ట్రైనీ ఎస్ఐ ఆత్మహత్య
Published Thu, Jan 19 2017 2:37 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
హైదరాబాద్: షామీర్పేట్లోని సీఐఎస్ఎఫ్లో ట్రైనీ ఎస్ఐ సచిన్(25) ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరికి వేలాడుతూ కనిపించడం గమనించిన సహచరులు అధికారులకు సమాచారం ఇచ్చారు. సచిన్ స్వస్థలం హర్యానా. గత అక్టోబర్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement