ జాతీయ కార్యదర్శి న ల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలోని బాలాజీ గార్డెన్స్లో సోమవారం బీజేపీ అసెంబ్లీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల సమస్యలను పట్టించుకోని కిరణ్.. వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రైతులపై రెవెన్యూ రికవరీ చట్టం (ఆర్ఆర్) ప్రయోగించేందుకు సిద్ధమవుతుండడం సిగ్గుచేటన్నారు. వేల కోట్లు బకాయి పడిన పెద్దలను వదిలేసి రైతాంగాన్ని వేధించడం సమంజసం కాదన్నారు. రైతులను దెబ్బతీసే చర్యలు తీసుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చకు రాకపోవడం ఇరు ప్రాంతాలకూ నష్టమేనన్నారు. సీడబ్ల్యూసీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం జరిగేంతవరకు మౌనంగా ఉన్న కిరణ్ ఇప్పుడు సమైక్యం అంటూ రాగం ఎత్తుకోవడం సమంజసం కాదన్నారు. రాచకాల్వకు మరమ్మతులు చేయాలి.. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు నీరందించే రాచకాల్వకు వెంటనే మరమ్మతులు చేయించాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. హిమాయత్సాగర్ నీరు గతంలో రాచకాల్వ ద్వారా పెద్ద చెరువులోకి వచ్చేదని, రాచకాల్వ కబ్జాకు గురికావడం వల్ల ఇప్పుడు నీరు రావడంలేదని అన్నారు. భువనగిరి నుంచి పోటీ..? వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇంద్రసేనారెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు కృషి చేయాలని ఇంద్రసేనారెడ్డి అసెంబ్లీ పదాధికారుల సమావేశంలో పిలుపునిచ్చారు. ‘బూత్ దర్శన్’ పేరిట గ్రామాల్లో నాయకులు క్షేత్ర స్థాయికి వెళ్లి కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేయాలన్నారు. ఈ నెల 10వ తేదీలోగా ‘బూత్ దర్శన్’ కార్యక్రమాలను పూర్తిచేయాలని కోరారు. వివిధ పాఠశాలల్లో నిర్వహించే పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తరఫున బహుమతులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహంతో కూడిన ఎనిమిది రథాలను ఇబ్రహీంపట్నంలో సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. అదే విధంగా ప్రధాన కేంద్రాల్లో టీలు విక్రయించే వారికి పార్టీ తరఫున బనియన్లను బహూకరించనున్నట్లు తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన అసెంబ్లీ క న్వీనర్ ముత్యాల భాస్కర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజన్కుమార్గౌడ్, జిల్లా ఇన్చార్జి వెంకట్రామయ్య, రాష్ట్ర నాయకులు పోరెడ్డి నర్సింహారెడ్డి, బోసుపల్లి ప్రతాప్, బొక్కా నర్సింహారెడ్డి, బోజిరెడ్డి, నాయిని సత్యనారాయణ, బండి మహేశ్, గోగిరెడ్డి లచ్చిరెడ్డితోపాటు జిల్లా, మండల నాయకులు దొండ రమణారెడ్డి, కంచకట్ల భాస్కర్, టేకుల రాంరెడ్డి, కాళిదాసు, జక్కా రవీందర్రెడ్డి, డేరంగుల రాజు, కొప్పు బాషా, జగదీశ్, అంజయ్య యాదవ్, రాజు గౌడ్, శ్రీధర్రెడ్డి, డి.భాషయ్య, శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు. -
మోహన్ బాబు,బ్రహ్మానందంల పద్మశ్రీలకు చిక్కు
-
మోహన్బాబు, బ్రహ్మానందంలకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: సినిమా టైటిల్స్లో 'పద్మశ్రీ'ని దుర్వినియోగం చేశారని ప్రముఖ హీరో, నిర్మాత మోహన్బాబు, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంలపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పద్మశ్రీని వారు వెనక్కు ఇస్తే గౌరవంగా ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సినిమా టైటిల్స్లో నటులకు పద్మశ్రీ ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పద్మశ్రీని వెనక్కు తీసుకునేలా ఆదేశించాలని బిజెపి నేత ఇంద్రసేనారెడ్డి కోర్టును కోరారు. 'దేనికైనారెడీ' సినిమా క్లిప్పింగ్ను పిటిషనర్ ఉదహరించారు. పేరుకు ముందు, వెనక పద్మశ్రీ ఉండటంపై ఇంద్రసేనారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా వారు సినిమా టైటిల్స్లో పద్మశ్రీని వాడుకున్నారని ఆయన తెలిపారు. పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. మోహన్ బాబు, బ్రహ్మానందంలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది 2007లో మోహన్ బాబును, 2009లో బ్రహ్మానందంను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులతో గౌరవించింది. మోహన్ బాబు, బ్రహ్మానందంలు వారం రోజులలో 'పద్మశ్రీ'లను తిరిగి ఇస్తే బాగుంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారని హైకోర్టు తెలిపింది. ఈ కేసు విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. 'దేనికైనారెడీ' సినిమా వివాదంలో సెన్సార్ బోర్టు తీరును హైకోర్టు తప్పు పట్టింది. -
సీఎం సీమాంధ్ర ప్రజల్ని మభ్యపెడుతున్నారు
అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం చర్చకు వచ్చినప్పుడు దాన్ని అడ్డుకొని ఓడిస్తామని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి సీమాంధ్ర ప్రజలను, పార్టీ నాయకులను మభ్యపెడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, కేఆర్ ఆమోస్, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. తన స్వార్ధం కోసం ప్రజలను చివరివరకు భ్రమల్లో ఉంచే ఎత్తుగడల్లో సీఎం వెళ్తున్నారని దుయ్యబట్టారు. ఇది సీమాంధ్రకే తీరని నష్టం అవుతుందని, ఈ విషయాన్ని అక్కడి ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో కోర్కమిటీలోపార్టీ పెద్దలతో, కేంద్ర మంత్రులతో అధిష్టానం తెలంగాణపై తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, ప్రక్రియకు సహకరిస్తానని ప్రకటిస్తూ బయటకు వచ్చాక సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రం ఏమీ కాబోదని మాయమాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ అయిపోతుందని తె రవెనుక చెబుతూ తనపబ్బం గడుపుకోవడానికి బయట ప్రజల్ని వంచిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రక్రియపై సీఎం క్రికెట్ పరిభాషనుపయోగించడం దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. ‘‘ఇది అధిష్టానాన్ని ధిక్కరించడమే. దీనివల్ల పార్టీకి తీరని నష్టం వాటిల్లుతోంది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధిష్టానానికి తెలుసు’’ అని యాదవరెడ్డి వ్యాఖ్యానించారు. సగం ఇన్నింగ్స్ కే సీమాంధ్ర కాంగ్రెస్ బ్యాట్సమెన్లు ఆలౌట్ అయిపోయారు కనుక ఇక వారు ఆడేందుకు ఏమీలేదన్న విషయాన్ని కిరణ్కుమార్రెడ్డి గమనించాలన్నారు. రూల్సను అతిక్రమించి చివరిబంతి వరకు సీఎం ఆడాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. సీఎం వైఖరి వల్ల పార్టీకి తీరని నష్టం వాటిల్లుతోందన్నారు. చివరకు విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరింపచేసుకొనే అవకాశం కూడా లేకుండా సీఎం చేస్తున్నారని, దీనివల్ల ఆప్రాంతం తీవ్రంగా నష్టపోకతప్పదన్నారు. సీమాంధ్రలో సమ్మెను తక్షణమే విరమింపచేయాల్సిన బాధ్యత సీఎంపైనే ఉందని ఆమోస్ పేర్కొన్నారు. ప్రయివేటు బస్సులు, కార్పొరేట్ స్కూళ్లను నడిపిస్తూ సామాన్యప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ సంస్థలను మూతవేయించడం సరికాదన్నారు. ఏపీ ఎన్జీఓలు తమ సమస్యల గురించి ప్రస్తావించకుండా రాజకీయ నిర్ణయాలపై ప్రశ్నించడం విడూడరంగా ఉందన్నారు.రానున్న కాలంలో వారు ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీచేయదల్చుకున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కొత్త రాజధానికి 4లక్షల కోట్లు కావాలని అడిగి ఇప్పుడు ఢిల్లీకి టీడీపీలోని సమైక్య, తెలంగాణ వాదులను తీసుకువెళ్లడంలోని ఆంతర్యమేమిటన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కేసులకు, బెయిల్కు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఖండించారు.