
వీకెండ్లో సిమ్ బ్లాకా?
బ్లాక్ చేసి దోచేస్తారు
సైబర్ నేరగాళ్ళ ఎత్తుగడ కావచ్చంటున్న పోలీసులు
బ్యాంకు ఖాతాతో ముడిపడి ఉంటే మరింత ముప్పు
సెలవులున్నా తక్షణం స్పదించాలంటున్న అధికారులు
{sాన్సఫర్ కాకున్నా... ఆన్లైన్ ఖరీదులకు అవకాశం
వీకెండ్లోనో... వరుసగా సెలవులు ఉన్నప్పుడో హఠాత్తుగా మీ సిమ్కార్డు పని చేయకుండా బ్లాక్ అరుుందా..? మీ బ్యాంకు ఖాతా లావాదేవీలతో అది ముడిపడి ఉందా..? ఆర్టీజీఎస్ వంటి ప్రక్రియలకు సంబంధించిన పిన్ ఆ నెంబర్కే వస్తుంటుందా..? అరుుతే ఇది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడగా అనుమానించాలని అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు ఇలా జరిగితే తక్షణం స్పందించి సర్వీస్ ప్రొవైడర్తో పాటు బ్యాంకు అధికారుల్ని అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో మీ ఖాతాలో ఉన్న నగదు సైబర్ నేరగాళ్లకు చేరిపోతుందని హెచ్చరిస్తున్నారు. వ్యవస్థీకృతంగా ‘నయా’వంచనకు పాల్పడుతున్న నైజీరియన్లతో పాటు ఉత్తరాదికి చెందిన కొన్ని ముఠాలు వివిధ రాష్ట్రాల్లో ఈ తరహాలో మోసాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారుు. వీటి వ్యవహార శైలిని పూర్తిగా అధ్యయనం చేసిన అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. - సాక్షి, సిటిబ్యూరో
‘బ్లాక్’తో డమ్మీ సిమ్లు
ఉత్తరాదికి చెందిన కొందరు యువకుల్ని వివిధ పట్టణాలు, నగరాలకు పంపి కరెంట్ ఖాతాలు తెరిపిస్తున్న నైజీరియన్లు బ్యాంకుల పేర్లను పోలి ఉండే యూఆర్ఎల్స్తో వెబ్సైట్స్ రూపొందిస్తున్నారు. వీటి ద్వారా వల వేసి వినియోగదారుడి ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు ఆ తరవాతే అసలు అంకం ప్రారంభిస్తున్నారు. తమ వల్లో పడిన బాధితులు సిమ్కార్డుల్ని వీరు చాకచక్యంగా బ్లాక్ చేరుుస్తున్నట్లు తేలింది. నేరుగా అతడు నివసిస్తున్న ప్రాంతానికే వెళ్లి సర్వీస్ ప్రొవైడర్లను వారి (బాధితుడి) మాదిరిగానే ఆశ్రరుుస్తున్నారు. అప్పటికే ఖాతాదారుడిని సంబంధించిన పూర్తి సమాచారం వెబ్సైట్ ద్వారా వీరివద్ద సిద్ధంగా ఉండటంతో ఈ వివరాలతో బోగస్ ధ్రువీకరణలు తయారు చేసి వాటిని జత చేస్తూ తమ సిమ్కార్డు పోరుుందని, మరోటి ఇప్పించమంటూ సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ అందిస్తున్నారు. దీంతో సెల్ కంపెనీలు అసలు ఆ నెంబర్తో పని చేస్తున్న సిమ్ను బ్లాక్ చేసి మరోటి ఈ నేరగాళ్లకు అందించేస్తున్నారు. ఈ పనిని ఎక్కువగా వారాంతాల్లో, సెలవు దినాల్లో చేస్తుండటంతో సిమ్ బ్లాక్ అరుునట్లు దాని యజమానులు గుర్తించినా... సర్వీస్ ప్రొవైడర్ను సంప్రదించేందుకు కొంత సమయం తీసుకుంటున్నారు. ఈలోపు నేరగాళ్లు ‘తమ పని’ పూర్తి చేసుకుంటున్నారని కొందరు సైబర్ నేరగాళ్ల విచారణలో వెలుగులోకి వచ్చింది.
ఓటీజీఎస్ పద్ధతిలో భారీ మొత్తం స్వాహా...
అసలు వ్యక్తి వివరాలతో డూప్లికేట్ సిమ్ తమ చేతికి వచ్చిన తర్వాత సైబర్ నేరగాళ్ళు అసలు అంకం ప్రారంభిస్తున్నారు. అప్పటికే ‘వెబ్సైట్’ ద్వారా బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత వివరాలను సంగ్రహించే ఈ-కేటుగాళ్లు వాటిని తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఇక తీసుకున్న సిమ్ను వినియోగించి బ్యాంకుకు కాల్ చేసి ఖాతాదారుడి మాదిరిగానే మాట్లాడుతూ... ఓ సంస్థకు రియల్-టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) పద్దతిలో భారీ మొత్తాన్ని బదిలీ చేయనున్నామని, దీనికోసం వన్-టైమ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ (ఓటీపీడబ్ల్యూ) పంపాల్సిందిగా కోరుతున్నారు. ఖాతాదారుడి నెంబర్ నుంచే ఫోన్ రావడం, వారు అడిగిన అన్ని వివరాలు చెప్పడంతో బ్యాంకు సిబ్బంది ఓటీపీడబ్ల్యూ ఇచ్చేస్తున్నారు. ఇలా సమస్తం తమ చేతికి వచ్చిన తరవాత టార్గెట్ చేసిన ఖాతాను ఆన్లైన్ ద్వారా యాక్సిస్ చేస్తున్న నేరగాళ్లు అప్పటికే తెరిచి ఉంచిన బోగస్ కరెంట్ ఖాతాల్లోకి నగదును బదిలీ చేస్తున్నారు. వెంటనే దీన్ని డ్రా చేసుకుని ఖాతా మూసేస్తున్నారు. సేవింగ్స ఖాతాలనూ ఇదే పంథాలో వివరాలు, సిమ్ సంగ్రహించడం ద్వారా ఖాళీ చేస్తున్నారు.
డ్రా సాధ్యం కాకపోతే..కొనుగోళ్లు
సైబర్ నేరగాళ్ళు ఈ కరెంట్, సేవింగ్స ఖాతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటూ వాటిలోని నగదును ‘మనీమ్యూల్స్’ ఖాతాల్లోకి మళ్ళిస్తుంటారు. ఉత్తరాదికి చెందిన అనేక మంది నిరుద్యోగుల్ని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా బోగస్ ధ్రువీకరణలు తయారు చేరుుంచి, వీటి ఆధారంగా ఖాతాలు తెరిపిస్తున్నారు. నగదు ట్రాన్సఫర్ పూర్తికాగానే వారి ద్వారా తక్షణం డ్రా చేరుుంచేస్తున్నారు. సాంకేతికంగా మనీమ్యూల్స్గా పిలిచే వీరికి స్వాహా చేసిన సొమ్ములో 10 నుంచి 30 శాతం కమీషన్లుగా ఇస్తున్నారు. ఎప్పుడైనా విషయం పోలీసుల వరకు వెళ్ళి, వారు దర్యాప్తు చేస్తూ వచ్చినా కేవలం ఈ మనీ మ్యూల్స్ మాత్రమే చిక్కుతున్నారు తప్ప అసలు సూత్రధారులు వెలుగులోకి రారు. అనేక సందర్భాల్లో అసలు వ్యక్తులైన బాధితులు మోసం, నగదు బదిలలీ జరిగిన విషయాలను గుర్తించేలోపే నేరగాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. వీరు వాడేవన్నీ బోగస్ వివరాలతో తీసుకున్నవి కావడమే ఇందుకు కారణం. కేంద్ర తాజాగా తీసుకున్న ‘కరెన్సీ నిర్ణయం’తో నగదు విత్డ్రాపై ఆంక్షలు వచ్చారుు. దీంతో సైబర్ నేరగాళ్ళు నగదు ట్రాన్సఫర్ చేసుకోవడం, డ్రా చేయడం తగ్గించారు. అరుునప్పటికీ ఆన్లైన్లో విలువైన వస్తువులు ఖరీదు చేసి, బోగస్ చిరునామాల్లోనే, కొరియర్ బాయ్లను తప్పుదోవ పట్టించో తమ ఉనికి బయటకు రాకుండా వాటిని తీసుకునే ఆస్కారం లేకపోలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మైక్రో సిమ్కార్డుల ఆధారంగా మరోలా...
ఇటీవల కాలంలో అన్ని సెల్ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు మైక్రో సిమ్కార్డుల్ని అందిస్తున్నారు. సెల్ఫోన్లన్నీ ఇవి పట్టే విధంగానే డిజైన్ అవుతుండటంతో పెద్దగా ఉన్న పాత వాటిని ‘రీ-ప్లేస్’ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. దీన్ని సైతం సైబర్ నేరగాళ్ళు తమను అనుకూలంగా మార్చుకుంటున్నారు. అప్పటికే ‘వెబ్సైట్ల’ ద్వారా వినియోగదారుడి పూర్తి వివరాలు సంగ్రహిస్తున్న సైబర్ నేరగాళ్ళు సిమ్ బ్లాకింగ్ కోసం మైక్రో కార్డు ‘విధానాన్ని’ అవలంభిస్తున్నారు. ఈ మార్పిడి కోసం ఎమ్టీ మైక్రో సిమ్కార్డుల్ని తీసుకునే వినియోగదారులు దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ సిమ్ ఐడెంటిటీ (ఐసీఐడీ) నెంబర్ను పాత పెద్ద సిమ్ నుంచి సర్వీస్ ప్రొవైడర్కు ఎస్సెమ్మెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే తమ తెలివి తేటలు ప్రదర్శిస్తున్న సైబర్ నేరగాళ్ళు మైక్రో సిమ్ తీసుకుంటున్నారు. అప్పటికే సంగ్రహించిన వినియోగదారుల్ని సర్వీసు ప్రొవైడర్ల మాదిరిగా సంప్రదించి, అనివార్య కారణాలు చెప్తూ అప్పటికే వారు వినియోగిస్తున్న పాత సిమ్కార్డు నుంచి తాము పంపే నెంబర్ను (ఐసీఐడీని) సర్వీసు ప్రొవైడర్కు ఎస్సెమ్మెస్ చేయమని చెప్తున్నారు. అలా చేసిన వెంటనే కొన్ని గంటల పాటు సిమ్ పని చేయదని, ఆపై అప్డేట్ అవుతుందని నమ్మబలుకుతున్నారు. వీరివల్లో పడిన వినియోగదారులు అలా చేసేసరికి నేరగాళ్ళు తీసుకున్న మైక్రోసిమ్ యాక్టివేట్ అవుతోంది. వినియోగదారుల మేల్కొనే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ తరహా నేరాలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
తప్పు కొడితే..‘రైటుది’ చెప్తుంది
‘బోగస్ వెబ్సైట్ల ద్వారా చేసే మోసాలను ఫిషింగ్ అని, సిమ్ కార్డులను సంగ్రహించడాన్ని కార్డ్ క్లోనింగ్ అని అంటారు. ఇలాంటి వాటి బారినపడకుండా ఉంటాలంటే అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఆన్లైన్, మెబైల్, వెబ్సైట్స్, ఈ-మెరుుల్... వీటిలో ఎక్కడా యూజర్ ఐడీలు, పిన్నెంబర్లు, కార్డుల వివరాలు షేర్ చేయకూడదు. ఇలాంటి వ్యక్తిగత వివరాలు అడిగిన సైట్, బ్యాంకు, సర్వీసు ప్రొవైడర్ తదితరాలను అనుమానించాల్సిందే. కేవలం ఈ-కామర్స్ ద్వారా ఖరీదు చేసేప్పుడు మాత్రమే ఈ వివరాలతో పని ఉంటుంది. బ్యాంకు పోలి ఉన్న వెబ్సైట్ అసలుదా? నకిలీదా? అనేది తెలుసుకోవడానికి ఓ మార్గం ఉంది. వినియోగదారులు ఆయా వెబ్సైట్లలోకి ప్రవేశించేప్పుడు తొలిసారిగా పాస్వర్డ్ తప్పుకొట్టాలి. అది అసలు వెబ్సైట్ అరుుతే మీరు ఎంటర్ చేసింది తప్పు అని చెప్తుంది. బోగస్ది అరుుతే ఓపెన్ అవడంతో పాటు ఇతర వివరాలు కోరుతూ మరో లింకులోకి తీసుకువెళ్తుంది. ఇలా పాస్వర్డ్ను అసలు వెబ్సైట్లో మూడుసార్లు తప్పుకొడితే బ్లాక్ అవుతోతుందని గుర్తుంచుకోండి. గతంలో లేని విధంగా హఠాత్తుగా సిమ్కార్డు బ్లాక్ అరుునా అనుమానించి అప్రమత్తం కావాలి.’ - యు.రామ్మోహన్, సైబర్ క్రైమ్ ఎస్పీ.