భూముల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కూకట్పల్లి, బాలా నగర్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఇక చంపాపేట, గండిపేట, శంకర్పల్లి, రాజేంద్రనగర్, ఆజంపూర్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లను వారి స్థానాల నుంచి బదిలీ చేసినా.. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సీఎం, డిప్యూటీ సీఎంలతో రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అహ్మద్ నబీ, నోడల్ డీఐజీ శ్రీనివాసులు మంగళవారం రాత్రి వరకు కసరత్తు చేసిన అనంతరం ఈ బదిలీలు జరిగాయి.
