హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో నలుగురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరినగర్కాలనీలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
స్థానిక కాలనీకి చెందిన విద్యార్థినులు పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో వీధికుక్కలు దాడి చేశాయి. దీంతో వారికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు కుక్కల ను తరిమికొట్టి విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు.
వీధికుక్కల దాడిలో విద్యార్థినులకు గాయాలు
Published Wed, Mar 30 2016 3:23 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement