శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి నుంచి కిలో బంగారం కస్టమ్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడి నుంచి కిలో బంగారం కస్టమ్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి నగరానికి వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు తనిఖీలలో గుర్తించారు. దాంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.