బూడిద తెలంగాణగా మారుస్తున్నారు | MP palvayi govarthan Reddy comments on CM KCR | Sakshi
Sakshi News home page

బూడిద తెలంగాణగా మారుస్తున్నారు

Published Fri, Jun 24 2016 3:16 AM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

బూడిద తెలంగాణగా మారుస్తున్నారు - Sakshi

బూడిద తెలంగాణగా మారుస్తున్నారు

సీఎం కేసీఆర్‌పై ఎంపీ పాల్వాయి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ అంటూ అడ్డగోలు విధానాలతో బూడిద తెలంగాణగా మారుస్తున్నారని ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కోదండరాంను ఒంటరివాడిని చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని తెలంగాణ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. యూనివర్సిటీలకు వీసీలను నియమించకపోవడం వల్ల యూజీసీ నిధులు రావడం లేదని, దీంతో వర్సిటీలు నిర్వీర్యమయ్యే అవకాశం ఉందన్నారు.

ప్రాజెక్టు రీడిజైన్‌ల పేరుతో పెంచిన నిధులలో సీఎం కేసీఆర్‌కు ఎన్ని ముడుపులు ముడుతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానాను కేసీఆర్ అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement