Sachin
-
సచిన్ ఎవరెస్ట్.. కోహ్లీ బిస్కెట్.. ఇదిగో ప్రూఫ్!
-
Paralympics: సచిన్కు రజతం.. 21కి చేరిన పతకాల సంఖ్య
ప్యారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ మరో పతకం సాధించింది. ప్రపంచ చాంపియన్ సచిన్ ఖిలారి పురుషుల షాట్పుట్ ఎఫ్46 ఈవెంట్లో రజతం గెలిచాడు. బుధవారం నాటి ఈ ఈవెంట్లో కెనడాకు చెందిన గ్రెగ్ స్టువర్ట్ 16.38 మీటర్ల దూరం షాట్ విసిరి స్వర్ణం గెలవగా.. సచిన్ 16.32 మీటర్ల దూరంవిసిరి రెండో స్థానంలో నిలిచాడు.తద్వారా పారాలింపిక్స్ తాజా ఎడిషన్లో భారత్ ఖాతాలో 21వ మెడల్ చేరింది. ఇక ఇదే ఈవెంట్లో సచిన్తో పాటు పోటీ పడిన భారత అథ్లెట్లు మొహ్మద్ యాసిర్, రోహిత్ కుమార్ వరుసగా 8, 9వ స్థానాల్లో నిలిచారు. కాగా ప్యారిస్ పారాలింపిక్స్లో భారత్ ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్య పతకాలు గెలిచింది.ప్యారిస్ పారాలింపిక్స్-2024లో ఇప్పటి వరకు పతకాలు గెలిచిన భారత అథ్లెట్లు👉శరద్ కుమార్- మెన్స్ హై జంప్ టీ63- రజతం👉అజీత్ సింగ్- మెన్స్ జావెలిన్ త్రో- రజతం👉మరియప్పన్ తంగవేలు- మెన్స్ హై జంప్ టీ63- కాంస్యం👉సుందర్ సింగ్ గుర్జార్- మెన్స జావెలిన్ త్రో ఎఫ్46- కాంస్యం👉దీప్తి జివాంజి- వుమెన్స్ 400 మీటర్ల టీ20 పరుగు- కాంస్యం👉సుమిత్ ఆంటిల్- మెన్స్జావెలిన్ త్రో ఎఫ్64- స్వర్ణం👉సుహాస్ యతిరాజ్- బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్ఎస్64- రజతం👉తులసిమతి మురుగేశన్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్యూ45- రజతం👉మనీషా రామదాస్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్యూ45- కాంస్యం👉నిత్యశ్రీ సుమతి శివన్- బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్ ఎస్హెచ్6- కాంస్యం👉శీతల్ దేవి- రాకేశ్ కుమార్- మిక్స్డ్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీ- కాంస్యం👉యోగేశ్ కతూనియా- మెన్స్ డిస్కస్ త్రో ఎఫ్56- రజతం👉నితేశ్ కుమార్- బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్ఎల్3- స్వర్ణం👉అవని లేఖరా- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్1- స్వర్ణం👉మోనా అగర్వాల్- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్1- కాంస్యం👉ప్రీతి పాల్- వుమెన్స్ 100 మీటర్ల పరుగు టీ35- కాంస్యం👉మనీశ్ నర్వాల్- పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్1- రజతం👉రుబీనా ఫ్రాన్సిస్- వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్టాండింగ్ ఎస్హెచ్1- కాంస్యం👉ప్రీతి పాల్- వుమెన్స 200 మీటర్ల పరుగు టీ35- కాంస్యం👉నిషద్ కుమార్- మెన్స్ హై జంప్ టీ47- రజతం👉సచిన్ ఖిలారి- పురుషుల షాట్పుట్ ఎఫ్46- రజతం -
PKL: సచిన్కు రూ. 2.15 కోట్లు
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆటగాళ్ల వేలంలో రూ. కోట్ల కూత కూసింది. దీంతో కబడ్డీ ప్లేయర్ల రాత కూడా రానురానూ మారుతోంది. పీకేఎల్ 11వ సీజన్ కోసం నిర్వాహకులు గురువారం ఆటగాళ్ల వేలం ప్రక్రియను మొదలుపెట్టారు. తొలిరోజు ఎ, బి కేటగిరీలకు చెందిన ఆటగాళ్ల వేలం నిర్వహించగా, రాజస్తాన్కు చెందిన సచిన్ తన్వర్పై ఫ్రాంచైజీలు రూ. రెండు కోట్లకు పైగా వెచ్చించేందుకు పోటీపడ్డాయి. చివరకు తమిళ్ తలైవాస్ ఈ రెయిడర్పై రూ. 2.15 కోట్లు కురిపించి మరీకైవసం చేసుకుంది. గత సీజన్లో పట్నా పైరేట్స్ తరఫున కూత పెట్టిన సచిన్ అంతకుముందు గుజరాత్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన్వర్ భారత జట్టులో కీలక సభ్యుడు. గతేడాది హాంగ్జూలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన విజేత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇతనితో పాటు ‘ఎ’ కేటగిరీలో ఉన్న మరో స్టార్ కబడ్డీ ప్లేయర్, ఇరానియన్ ఆల్రౌండర్ మొహమ్మద్ రెజా కోసం ఫ్రాంచైజీలు ఎగబడి వేలం పాట పాడాయి. చివరకు అతన్ని రూ. 2.07 కోట్లతో హరియాణా స్టీలర్స్ చేజిక్కించుకుంది. తొలి రోజు వేలంలో రెండు కేటగిరీల్లో కలిపి 8 మంది ఆటగాళ్లు రూ. కోటికి పైగా ధర పలికారు. రెయిడర్లు గుమన్ సింగ్ రూ. 1.97 కోట్లు (గుజరాత్ జెయింట్స్), మణీందర్ సింగ్ రూ. 1.15 కోట్లు (బెంగాల్ వారియర్స్), అజింక్యా అశోక్ రూ. 1.10 కోట్లు (బెంగళూరు బుల్స్), ఆల్రౌండర్లు పవన్ కుమార్ సెహ్రావత్ రూ.1.72 కోట్లు (తెలుగు టైటాన్స్), భరత్ రూ. 1.30 కోట్లు (యూపీ యోధాస్), డిఫెండర్ సునీల్ కుమార్ రూ. 1.01 కోట్లు (యు ముంబా)లు భారీ ధర పలికారు. తెలుగు టైటాన్స్ జట్టు స్టార్ ఆల్రౌండర్ పవన్ సెహ్రావత్తో పాటు డిఫెండర్ క్రిషన్ ధుల్ (రూ. 70 లక్షలు), ఆల్రౌండర్ విజయ్ మలిక్ (రూ. 20 లక్షలు)లను తొలిరోజు వేలంలో కొనుక్కుంది. రెండో రోజు శుక్రవారం వేలంలో ‘ఎ’, ‘బి’లతో పాటు ‘సి’ కేటగిరీ ఆటగాళ్ల వేలం నిర్వహిస్తారు. -
‘పారిస్’కు చేరువగా సచిన్
బ్యాంకాక్: పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు ఆఖరి క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్లు సచిన్ సివాచ్ (57 కేజీలు) క్వార్టర్ ఫైనల్ చేరగా... అమిత్ పంఘాల్ (51 కేజీలు), సంజీత్ కుమార్ (92 కేజీలు), జైస్మిన్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లో సచిన్ 5–0తో బతుహన్ సిఫ్టిసీ (టర్కీ)పై ఏకపక్ష విజయం సాధించాడు. రెండో రౌండ్ బౌట్లలో సంజీత్ 5–0తో లూయిస్ సాంచెజ్ (వెనిజులా)పై, అమిత్ 4–1తో మౌరిసియో రూయిజ్ (మెక్సికో)పై గెలిచారు. మహిళల 57 కేజీల రెండో రౌండ్లో జైస్మిన్ 5–0తో మహసతి హమ్జయేవా (అజర్బైజాన్)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన బాక్సర్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్లు ఖరారవుతాయి. -
ఈ చిత్ర ప్రదర్శన.. భళా!
మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉమ్మడి జిల్లాకే తలమానికంగా నిలుస్తోంది. హైదరాబాద్లోని ఇండోర్ స్టేడియాలకు ధీటుగా పాలమూరులో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని తీర్చిదిద్దారు. ఈ స్టేడియంలో ఆరు షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటుచేశారు.ఆకట్టుకుంటున్న చిత్రాలు..మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం బయట గోడలపై వేసిన క్రీడాకారుల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఔత్సాహిక క్రీడాకారులకు అవగాహన కలిగేలా ఆయా క్రీడల్లో రాణిస్తున్న ప్రముఖ క్రీడాకారుల చిత్రాలు ఇండోర్ స్టేడియానికి కొత్త శోభను తెచ్చిపెట్టాయి. జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ ఆర్టిస్ట్ మధు క్రీడాకారుల చిత్రాలు గీశారు. స్టేడియం ప్రధాన ద్వారం గోడపై ఓవైపు ప్రముఖ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ, మరోవైపు బాక్సర్ నిఖత్ జరీన్, మధ్యలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, స్టేడియానికి మరోవైపు క్రికెటర్లు విరాట్ కొహ్లి, సిరాజ్, షటిల్ క్రీడాకారిణి గుత్తాజ్వాల, మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, జావెలిన్త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా, కబడ్డీ క్రీడాకారుడు రాహుల్ చౌదరితో పాటు ఇతర క్రీడాకారుల చిత్రాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది..మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో క్రీడాకారుల చిత్రాలు గీయడానికి అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. గతంలో జిల్లా కేంద్రంలోని స్టేడియం ప్రహరీపై 36 గంటల్లోనే 300 లకుపైగా క్రీడలకు సంబంధించిన చిత్రాలను గీశాను. అదే విధంగా వాలీబాల్ అకాడమీలో క్రీడల బొమ్మలను వేశాను. – మధు, ఆర్టిస్ట్, మహబూబ్నగర్ఇవి చదవండి: బోరు చుట్టూ.. ఇంకుడుగుంత నిర్మించడం ఎలా? -
సీమా హైదర్కు రూ. 3 కోట్ల పరువు నష్టం నోటీసు!
పాక్ నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించి, తన ప్రియుని చెంతకు చేరిన సీమా హైదర్ ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. పాక్లో ఉంటున్న సీమా హైదర్ భర్త గులాం హైదర్ తాజాగా సీమా హైదర్, ఆమె ప్రియుడు సచిన్ మీనాలకు పరువు నష్టం నోటీసు పంపారు. సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ తరపు న్యాయవాది మోమిన్ మాలిక్ తాజాగా సీమా, ఆమె ప్రియుడు సచిన్ మీనాకు రూ. మూడు కోట్ల విలువైన పరువు నష్టం నోటీసు పంపారు. అలాగే సీమా తరపు న్యాయవాది డాక్టర్ ఏపీ సింగ్కు రూ. ఐదు కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. ఈ ముగ్గురికీ కోట్ల విలువైన పరువు నష్టం నోటీసులు పంపిన ఆయన వారంతా నెల రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని కోరారు. అలాగే జరిమానా కట్టకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకిస్తాన్లో ఉంటున్న సీమా హైదర్ భర్త గులాం హైదర్ ఇటీవల హర్యానాలోని పానిపట్కు చెందిన సీనియర్ న్యాయవాది మోమిన్ మాలిక్ను తన తరపు న్యాయవాదిగా నియమించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సీమా హైదర్ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు, ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లన్నింటిలో సీమా హైదర్ భర్త పేరు గులాం హైదర్ అని రాసి ఉంది. ఇంతేకాదు కోర్టు నుండి ఆమె బెయిల్ పొందినప్పుడు, సంబంధిత పేపర్లలో గులాం హైదర్ భార్య సీమా హైదర్ అని రాసివుందన్నారు. ఈ విధంగా ఆమె తాను గులాం హైదర్ భార్యనని ప్రకటించుకున్నదని అన్నారు. అయితే సీమా తరపు న్యాయవాది ఏపీ సింగ్ ఇంకా సీమా హైదర్ సచిన్ భార్య అని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ కారణంగానే సీమా హైదర్ పాక్ భర్త గులాం హైదర్ ఆమెకు పరువు నష్టం నోటీసు పంపారని మోమిన్ మాలిక్ తెలిపారు. గులాం హైదర్ పంపిన నోటీసులో తాను సీమా హైదర్ నుండి ఇప్పటి వరకు చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదని, సచిన్ కారణంగానే తన నలుగురు పిల్లలు తనకు దూరమయ్యారని, వారి చదువులు దిగజారుతున్నాయని ఆరోపించారు. -
భారత్ క్రికెట్ లో సచిన్ దాస్ పేరు ట్రెండింగ్
-
తండ్రి కలలు కన్నాడు.. కొడుకు నేరవేర్చాడు! ఎవరీ సచిన్ దాస్?
సచిన్ దాస్.. ప్రస్తుతం భారత క్రికెట్లో మారుమోగుతున్న పేరు. అండర్ 19 వరల్డ్కప్-2024లో టీమిండియా ఫైనల్కు చేరడంలో ఈ యువ ఆటగాడిది కీలక పాత్ర. క్రికెట్ గాడ్ పేరు పెట్టుకున్న ఈ యువ సంచలనం.. అందుకు తగ్గట్టుగానే అసాధారణమైన ప్రతిభను కనబరుస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి సెమీఫైనల్లో సచిన్ తనకు కెరీర్లో చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 244 పరగుల ఛేదనలో 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కెప్టెన్ ఉదయ్ సహారన్తో జతకట్టిన సచిన్.. తన విరోచిత పోరాటంతో తొమ్మిదోసారి ఫైనల్కు చేర్చాడు. బౌలర్లకు అనుకూలిస్తున్న వికెట్పై సచిన్ దాస్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. కేవలం 4 పరుగుల దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన దాస్.. తన సంచలన ఇన్నింగ్స్తో మాత్రం అందరి ప్రశంసలను అందుకుంటున్నాడు. ఈ మ్యాచ్లో 95 బంతులు ఎదుర్కొన్న సచిన్ 11 ఫోర్లు, 1 సిక్స్తో 96 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఎవరీ సచిన్ దాస్ అని నెటిజన్లు అరాతీసున్నారు. ఎవరీ సచిన్ దాస్? సచిన్ దాస్.. 2005 ఫిబ్రవరి 3న మహారాష్ట్రలోని బీడ్ గ్రామంలో జన్మించాడు. సచిన్కు తన చిన్నతనం నుంచే క్రికెట్పై మక్కువ ఎక్కువ. నాలుగున్నర ఏళ్ల వయస్సు నుంచే సచిన్ క్రికెట్ ఆడడం మొదలెట్టాడు. కానీ అతడు ఉన్న చోట క్రికెట్ ఆడేందుకు అత్యుత్తమ సౌకర్యాలు లేవు. అతడు ప్రాక్టీస్ చేయడానికి పూర్తి స్ధాయి క్రికెట్ పిచ్లు కూడా అందుబాటులో ఉండేవి కాదు. దాస్ హాఫ్ టర్ఫ్లపైనే ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. సచిన్ తన ప్రయాణంలో ఎన్ని ఇబ్బందిలు ఎదుర్కొన్నప్పటికీ తన అభిరుచిని మాత్రం వదులుకోలేదు. నిరంతరం శ్రమ, పట్టుదలతో భారత జెర్సీ ధరించే స్ధాయికి చేరుకున్నాడు. అయితే సచిన్ భారత్ అండర్-19 క్రికెటర్గా ఎదగడంలో అతడి తల్లిదండ్రుల కూడా కీలక పాత్ర. సచిన్ తండ్రి పేరు సంజయ్ దాస్. అతడు మహారాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. సంజయ్ దాస్కు కూడా క్రికెట్ అంటే ఇష్టం ఎక్కువే. యూనివర్సిటీ స్థాయి వరకు అతడు క్రికెట్ ఆడాడు. కానీ అతడు అంతకంటే ముందుకు వెళ్లలేదు. అయితే తన కలను కొడుకు రూపంలో నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. తనకు తనయడు జన్మించిన వెంటనే ఎలాగైనా క్రికెటర్ చేయాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. మరోవైపు సచిన్ తల్లిపేరు సురేఖ దాస్. మహారాష్ట్ర పోలీస్ విభాగంలో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కోచ్ కూడా.. అదే విధంగా సచిన్ ఈ స్ధాయికి చేరుకోవడంలో కోచ్ షేక్ అజార్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. సచిన్కు పేస్ బౌలర్లకు ఆడటంలో కాస్త ఇబ్బంది పడుతూ వస్తుండేవాడు. ముఖ్యంగా బౌన్సర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడేవాడు. ఈ క్రమంలో సచిన్.. కోచ్ షేక్ అజార్ సాయంతో తన సమస్యను అధిగమించాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడి తండ్రి సంజయ్ దాస్ తెలిపాడు. సచిన్ దాస్ పేరు ఎలా వచ్చిందంటే? సచిన్ దాస్ తండ్రి సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్కి వీరాభిమాని. అయితే తన ఆరాధ్య క్రికెటర్లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ పేరును తన కొడుక్కి పెట్టుకున్నారు. అయితే 18 ఏళ్ల సచిన్ దాస్ కూడా టెండూల్కర్కు వీరాభిమాని. అందుకే మాస్టర్ బ్లాస్టర్ ధరించిన 10వ నంబర్ జెర్సీనే వరల్డ్కప్లో వేసుకుంటున్నాడు. ఓవరాల్గా ఈ టోర్నీలో 6 మ్యాచ్లు ఆడిన సచిన్ దాస్.. 73.50 సగటుతో 294 పరుగులు చేశాడు. -
బార్ క్యాషియర్ దారుణహత్య
కర్ణాటక: బార్లో మద్యం తాగడానికి వచ్చిన యువకులు– సిబ్బంది మధ్య గొడవ జరిగి సిబ్బంది ఒకరు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఆదివారం రాత్రి శివమొగ్గ తాలూకాలోని ఆయనూరు గ్రామంలో చోటు చేసుకుంది. హతుడు బార్ క్యాషియర్ సచిన్ (27). నిందితులు ఆయనూరు తండాకు చెందిన నిరంజన్, సతీష్, అశోక్ నాయక్లు. నవరత్న బార్లో వీరు మద్యం తాగడానికి వచ్చారు. రాత్రి 11 గంటలకు.. బార్ మూసేయాలి, ఇక వెళ్లిపోవాలని సిబ్బంది వారికి సూచించారు. మందు తాగుతుంటే మధ్యలో ఇబ్బంది పెడుతారా అని తాగుబోతులు గొడవ పడ్డారు. దాంతో క్యాషియర్ సచిన్ వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా నువ్వేంటి మాకు చెప్పేది అని కత్తితో అతని పొట్టలో పొడిచారు. తరువాత బయట పోలీసులు ఉన్నప్పటికీ, బైక్లపై పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సచిన్ను బార్ సిబ్బంది ఆయనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ చికిత్స చేసి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శివమొగ్గ నగరానికి తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. కుంసి పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
సచిన్ కొడుకుపై షారుక్ ట్వీట్ అదే రేంజ్ లో సచిన్ రిప్లై
-
సచిన్ ను దాటేసిన కోహ్లీ.. స్వదేశంలో 20వ సెంచరీ
-
Ultimate Kho Kho 2022: తెలుగు యోధాస్ గెలుపు.. అరంగేట్ర సీజన్లో తొలి జట్టుగా!
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్లో భాగంగా రాజస్తాన్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో తెలుగు యోధాస్ 83–45తో నెగ్గింది. ఈ టోర్నీలో తెలుగు యోధాస్కిది మూడో విజయం. అటాకర్ సచిన్, డిఫెండింగ్ అరుణ్ తమ ప్రదర్శనతో తెలుగు యోధాస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం తెలుగు యోధాస్ 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్లో 83 పాయింట్లు స్కోరు చేసిన తెలుగు యోధాస్.. అల్టిమేట్ ఖో-ఖో తొలి సీజన్లో ఇప్పటి వరకు 80+ పాయింట్లు సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో సచిన్ భార్గో బెస్ట్ అటాకర్గా నిలిచాడు. అరుణ్ గుంకీకి బెస్ట్ డిఫెండర్ అవార్డు దక్కింది. ఇక మంగళవారం(ఆగష్టు 23) తెలుగు యోధాస్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. ముంబై ఖిలాడీస్తో తలపడనుంది. చదవండి: Ned Vs Pak 3rd ODI: పాపం.. జస్ట్ మిస్! ఆ తొమ్మిది పరుగులు చేసి ఉంటే! కనీసం.. IND vs ZIM 3rd ODI: క్లీన్స్వీప్పై భారత్ గురి -
సచిన్ 'దేవుడు', ధోని 'లెజెండ్', కోహ్లి..?
ముంబై: ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో "ఆస్క్ మీ ఎనీ థింగ్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు అతను సింగల్ వర్డ్లో సమాధానమిచ్చాడు. సచిన్ గురించి అభిమానులు అడగ్గా.. క్రికెట్ దేవుడని, ధోనిని దిగ్గజ క్రికెటర్ అని, కోహ్లి అంటే ఇన్స్పిరేషన్(స్పూర్తి) అని, రోహిత్ శర్మ అంటే హిట్మ్యాన్ అని, పోలార్డ్ అంటే లార్డ్ అని, హార్దిక్ పాండ్య అంటే ఎంటర్టైనర్ అని టకాటకా బదులిచ్చాడు. ఇక క్రికెటే తన ఊపిరని, అందులో తనకిష్టమైన షాట్ స్వీప్షాట్ అని చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ జట్టును అతను కుటుంబంతో పోల్చాడు. క్రికెటర్ కాకపోయుంటే ఏమైవుండేవాడివని ఓ అభిమాన్ని అడిగిన ప్రశ్నకు.. నటుడిగా రాణించేవాడినని సమాధానమిచ్చాడు. క్రికెట్కు సంబంధించిన అంశాలే కాకుండా, అభిమానులడిన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా సూర్యకుమార్ ఓపికగా సమాధానమిచ్చాడు. బిర్యాని తనకిష్టమైన ఆహారమని, బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ ఫేవరెట్ తన యాక్టర్ అని వెల్లడించాడు. కాగా, గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా.. సూర్యకుమార్, కోహ్లిల మధ్య మైదానంలో జరిగిన ఘర్షన నేపథ్యంలో కోహ్లిని స్పూర్తిదాయకమైన ఆటగాడని పేర్కొనడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. చదవండి: 45 ఏళ్ల వయసులో ఇరగదీశాడు.. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు -
సచిన్ పసిడి పంచ్
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలను భారత్ స్వర్ణ పతకంతో ముగించింది. పోలాండ్లో శుక్రవారం జరిగిన పురుషుల 56 కేజీల ఫైనల్లో భారత యువ బాక్సర్ సచిన్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. యెర్బోలాత్ సాబిర్ (కజకిస్తాన్)తో జరిగిన టైటిల్ పోరులో సచిన్ 4–1తో నెగ్గాడు. ఓవరాల్గా ఈ మెగా ఈవెంట్లో భారత్కిది ఎనిమిదో స్వర్ణ పతకం కావడం విశేషం. గురువారం మహిళల విభాగంలో భారత బాక్సర్లు బరిలోకి దిగిన ఏడు వెయిట్ కేటగిరీల్లోనూ బంగారు పతకాలు గెల్చుకున్న సంగతి తెలిసిందే. పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి భారత్ ఎనిమిది స్వర్ణాలు, మూడు కాంస్యాలతో 11 పతకాలు దక్కించుకొని టాప్ ర్యాంక్లో నిలిచింది. పురుషుల విభాగంలో అంకిత్ నర్వాల్ (64 కేజీలు), బిశ్వామిత్ర చోంగ్తోమ్ (49 కేజీలు), విశాల్ గుప్తా (91 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. ఈ మెగా టోర్నీలో 52 దేశాల నుంచి మొత్తం 414 మంది బాక్సర్లు పాల్గొన్నారు. -
మొన్న అలా, నేడు ఇలా.. కోహ్లిపై సెహ్వాగ్
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో డకౌటైనా, రెండో మ్యాచ్లో మాత్రం మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్(49 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) ఆడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తొలి టీ20 తుది జట్టు ఎంపిక విషయంలో(రోహిత్కు విశ్రాంతినివ్వడం) కొద్ది రోజుల కిందట టీమిండియా సారధిపై విరుచుకుపడిన ఆయన.. రెండో టీ20లో కోహ్లి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ను ఆకాశానికెత్తేశాడు. అంతటితో ఆగకుండా మ్యాచ్ను ముగించడంలో కోహ్లి.. దిగ్గజ ఆటగాడు సచిన్తో సరిసమానమని కొనియాడాడు. ఈ విషయంలో యువ క్రికెటర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్లు కోహ్లిని ఆదర్శంగా తీసుకోవాలని సూచనలు చేశాడు. అరంగేట్రం మ్యాచ్లోనే ఇషాన్ కిషన్(32 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్స్లు) అదరగొట్టే ప్రదర్శన చేసినా, కోహ్లిలా ఆఖరి దాకా క్రీజ్లో ఉండేందుకు అనాసక్తి కనబరిచాడని, ఈ విషయంలో అతను కెప్టెన్ సలహాలు తీసుకోవాలని సూచించాడు. అలాగే మరో యువ ఆటగాడు రిషబ్ పంత్ (13 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు) సైతం వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడే కానీ, కోహ్లిలా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడన్నాడు. జట్టును విజయతీరాలకు చేర్చడంలో కోహ్లి చాలా పట్టుదలగా ఉంటాడని, ఈ కసిని యువ క్రికెటర్లు కూడా కలిగి ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఇటీవలకాలంలో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న విరాట్ కోహ్లికి తాజా ఇన్నింగ్స్ ఊరట కలిగించి ఉంటుదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్తో ముగిసిన టెస్ట్ సిరీస్లో సైతం అంతగా ఆకట్టుకోని కోహ్లి రెండో టీ20లో అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి యువ క్రికెటర్లకు మార్గదర్శిగా నిలిచాడని సెహ్వాగ్ కితాబునిచ్చాడు. కాగా, ఇంగ్లండ్తో ముగిసిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 1-1తో సిరిస్ను సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ ఇదే వేదికగా ఇవాళ ప్రారంభంకానుంది. -
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
ఆదిలాబాద్రూరల్: సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. రక్షాబంధన్ రోజున జలపాతం వద్దకు స్నేహితులతో వెళ్లిన యువకుడు అందులోపడి గల్లంతు కాగా మంగళవారం మృతదేహం లభ్యమైంది. పోలీసుల, కుటుంబ సభ్యుల క థనం ప్రకారం.. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని భీంనగర్కు చెందిన డి.సచిన్ (20) స్నేహితుడితో కలిసి సోమవారం మండలంలోని ఖండాల జలపాతానికి వెళ్లాడు. సరదాగా సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జలపాతంలో జారీ పడ్డాడు. దీంతో తోటిమిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చేపట్టిగా చీకటి పడడంతో ఆచూకీ లభ్యం కాలేదు. తిరిగి మంగళవారం ఉదయం నుంచే జలపాతం వద్ద గాలింపు చర్యలు చేపట్టగా యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. పెద్ద దిక్కుకోల్పోయిన కుటుంబం.. సచిన్ తండ్రి ఏడేళ్ల కిందట పాముకాటుతో మృతిచెందాడు. అప్పటి నుంచి తల్లి తిర్వణబాయి సచిన్తో పాటు మరో కుమారుడిని చూసుకుంటుంది. ఈ క్రమంలోనే సచిన్ ఆదిలాబాద్ పట్టణంలో డిగ్రీ చదువుతూ ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఓ టీ హోటల్లో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న సచిన్ మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. సచిన్ కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. -
అభిమాన క్రికెటర్పై అంతులేని ప్రేమతో...
మన దేశంలో క్రికెటర్లకు ఉన్న ప్రేక్షకారాధన అంతాఇంత కాదు. వారి అభిమానులు చేసే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సచిన్ను ఆరాధించేవారైతే అతడిని ఓ మానవాతీత వ్యక్తిగానే భావిస్తారు. ఇలాంటి కోట్లాది మందిలో కేరళలోని కాలికట్లో ఉన్న మలబార్ క్రిస్టియన్ కళాశాల చరిత్ర విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎంసీ వశిష్ట్ ఒకరు. అయితే, మాస్టర్ బ్యాట్స్మన్పై తన అభిమానాన్ని వశిష్ట్ అందరికంటే భిన్నంగా పుస్తక రూపంలో విశిష్టంగా చాటుకున్నారు. సచిన్ రిటైరైన 2013లోనే తమ కళాశాలలో ‘సచిన్స్ గ్యాలరీ’ పేరిట అతడి ఘనతలు, విశేషాల వివరాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఇందులో సచిన్పై 11 (తెలుగు, మలయాళం, తమిళం, కన్నడం, ఒడియా, బెంగాలీ, అస్సామీ, మరాఠీ, గుజరాతీ, హిందీ, ఇంగ్లిష్) భాషల్లో రూపొందించిన 60 పుస్తకాలుండటం గమనార్హం. ఇన్ని భాషల్లో సచిన్ లైబ్రరీ ఏర్పాటు వెనుక దేశ సమైక్యతకు క్రికెట్ ఏవిధంగా తోడ్పడుతుందో చాటే ఉద్దేశమూ ఉండటం అభినందించదగ్గ విషయం. -
క్రికెట్ అడ్వైజరీ కమిటీకి దాదా గుడ్బై చెప్పనున్నారా?
-
ధోని... ‘సాక్షి’
ఆష్లే నర్స్ బౌలింగ్లో 37వ ఓవర్ మూడో బంతిని లాంగాన్ దిశగా పంపి సింగిల్ (81వ పరుగు) తీయడంతో ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ సమయంలో నాన్ స్ట్రయికింగ్లో ఉన్న ధోని అతడి వద్దకు వచ్చి అభినందించగా కోహ్లి బిగ్గరగా నవ్వాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిందేమంటే... భారత క్రికెట్లో మధుర ఘట్టాలుగా నిలిచే సందర్భాలన్నింటిలో ధోని సాక్షిగా నిలవడం! 2007 టి20 ప్రపంచకప్లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు కొట్టినపుడు, 2010లో సచిన్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీని సాధించినపుడు, రోహిత్ శర్మ వన్డేల్లో తన తొలి ద్విశతకాన్ని అందుకున్నప్పుడు... నాన్ స్ట్రయికర్గా ధోనినే ఉండటం విశేషం. ఇక వీటన్నింటికీ మించినదేమంటే, స్ట్రయికింగ్లో ఉండి... 2011 ప్రపంచ కప్ ఫైనల్లో సిక్స్తో దేశాన్ని విశ్వ విజేతగా నిలపడం. ఆ మ్యాచ్..: వన్డే క్రికెట్లో అందరికంటే ముందుగా 10 వేల పరుగుల మైలు రాయిని చేరుకోవడం మాస్టర్ బ్లాస్టర్కే సాధ్యమైంది. మార్చి 31, 2001న ఇండోర్లో ఆస్ట్రేలియాపై అతను ఈ ఘనతను నమోదు చేశాడు. భారత్ 118 పరుగుల భారీ తేడాతో గెలిచిన ఆ మ్యాచ్లో సచిన్ 125 బంతుల్లో 19 ఫోర్లతో 139 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఇది సచిన్ కెరీర్లో 28వ సెంచరీ. -
సచిన్–మిడిలెసెక్స్ అకాడమీ
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్కు చెందిన మిడిలెసెక్స్తో కలిసి అంతర్జాతీయ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. ‘టెండూల్కర్ మిడిలెసెక్స్ గ్లోబల్ అకాడమీ’ (టీఎంజీఏ) పేరుతో త్వరలోనే నార్త్వుడ్ (ఇంగ్లండ్)లో తొలిదశ శిక్షణ శిబిరం ప్రారంభం కానుంది. నార్త్వుడ్లోని ప్రఖ్యాత మర్చంట్ టేలర్స్ స్కూల్ క్యాంపస్లో వచ్చే నెల 6 నుంచి 9వ తేదీ వరకు క్యాంప్ జరుగనుంది. ఆ తర్వాత ముంబై, లండన్లలోనూ శిబిరాలను నిర్వహించనున్నారు. 9 నుంచి 14 ఏళ్ల బాలబాలికలకు విశేష అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పించడమే ఈ శిబిరాల లక్ష్యం. ఇందులో సచిన్ కోచ్గా పరకాయ ప్రవేశం చేయనున్నాడు. ‘మిడిలెసెక్స్తో జతకట్టడం ఆనందంగా ఉంది. ఇక్కడ కేవలం క్రికెటర్లను తయారు చేయడమే కాదు, ఉన్నతమైన పౌరుల్ని అందించడమే మా లక్ష్యం’ అని సచిన్ అన్నాడు. -
‘క్రీడా తరగతి’ని విస్తరించండి: సచిన్ టెండూల్కర్
తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి రోజూ క్రీడా తరగతిని తప్పనిసరి చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీసుకున్న నిర్ణయాన్ని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసించాడు. ఇదే విధానాన్ని మిగతా అన్ని తరగతుల వారికి వర్తింపజేయాలని కోరాడు. తద్వారా విద్యార్థుల్లో చురుకుదనం పెంపొందేందుకు వీలుంటుందని పేర్కొన్నాడు. -
హైదరాబాలో సందడి చేసిన సచిన్
-
రోడ్డుపై క్రికెట్ ఆడిన సచిన్..!
-
వైరల్ : రాత్రివేళ రోడ్డు పక్కన సచిన్..
ముంబై : క్రికెట్ను అమితంగా ప్రేమించే టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ క్రికెట్కు గుడ్ బై చెప్పినా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఐకాన్గా వ్యవహరిస్తున్నారు. సచిన్ జీవితాన్ని క్రికెట్ను విడదీసి చూడలేమనేది అందరికి తెలిసిందే. చాలా మంది యువ క్రికెటర్లకు సచినే మార్గదర్శి. ప్రపంచ క్రికెట్లో తన పేరు మీద అనేక రికార్డులు నెలకొల్పిన సచిన్, రిటైర్మెంట్ తర్వాత కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. తాజాగా హోమ్ టౌన్ ముంబైలో రాత్రి సమయంలో సచిన్ ఓ రోడ్డు పక్కన సరదాగా క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సచిన్ బ్యాటింగ్ చేస్తుండగా, కొంత మంది యువకులు ఫీల్డింగ్ చేశారు. పరిసరాలను బట్టి అది విల్లే పార్లేలోని రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతమని తెలుస్తోంది. రోడ్డుపైనే క్రికెట్ ఆడుతుండటంతో వికెట్లుగా ప్లాస్టిక్ డివైడర్ని వాడారు. -
డుమ్మా మాస్టర్లు సచిన్, రేఖ
సాక్షి, హైదరాబాద్ : ఒకరు క్రికెట్ రంగానికే దేవుడు.. మరొకరు బాలీవుడ్ ఎవర్గ్రీన్.. తమ రంగాల్లో అత్యంత ప్రతిభావంతులు. ప్రజల మనసు దోచుకున్న వారు.. కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. కానీ, ప్రజాప్రతినిధులుగా వారి పనితీరు మాత్రం అధ్వానంగా ఉంది. వాళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే! సచిన్ టెండూల్కర్, రేఖ ఇద్దరూ 2012 మార్చిలో పెద్దల సభలో అడుగు పెట్టారు. ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయబోతున్నారు. రాజ్యసభ అందించిన వివరాల ప్రకారం ఈ ఆరేళ్లలో సచిన్ హాజరు 7.3 శాతం మాత్రమే.. 22 ప్రశ్నలు అడిగారు. ఒక్క బిల్లు కూడా ప్రవేశపెట్టలేదు. ఇక రేఖ విషయానికొస్తే ఆమె హాజరు మరీ అన్యాయంగా 4.5 శాతం ఉంది..పెద్దల సభలో అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఏ ఒక్క సెషన్ని తీసుకున్నా ఒక్క రోజుకు మించి రేఖ హాజరు కాలేదు. అంతే కాదు సభలో అసలు నోరు విప్పలేదు. వీరిద్దరి పనితీరుపై విమర్శలు రావడం ఇది కొత్తేమీ కాదు. గత ఏడాది సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ సెలబ్రిటీ ఎంపీల హాజరు అంశాన్ని సభలోనే ప్రశ్నించారు. అప్పుడే సెలెబ్రిటీలకు ఈ రాజకీయ పదవులెందుకన్న చర్చ విస్తతంగా జరిగింది. ఎంపీ పదవులు చేపట్టిన మొదటి రెండేళ్లలో సచిన్, రేఖ ఇద్దరూ ఎంపీ లాడ్స్ ని«ధులు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదన్న విషయమూ బయటపడింది.. ప్రతీ రాజ్యసభ సభ్యుడికి ఏడాదికి ఎంపీ ల్యాడ్స్ కింద రూ.5 కోట్ల నిధులు ఇస్తారు.. ఆ నిధుల్ని మురగబెట్టారే తప్ప ఖర్చు చేయలేదు. విమర్శలు వెల్లువెత్తాక వాళ్లలో కదలిక వచ్చింది. సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగ, మహారాష్ట్రలోని డోంజా అనే గ్రామాలను దత్తత తీసుకున్నారు. రేఖ కూడా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి పుణెలోని కసర్వాడి దగ్గర ఛత్రపతి సాహు మహరాజ్ స్కూల్ నిర్మాణానికి రూ.3.03 కోట్లు కేటాయించారు. రాయ్బరేలిలో ఒక స్కూలు నిర్మాణానికి కూడా రూ.2.5 కోట్లు ఇచ్చారు.. కానీ, ఆ ప్రాజెక్టుల అతీగతీ ఇప్పటికీ తెలీదు. సచిన్ టెండూల్కర్, రేఖలను 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నామినేట్ చేసింది. ఇలా వివిధ రంగాలకు చెందిన నామినేటెడ్ ఎంపీల వల్ల ఒరిగేదేమిటన్న విమర్శలు ఘాటుగానే వినిపిస్తున్నాయి. సచిన్ రిపోర్ట్ కార్డు (2012 ఏప్రిల్ నుంచి) సభ జరిగిన రోజులు: 397 సచిన్ హాజరైన రోజులు: 29 ఆరేళ్లలో అందుకున్న జీతభత్యాలు: రూ.86,23,266 అడిగిన ప్రశ్నలు: 22 ప్రవేశపెట్టిన బిల్లులు: 0 రేఖ రిపోర్ట్ కార్డు (2012 ఏప్రిల్ నుంచి) సభ జరిగిన రోజులు : 397 రేఖ హాజరైన రోజులు : 18 అందుకున్న జీత భత్యాలు : రూ.99,59,178 అడిగిన ప్రశ్నలు: 0 ప్రవేశపెట్టిన బిల్లులు: 0 – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
'నేను ఇద్దరు గొప్ప వ్యక్తులను కలిశాను'
-
ఇక ముంబై టి20 లీగ్
ముంబై: క్రికెట్ లీగ్ల జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో లీగ్లు జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు ప్రాంతీయ లీగ్ల వంతు వచ్చినట్లుంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో టి20 క్రికెట్ లీగ్లు మొదలైనట్లే... తాజాగా ఇప్పుడు మహారాష్ట్రలోనూ ‘టి20 ముంబై లీగ్’కు రంగం సిద్ధమైంది. ముంబై క్రికెట్ సంఘం సౌజన్యంతో ‘ప్రాబబిలిటీ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో మొదలవనున్న ఈ లీగ్కు భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల 11 నుంచి 21 వరకు వాంఖెడే స్టేడియంలో ఈ ‘టి20 లీగ్’ మ్యాచ్లు జరుగుతాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రచార కార్యక్రమంలో సచిన్ మాట్లాడుతూ ‘ముంబైకి ఇలాంటి లీగ్ల అవసరం ఎంతో ఉంది. సుదీర్ఘ కాలంగా ముంబై క్రికెటర్లే పెద్ద సంఖ్యలో భారత క్రికెట్లో ప్రధాన పాత్ర పోషించారనేది వాస్తవం. ఈ స్థానిక లీగ్లో ‘బ్రాండ్ అంబాసిడర్’గా నేనులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. తమ సత్తా చాటేందుకు కుర్రాళ్లకు ఇది చక్కని వేదిక’ అని అన్నారు. ముంబై గల్లీ కుర్రాళ్లు శివాజీ పార్క్, క్లబ్ల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వేదికైన వాంఖెడేలో మెరిసేందుకు ఇది మంచి అవకాశమని సచిన్ అన్నారు. -
అంధుల క్రికెట్కూ గుర్తింపు ఇవ్వండి
న్యూఢిల్లీ: ‘అంధుల జట్టు ఎన్నో అవరోధాలు అధిగమించింది. వారి స్ఫూర్తిదాయక ప్రపంచకప్ విజయం మానవ మేధస్సుకు పరిమితి లేదని గుర్తుచేస్తోంది. అందుకని భారత అంధుల క్రికెట్ సంఘం (సీఏబీఐ)కు గుర్తింపునిస్తూ ఆ క్రికెటర్లను బోర్డు పెన్షన్ పథకం పరిధిలోకి తీసుకోండి’ అని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బీసీసీఐని కోరాడు. ఈ మేరకు బోర్డు పరిపాలకుల కమిటీ అధ్యక్షుడు వినోద్రాయ్కు లేఖ రాశాడు. బీసీసీఐ గుర్తింపు దక్కడం వారి కృషికి మెచ్చుకోలుగా ఉంటుందని, ఆటగాళ్ల ఆర్థిక భద్రతకూ భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నా డు. గత నెలలో అంధుల జట్టు ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా బీసీసీఐ తరఫున రివార్డు అందిస్తామని రాయ్ ప్రకటించారు. -
క్రైమ్ థ్రిల్లర్గా యార్ ఇవన్
తమిళసినిమా: క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కిన యార్ ఇవన్ చిత్రం ఈ నెల 15న తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఒక పక్క వ్యాపార రంగంలో రాణిస్తూ మరో పక్క సినిమాను ఫ్యాషన్గా నటిస్తున్న నటుడు సచిన్. ఇంతకు ముందు పలు తెలుగు చిత్రాల్లో నటించిన ఆయన తాజాగా యార్ ఇవన్ పేరుతో తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళం, తెలుగు భాషల్లో సచిన్ కథానాయకుడిగా నటించి నిర్మించిన ఈ చిత్రంలో ఆయనకు జంటగా ఇషాగుప్తా నాయకిగా నటించింది. ఇతర ప్రధాన పాత్రల్లో ప్రభు, కిశోర్, సతీష్ తదితరులు నటించారు. ఎస్ఎస్.థమన్ సంగీతం అందించిన యార్ ఇవన్ చిత్రానికి టీ.సత్య దర్శకుడు. చిత్రం ఈ నెల 15వ తేదీన రెండు భాషల్లో విడుదల కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం ఉదయం చెన్నైలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ఈ సమావేశంలో దర్శకుడు టీ.సత్య మాట్లాడుతూ క్రీడా నేపథ్యంలో తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం యార్ ఇవన్ అని తెలిపారు. ఇందులో సచిన్ ప్రోకబడ్డీ క్రీడాకారుడిగా నటించారని తలిపారు. లవ్, యాక్షన్ సన్నివేశాలతో కూడిన భారీ చిత్రంగా యార్ ఇవన్ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం చిత్ర నిర్మాత, కథానాయకుడు సచిన్ మాట్లాడుతూ తాను వ్యాపార రంగానికి చెందిన వాడినైనా 8 ఏళ్ల వయసులోనే బాల నటుడిగా పరిచయం అయ్యానని చెప్పారు. అందువల్ల వ్యాపారాన్ని నాన్న చూసుకుంటారని, తనకు నటనే ముఖ్యం అని తెలిపారు. అదే విధంగా సినిమాకు భాష లేదని, యార్ ఇవన్ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులను అలరించే చిత్రంగా ఉంటుందని తెలిపారు. -
అది శక్తికి మించిన పని
‘సచిన్ సెంచరీల’ రికార్డుపై కోహ్లి కొలంబో: వన్డే క్రికెట్లో విఖ్యాత బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అత్యధిక సెంచరీల (49) రికార్డును అధిగమించడం అత్యంత కష్టమైన పని అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. 30వ సెంచరీతో రికీ పాంటింగ్ (ఆసీస్) రికార్డును సమం చేసిన ఈ భారత స్టార్ మాట్లాడుతూ ‘గ్రేట్ మ్యాన్ (సచిన్) రికార్డు అయ్యే పని కాదు. దాని కోసం శక్తికి మించి శ్రమించాలి. అందుకే దానిపై ఆలోచించడం లేదు. టీమ్ గెలిచేందుకు నేను అజేయంగా 90 పరుగులు చేసినా అదే అమూల్యమైందిగా భావిస్తాను’ అని అన్నాడు. 2019 ప్రపంచకప్పై: మెగా ఈవెంట్కు 20–25 మంది ప్లేయర్లను సన్నద్ధం చేస్తామని కోహ్లి అన్నాడు. వీరందరికీ ప్రపంచకప్ బరిలోకి దిగే సత్తా ఉండేలా తీర్చిదిద్దుతామన్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో కీలకమైన సిరీస్ల్లో కుర్రాళ్లకు అవకాశమిస్తామని... సుదీర్ఘమైన ఈ ప్రక్రియలో పారదర్శకతతో ఆటగాళ్లను ఎంపిక చేస్తామని చెప్పాడు. తద్వారా అత్యుత్తమ తుది జట్టు ప్రపంచకప్ ఆడుతుందన్నాడు. అత్యధిక రేటింగ్ పాయింట్లతో.... దుబాయ్: ఐసీసీ వన్డే క్రికెటర్ల ర్యాంకింగ్స్లో రెండు దశాబ్దాల క్రితం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి సమం చేశాడు. తాజా ర్యాంకింగ్స్లో కోహ్లి నంబర్వన్ ర్యాంక్ను మరింత పటిష్టం చేసుకుంటూ అత్యధికంగా 887 పాయింట్లు సాధించాడు. దీంతో భారత క్రికెటర్లలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా సచిన్ సరసన నిలిచాడు. 1998లో సచిన్ ఈ ఫీట్ సాధించి నంబర్వన్గా నిలిచాడు. -
జీల్, సచిన్లకు స్వర్ణాలు
కామన్వెల్త్ యూత్ గేమ్స్ నసావు (బహమాస్): పతకాల వేటను పసిడితో మొదలుపెట్టిన భారత క్రీడాకారులు స్వర్ణ పతకంతోనే ముగించారు. కామన్వెల్త్ యూత్ గేమ్స్లో మరోసారి సత్తా చాటుకున్నారు. బహమాస్లో ముగిసిన ఈ ఆరు రోజుల క్రీడల్లో భారత్ ఓవరాల్గా నాలుగు స్వర్ణాలు, రజతం, ఆరు కాంస్య పతకాలను సాధించి మొత్తం 11 పతకాలతో ఏడో స్థానంలో నిలిచింది. చివరిరోజు టెన్నిస్లో జీల్ దేశాయ్ బాలికల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించగా... బాలుర సింగిల్స్లో సిద్ధాంత్ బంతియా కాంస్య పతకాన్ని గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో జీల్ దేశాయ్–సిద్ధాంత్ ద్వయం బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. సింగిల్స్ ఫైనల్లో జీల్ దేశాయ్ 6–3, 7–6తో ఎలీజా ఒమిరూ (సైప్రస్)ను ఓడించగా... మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో జీల్–సిద్ధాంత్ జంట 6–4, 6–3తో నియోస్–ఒమిరూ (సైప్రస్) జోడీపై గెలిచింది. కాంస్య పతక పోరులో సిద్ధాంత్ 6–2, 6–0తో నియోస్ (సైప్రస్)పై నెగ్గాడు. ఇక బాక్సింగ్లో సచిన్ సివాచ్ (49 కేజీలు) స్వర్ణం దక్కించుకోగా... మొహమ్మద్ ఎతాష్ ఖాన్ (56 కేజీలు) కాంస్యం... బాలికల ఈవెంట్లో జానీ (60 కేజీలు) రజతం, ఏక్తా (51 కేజీలు) కాంస్యం గెలిచారు. -
శ్రీవారి ఆలయంలో సచిన్
సాక్షి, తిరుమల: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి అంజలితో కలసి ఉదయం నైవేద్య విరామ సమయంలో సచిన్ సంప్రదాయ దస్తులతో ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకున్నారు. తర్వాత హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. సచిన్ వెంట పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కూడా ఉన్నారు. ఆలయం వెలుపల అభిమానులు సచిన్ను పలుకరించేందుకు పోటీ పడ్డారు. కొందరు సెల్ఫీలు తీసుకోవటం కనిపించింది. -
తిరుమలలో సచిన్
తిరుపతి అర్బన్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. గురువారం వేకువజామున స్వామివారిని దర్శించుకోనున్నారు. సచిన్తో పాటు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కూడా తిరుమలకు చేరుకున్నారు. -
మాకు రవిశాస్త్రే కావాలి..
ముంబై: భారత జట్టు ఆటగాళ్లు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రినే గట్టిగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆటగాళ్లు క్రికెట్ దిగ్గజం సచిన్ ముందు ఉంచడంతో రంగంలోకి దిగిన మాస్టర్ రవిశాస్త్రిని కోచ్ పదవి దరఖాస్తు చేయించాడనే ప్రచారం జరుగుతోంది. రవిశాస్త్రి 2014 నుంచి 2016 భారత జట్టుకు డైరెక్టర్ గా సేవలిందించాడు. ఈ సమయంలో రవిశాస్త్రితో ఆటగాళ్లకు సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతోనే వారు రవిశాస్త్రిని కోచ్ గా కోరుకుంటున్నట్లు సమాచారం. రవిశాస్త్రి డైరెక్టర్ గా ఉన్నపుడు భారత జట్టు అద్భుతంగా రాణించింది. 2015 వరల్డ్ కప్ లో సెమీస్ చేరింది. 22 ఏళ్ల తర్వాత శ్రీలంకతో టెస్టు సిరీస్ నెగ్గింది. సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 3-0 తో కైవసం చేసుకుంది. రవిశాస్త్రి గత సంవత్సరం కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు కానీ గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని సలహాదారుల కమిటీ కుంబ్లే వైపే మొగ్గు చూపింది. ఈ విషయంలో రవిశాస్త్రి గంగూలీ మధ్య అప్పట్లో మాటల యుద్దం బాహాటంగానే నడిచింది. తొలుత చాంపియన్స్ ట్రోఫీకి ముందు కోచ్ పదవికి దరఖాస్తుల ఆహ్వానించిన బీసీసీఐ కుంబ్లే రాజీనామా చేయడంతో ఆ గడవును జులై 9 కి పొడగించింది. ముందు కోచ్ పదవికి సుముఖత చూపని రవిశాస్త్రి సచిన్ సూచనతో దరఖాస్తు చేశాడని తెలుస్తోంది. బీసీసీఐ గడువు కూడా రవిశాస్త్రి కోసమే పెంచిందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కోచ్ పదవికి రవిశాస్త్రితో పాటు వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, దొడ్డ గణేష్, రిచర్డ్ పైబస్, లాల్ చంద్ రాజ్ పుత్ లు దరఖాస్తు చేసుకున్నారు. జులై 10 న సలహాదారుల కమిటి ఇంటర్వ్యూలు చేయనుంది. ఆరోజే ఈ కోచ్ పదవి సందిగ్ద వీడనుంది. -
ఇదే నా బెస్ట్ బ్రేక్ఫాస్ట్: సచిన్
ముంబై: తన కుమారడు అర్జున్ టెండూల్కర్ తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ ను చూసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెగి మురిసిపోతున్నాడు. అర్జున్ తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ ఎంతబాగుందో అంటూ అర్జున్ని పొగడ్తలతో ముంచుత్తుతున్నాడు. ఈ మేరకు అర్జున్ చేసిన బ్రేక్ ఫాస్ట్ ను బెడ్ పైనే ఉండి తింటుండగా తీసిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు సచిన్. 'మా అబ్బాయి తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ ఇది.. ఎప్పటికీ ఇదే నా బెస్ట్ బ్రేక్ ఫాస్ట్'అని సచిన్ క్యాప్షన్ జోడించాడు. తనదైనందిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా పంచుకునే సచిన్.. తాజాగా కుమారుడు చేసిన బ్రేక్ ఫాస్ట్ ను సైతం ఫోటో తీసి అభిమానులతో పంచుకోవడం విశేషం. Breakfast in bed cooked by my son Arjun :-) best breakfast ever!!! A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on Jul 2, 2017 at 2:29am PDT -
బీఎండబ్ల్యూ 5 సిరీస్ కొత్త వెర్షన్
ధర రూ.49.9 లక్షలు – రూ.61.3 లక్షలు ముంబై: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ గురువారం భారత మార్కెట్లో మోడల్ 5 సిరీస్లో లేటెస్ట్ వెర్షన్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ. 49.9 లక్షలు–61.3 లక్షలు(ఎక్స్ షోరూం ముంబై). కొత్త మోడల్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. 3 వేరియంట్స్లో లభించే డీజిల్ ఇంజిన్ కారు ధర రూ. 49.9 లక్షల నుంచి రూ. 61.3 లక్షల దాకా ఉండనుండగా, పెట్రోల్ వెర్షన్ రేటు రూ. 49.9 లక్షలుగా ఉంటుంది. డ్రైవర్ అసిస్టెన్స్, జెస్చర్ కంట్రోల్, రిమోట్ కంట్రోల్ పార్కింగ్ మొదలైన ఫీచర్స్ ఉంటాయి. అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్స్లో సిరీస్ 5 ఒకటని బీఎండబ్ల్యూ ఇండియా గ్రూప్ ప్రెసిడెంట్ విక్రమ్ పవా పేర్కొన్నారు. భారత్ విభాగం కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు మరో రూ. 130 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. -
సలహాలకే పరిమితమా!
♦ బాధ్యత తీసుకోని సీఏసీ ♦ బాధ్యత తీసుకోని సీఏసీకోచ్, కెప్టెన్ల వివాదంలో ముగ్గురు దిగ్గజాల నిస్సహాయత సచిన్, గంగూలీ, లక్ష్మణ్... భారత క్రికెట్కు ఆటగాళ్లుగా ఎనలేని సేవలందించారు. వారి అనుభవాన్ని, ఆలోచనలను మరో రీతిలో వాడుకోవాలనే ఆలోచనతో బీసీసీఐ ప్రత్యేకంగా క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)ని ఏర్పాటు చేసింది. దాంతో పాటు కోచ్ను ఎంపిక చేసే పనిని కూడా వారి చేతుల్లోనే పెట్టింది. అయితే ఈ కమిటీ ఇచ్చిన సలహాలు ఏమిటి, అవి ఎంత వరకు భారత క్రికెట్కు మేలు చేశాయో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కానీ భారత కోచ్ ఎంపిక విషయంలో, కోచ్, కెప్టెన్ వివాదాన్ని పరిష్కరించే విషయంలో కూడా కమిటీ చురుగ్గా వ్యవహరించలేకపోయింది. ఈ దిగ్గజాలు మరింత బాధ్యతను తీసుకొని ఉంటే గొడవ ముదరకుండా ముగిసిపోయేదేమో! సాక్షి క్రీడా విభాగం గత ఏడాది భారత కోచ్గా అనిల్ కుంబ్లేను ఎంపిక చేసే విషయంలో క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) తమ పరిధికంటే మించి ఉత్సాహంగా పని చేసింది. ఎలాగైనా తమ మాజీ సహచరుడు కుంబ్లేను ఆ పదవిలో కూర్చోబెట్టేందుకు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ తమ అధికారాన్ని గట్టిగా ఉపయోగించారు. ‘కనీసం జాతీయ జట్టుకు లేదా ఫస్ట్ క్లాస్ జట్టుకు కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉండాలి’ అనేది కోచ్ పదవికి పోటీ పడేందుకు ఉంచిన నిబంధనల్లో ప్రధానమైంది. కానీ ఈ ముగ్గురు దానిని తోసిరాజన్నారు. నిబంధనల ప్రకారం కుంబ్లేకు అర్హత లేకపోయినా అతడికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో రవిశాస్త్రితో గొడవ పెట్టుకునేందుకు కూడా గంగూలీ సిద్ధమయ్యాడు. ఆ సమయంలో కమిటీ వ్యవహరించిన తీరు ఇది. అంటే నిబంధనలను ఉల్లంఘించవచ్చని తామే చేసి చూపించారు. పరిష్కరించే ప్రయత్నమేది? కోహ్లి, కుంబ్లే మధ్య చాలా రోజులుగా విభేదాలు సాగుతున్నాయనే విషయం చాంపియన్స్ ట్రోఫీకి ముందే మీడియాలో వచ్చింది. కానీ ఇలాంటి విషయాలు ఆ ముగ్గురికి అప్పటి వరకు తెలియదనుకోవాలా! తెలిసినా ఎందుకు మౌనం వహించారు. తాము ఏరికోరి ఎంపిక చేసిన కోచ్కు, కెప్టెన్కు పడటం లేదంటే కలగజేసుకొని సరిదిద్దే ప్రయత్నం కూడా వారు చేయలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్కు, చాంపియన్స్ ట్రోఫీకి మధ్య దాదాపు రెండు నెలల విరామం ఉంది. ఆ సమయంలో దీనికి ఏదైనా పరిష్కారం వెతికే ప్రయత్నం కూడా జరగలేదు. అది మా పని కాదని వారు చెప్పడానికి వీలులేదు. భారత క్రికెట్లో దిగ్గజాలుగా గుర్తింపు తెచ్చుకున్న వీరినుంచి బీసీసీఐ కేవలం సలహాలకంటే ఎక్కువే ఆశించడం సహజం. తాము కోచ్ను ఎంపిక చేయడంతోనే పని ముగిసిపోయిందని ఈ ముగ్గురు భావించారా? నిజానికి సచిన్ స్థాయి వ్యక్తి పూనుకుంటే ఆరంభంలో కచ్చితంగా ఎంతో కొంత మెరుగైన ఫలితం వచ్చేది. అతని మాటను కుంబ్లే గౌరవించకపోయేవాడా? లేక గురుభావంతోనైనా కోహ్లి కాదనేవాడా? ఇప్పుడేం చేస్తారు? పరిస్థితి చేయి దాటిపోయిందని తెలిసిన తర్వాత కూడా ఈ ముగ్గురు కుంబ్లేనే కోచ్గా కొనసాగించమంటూ సిఫారసు చేశారు. కోహ్లి అసలు దానిని లెక్క చేయకపోవడం ఈ కమిటీ వైఫల్యం కిందనే లెక్క. కుంబ్లే హుందాగా తప్పుకున్నాడు కాబట్టి వివాదం సద్దుమణిగింది. కమిటీ చెప్పింది కాబట్టి తాను కొనసాగుతానంటే పరిస్థితి ఎలా ఉండేదో! మరో సారి కొత్త కోచ్ ఎంపిక కూడా ఈ త్రిసభ్య కమిటీ చేతికే వచ్చింది. మేం కోచ్ ఎంపికలో జోక్యం చేసుకోమని పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఇప్పటికే స్పష్టం చేసింది కాబట్టి పూర్తి బాధ్యత మళ్లీ కమిటీదే. తాము ఎంపిక చేసిన వ్యక్తి ఏడాది కాలానికే తప్పుకున్న నేపథ్యంలో ఈసారి కమిటీపై బాధ్యత మరింత పెరిగింది. భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందు చూపుతో కోచ్ను ఎంపిక చేయాల్సి ఉంది. సొంత ఇష్టా ఇష్టాలను పట్టించుకోకుండా ఈసారి తమ క్రికెట్ పరిజ్ఞానం, అనుభవం, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కోచ్ను ఎంపిక చేయడం అవసరం. అదే విధంగా తాజా పరిణామాల కారణంగా కోహ్లితో కూడా ముందుగా మాట్లాడతారా అనేది ఆసక్తికరం. నిజంగానే అదే జరిగి కోహ్లి చెప్పిన పేరుకే ఆమోద ముద్ర వేస్తే మాత్రం ఏ మాత్రం బాధ్యతలు పట్టని, కోరలు లేని ఈ కమిటీ ఉండటం కూడా అనవసరం! ఆరు నెలలుగా మాటల్లేవ్! బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం... ఏడాది పదవీ కాలంలో గత ఆరు నెలల నుంచి కెప్టెన్, కోచ్ అసలు మాట్లాడుకోవడం లేదట. ఇంగ్లండ్తో సిరీస్ ముగిసిన నాటినుంచి వీరిద్దరు ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నట్లు సమాచారం. మరి కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్ కూడా అలాగే సాగిపోయిందంటే బోర్డు పెద్దలు ఏం చేస్తున్నారనేది ప్రశ్న. ‘వీరిద్దరు ఆరు నెలల్లో ఒకే ఒక్కసారి ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిసిన తర్వాత ఎదురెదురుగా కూర్చున్నారు. అప్పుడు కూడా వారిద్దరు ఏం మాట్లాడుకోలేదు. ఇక మైత్రి కొనసాగదని వారిద్దరికి అర్థమైపోయింది’ అని బోర్డు అధికారి వ్యాఖ్యానించారు. ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లపై కుంబ్లే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది. దాంతో చిర్రెత్తిన క్రికెటర్లు కుంబ్లేపై మరింత వ్యతిరేకతను పెంచుకున్నారు. ఇదే విషయాన్ని వారు కోహ్లికి కూడా ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది. అంతకు ముందు కూడా కోచ్ గురించి ఆటగాళ్ల లెక్కలేనితనం బయటపడింది. చాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్ తర్వాత ఆటగాళ్ల తప్పొప్పులను గుర్తించేందుకు కుంబ్లే వీడియో అనలిస్ట్తో సుదీర్ఘంగా కూర్చున్నారు. ఒక్కొక్కరి వీడియో క్లిప్లను తీసుకొని లోపాలు ఎలా సరిదిద్దుకోవాలో కూడా వివరిస్తూ కుంబ్లే నోట్స్ రాశారు. అదే రోజు రాత్రి వీడియో, నోట్స్ను ఒక్కో ఆటగాడికి పంపించారు. కానీ రెండు రోజుల తర్వాత చూస్తే జట్టులో ఏ ఒక్కరు కుంబ్లే వీడియోను చూడలేదు. అతనిచ్చిన నోట్స్ను కూడా కనీసం చదవలేదు! కుంబ్లే తాను తప్పుకోవడం అవసరమనే నిర్ణయం తీసుకునేందుకు ఇది సరిపోయింది. -
ఆ రికార్డు సచిన్ తర్వాత యువరాజ్దే..
లండన్: చాంపియన్స్ట్రోఫిలో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత ఘన విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న యువరాజ్ సింగ్ ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఇప్పటికే ఈ మ్యాచ్తో భారత్ తరపున అత్యధిక ఐసీసీ టోర్నిలు ఆడిన తొలి ప్లేయర్గా నిలిచిన యువీ, అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్న భారత ఆటగాళ్లలో రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఐసీసీ టోర్నిల్లో భారత్ తరుపున అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్నరికార్డు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా ఆ తరువాతి స్థానంలో యువీ నిలిచాడు. సచిన్ 10 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకోగా యువీ నిన్నటి దానితో కలిపి 9 అందుకున్నాడు. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైప్ యువీకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఐసీసీ టోర్నిల్లో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్గేల్ (11) అందుకొని అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాతి స్థానంలో సచిన్, యువరాజ్లున్నారు. ICC tournaments get the best out of @YUVSTRONG12 . His 9th Man of the Match, only second to Sachin Paaji's 10 . A real champ.#IndvsPak — Mohammad Kaif (@MohammadKaif) 5 June 2017 -
అభిమాని కోసం సచిన్ లేఖ
లండన్: భారత్ ఆడే ప్రతి క్రికెట్ మ్యాచ్కు చేతిలో త్రివర్ణ పతాకాన్ని, ముఖంపై సచిన్ అని రాసుకొని అలరించే ఓ వ్యక్తి కనపిస్తూ ఉంటాడు. అతడే సచిన్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి. సచిన్ రిటైర్మెంట్ అనంతరం కూడా సుధీర్ భారత్ ఆడే మ్యాచ్ల్లో పాల్గొని ఆటగాళ్లను, అభిమానులను ఉత్సహపరుస్తూనే ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫి కోసం భారత్ జట్టు ఇంగ్లండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే భారత జట్టుతో కలిసి సుధీర్ అక్కడికి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోగా అతనికి వీసా రాలేదు. దీంతో భారత్- న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్కు సుధీర్ హాజరు కాలేకపోయాడు. తన వీరాభిమానికి వీసా దక్కలేదన్న విషయం తెలుసుకున్న సచిన్ స్పందించాడు. సుధీర్కు వీసా ఇవ్వాలని కోరుతూ లేఖ రాశాడు. సుధీర్ గొప్ప మద్దతుదారుడని, ఎలాంటి సహాయం లేకుండా ఎవరు అతనిలా మద్దతు తెలుపుతారని, సొంత ఖర్చులతో భారత జట్టుకు మద్దతు తెలిపాడని, అతను ఇంగ్లండ్ వెళ్లేందుకు వీసా మంజూరు చేస్తారని ఆశిస్తున్నట్లు సచిన్ లేఖలో పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లతో సుధీర్ సచిన్ ఏబిలియన్ డ్రీమ్స్ ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన విషయం తెలిసిందే. -
థ్రిల్ ఆఫ్ లైఫ్
మీకు నచ్చింది చేస్తున్నప్పుడు మీరు చేస్తున్నది అందరికీ నచ్చుతుంది! మన పిల్లలకు కూడా మనం ఇదే చెప్పాలేమో. మనకు నచ్చింది వాళ్లతో చేయించడం కంటే... వాళ్ల అభిరుచిని అర్థం చేసుకుని ప్రోత్సహించాలేమో..! ఎవరైనా అనుకున్నారా.. ఒకరోజు మనం పక్షిలా ఎగరగలమని! ఎవరైనా అనుకున్నారా..ఒకరోజు మనం చంద్రుడిపై కాలు పెట్టగలమని! సచిన్ లైఫ్ లోని థ్రిల్ని చూస్తే ఇదే అనిపిస్తోంది. సచిన్ అసాధ్యాలను సుసాధ్యం చేసుకున్నాడు. మన పిల్లలు కనవలసిన బిలియన్ డ్రీమ్స్కి స్ఫూర్తిని ఇచ్చాడు. విఖ్యాత సంగీత దర్శకుడు ఎస్డీ బర్మన్పై అభిమానంతో తల్లిదండ్రులు సచిన్ అని పేరు పెట్టారు. ప్రొఫెసర్గా పని చేసిన తండ్రి రమేశ్ టెండూల్కర్ ప్రఖ్యాత మరాఠీ రచయిత కూడా. సచిన్కు ఇద్దరు సోదరులు నితిన్, అజిత్, సోదరి సవిత ఉన్నారు. వీరిద్దరు రమేశ్ తొలి భార్య సంతానం కాగా, తల్లి రజనికి సచిన్ ఒక్కడే. ఈ విషయాన్ని సచిన్ తన సొంత ఆటోబయోగ్రఫీలో కూడా ప్రస్తావించలేదు. చిన్నప్పుడు టెన్నిస్ స్టార్ జాన్ మెకన్రోను విపరీతంగా అభిమానించిన సచిన్ అతనిలాగే రింగుల జుట్టు పెంచుకొని హెడ్ బ్యాండ్తో కనిపించేవాడు. కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాటలను సచిన్ అమితంగా ప్రేమిస్తాడు. వేసవి సెలవుల్లో ఓ సాయంత్రం దూరదర్శన్ గైడ్ సినిమా ప్రసారమవుతున్న సమయంలో చెట్టుపైనుంచి పక్కింట్లో చూడబోయే ప్రయత్నంలో సచిన్ కింద పడ్డాడు. దాంతో అతని అన్న అజిత్ పనిష్మెంట్ కింద క్రికెట్ కోచింగ్ క్లాస్లకు తీసుకెళ్లాడు. మొదటిసారి గురువు రమాకాంత్ అచ్రేకర్ ముందు వెళ్లినప్పుడు ఆయన ముందు భయంతో సరిగా బ్యాట్ కూడా పట్టలేకపోయాడు. అయితే సచిన్లో మంచి ప్రతిభ ఉందని, ఎదురుగా నిలబడకుండా మరో అవకాశం ఇవ్వమని అజిత్ కోరాడు. దాంతో సచిన్ను ఆడమని చెప్పిన అచ్రేకర్ చెట్టు చాటునుంచి పరీక్షించారు. అంతే... ఆ అద్భుతాన్ని చూసిన తర్వాత తన అకాడమీలోకి తీసుకోవడం, చరిత్ర సృష్టించేందుకు అడుగులు పడటం అక్కడే జరిగిపోయాయి. సచిన్ అక్కడ సుదీర్ఘంగా సాధన చేసేవాడు. కుర్రాడిని ఉత్సాహపరిచేందుకు కోచ్ స్టంప్స్పై ఒక రూపాయి నాణాన్ని ఉంచేవారు. సెషన్ మొత్తం అవుట్ కాకుండా ఉంటే అది సచిన్కు, ఎవరైనా అతడిని అవుట్ చేస్తే అది వారికి దక్కుతుంది. ఈ రకంగా ఎన్నో సెషన్లలో అసలు అవుట్ కాకుండా ఆడిన సచిన్ వద్ద ఆ రూపాయి నాణాలు ఎన్నో భద్రపరిచి ఉన్నాయి. అవన్నీ తన అపురూపమైన కానుకలని అతను అంటాడు. శారదాశ్రమ్ విద్యా మందిర్ స్కూల్ తరఫున సచిన్, వినోద్ కాంబ్లీ కలిసి స్కూల్ క్రికెట్లో ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హారిస్ షీల్డ్ ట్రోఫీ సెమీ ఫైనల్లో సెయింట్ జేవియర్ స్కూల్పై వీరిద్దరు ఏకంగా 664 పరుగులు జోడించారు. ఇందులో సచిన్ 326 పరుగులు, కాంబ్లీ 349 పరుగులు చేశారు. జట్టు అసిస్టెంట్ కోచ్ లక్ష్మణ్ చౌహాన్ ఇక చాలు డిక్లేర్ చేయమని ఎన్ని సందేశాలు పంపించినా... వీరిద్దరు పట్టించుకోకుండా తమ జోరును కొనసాగించారు. ఆ తర్వాత అచ్రేకర్ సర్ తిట్లు తినాల్సి వచ్చింది. ఏ స్థాయికి చేరినా తన మూలాలు మరచిపోని సచిన్, నాలుగు నెలల సుదీర్ఘ పర్యటన తర్వాత 1992 వరల్డ్ కప్నుంచి తిరిగొచ్చాక స్థానిక లీగ్లలో కీర్తి కాలేజ్ తరఫున ఆడాడు. ప్రేమ... సచిన్కంటే అతని భార్య అంజలి వయసులో ఐదేళ్లు పెద్ద. చిన్న పిల్లల వైద్యురాలు. టీనేజర్గానే సచిన్, అంజలిపై మనసు పారేసుకున్నాడు. తొలిసారి 1990 న్యూజిలాండ్ పర్యటనకు వెళుతున్న సమయంలో సచిన్ను ఎయిర్పోర్ట్లో అంజలి కలిసింది. జర్నలిస్ట్గా తనను తాను పరిచయం చేసుకొని నేరుగా అతని ఇంటికే వచ్చి కలిసే ప్రయత్నం కూడా చేసింది. ఆ తర్వాత ఆ ప్రేమ అలాగే పెరిగింది. మూడేళ్ల స్నేహం తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో సచిన్ వయసు 22 ఏళ్లు మాత్రమే. సాధారణంగా బయట ఏ కెరీర్ చూసుకున్నా ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం అరుదు. కానీ అంతర్జాతీయ క్రికెటర్కు కుటుంబం అవసరం ఎక్కువగా ఉందని భావించిన సచిన్ 1995లో అంజలిని వివాహమాడాడు. సచిన్ విషయంలో కూడా అప్పట్లో అనేక గాసిప్స్ వినిపించాయి. ముఖ్యంగా నాటి బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్తో ప్రేమ వ్యవహారం అంటూ టెండూల్కర్, శిరోద్కర్ కులాలు కూడా ఒక్కటే... సమస్య లేదు, ఇక పెళ్లే తరువాయి అంటూ కథనాలు ఇచ్చాయి. అయితే సచిన్ తాను అనుకున్నట్లుగా పెళ్లి చేసుకొని వాటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టేశాడు. సచిన్ పెళ్లి లైవ్ కవరేజి కోసం ఒక ఛానల్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినా అతను తిరస్కరించాడు. 1987 ప్రపంచకప్లో భాగంగా భారత్, జింబాబ్వే మధ్య వాంఖెడేలో జరిగిన మ్యాచ్లో సచిన్ బాల్ బాయ్గా పని చేశాడు. తర్వాతి ఏడాది బ్రబోర్న్ స్టేడియంలో పాకిస్తాన్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడగా, ఆ టీమ్ తరఫున సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగడం విశేషం. సునీల్ గావస్కర్ బహుమతిగా ఇచ్చిన ప్యాడ్స్ కట్టుకొని అతను తన తొలి టెస్టు (కరాచీ)లో బరిలోకి దిగాడు. ఎడమ కాలికి ముందుగా ప్యాడ్ కట్టుకునే సెంటిమెంట్ అతడికి ఉంది. ముంబై సహచరుడు ప్రవీణ్ ఆమ్రే తొలి సారి సచిన్కు అంతర్జాతీయ క్రికెటర్లు ధరించే బ్రాండింగ్ షూస్ను కానుకగా ఇచ్చాడు. సచిన్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆమ్రే కొత్త అడిడాస్ స్పైక్స్ తీసుకొని అక్కడికి వచ్చాడు. అవి సచిన్ను బాగా ఆకర్షించడంతో పదే పదే ఆమ్రేను వాటి గురించి అడిగాడు. దాంతో ఆమ్రే నువ్వు సెంచరీ కొడితే చాలు షూస్ నీవే అన్నాడు. అంతే...తర్వాతి వారమే స్కూల్ క్రికెట్లో సచిన్ శతకం మోత మోగింది. సచిన్ తన కెరీర్ చివర్లో అడిడాస్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం విశేషం. కెరీర్లో పెద్ద సంఖ్యలో ప్రకటనలకు ప్రచారకర్తగా కోట్లాది రూపాయలు ఆర్జించిన సచిన్ తొలి ప్రకటన బ్యాండ్ – ఎయిడ్. తనతో ఆడుతూ గాయపడిన ఫీల్డర్ వేలికి అతను బ్యాండ్ ఎయిడ్తో చికిత్స చేస్తాడు. 1996 ప్రపంచకప్లో పరుగుల వరద పారించిన సమయంలో సచిన్ బ్యాట్కు స్పాన్సర్ ఎవరూ లేరు. ఆ తర్వాత అతనితో జత కట్టిన ఎంఆర్ఎఫ్ సుదీర్ఘ కాలం ఆ అనుబంధాన్ని కొనసాగించింది. ప్రకటనల విషయంలో కూడా సచిన్ ఆటను ఏ మాత్రం తక్కువ చేయడానికి ఇష్టపడడు. ఒక సారి పెప్సీ యాడ్లో అతను బంతిని ఫ్లై స్వాటర్ (దోమలను కొట్టే పరికరం)తో కొట్టే విధంగా రూపొందించారు. అది క్రికెట్ విలువను తగ్గించినట్లే అని చెప్పడంతో రూపకర్త ప్రహ్లాద్ కక్కడ్ చివరకు స్టంప్స్తో బంతిని కొట్టే విధంగా మార్చారు. 1999 వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో సచిన్ తండ్రి రమేశ్ కన్నుమూశారు. హుటాహుటిన ఇంగ్లండ్నుంచి తిరిగొచ్చిన సచిన్ కార్యక్రమాలు పూర్తి చేసి మళ్లీ వచ్చి జట్టుతో చేరాడు. కీలకమైన మ్యాచ్లో కెన్యాపై సెంచరీ సాధించి భారత్ను గెలిపించాడు. అప్పటినుంచి అతను తాను చేసి ప్రతీ సెంచరీకి ఆకాశం వైపు చూసి తండ్రిని గుర్తు చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. 1988లో సచిన్ తొలి సారి రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. అంతకు కొద్ది రోజుల ముందు అతను ఒక మ్యాచ్లో అతను మరో ఆటగాడు సాయిరాజ్ బహుతులే (భారత్ తరఫున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు) బ్యాట్తో బరిలోకి దిగి మంచి స్కోర్ సాధించాడు. దాంతో సెంటిమెంట్గా మరో ఫ్రెండ్కు చెప్పి అదే బ్యాట్ తెప్పించమని కోరాడు. అదే బ్యాట్తో గుజరాత్తో తొలి మ్యాచ్లోనే సెంచరీ బాదడంతో చరిత్రకు తొలి అడుగు పడింది. బ్యాట్లను కానుకలుగా ఇచ్చే అలవాటు సచిన్కు కూడా ఉంది. 1989లో సచిన్ ఆడిన తొలి టెస్టు పాక్ దిగ్గజ పేస్ బౌలర్ వకార్ యూనిస్కు కూడా మొదటి టెస్టే. ఈ సిరీస్ చివరి టెస్టులో వకార్ బౌలింగ్లో ముక్కుకు గాయమై రక్తం కారినా కూడా ఇన్నింగ్స్ కొనసాగించి సచిన్ అర్ధసెంచరీ చేశాడు. ఆ తర్వాత వకార్తో మంచి స్నేహం కుదిరింది. ఒక సారి సచిన్ తన బ్యాట్ను అభిమానంతో వకార్కు కానుకగా ఇచ్చాడు. కొన్నాళ్లకు షాహిద్ ఆఫ్రిది ఇదే బ్యాట్తో 37 బంతుల్లో ప్రపంచరికార్డు సెంచరీ సాధించాడు. అంటే పరోక్షంగా ఆ రికార్డులో సచిన్దే పాత్ర ఉంది. సచిన్ ఆరంభంలో తాను ఫాస్ట్ బౌలర్ను కావాలని కోరుకున్నాడు. మద్రాస్లోని ఎంఆర్ఎఫ్ పేస్ అకాడమీ సెలక్షన్స్కు కూడా అతను హాజరయ్యాడు. అయితే అక్కడి డైరెక్టర్, దిగ్గజ బౌలర్ డెన్నిస్ లిల్లీ నువ్వు బౌలింగ్కు పనికి రావని తేల్చేశాడు. బ్యాటింగ్పై దృష్టి పెడితే మంచిదని మందలించి వెనక్కి పంపించాడు. ఆ రోజు అలా జరగకబోతే క్రికెట్ ప్రపంచం వేల కొద్దీ పరుగులను చూసి ఉండకపోయేదేమో. ►సచిన్ బ్యాటింగ్లో రైట్ హ్యాండరే అయినా... తినడం, ఆటోగ్రాఫ్ ఇవ్వడం అంతా ఎడమ చేత్తోనే చేస్తాడు. ►తన తొలి రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ మ్యాచ్లలో సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ సచిన్. ►భారతరత్న కూడా అయిన సచిన్కు ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ ఉంది. మూవీ రివ్యూ సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ సచిన్ అంటే క్రికెట్ ఒక్కటే కాదు... అతని జీవితంలోనూ అందరిలాగే అమ్మా నాన్నల ఆప్యాయత ఉంది...అండగా నిలిచిన అన్న ఉన్నాడు... అడుగులో అడుగు వేసి నడిచిన అంజలి ఉంది. అందులో అందరికీ తెలిసిందే కొంతే. కొడుకుగా, భర్తగా, నాన్నగా మనం చూడని సచిన్ను అతను కొత్తగా వెండి తెరపై ‘సచిన్– ఎ బిలియన్ డ్రీమ్స్’ పేరుతో తనను తను ఆవిష్కరించుకున్నాడు. ఈ చిత్రం నిన్న శుక్రవారం విడుదలైంది. సచిన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సమ్థింగ్ స్పెషల్ ‘సచిన్ – ఎ బిలియన్ డ్రీమ్స్’ అనేది పూర్తి స్థాయి ఫీచర్ ఫిల్మ్ కాదు. డాక్యుమెంటరీ కమ్ మూవీ. ధోని, అజహర్, మిల్కా సింగ్ల తరహాలో మరొకరు సచిన్ పాత్రను పోషిస్తూ సన్నివేషాలను షూట్ చేయలేదు. ఇందులో సచిన్ మాత్రమే కనిపిస్తాడు. వినిపిస్తాడు. తన చిన్ననాటి అల్లరి, ఆట పాటల మొదలు దిగ్గజంగా ఎదిగే వరకు వేర్వేరు దశల్లో సచిన్ తన గురించి తాను చెప్పుకుంటాడు. మధ్యలో గొప్ప మ్యాచ్లు, విజయాలు, పరాజయాలు, వివాదాలు.... ఇలా అన్నీ రియల్స్ విజువల్స్ చూపిస్తూ మనల్ని మరోసారి పాత రోజుల్లోకి ఈ సినిమా తీసుకెళుతుంది. దాదాపు 10 వేల గంటల వ్యవధి గల సచిన్ వీడియోలను తీసుకొని వాటిని సందర్భానుసారం ఈ సినిమాలో వాడుకున్నారు. అలాగే తనకు మాత్రమే పరిమైతమైన కొన్ని అరుదైన ఫ్యామిలీ వీడియోలు కూడా సచిన్ మనకు చూపించాడు. – మొహమ్మద్ అబ్దుల్ హాది, సాక్షి క్రీడా ప్రతినిధి -
టెస్టు చరిత్రలో స్పెషల్ రికార్డు
హైదరాబాద్: టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్ లో నలుగురు సెంచరీలు చేయడమే అరుదు. అటువంటిది వరుసగా నలుగురు ఆటగాళ్ల శతకాలతో ప్రత్యర్థిపై ముప్పేట దాడి చేస్తే ఎలా ఉంటుంది. 2007లో మే 25 నుంచి 27వ తేదీ వరకూ బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు వరుస నాలుగు సెంచరీల నమోదు చేసి తొలిసారి కొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు 10 ఏళ్ల క్రితం భారత జట్టు రికార్డును నమోదు చేసిన సందర్భంగా ఆ మ్యాచ్ను మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. బంగ్లాదేశ్లోని మిర్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఓపెనర్లు దినేష్ కార్తీక్(129), వసీం జాఫర్(138) శతకాలతో మెరవగా, ఆ పై వన్డౌన్ బ్యాట్స్మన్ ద్రావిడ్(129) సెకండ్ డౌన్ బ్యాట్స్మన్ సచిన్(122)లు సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ మ్యాచ్ లో మరో విశేషమేమిటంటే... 175 పరుగుల వద్ద కార్తీక్ గాయంతో రిటైర్డ్ అవుట్గా మైదానం వీడగా క్రీజులో ఉన్న జాఫర్ ద్రావిడ్తో ఆడుతూ సెంచరీ సాధించాడు. అనంతరం కొద్దిసేపటికి జాఫర్ కూడా గాయంతో రిటైర్ట్ అవుట్గా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ వికెట్ కోల్పోకుండా 281 పరుగులు చేసింది. తర్వాత సచిన్, ద్రావిడ్లు సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ తొలివికెట్ కు 408 పరుగులు చేసింది. ద్రావిడ్ అవుటవ్వడంతో వినూమన్కడ్-పంకజ్ రాయ్ పేరిట ఉన్న 413 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్య రికార్డును 5 పరుగుల దూరంలో చేజార్చుకుంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కార్తీక్ సెంచరీ చేయడంతో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు చేసిన రికార్డు నమోదు అయింది. ఈమ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్, 239 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది. టెస్టుల్లో ఇషాంత్ శర్మకు తొలి మ్యాచ్ కావడం మరో విశేషం. -
హీరో సచిన్తో రిపోర్టర్ రకుల్
రకుల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం బాగా అలవాటు. కానీ, ఇంటర్వ్యూ చేయడమనేది అస్సలు అలవాటు లేని కొత్త పాత్రే. యాక్టర్స్ పనేంటి? అలవాటు లేని పాత్రలను అవలీలగా చేసుకుంటూ వెళ్లడమే కదా! అలా బోలెడుఇంటర్వ్యూ లు ఇచ్చిన ఎక్స్పీరియన్స్తో ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్నుఇంటర్వ్యూ చేశారీ బ్యూటీ. అసలే సచిన్ అంటే ఆమెకు బోల్డంత అభిమానమేమో... సచిన్ లైఫ్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను రాబట్టే ప్రయత్నం చేశారు. భలే భలే ప్రశ్నలు అడిగారు. ఇదంతా ఎందుకు? అంటే... సచిన్ జీవితకథతో ‘సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్’ అనే సినిమా రూపొందింది కదా! ఈ నెల 26న విడుదలవుతోన్న ఆ సినిమా కోసం రియల్ లైఫ్ అండ్ రీల్ లైఫ్ హీరో సచిన్ను ఇంటర్వ్యూ చేశానని ట్వీట్ చేశారామె. రకుల్ రిపోర్టర్గా మారి, ఇంటర్వ్యూ చేయడం ఇది రెండోసారి. ‘సాక్షి’ పత్రిక కోసం గతంలో ఆమె(రకుల్)ను, ఆమె (ప్రీత్)ఇంటర్వ్యూ చేసుకున్నారు. -
సచిన్, ధోనిలకు నో ప్లేస్..
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ బౌలర్ అజిత్ అగార్కర్ ప్రకటించిన ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవన్ జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో పాటు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనిలకు చోటు దక్కలేదు. ఇదిలా ఉంచితే అజిత్ అగార్కర్ విడుదల చేసిన ఐపీఎల్ జట్టులో ఓపెనర్ గా వీరేంద్ర సెహ్వాగ్ కు స్థానం దక్కింది. అయితే అతనితో కలిసి ఓపెనింగ్ చేసే బాధ్యతను క్రిస్ గేల్ కు కట్టబెట్టాడు అగార్కర్. మరొకవైపు మిడిల్ ఆర్డర్ లో రోహిత్ శర్మ, సురేష్ రైనా,విరాట్ కోహ్లి, డివిలియర్స్ లకు చోటు కల్పించగా, ఆల్ రౌండర్లగా హర్భజన్ సింగ్, సునీల్ నరైన్ లను ఎంపిక చేశాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే లసిత్ మలింగా, జస్ప్రిత్ బూమ్రా, ఆశిష్ నెహ్రాలను అగార్కర్ తన ఆల్ టైమ్ ఐపీఎల్ జట్టులో ఎంపిక చేశాడు. అగార్కర్ జట్టు ఇదే: విరాట్ కోహ్లి(కెప్టెన్), క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్), లసిత్ మలింగా, బూమ్రా, ఆశిష్ నెహ్రా, సునీల్ నరైన్, హర్భజన్ సింగ్ -
ప్రధానితో ‘సచిన్’ సినిమా విశేషాలు
న్యూఢిల్లీ: ఈనెల 26న విడుదల కానున్న ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’కు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బిజీగా గడుపుతున్నారు. దీంట్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న ఆయన తన జీవిత చరిత్రపై వస్తున్న సినిమా గురించి వివరించారు. ‘ప్రధానిని కలుసుకుని సినిమా గురించి తెలపడం సంతోషంగా ఉంది. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. వచ్చే తరానికి ఈ సినిమా ప్రేరణగా నిలవడమే కాకుండా కెరీర్లో నా ఒడిదుడుకుల గురించి కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. దీనివల్ల సవాళ్లనేవి ఎక్కడైనా ఉంటాయని, వాటికి లొంగకుండా పైకి ఎదిగేందుకు ప్రయత్నించాలనే సందేశం ఇందులో ఉందని అన్నారు. ఈ సందర్భంగా నా గురించి ప్రత్యేకంగా ‘జో ఖేలే.. వహీ ఖిలే’ అని రాశారు. ఓ క్రీడాకారుడికి ఇది చాలా ఉత్తేజాన్నిచ్చే సందేశం. ఇది నిజంగా నా హృదయాన్ని తాకింది’ అని సచిన్ వివరించారు. మరోవైపు సచిన్తో జరిగిన భేటిని ప్రధాని మోదీ ట్వీటర్ ద్వారా తెలిపారు. ‘సచిన్ జీవనయానం, సాధించిన విజయాలు ప్రతీ భారతీయుడు గర్వించేలా.. స్ఫూర్తి పొందేలా ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు. -
గెలిపించని శతకాలు ఇవే..
హైదరాబాద్: ఐపీఎల్ అంటేనే బౌండరీల మోత. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడమే బ్యాట్సమన్ ప్రధాన లక్ష్యం. ఇలాంటి లీగ్ లో ఇక సెంచరీ బాదెస్తే మ్యాచ్ గెలవడం ఎంతో సులభం. కానీ పూర్తిగా బ్యాటింగ్ మద్దతుగా ఉండే ఈ పొట్టి క్రికెట్ లీగ్ లో కొందరు క్రికెటర్లు సెంచరీలు బాదినా మ్యాచ్ లు గెలిపించలేకపోయారు. ఇలా ఐపీఎల్ చరిత్రలో సెంచరీలు బాది జట్టును గెలిపించ లేక పోయినా ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం. హషీమ్ ఆమ్లా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (2017) ఆమ్లా ఈ సీజన్ లో రెండు సెంచరీలు బాదాడు. కానీ రెండు మ్యాచుల్లో పంజాబ్ ఓడడం గమనార్హం. ముంబై ఇండియన్స్ పై 60 బంతుల్లో 104 పరుగులతో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీ తో పంజాబ్ ముంబై కి 198 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక గెలుపు కాయం అనుకున్న సందర్భంలో ముంబై కేవలం 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని సునాయసంగా చేదించింది. ఆమ్లా సెంచరీ వృధా అయింది. ఇక మరో సెంచరీ గుజరాత్ లయన్స్ పై మరో సారి 104 పరుగలే నమోదు చేశాడు. ఈ శతకంతో ఒక సీజన్ లో రెండు అంతకన్నా ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన మూడో బ్యాట్స్ మన్ గా ఆమ్లా గుర్తింపు పొందాడు. పంజాబ్, ఆమ్లా శతకంతో గుజరాత్ కు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించినా గెలువలేక పోయింది. ఆమ్లా రెండు సెంచరీలు బాదినా రెండు మ్యాచుల్లో జట్టు గెలవకపోవడం గమనార్హం. విరాట్ కోహ్లీ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2016) ఐపీఎల్-9 సీజన్లో విరాట్ కోహ్లీ గుజరాత్ లయన్స్ పై రాజ్ కోట్ లో సెంచరీ నమోదు చేశాడు. కానీ ఈ మ్యాచ్ లో బెంగళూరు ఓడిపోయింది. కోహ్లీ 63 బంతుల్లో 100 పరుగులు చేయడంతో బెంగళూరు 180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 5 బంతులు మిగిలి ఉండగానే చేదించింది. దీంతో ఈ సీజన్ లో సెంచరీ చేసిన జట్టును గెలిపించకపోయినా ఆటగాడిగా కోహ్లీ నిలిచిపోయాడు. వృద్ధిమాన్ సాహా, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2014) ఐపీఎల్-2014 ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ పై సాహా కెరీర్ లో తొలి సెంచరీ చేసినా జట్టు గెలువలేకపోయింది. సాహా 66 బంతుల్లో 115 పరుగులు చేయడంతో కింగ్స్ పంజాబ్ 199 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఒంటి చేత్తో టైటిల్ అందించాలని భావించిన సాహాకు చివరకు నిరాశే మిగిలింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు మనీష్ పాండే(94) చెలరేగడంతో పంజాబ్ కు ఓటమి తప్పలేదు. ఇలా ఈ సీజన్ లో సెంచరీ చేసి జట్టును గెలిపించలేక పోయిన ఆటగాడిగా సాహా నిలిచాడు. సచిన్ టెండూల్కర్, ముంబై ఇండియన్స్(2011) ఐపీఎల్-2011 సీజన్ లో వాంఖేడ్ స్టేడియంలో సచిన్ టెండూల్కర్ అప్పటి టీం కొచ్చి టస్కర్స్ పై 66 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. సచిన్ 12 ఫోర్లు, 3సిక్సర్లతో చెలరేగడంతో ముంబై 182 పరుగులు చేసింది. కానీ బ్రెండన్ మెకల్లమ్(81), మహేలా జయవర్ధనే(56) ఆట ముందు ముంబై లక్ష్యం చిన్నబోయింది. ఈ సీజన్ లో సెంచరీ చేసి జట్టును గెలిపించలేకపోయిన ఆటగాడిగా సచిన్ నిలిచాడు. యూసఫ్ పఠాన్, రాజస్థాన్ రాయల్స్ (2010) ఐపీఎల్-2010 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఆటగాళ్లు అంబటి రాయుడు(55), సౌరభ్ తివారీ(53) లు చెలరేగడంతో రాజస్థాన్ కు ముంబై 212 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్య చేధనలో తడబడిన రాజస్థాన్ 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో బ్యాటింగ్ కు దిగిన యూసఫ్ పఠాన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగమైన సెంచరీ నమోదు చేశాడు. యూసఫ్ కేవలం 37 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు బ్రేక్ కాలేదు. 173 పరుగుల వద్ద రనౌట్ గా యూసఫ్ వెనుదిరిగాడు. చివర్లో పారాస్ దోగ్రా (41) ప్రయత్నించినా, రాజస్థాన్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఈ సీజన్లో సెంచరీ వృథా చేసుకున్న బాట్స్ మన్ గా యూసఫ్ నిలిచాడు. ఆండ్రూ సైమండ్స్, డెక్కన్ చార్జెర్స్ (2008) ఐపీఎల్ తొలి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ పై సైమండ్స్ 53 బంతుల్లో 117 పరుగులు బాదడంతో డెక్కన్ చార్జెర్స్ 214 పరుగులు చేసింది. గెలుపు కాయం అనుకున్న తరుణంలో రాజస్థాన్ బ్యాట్స్ మెన్స్ గ్రేమ్ స్మిత్ (71), యూసఫ్ పఠాన్ (61) విజృంభించడంతో డెక్కన్ చార్జెర్స్ కు పరాజయం తప్పలేదు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల చేజింగ్ రికార్డుగా నమోదు అయింది. ఈ రికార్డు ఇప్పటి వరకు ఎవరూ అధిగమించకపోవడం గమనార్హం. సెంచరీ వృధా చేసుకున్న ఆటగాడిగా సైమండ్స్ నిలిచాడు. -
నా సినిమా నన్ను ఆవిష్కరిస్తుంది: సచిన్
లండన్: తన జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘సచిన్ ఎ బిలి యన్ డ్రీమ్స్’ చిత్రం తనను ఆవిష్కరిస్తుందని సచిన్ టెండూల్కర్ చెప్పారు. సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందు కు ఇక్కడికి వచ్చిన సచిన్ మాట్లాడుతూ ‘నా జీవితంలోని మధురఘట్టాల్ని నేను తిరిగి చూసుకునేందుకు, నా సుదీర్ఘ పయనంలో నాకు మాత్రమే తెలిసిన విశేషాలను అభిమానులతో పంచుకునేందుకు ఈ బయోపిక్చర్ ఉపయోగపడుతుం ది. ఈ సినిమా నా ఇన్నింగ్స్ల్లాగే అభిమానుల్ని అలరిస్తుంది. 24 ఏళ్ల కెరీర్లో నాపై కురిపించిన ఆదరాభిమానాల్ని ఈ సినిమాపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నా’నని అన్నారు. ఈ చిత్రానికి రవి భాగ్చంద్క నిర్మాతగా వ్యవహరించగా.. ప్రముఖ డైరెక్టర్ జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించాడు. -
నన్ను ‘సార్’ అనొద్దు... ‘ఓకే సార్’!
న్యూఢిల్లీ: క్రికెట్లో ఎవరెస్ట్ అంతటోడు సచిన్. తన సుదీర్ఘ ప్రస్థానంలో వేలకొద్దీ పరుగులు... లెక్కలేనన్ని రికార్డులున్నట్లే... ఎన్నో విశేషాలు, గమ్మత్తు అనుభవాలూ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ బ్యాటింగ్ దిగ్గజం చెబుతుంటే సరదాగానే ఉండొచ్చు కానీ... అయనకు అప్పుడు ఎదురైనవి మాత్రం ఇబ్బందికర పరిస్థితులే మరి! బుధవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన తను సారథ్యం వహించిన రోజుల్లో హిందీ, ఇంగ్లీష్ భాష రాని సహచరులతో ఎలా వేగాడో ఇలా చెప్పుకొచ్చారు. 1997లో సచిన్ సేన దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఈ క్రమంలో కర్ణాటక బౌలర్ దొడ్డ గణేష్కు కన్నడ తప్ప ఇంకే భాష రాదు. ఇలాంటి సందర్భంలో సచిన్ పడరాని పాట్లే పడ్డారు. అయితే గణేష్ మాత్రం సచిన్ ఏమని అడిగిన... ఏం చెప్పినా... ‘ఓకే సార్’ అనేవాడు. ‘దీంతో నాకు అర్థమైందేమిటంటే... నేనేం చెప్పిన అతనిచ్చే సమాధానం ‘ఓకే సార్’. పదేపదే అలా అనడంతో నేనోసారి... నన్ను సార్ అని పిలవొద్దని చెప్పా. విచిత్రంగా దానిక్కూడా అతనిచ్చిన సమాధానం ‘ఓకే సార్’! ఏం చేయను.. ఒక దేశానికి చెందిన మేమిద్దరమే భాష అర్థం కాక సతమతమవుతుంటే... ఓ రోజు డొనాల్డ్తో పెట్టుకున్నాడు. వెంటనే నేను వెళ్లి నీవు ఎం చెప్పాలనుకున్నా ముందు నాకు అర్థమయ్యేలా చెబితే... నేను డొనాల్డ్కు వివరిస్తాను అని చెప్పా! దీనికీ ఓకే సార్ అనే సమాధానమే’ అని సచిన్ వివరించారు. గణేష్ -
లెజెండ్
-
ఓటమితోనే... గెలిచేది, నేర్చేది!
షారుక్ ట్వీట్కు సచిన్ స్పందన న్యూఢిల్లీ: ఒకరేమో వెండితెర వేల్పు! మరొకరు క్రికెట్ దేవుడు! ఎవరికి వారే సాటి. విభిన్న చిత్రాలతో షారుక్ ఖాన్ బాలీవుడ్కు బాద్షా అయితే... సంచలన బ్యాటింగ్తో సచిన్ క్రికెట్లో పరుగుల మెషీన్ అయ్యాడు. ఈ హేమాహేమీలు అప్పట్లో పెప్సీ యాడ్లో కలిసి నటించడం... ఇద్దరి స్టార్ల అభిమానుల్ని అదేస్థాయిలో అలరించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు కొత్తగా ట్వీట్లతోనూ ఒకరికొకరు తమ హృదయ స్పందనను తెలియజేసుకున్నారు. దీనికి ట్విట్టర్ వేదికైంది. ఈ సెలబ్రిటీల ట్వీట్లు ఇరు వర్గాల అభిమానుల్ని ఉత్సాహపరిచేలా ఉన్నాయి. క్రికెట్ లెజెండ్ సచిన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సచిన్– ఎ బిలియన్ డ్రీమ్స్’. చ్చే నెల 26న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో షారుక్... మాస్టర్ బ్లాస్టర్కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘నేను బలంగా నమ్ముతున్నా... నీవు బాగా ఆడినపుడు నా సినిమా బాగా ఆడింది. అదే నీవు విఫలమైనపుడు నా సినిమా ఫెయిలైంది. నీ శతకోటి అభిమానుల్లో నేను ఒకడ్ని. నీ బయోపిక్చర్కు ఆల్ ద బెస్ట్ సచిన్’ అని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన సచిన్ ‘జీవితంలో ఓటమే లేకుంటే గెలుపనేదే ఉండదు... నేర్చుకునేదీ ఉండదు. శతకోటి అభిమానుల్లాగే నీ మాటలు నా మనసును తాకాయ్..! లవ్ యూ షారుక్’ అని పోస్ట్ చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ అభినేత్రి మాధురి దీక్షిత్, శ్రేయా ఘోషల్లు కూడా సచిన్కు శుభాకాంక్షలు తెలిపారు. -
ముల్తాన్..సుల్తాన్.. సెహ్వాగ్
న్యూఢిల్లీ: సరిగ్గా ఇదే రోజు భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ మైలు రాయిగా నిలిచింది. అదే త్రిశతక వీరుడు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వీర రూపం చూపించన రోజు. మార్చి 29, 2004 ప్రపంచ టెస్టు క్రికెట్లోనే అత్యంత వేగమైన త్రిబుల్ సెంచరీ నమోదయింది. ఈ ఘనత వీరు మన దాయాదీ పాకిస్థాన్పై సాధించడంతో భారత అభిమానులకు పండుగ దినమైంది. ఈ ఘనత సాధించి నేటికి 13 సంవత్సరాలు. దీన్ని గుర్తు చేసుకుంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో సెహ్వాగ్కు అభినందనలు తెలుపుతున్నారు. ముల్తాన్ టెస్టు రెండో రోజు ఆటలో త్రిశతకం సాధించి భారత్ తరపున తొలి త్రిబుల్ సెంచరీ సాధించన క్రికెటర్గా సెహా్వగ్ రికార్డు నమోదు చేశాడు. త్రిబుల్ సెంచరీని వీరు సిక్సర్తో సాధించడం కొసమెరుపు. అప్పటి వరకు వీవీఎస్ లక్ష్మణ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల (281) రికార్డును వీరు అధగమించాడు. ఈ ఇన్నింగ్స్లో సెహ్వాగ్ 39 బౌండరీలు, ఆరు సిక్సర్లతో దాయదులకు చుక్కలు చూపించాడు. వీరు 82.40 స్ట్రైక్రేట్తో అత్యంత వేగంగా త్రిశతకం బాదిన బ్యాట్స్మన్గా రికార్డు నెలకొల్పాడు. వీరు మెరుపు బ్యాటింగ్తో భారత్ రెండేరోజుల్లో650 పరుగులు చేసింది. మిగతా రెండురోజుల్లో పాక్ను రెండు సార్లు ఆల్ అవుట్ చేసి ఇన్నింగ్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ అత్యంత దుమారానికి కూడా కారణమైంది. సచిన్ టెండూల్కర్ (194 ) డబుల్ సెంచరీకి దగ్గర్లో ఉండగా అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మ్యాచ్ను డిక్లెర్ చేశాడు. ఇది పెద్ద వివాదం అయింది. సచిన్ తన కన్న ముందు 5 డబుల్ సెంచరీలు చేస్తాడన్న అక్కసుతోనే ద్రవిడ్ డిక్లర్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ మ్యాచ్ గెలవడం కోసమే అలా చేశానని, సచిన్కు ముందే చెప్పానని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. ఇదే విషయాన్ని సచిన్ తన బయోగ్రఫీ ప్లేయింగ్ ఇట్ మై వే లో ద్రవిడ్ తప్పులేదని, ముందే తనకు సూచించాడని తెలిపాడు. -
సచిన్, ధోనీలను మించిన కోహ్లి..
-
సచిన్, ధోనీలను మించిన కోహ్లి..
ముంబై: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటతోనే కాకుండా ప్రచారకర్తగా కూడా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ప్రముఖ స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ బ్రాండ్ పూమాకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నాడు. దేశంలో ఒకే బ్రాండ్తో వంద కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న తొలి క్రీడాకారుడిగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డులకెక్కాడు. ఎనిమిది సంవత్సరాలకు రూ.110 కోట్లతో ప్రచారకర్తగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో కోహ్లి ప్రసిద్ధ క్రీడాకారులు జమైకా పరుగుల వీరులు ఉసెన్బోల్ట్, అసఫా పోవెల్, ఫుట్బాల్ ఆటగాళ్లు థీయరీ హెన్రీ, ఆలివర్ గిరౌడ్ల సరసన చేరాడు. ఒప్పందం ప్రకారం కోహ్లికి పూమా సంవత్సరానికి రూ.12 నుంచి రూ.14 కోట్లు ఇవ్వనుంది. పూమాతో చాలకాలం ఒప్పందం కుదుర్చుకున్నానని, పూమా భారత్లో అతి తక్కువ కాలంలో పాపులారిటీ పొందడం తనను ఆకట్టుకుందని, గొప్ప చరిత్ర కలిగిన ఆటగాళ్లు పూమాకు ప్రచారకర్తలుగా ఉండటం సంతోషంగా ఉందని కోహ్లి తెలిపాడు. సచిన్, ధోని, వివిధ స్పోర్ట్స్, ఏజెన్సీల ఒప్పందాలతో రూ.100 కోట్ల క్లబ్లో చేరారు. సచిన్ 24 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 50కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరించాడు. సచిన్ 1995లో వరల్డ్టెల్తో అత్యధికంగా రూ.30 కోట్లకుపైగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2001లో ఇదే ఒప్పందాన్ని డబుల్ రేటుతో పునరుద్ధరించుకున్నాడు. సాచి, సాచిస్ కంపెనీలకు ప్రచారకర్తగా 2006లో సచిన్ మూడు సంవత్సరాలకు రూ.175 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. సచిన్ తర్వాత అంత స్థాయిలో ప్రచారాల ద్వారా లబ్ధి పొందిన క్రికెటర్ ధోనినే. ప్రచారకర్తగా సుమారు రూ.180 కోట్లు ఆర్జించాడు. ధోని దెబ్బతో 2013లో 20 కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్న నటుడు షారుక్ఖాన్ అతని ఒప్పందం విరమించుకోవాల్సి వచ్చింది. కోహ్లి 2013లో అడిడాస్తో ఏడాదికి రూ.10 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం గత ఏడాది డిసెంబర్ వరకూ కొనసాగింది. తర్వాత ఈ ఒప్పందం పునరుద్దరించకపోవడంతో పూమాతో తాజాగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. -
ట్రైనీ ఎస్ఐ ఆత్మహత్య
హైదరాబాద్: షామీర్పేట్లోని సీఐఎస్ఎఫ్లో ట్రైనీ ఎస్ఐ సచిన్(25) ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరికి వేలాడుతూ కనిపించడం గమనించిన సహచరులు అధికారులకు సమాచారం ఇచ్చారు. సచిన్ స్వస్థలం హర్యానా. గత అక్టోబర్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
మరో కారు కొనుక్కున్న దీపా కర్మాకర్
ఒలింపిక్స్లో ప్రదర్శనకుగాను ప్రోత్సాహకంగా సచిన్ చేతుల మీదుగా తాను అందుకున్న బీఎండబ్ల్యూ కారు స్థానంలో జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ మరో కారును కొనుక్కుంది. అగర్తలా వీధులలో తాను బీఎండబ్ల్యూ కారును వాడలేనంటూ దీపా, తనకు బహుమతి ఇచ్చిన చాముండేశ్వరీనాథ్కు తిరిగి ఇచ్చేసింది. దానికి బదులుగా ఆయన నుంచి అందుకున్న రూ. 25 లక్షలతో హ్యుందాయ్ ఎలాంత్రా కారును ఆమె కొనుక్కుందని కోచ్ బిశ్వేశ్వర్ నంది వెల్లడించారు. తమ నగరంలో దానికి సర్వీస్ సెంటర్ కూడా ఉందని ఆయన చెప్పారు. -
కోహ్లి ఒక బ్రాండ్..కానీ
న్యూఢిల్లీ:భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్తో పోల్చే స్థాయి మాత్రం కాదని ఫుట్బాల్ మాజీ కెప్టెన్ బైచింగ్ భూటియా అభిప్రాయపడ్డాడు. గత కొంతకాలంగా విరాట్ సాధించిన ఘనతలతో అతనొక బ్రాండ్గా మారిపోయాడని భూటియా తెలిపాడు. 'ప్రస్తుతం విరాట్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఓవరాల్గా చూస్తే కోహ్లి పేరే ఒక బ్రాండ్ గా మారిపోయింది. కానీ సచిన్ టెండూల్కర్తో విరాట్ ను పోల్చడం మాత్రం కరెక్టు కాదు. సచిన్ సాధించిన ఘనతలు అసాధారణం. సచిన్ చాలా మైలురాళ్లను సృష్టించిన దిగ్గజ క్రికెటర్. విరాట్ను వేరుగా, సచిన్ను వేరుగా చూస్తేనే మంచింది. సచిన్తో పోల్చదగిన స్థాయికి ఇంకా విరాట్ చేరలేదు'అని బైచింగ్ భూటియా అన్నాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి 2,595 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు సాధించిన కోహ్లి..13 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.అత్యంత నిలకడైన ప్రదర్శనతో వరల్డ్ క్రికెట్ను శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలోనే సచిన్ తో విరాట్ ను పలువురు పోల్చుతుండగా, కొంతమంది మాత్రం ఆ పోలికతో విభేదిస్తున్నారు. సూపర్ మ్యాన్.. విరాట్ కోహ్లి(ఇక్కడ క్లిక్ చేయండి); -
ఆ పోలిక విరాట్కు వద్దే వద్దు..
ముంబై:ఇప్పటికే క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను తిరగరాసిన భారత స్టార్ విరాట్ కోహ్లిని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్తో పోల్చుతుంటే, అసలు ఆ పోలిక వద్దే వద్దే అంటున్నాడు ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జెఫ్రీ బాయ్కాట్. ఏవో కొన్ని రికార్డులను ఒక ఆటగాడు లిఖించినంత మాత్రానా, దిగ్గజ ఆటగాళ్లతో విరాట్ను పోల్చడం ఎంతమాత్రం సమంజసం కాదంటున్నాడు. దాంతో పాటు విరాట్ కోహ్లి క్రికెట్లోని అన్ని రికార్డులను బద్ధలు కొడతాడని తాను అనుకోవడం లేదన్నాడు. ఒకవేళ సచిన్ రికార్డులను కోహ్లి బద్ధలు కొట్టినా, అది ఏమీ పెద్ద విషయమే కాదని బాయ్కాట్ పేర్కొన్నాడు. గత విరాట్ను చూస్తే అతనేమీ పెద్ద గొప్ప ఆటగాడు విషయం అవగతం అవుతుందన్నాడు. ఈ క్రమంలోనే ఒక ఉదాహరణను జెఫ్రీ తెలిపాడు. గతంలో ఢిల్లీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ రికార్డును తాను బద్ధలు కొట్టిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. ఆ ఘనతతో తాను సోబర్స్ కంటే అత్యుత్తమ ఆటగాడిగా మారిపోలేదనే విషయాన్ని జెఫ్రీ అంగీకరించాడు. రికార్డులు వస్తూ పోతూ ఉంటాయనే విషయాన్ని మాత్రమే ఇక్కడ గ్రహించాలన్నాడు. ఒకవేళ విరాట్ ఫామ్ కడవరకూ ఇలానే ఉంటే అప్పుడు మాత్రమే అతను గ్రేటెస్ట్ అనే అంశాన్ని నిర్ధారించాలన్నాడు. అంతేకానీ సచిన్ టెండూల్కర్తో విరాట్ను ఇప్పుడు పోల్చడం మాత్రం సరికాదన్నాడు. -
బ్యాడ్మింటన్ లీగ్లోకి సచిన్
► పీబీఎల్లో ‘బెంగళూరు బ్లాస్టర్స్’ ఫ్రాంచైజీలో వాటా కొనుగోలు ►భాగస్వాములుగా నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ బెంగళూరు: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తాజాగా బ్యాడ్మింటన్ లీగ్లోనూ అడుగు పెట్టారు. ఇప్పటికే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో కేరళ బ్లాస్టర్స్ సహ యజమానిగా ఉన్న ఆయన బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ (పీబీఎల్)లో బెంగళూరు బ్లాస్టర్స్ ఫ్రాంచైజీలో వాటా తీసుకున్నారు. ‘ఫిట్నెస్, నైపుణ్యత, చురుకుదనం కలబోతే బ్యాడ్మింటన్. బెంగళూరు బ్లాస్టర్స్లో భాగం అవుతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉంది. వచ్చే సీజన్లో ఈ జట్టు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకోవాలని కోరుకుంటున్నాను’ అని సచిన్ తెలిపారు. మరోవైపు ఈ ఒప్పదం వివరాలను సహ యజమాని, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ వెల్లడించారు. ‘సచిన్, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, నేను కలిసి ఓ బృందంగా ఏర్పడి బెంగళూరు జట్టులో పెట్టుబడి పెట్టాం. ప్రస్తుతానికై తే ఆ మొత్తం ఎంత అనేది చెప్పలేం. కానీ సరైన సయమంలో వెల్లడిస్తాం’ అని నిమ్మగడ్డ ప్రసాద్ తెలిపారు. అంతగా విజయవంతం కాని బ్యాడ్మింటన్ లీగ్లో ప్రవేశించడాన్ని ఆయన సమర్థించుకున్నారు. క్రీడల్లో అడుగుపెట్టే ప్రతీ పెట్టుబడిదారులకు ఇలాంటి సవాళ్లు మామూలేనని, అరుుతే తాము లాభాల కోసమే ఇందులో అడుగుపెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో బ్యాడ్మింటన్ ప్రమాణాలను మరింత పెంచే ఉద్దేశంతోనే దీంట్లోకి వచ్చినట్టు ఆయన చెప్పారు. లీగ్లో సచిన్ అడుగుపెట్టడం ఆటగాళ్లకు ప్రేరణగా ఉండడమే కాకుండా ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతుందని జాతీయ కోచ్ గోపీచంద్ అభిప్రాయపడ్డారు. మీడియా సమావేశంలో సినీ హీరో అల్లు అర్జున్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ కూడా పాల్గొన్నారు. పీబీఎల్ జనవరి 1 నుంచి 14 వరకు జరుగుతుంది. -
బన్నీ జీవితంలో బెస్ట్ సెల్ఫీ
ఈ జనరేషన్ హీరోలందరూ సినిమాలతో పాటు ఇతర బిజినెస్ల మీద కూడా దృష్టి పెడుతున్నారు. కొంత మంది సినీ నిర్మాణరంగంలో డబ్బులు పెడుతుంటే మరికొందరు హోటల్ బిజినెస్, క్రీడారంగంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. వరుస బ్లాక్ బస్టర్స్తో సత్తా చాటుతున్న బన్నీ బిజినెస్మేన్గా కూడా ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే హైదరాబాద్లో ఓ హైక్లాస్ బార్ ఓపెన్ చేశాడు బన్నీ. ఇద్దరు పార్టనర్స్తో కలిసి బన్నీ ప్రారంభించిన క్లబ్ సూపర్ హిట్ అయ్యింది. అదే బాటలో మరో బిజినెస్లోకి అడుగుపెడుతున్నాడు స్టైలిష్ స్టార్. ఇటీవల చిరంజీవి, నాగార్జునలతో కలిసి కేరళ ఫుట్బాల్ టీంను సొంతం చేసుకున్న సచిన్ టెండుల్కర్, ఇప్పుడు బ్యాడ్మింటన్ టీంను కూడా కొన్నాడు. నాగ్, నిమ్మగడ్డ ప్రసాద్లతో పాటు అల్లు అర్జున్ కూడా ఈ టీంకు భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్లో ప్రకటించిన అల్లు అర్జున్, సచిన్ టెండుల్కర్, పుల్లెల గోపీచంద్, నిమ్మగడ్డ ప్రసాద్లతో కలిసి దిగిన సెల్ఫీని తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేశాడు. తన జీవితంలో దిగిన బెస్ట్ సెల్ఫీలలో ఇదీ ఒకటి అంటూ కామెంట్ చేసిన బన్నీ, లెజెండరీ క్రీడాకారులతో కలిసి బెంగళూరు బ్లాస్టర్స్ బ్యాడ్మింటన్ టీంకు భాగస్వామిగా వ్యవహరించటం ఎంతో ఆనందంగా ఉందన్నాడు.One of my Best selfie's ! Legendary Sports men ! Great Honour being associated & Co-owners of the Team #BengaluruBlasters pic.twitter.com/n9DjljUpPW— Allu Arjun (@alluarjun) 8 December 2016 -
సచిన్ ‘ఆత్మకథ’కూ అవార్డు
న్యూఢిల్లీ: ఇప్పుడు తన ఆత్మకథతో కూడా అవార్డు దక్కించుకున్నాడు. రెండేళ్ల క్రితం విడుదలైన అతని స్వీయచరిత్ర ‘ప్లేరుుంగ్ ఇట్ మై వే’ అభిమానులు, పుస్తక ప్రియుల ఆదరణతో తాజా గా రేమండ్ క్రాస్వర్డ్ పాపులర్ అవార్డును సొంతం చేసుకుంది. అమ్మకాల రికార్డుతో ఈ ఏడాది ఆరంభంలో ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్న ఈ ఆత్మకథకు ఇప్పుడు పాపులర్ చారుుస్ అవార్డు లభించడం పట్ల క్రికెట్ దిగ్గజం... ప్రచురణ కర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. -
సూపర్మ్యాన్లా భావిస్తారు!
► అభిమానాన్ని అదుపు చేయడం కష్టం ► నాలుగు ఐస్ ముక్కలు చాలని సచిన్తో చెప్పా ► విరాట్ కోహ్లి చెప్పిన విశేషాలు క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు రారాజులా వినిపిస్తున్న పేరు విరాట్ కోహ్లి... ఫార్మాట్ ఏదైనా అతని తిరుగులేని ప్రదర్శనకు ఆటగాళ్లు, విశ్లేషకులు అంతా దాసోహం అంటున్నారు. ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నంలాటి కోహ్లి భారత అభిమానుల దృష్టిలో మరో సచిన్ టెండూల్కర్. ముఖ్యంగా గత రెండేళ్ల కాలంలో అతని ఆటకు అన్ని రికార్డులు ముంగిట వచ్చి వాలిపోతున్నారుు. పోలికలో ఒక రకంగా సచిన్ను కూడా అతను మించిపోతున్నాడు. భారత టెస్టు కెప్టెన్గా విశాఖపట్నంలో మరో అద్భుత విజయం సాధించిన అనంతరం కోహ్లి తన గురించి ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విశేషాలు... సెంచరీలే ఆశిస్తారు బౌండరీ వద్ద నిలబడినప్పుడు ప్రేక్షకులు పదే పదే నేను సెంచరీ కొట్టాలని కోరుతూ ఉంటారు. సాధ్యాసాధ్యాల సంగతి పక్కన పెడితే వారి అభిమానాన్ని తప్పు పట్టలేం. ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడ్డాను కానీ ఇది వారు కురిపిస్తున్న ప్రేమని మెల్లగా అర్థమైంది. భారత క్రికెటర్కు ఇదంతా సహజం. దానినుంచి దూరంగా వెళ్లాలని ప్రయత్నిస్తే అది ఇంకా వెంటాడుతుంది. మరింతగా ఒత్తిడి పెంచి మనల్ని కింద పడేస్తుంది. కొన్నేళ్లు పోతే మర్చిపోతారు నేను బాగా ఆడుతున్నానని, అన్ని రికార్డులు బద్దలు కొడతానని అంతా చెబుతుంటారు. అరుుతే నేను వాస్తవానికి దగ్గరగా బతుకుతాను. ఒక 10-12 ఏళ్లు ముందుకు వెళితే నేను మీకు కనిపించను. ఆ స్థానంలో మరొకరు వస్తారు. ఇప్పుడు చూపిస్తున్న ఆదరాభిమానాలు, కీర్తి అతనికి దక్కుతారుు. కాబట్టి ప్రస్తుతంకంటే నేను భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తా. జట్టులోని మిగతా 10 మందికంటే నేనేమీ గొప్ప కాదని భావిస్తాను. చేతులు పట్టుకొని చూశాడు టి20 ప్రపంచ కప్ సందర్భంగా ఆశ్చర్యకర అనుభవం ఎదురైంది. ఎరుుర్పోర్ట్లో ఒక వ్యక్తి నాకు చేరువగా వచ్చాడు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోబోతే నేను వారించాను. అతను నా చేరుు చూపించమని అడిగాడు. పట్టుకొని ఏదో ఒంట్లో కరెంట్ వచ్చినట్లుగా కదిలిపోయాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించి ఏంటిది అని తిట్టుకున్నాను. అతను నన్నేదో సూపర్మ్యాన్లా భావించాడు. చాలా మంది మమ్మల్ని పట్టుకొని మనిషా కాదా అన్నట్లుగా చూసి చెక్ చేసుకుంటారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ మాటలు మార్చేశారుు ప్రొఫెషనల్ క్రీడలలో ప్రొఫెషనలిజం కనిపించనిది ఒక్క క్రికెట్లోనే. టెన్నిస్ ఆటగాళ్లలాంటి ఫిట్నెస్ మనకేదీ అని అప్పటి కోచ్ ఫ్లెచర్ ఒక రకంగా వ్యంగ్యంగా అన్నారు. దాంతో ఫిట్నెస్పై దృష్టి పెట్టాలని నిర్ణరుుంచుకున్నా. అప్పట్లో ఏది పడితే అది తినేవాడిని. ఎక్కువసేపు మెలకువగా ఉండటంతో పాటు రెగ్యులర్గా మద్యం తాగేవాడిని కూడా. తర్వాత అన్నీ మానేసి కఠినంగా కసరత్తులు చేశాను. ఒక్కోసారి ఆకలికి తట్టుకోలేకపోయేవాడిని. అరుుతే మంచి ఫలితాలు వచ్చాక అదే డైట్ను కొనసాగించాను. శ్రీలంకలో ఒకసారి ఫీల్డింగ్ సందర్భంగా నా ఫిట్నెస్ స్థారుు చూసి నేనే ఆశ్చర్యపోయా. క్రికెట్టే నన్ను ఎంచుకుంది నాకు గుర్తున్నంత వరకు క్రికెట్ బ్యాట్తోనే నా బాల్యం గడిచిపోరుుంది. ఇంట్లో అందరికంటే చిన్నవాడిని కావడంతో బాగా చదవాలని, సంపాదించాలనే ఒత్తిడి నాపై ఎప్పుడూ లేదు. నన్ను అందరూ గారాబం చేయడాన్ని కూడా బాగా వాడుకున్నాను! ఆరేళ్ల వయసులో క్రికెట్కు ఉన్న విలువేమిటో అర్థమైంది. సచిన్ గురించి తెలిసింది కూడా అప్పుడే. 12 ఏళ్ల వయసులో తొలిసారి చూశాను. చాలా మందిలాగే ఆయనే స్ఫూర్తిగా ఆట వైపు మరలాను. డ్రెస్సింగ్ రూమ్లో తొలిసారి... చాలా ఏళ్ల తర్వాత సచిన్తో కలిసి ఆడే అవకాశం వచ్చింది. సహజంగానే సీనియర్ల ముందు మన ఇష్టాఇష్టాలు, పార్టీల గురించి చెప్పలేకపోవడం భారతీయుల్లో సహజం. నాకు డ్రింక్ అంటే ఇష్టమని సచిన్తో చెప్పగలగడమే నాకు ఎదురైన పెద్ద సవాల్! ఆయన డ్రింక్ తీసుకోమని అడిగారు. నాకు అలవాటు లేదన్నాను. మళ్లీ అడిగితే మళ్లీ అదే జవాబిచ్చాను.చివరకు నాకు నాలుగు ఐస్ క్యూబ్లు చాలని చెప్పగలిగాను. ఆ తర్వాత అది చాలా సాధారణంగా మారిపోరుుంది. అరుుతే ఇప్పుడు ఐపీఎల్ వల్ల అందరం తొందరగా కలిసిపోగలుగుతున్నాం. జోక్స్ చెప్పుకోవడం, సెల్ఫీలు కామన్గా మారిపోయారుు. ఇంకా మారాల్సి ఉంది మైదానంలో నా ఆవేశాన్ని ప్రదర్శిస్తుంటాను. కొన్నిసార్లు పరిస్థితులు చేజారిపోరుునప్పుడు అసహనం పెరిగిపోవడమే దానికి కారణం. దీన్ని ఇంకా తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాను. అర్ధ సెంచరీలు, సెంచరీలు సాధించినప్పుడు సంబరాలు జరుపుకోవడం కూడా తగ్గించేశాను. నా పనే పరుగులు చేయడం అరుునప్పుడు అంత ఉద్వే గం ప్రదర్శించడం అవసరమా అనిపించడమే అందుకు కారణం. -
ప్రిక్వార్టర్స్లో సచిన్
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ సచిన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో 49 కేజీల విభాగం రెండో రౌండ్లో సచిన్ 3-0తో పీటర్ కాస్మిన్ (రొమేనియా)పై గెలిచాడు. -
నేడు నెల్లూరు జిల్లాకు క్రికెట్ లెజెండ్ సచిన్
-
త్వరలో పుట్టంరాజు కండ్రిగకు సచిన్?
ఏర్పాట్లు పరిశీలించిన జేసీ, సచిన్ పీఏ గూడూరు: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ దత్తత గ్రామం అయిన పుట్టమరాజు కండ్రిగలో జేసీ ఇంతియాజ్, సచిన్ పీఏ నారాయణలతోపాటు ఇన్చార్జి ఆర్డీఓ వెంకటసుబ్బయ్యలతో కలిసి గురువారం పర్యటించారు. త్వరలో సచిన్ ఆ గ్రామానికి రానున్నారని, ఈ మేరకే జేసీ గ్రామాన్ని విజిట్ చేసినట్లు తెలుస్తోంది. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను వర్మిక్యులైట్, టైలరింగ్, పచ్చళ్ల తయారీపై శిక్షణ ఇచ్చేందుకు అక్కడికి వచ్చిన ఏజన్సీవారితో పలు విషయాలపై చర్చించారు. త్వరలో గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు, త్వరితగతిన గ్రౌండ్ను చదును చేయాలని సంబంధిత అధికారుకు ఆదేశించారు. ముఖ్యంగా గ్రామంలో రోడ్డు విస్తరణలో 7 కాలనీ ఇళ్ల బేస్మెంట్లు తీసివేయడం జరిగింది. దీంతో హౌసింగ్ అధికారులు ఆ మొత్తాన్ని మినహాఇంచి బిల్లులు చేస్తామని చెప్పడంతో ఆ మొత్తంతో తాము ఇళ్ల నిర్మించుకోలేమని, నూతనంగా ఇళ్లు మంజూరుకు గతంలో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు గ్రామాన్ని సందర్శించిన సమయంలో వారు విన్నవించుకోవడం జరిగింది. ఈ క్రమంలో వారికి పూర్తి పేమెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ ఆ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆయన వెంట చీఫ్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకయ్య, ఇతర శాఖాధికారులు ఉన్నారు. -
ఆలస్యానికి అడ్రస్ లక్ష్మణ్
కోల్కతా: సచిన్కు తెలిసింది రెండే రెండు... మైదానంలో పరుగుల వరద పారించడం, ఆ తర్వాత షాపింగ్లో మునగడం! అతని సహచరుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పిన ముచ్చట ఇది. సొంతగడ్డపై భారత్ 250వ టెస్టు ఆడుతున్న సందర్భంగా కొందరు క్రికెటర్లతో సరదాగా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తమ డ్రెస్సింగ్ రూం విశేషాలను ఆటగాళ్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ ‘మ్యాచ్లో సెంచరీ చేశాడంటే మరుసటి రోజు సచిన్కు షాపింగ్ తప్ప మరో వ్యాపకం ఉండేదికాదు. అర్మానీ, వెర్సెస్లాంటి బ్రాండింగ్ డ్రెస్లు అతని వార్డ్రోబ్లో చాలా కనిపిస్తాయి. తన దుస్తుల విషయంలో సచిన్ ప్రత్యేక శ్రద్ధ పెడతాడు’ అని చెప్పారు. హైదరాబాదీ సొగసరి బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ అయితే ఆలస్యానికి కేరాఫ్ అడ్రస్ అని గంగూలీ గుర్తు చేసుకున్నారు. ‘నాలుగో, ఐదో స్థానం ఆటగాళ్లు క్రీజ్లో ఉన్న సమయంలో కూడా అతను ఇంకా బాత్రూంలో స్నానం చేస్తూ కనిపించేవాడు. టీమ్ బస్సులోకి అందరికంటే ఆలస్యంగా వచ్చేది కూడా అతనే’ అని గంగూలీ అన్నారు. తాను ఆడిన రోజుల్లో శుచీ శుభ్రతా గురించి అసలు ఏ మాత్రం పట్టించుకోని ఆటగాళ్లంటే సిద్ధూ, అజయ్ జడేజాలే అని మరో మాజీ కెప్టెన్ కపిల్దేవ్ చెప్పారు. ‘ఉత్తరాదివారే దూకుడుగా ఉంటారని మేం అనుకునేవాళ్లం. దక్షిణాదివాళ్లు సున్నితంగా, ప్రశాంతంగా ఉంటారని భావించాం. కానీ కుంబ్లే తన ఆటతో వారిలోని దూకుడును చూపించాడు’ అని కపిల్దేవ్ వ్యాఖ్యానించడం విశేషం. -
సచిన్ ఓనం వేడుక
తిరువనంతపురం: భారత మాజీ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తిరువనంతపురంలో సందడి చేశారు. కేరళ బ్లాస్టర్ టీం సభ్యులతో కలిసి ఓనమ్ పండుగను జరుపుకున్నారు. కేరళ బ్లాస్టర్స్ యాజమాని అయిన సచిన్ టీం సభ్యులతో కలిసి భోజనాలు చేశాడు. ఈ విషయాన్ని సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఓనం పండుగను దేశ, విదేశాల్లో ఉన్న కేరళీయులు ఘనంగా జరుపుకుంటారు. -
అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం
కేరళ బ్లాస్టర్స్ యజమాని సచిన్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ మూడో సీజన్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తామని మాజీ క్రికెటర్, కేరళ బ్లాస్టర్స్ టీమ్ యజమాని సచిన్ టెండూల్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఏడాది వైఫల్యం తర్వాత ఈ సారి అనేక మార్పులతో జట్టు బరిలోకి దిగుతోంది. బుధవారం ఇక్కడ బ్లాస్టర్స్ జెర్సీ ఆవిష్కరణతో పాటు జట్టు సభ్యుల పరిచయ కార్యక్రమం కూడా జరిగింది. సచిన్తో పాటు ఫ్రాంచైజీ సహ యజమానులు నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్ కూడా ఇందులో పాల్గొన్నారు. కేరళ సంప్రదాయ దుస్తుల్లో వీరు హాజరయ్యారు. ‘కుర్రాళ్లు, అనుభవజ్ఞులతో కూడిన మా జట్టులో మంచి ప్రతిభ ఉంది. అటాకింగ్ తరహా ఆటతో మైదానంలో దూసుకుపోవాలని వారు ఉత్సాహంగా ఉన్నారు‘ అని సచిన్ అన్నారు. అందరూ ఇష్టపడే తరహాలో కేరళ శైలిలో ఫుట్బాల్ ఆడాలన్నారు. గత ఏడాది ఆడిన జట్టులో ఆంటోనియా జర్మన్, జోసూలతో పాటు ఐదుగురు భారత ఆటగాళ్లను ఈ సారి కూడా బ్లాస్టర్స్ కొనసాగించింది. 27 మంది సభ్యుల టీమ్లో మిగతావారంతా కొత్తవారే. మార్క్యూ ప్లేయర్ ఆరోన్ హ్యూజెస్తో పాటు దిదియార్ బోరిస్, సెడ్రిక్ హెంగ్బార్ట్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. మాంచెస్టర్ యునెటైడ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ కోపెల్ను ఈ సారి జట్టు కోచ్గా ఎంచుకుంది. సీజన్ ఆరంభానికి ముందు కేరళ బ్లాస్టర్స్ జట్టు థాయ్లాండ్లో కొన్ని ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడనుంది. -
'సచిన్, లారా, పాంటింగ్ గ్రేట్ బ్యాట్స్మన్లు కాదు'
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ దేవుడు, భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, ఆస్ట్రేలియా గ్రేట్ రికీ పాంటింగ్ తన దృష్టిలో అంత గొప్ప ఆటగాళ్లు కారని పేర్కొన్నాడు. తాను క్రికెట్ ఆడిన దశకంలో ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరున్న షోయబ్ అక్తర్ బెస్ట్ బ్యాట్స్ మన్ ఈ ముగ్గురిలో ఎవరూ కాదని అభిప్రాయపడ్డాడు. పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ టాక్ షో లో పాల్గొన్న సందర్భంగా షోయబ్ ఈ విషయాలను వెల్లడించాడు. 'ప్రపంచంలో చాలా మంది గొప్ప బ్యాట్స్ మన్లు ఉన్నప్పటికీ చాలా కష్టమైనా సరే వారిని ఏదో విధంగా ఔట్ చేయగలిగాను. కానీ, తన సహచరుడు, అప్పట్లో జట్టు కెప్టెన్ అయిన ఇంజమామ్ ఉల్ హక్ ను ఔట్ చేయడం చాలా కష్టం. కనీసం నెట్స్ లో ఒక్కసారి కూడా ఇంజీని ఔట్ చేయలేకపోయాను' అని అక్తర్ వెల్లడించాడు. అతడి ఫుట్ వర్క్ చాలా అద్భుతంగా ఉండటంతో తన బంతిని కచ్చితంగా అంచనా వేసేవాడన్నాడు. అందుకే తన బౌలింగ్ ఎదుర్కొన్న వారిలో ఇంజమామ్ అత్యుత్తమ బ్యాట్స్ మన్ అని, అతడితో సరితూగే బ్యాట్స్ లేడని.. ఎవరితోనూ అతడిని పోల్చలేమని అక్తర్ కొనియాడాడు. -
ఈ విజయంతో ఆగిపోవద్దు!
‘రియో’ స్టార్లకు సచిన్ సూచన 2020లో మరింత బాగా ఆడాలన్న మాస్టర్ సింధు, సాక్షి, దీప, గోపీచంద్లకు కార్లు బహుకరణ హైదరాబాద్: భారత దేశం యావత్తూ కలిసి వేడుకను జరుపుకునేందుకు రియో విజేతలు అవకాశం ఇచ్చారని, మున్ముందు ఇలాంటి రోజులు మరిన్ని రావాలని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆకాంక్షించారు. జాతి మొత్తం ఈ సమయంలో పట్టరాని సంతోషంతో ఉందని ఆయన అన్నారు. రియోలో పతకాలు గెల్చుకున్న సింధు, రెజ్లర్ సాక్షి మలిక్లతో పాటు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, కోచ్ గోపీచంద్లను అభినందించేందుకు ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సచిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి. చాముండేశ్వరీనాథ్ తరఫున ఈ నలుగురికి బీఎండబ్ల్యూ కార్లను సచిన్ బహుకరించారు. ‘భారత క్రీడల్లో ఇదో సుదినం. మన అమ్మాయిలు గర్వపడే ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడే విజయాల ప్రయాణం ప్రారంభమైంది. ఇది ఇక్కడితో ఆగిపోవద్దు. మేమందరం మీ కోసం ప్రార్థిస్తాం. మీకు అండగా నిలుస్తాం. మేం సంబరాలు జరుపుకునేందుకు మళ్లీ మీరు అవకాశం ఇవ్వాలి. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు రానున్నాయని నేను నమ్ముతున్నా’ అని సచిన్ వ్యాఖ్యానించారు. పుల్లెల గోపీచంద్ను రియల్ హీరోగా, యువతరానికి రోల్మోడల్గా అభివర్ణించిన సచిన్... మరిన్ని పతకాలు సాధించేందుకు ఆయన మార్గదర్శనం కావాలని చెప్పారు. ఈ పతకాల సాధన వెనుక ఎంతో శ్రమ, పట్టుదల, త్యాగాలు ఉన్నాయని సింధు, సాక్షిలపై మాస్టర్ ప్రశంసలు కురిపించారు. మరిన్ని విజయాలు సాధిస్తాం... దశాబ్దం క్రితం బ్యాడ్మింటన్ ఒలింపిక్ పతకం తెస్తానని తాను చెబితే ఎవరూ నమ్మలేదని, సహకరించేందుకు ముందుకు రాలేదని గోపీచంద్ గుర్తు చేసుకున్నారు. అలాంటి సమయంలో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అండగా నిలవడంతో అకాడమీ నిర్మాణం సాధ్యమైందని, ఇప్పుడు వరుస ఒలింపిక్స్లలో పతకాలు గెలవగలిగామని ఆయన అన్నారు. ఒలింపిక్స్కు ముందు, ఒలింపిక్స్ సమయంలో కూడా సచిన్ మాటలు ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాయని గోపీ చెప్పారు. ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి దేశంలో సంబరాలకు కారణం కావడం గతంలో ఎప్పుడూ లేదని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఒలింపిక్స్కు ఒంటరిగా వెళ్లానని, ఇప్పుడు దేశం మొత్తం తన వెంట ఉందని సాక్షి సంతోషం వ్యక్తం చేయగా... పతకం తీసుకురాకపోయినా దేశ ప్రజలు ఇంతటి ప్రేమ చూపించడం గర్వంగా అనిపిస్తోందని దీపా కర్మాకర్ చెప్పింది. చాన్నాళ్ల క్రితం బ్యాడ్మింటన్లో ప్రదర్శనకే తొలి కారు స్విఫ్ట్ డిజైర్ అందుకున్నానని, ఇప్పుడు కారు బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించడం పట్ల సింధు కృతజ్ఞతలు తెలిపింది. సింధు, గోపీలకు బీఎండబ్ల్యూ 320డి మోడల్... సాక్షి, దీపలకు బీఎండబ్ల్యూ ఎక్స్1 మోడల్ కార్లను బహుమతిగా అందజేశారు. చాముండేశ్వరీనాథ్తో పాటు పారిశ్రామికవేత్తలు వై.నవీన్, టి. శ్రీనివాస్, ఎం.వెంకటరమణ, సి.అనిల్ వీటికి స్పాన్సర్లుగా వ్యవహరించారు. మరోవైపు గోపీచంద్ అకాడమీ తరఫున కూడా సింధు, సాక్షి, దీప లకు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. -
పీవీ సింధుకు సచిన్ ప్రశంసలు
-
ఇంతకన్నా గొప్ప 'రాఖీ' కానుక ఉండదేమో!
అన్నా-చెల్లెలి అనుబంధానికి రక్షగా నిలిచే రాఖీ పండుగను జరుపుకొంటున్న తరుణంలోనే రెజ్లర్ సాక్షి మాలిక్ దేశంలో కొత్త ఆనందాన్ని నింపారు. రియో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టారు. తన సోదరి సాధించిన ఈ విజయంపై సాక్షిమాలిక్ సోదరుడు సచిన్ రాధాకృష్ణన్ ఆనందం వ్యక్తం చేశారు. రాఖీ పండుగ సందర్భంగా ఇంతకన్నా గొప్ప కానుకను ఏ చెల్లి కూడా తన అన్నకు ఇచ్చి ఉండదంటూ ఆయన పేర్కొన్నారు. పతకం గెలువాగానే తాను సాక్షికి రక్షాబంధన్ మెసేజ్ పంపించానని, ఒక అన్నగా ఆమెను తనకు ఎంత ఆప్యాయత ఉందో ఆ మెసేజ్లో తెలియజేశానని సచిన్ చెప్పారు. మరోవైపు సాక్షి మాలిక్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆమెను పెద్ద ఎత్తున అభినందిస్తూ.. మహిళా శక్తిని చాటిన సాక్షికి నీరాజనాలు పడుతున్నారు. ఆమె ప్రతిభను కీర్తిస్తూ ట్వీట్ చేస్తున్నారు. -
ఆమె హృదయాలను గెలుచుకుంది: సచిన్
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ లో అద్భుత ప్రతిభ ప్రదర్శించిన దీపా కర్మాకర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీపాను కీర్తించిన జాబితాలో తాజాగా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేరారు. ఆటలో గెలుపోటములు సహజమని దీపా తన అద్భుత ప్రదర్శనతో కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకుందని, దేశం ఆమెను చూసి గర్విస్తోందని సచిన్ ట్వీట్ చేశారు. భారత త్రివర్ణ పతాకాన్ని ప్రపంచంలో ముందుంచడానికి దీపా, ఆమె కోచ్ గొప్ప కృషి చేశారని మరో భారత క్రికెటర్ శిఖర్ ధవన్ కొనియాడారు. జిమ్నాస్టిక్ పోటీలో 0.150 పాయింట్ల తేడాతో దీపా నాల్గవ స్థానంలో నిలిచి తృటిలో కాంస్య పథకాన్ని కోల్పోయింది. Winning & losing is a part of sport.. You've won millions of hearts & the entire nation is proud of ur achievements. https://t.co/qSpiWFSp2K — sachin tendulkar (@sachin_rt) 15 August 2016 Congratulations to you and your coaches @dipakarmakar for placing the tricolour at the forefront of world gymnastics. Proud #DipaKarmakar — Shikhar Dhawan (@SDhawan25) 15 August 2016 -
కొద్దిగంటల్లో పెళ్లి... అంతలోనే... వరుడు ఆకస్మిక మృతి
సచిన్ మృతదేహం బెంగళూరు(బనశంకరి): కొద్దిగంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు ఆకస్మికంగా మృతిచెందిన ఘటన చిక్కమంగళూరు జిల్లా సుళ్య పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు... సుళ్య తాలూకా పంజ గ్రామంలోని కండూరకు చెందిన పరమేశ్వరగౌడ కుమారుడు సచిన్(29)కు ఎడమంగలలోని హొన్నప్పాడి బాలకృష్ణగౌడ కుమార్తె గాయత్రితో వివాహం నిశ్చయించారు. పైందోడి సుబ్రమణ్యస్వామి దేవస్థానంలో బుధవారం ఉదయం వివాహం చేయడానికి ఇరుకుటుంబాలు సిద్ధమయ్యాయి. మంగళవారం రాత్రే బంధుమిత్రులతో కళ్యాణమంటపానికి చేరుకోవడానికి సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం ఇంటిలో పెళ్లి కుమారుడు సచిన్ షేవింగ్ చేసుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. గాయపడిన బాధితుడిని వెంటనే పుత్తూరు ఆదర్శ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సచిన్ మరణవార్త తెలియగానే ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. ఘటనపై సుళ్య పోలీసులు కేసు నమోదు చేశారు. -
వెస్ట్ జోన్ జట్టులో అర్జున్ టెండూల్కర్
వడోదర:ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో భాగంగా అండర్ -16 వెస్ట్ జోన్ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఎంపికయ్యాడు. ఈ మేరకు సోమవారం ఆలిండియా జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ రాకేష్ పారిక్ నేతృత్వంలో సెలక్టర్లు అర్జున్ కు అవకాశం కల్పించారు. వెస్ట్ జోన్ జట్టుకు ఓఎమ్ భోసాలే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అండర్-16 వెస్ట్ జోన్ జట్టు: ఓఎమ్ భోసాలే(కెప్టెన్), వాసుదేవ్ పాటిల్, సువేద్ పార్కర్, స్మిత్ పటేల్, సన్ ప్రీత్ బగ్గా, యస్వి జైశ్వాల్, దైవాంశ్ సక్సెనా, నీల్ జాదవ్, అర్జన్ టెండూల్కర్, యోగేష్ దోంగ్రే, అంకోల్కర్, సురజ్ సుర్యాల్, సిద్దార్త్ దేశాయ్, అకాశ్ పాండే, ముకుంద సర్దార్ -
స్మార్ట్ రాన్ నుంచి టి-ఫోన్
♦ ఆవిష్కరించిన సచిన్, కేటీఆర్ ♦ స్మార్ట్ఫోన్ ధర రూ.22,999 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ స్మార్ట్రాన్ టి-ఫోన్ పేరుతో స్మార్ట్ఫోన్ను గురువారమిక్కడ ప్రవేశ పెట్టింది. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చేతుల మీదుగా ఈ ఫోన్ను విడుదల చేసింది. 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, 64 బిట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 810 అక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీని దీనికి పొందుపరిచారు. 4జీ, డ్యూయల్ ఫ్లాష్తో 13 ఎంపీ కెమెరా, 4 ఎంపీ ఫ్రంట్ కెమెరా, డీటీఎస్ ప్రీమియం సౌండ్, డ్యూయల్ సిమ్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్-సి చార్జర్ ఇతర ఫీచర్లు. వెలుతురులో డిస్ప్లే స్పష్టత కోసం అపికల్ అసెర్టివ్ టెక్నాలజీని వాడారు. ధర రూ.22,999. నాలుగు రంగుల్లో లభిస్తుంది. జూన్ నుంచి స్మార్ట్రాన్ టి-స్టోర్, గ్యాడ్జెట్360.కామ్లో కొనుక్కోవచ్చు. ఏటా ఒక మోడల్..: స్మార్ట్రాన్ ఇటీవలే ఇక్కడి గచ్చిబౌలిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. తయారీ కేంద్రాన్ని సైతం నెలకొల్పాల్సిందిగా ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. 14 అంగుళాల అల్ట్రాబుక్, 15.6 అంగుళాల ల్యాప్టాప్తోపాటు ఇతర యాక్సెసరీస్ను కొద్ది రోజుల్లో ప్రవేశపెడతామని కంపెనీ వ్యవస్థాపకులు మహేష్ లింగారెడ్డి వెల్లడించారు. ఏటా ఒక ఫ్లాగ్షిప్ మోడల్ను తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే టీ-బుక్ పేరుతో అల్ట్రాబుక్ను ప్రవేశపెట్టామన్నారు. ‘ప్రస్తుతం ఫాక్స్కాన్కు చెందిన విదేశీ ప్లాంట్లలో తయారు చేసి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం. కొద్ది రోజుల్లో ఫాక్స్కాన్ భారత ప్లాంట్లలో తయారు చేయిస్తాం. రెండు మూడేళ్లలో సొంత ప్లాంటు పెట్టాలన్న ఆలోచన ఉంది. పరిశోధన, అభివృద్ధికి రూ.50 కోట్లకుపైగా ఖర్చు చేశాం’ అని పేర్కొన్నారు. సవాళ్లుంటేనే ఫన్..: స్మార్ట్రాన్లో సచిన్ సైతం పెట్టుబడులు పెట్టారు. టి-ఫోన్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సవాళ్లు లేకుంటే జీవితంలో ఫన్ ఉండదని అన్నారు. సవాళ్ల నుంచి వచ్చిన విజయమే మరింత తీయగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘నేను యవ్వనంలో ఉన్నప్పుడు స్మార్ట్ఫోన్లు లేవు. ల్యాండ్లైన్ ముందు కుటుంబ సభ్యులందరూ కూర్చుని మాట్లాడేవారు. ఇప్పుడు అందరి చేతిలోనూ మొబైల్ ఉంటోంది. అందరూ అందుబాటులో ఉంటున్నారు. నా కుమారుడు అర్జున్ కి ఆరేళ్ల వయసు వచ్చే దాకా అతనితో మొబైల్లో మాట్లాడలేదు. స్మార్ట్రాన్ విషయంలో సరైన కంపెనీనే ఎంచుకున్నందుకు గర్వంగా ఉంది’ అన్నారు. -
మరో 36 పరుగులు చేస్తే...
► అరుదైన రికార్డు కుక్ సొంతం ► నేటి నుంచి లంకతో తొలి టెస్టు లీడ్స్: మరో 36 పరుగులు చేస్తే ఇంగ్లండ్ బ్యాట్స్మన్ అలిస్టర్ కుక్... టెస్టుల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో 10 వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్గా రికార్డులకెక్కుతాడు. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా సచిన్ రికార్డునూ అధిగమిస్తాడు. ఈ నేపథ్యంలో మూడు టెస్టుల సిరీస్లో భాగంగా నేటి నుంచి జరిగే తొలి మ్యాచ్లో ఇంగ్లండ్... శ్రీలంకతో తలపడుతుంది. గతంలో సచిన్ 31 ఏళ్ల 10 నెలల వయసులో పాకిస్తాన్ (2005)పై ఈ రికార్డును సాధించాడు. గతేడాది క్రిస్మస్తో కుక్కు 31 ఏళ్లు నిండాయి. -
నన్ను సచిన్తో పోల్చకండి.. ఇబ్బందిగా ఉంది!
పరుగుల యంత్రంలా మారి నిరంతరం రికార్డులతో హోరెత్తిస్తున్న విరాట్ కోహ్లిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, టీ-20 వరల్డ్ కప్, ఐపీఎల్.. ఇలా తాను ఆడిన ప్రతి సీరిస్లోనూ తనదైన ప్రత్యేకత నిలుపుకొంటున్న కోహ్లిని ఇప్పుడు అందరూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్తో పోలుస్తున్నారు. డొనాల్డ్ బ్రాడ్మన్ తర్వాత క్రికెట్లో ఆ స్థాయిలో గొప్ప ఆటతీరును ప్రదర్శించిన ఆటగాడు సచిన్. 100 అంతర్జాతీయ సెంచరీలు, 200 టెస్టులు ఆడిన ఏకైక ఆటగాడికి క్రికెట్ చరిత్రలో సచిన్కు తిరుగులేని స్థానం. మరి, అంతటి లెజండరీ ఆటగాడితో పోలిక పట్ల కోహ్లి ఎలా ఫీలవుతున్నాడంటే.. 'నిజాయితీగా చెప్తున్నా. చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇది సరికాదు. సచిన్ను ఎవరితో పోల్చలేం. నా విషయంలో ఈ పోలిక ఎంతమాత్రం ప్రామాణికం కాదు. అతన్ని చూస్తేనే నేను ఎదిగాను. కానీ క్రీజ్లో నాలా ఆడాలనుకుంటాను. కచ్చితంగా సచిన్ నుంచి స్ఫూర్తి పొందుతాను. ఏ ఆటగాడితో పోల్చినా రెండు రెట్లు ఎక్కువ ఎత్తులో ఉంటారు ఆయన. సచిన్కు ప్రతిభ స్వతహఃగా జన్మతో వచ్చింది. నేను కష్టపడి దానిని సొంతం చేసుకున్నాను' అని కోహ్లి వివరణ ఇచ్చాడు. -
సచిన్కన్నా కాంబ్లీ ఎక్కువ ప్రతిభావంతుడు!
క్రీడల్లో ఎదిగేందుకు ప్రతిభ ఒక్కటే సరిపోదని, సరైన కుటుంబ వాతావరణం, మంచి స్నేహితులు వంటివి కూడా ప్రభావం చూపిస్తాయని క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ అభిప్రాయపడ్డారు. వాస్తవానికి సచిన్కంటే వినోద్ కాంబ్లీ ప్రతిభావంతుడే అయినా అతనికి సరైన మార్గదర్శనం లభించక వెనుకబడిపోగా, అందరి ప్రోత్సాహంతో సచిన్ 24 ఏళ్లు భారత్కు ఆడగలిగాడని గుర్తు చేశారు. అతని విజయాల్లో కుటుంబం కీలకపాత్ర పోషించిందన్నారు. -
మోదీ గురించి కోహ్లి చెప్పిన ఒక్కమాట!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారత టాప్ క్రికెటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగతంగా ఎప్పుడూ కలుసుకోలేదు. కానీ, సోషల్ మీడియాలో వీరు పలుసార్లు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నరేంద్రమోదీ దేశ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పుడు ట్విట్టర్ లో కోహ్లి శుభాకాంక్షలు తెలిపాడు. మోదీ దేశాన్ని మరింత గొప్పగా నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఆ తర్వాత ఇటీవలి వరల్డ్ కప్ సందర్భంలో కోహ్లిని ట్యాగ్ చేస్తూ ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఆల్ ద బెస్ట్ చెప్పారు. వరల్డ్ కప్ లో తన అద్భుత పోరాటంతో టీమిండియాను కోహ్లిని గెలిపించినప్పుడు అతనిపై మోదీ ప్రశంసల వర్షం కురిపించాడు. వ్యక్తిగతంగా కలుసుకోకపోయినా ఇలా కోహ్లి-మోదీ మధ్య మంచి అనుబంధమే ఉంది. ఈ నేపథ్యంలో సీఎన్ఎన్ చానెల్ లో మల్లికా కపూర్ కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారని మల్లికా కపూర్ అడుగగా..'సెల్ఫ్ బిలీఫ్' (ఆత్మవిశ్వాసం) అని కోహ్లి బదులిచ్చారు. ప్రధాని మోదీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ అని కితాబిచ్చారు. అదే సమయంలో తనకున్న క్రికెట్ నైపుణ్యంపైనే విశ్వాసంతోనే తాను మైదానంలో అడుగుపెడతానని కోహ్లి తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో కోహ్లి ఇచ్చిన ఫటాఫట్ జవాబులివి.. క్రికెట్ ను మీరు ఎలా భావిస్తారు? నా జీవితంలో క్రికెట్ కే అన్నింటికన్నా ఎక్కువ ప్రాధాన్యమిస్తాను దూకుడుగా ఆడటంపై.. దూకుడుగా ఆడటమే నన్ను గేమ్ లో టాప్ ఆటగాడిగా నిలబెట్టింది. ఏదిఏమైనా ఎట్టిపరిస్థితుల్లో దానిని వీడను. టెస్ట్ క్రికెట్ ఆడటంపై.. టెస్ట్ క్రికెట్ ఒక ప్రయాణం లాంటింది. ఎన్నింటినో నేర్పిస్తుంది. నిన్ను నువ్వు కనుగొనేందుకు ఉపయోగపడుతుంది. మీ వ్యక్తిగత జీవితంపై వస్తున్న కథనాలపై.. మైదానంలో ఎలా ఆడుతారు అన్న దానిపైనే ఆటగాళ్లను పరిగణించాలి. అంతేకానీ వ్యక్తిగతంగా వారు ఏమిటి అన్నదానిపై కాదు సచిన్ తో అంతర్జాతీయ వేదిక పంచుకోవడంపై.. సచిన్ నా ఆరాధ్యుడు. నా ఆదర్శంగా భావిస్తూ వచ్చిన ఆయనతో కలిసి క్రికెట్ ఆడటం నిజం కాదేమో అనిపిస్తుంది. మ్యాచ్ ఫిక్సింగ్ పై.. ఎవరైనా తప్పు చేయాలనుకుంటే ఎవరూ ఆపలేరు.ఎంత నియంత్రణ ఉన్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఆపడం కష్టం. -
నటించడమే కష్టంగా ఉంది:సచిన్
ముంబై: క్రికెట్ ఆడటం కంటే నటించడమే చాలా కష్టంగా ఉందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. 'సచిన్' మూవీ టీజర్ను గురువారం విడుదల చేసిన అనంతరం సచిన్ టెండూల్కర్ మీడియాతో మాట్లాడాడు. ' నాకు క్రికెట్ ను ఆడటం కంటే నటించడమే ఒక ఛాలెంజ్ అనిపించింది. సినిమా సందర్భంగా నేను ఏది చేయాలనుకున్నానో అది చేశా. కానీ కొన్ని ప్రత్యేకమైన సీన్లలో చాలా ఇబ్బంది పడ్డా. నా డ్రీమ్లో భాగమైన యాక్టింగ్ కంటే క్రికెట్ ఆడటమే సులువుగా అనిపించింది. క్రికెట్ ను ఎంజాయ్ చేస్తూ ఆడా. ఈ రెండింటిని పోల్చి చూస్తే మాత్రం నాకు నటించడమే సవాల్ గా అనిపించింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు' అని సచిన్ పేర్కొన్నాడు. -
వెండితెర మీద క్రికెట్ గాడ్
బాలీవుడ్ తెర మీద మరో బయోపిక్కు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇండియన్ క్రికెటర్స్ ధోని, అజారుద్దీన్ల జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్న నేపథ్యంలో క్రికెట్ గాడ్ సచిన్ బయోగ్రఫీ కూడా వెండితెర మీద సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ను సచిన్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. కాళ్లకు ప్యాడ్స్ కట్టుకొని వస్తున్న ఈ ఫొటో అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సచిన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏ బిలియన్ డ్రీమ్స్ అనే క్యాప్షన్ను యాడ్ చేశారు. '55 రోజుల ట్రైనింగ్, ఒక జత ట్రౌజర్స్, సచిన్ స్టోరీ' అని పోస్టర్పై రాసిన స్టేట్ మెంట్, ఇది సచిన్ పూర్తి బయోగ్రఫీ కాదేమో అన్న అనుమానం కలిగిస్తోంది. తన పాత్రలో సచిన్ స్వయంగా నటిస్తున్న ఈ సినిమాను డాక్యుమెంటరీ సినిమా తరహాలో రూపొందిస్తున్నారు. బ్రిటిష్ దర్శకుడు జేమ్స్ ఎరిక్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అదిస్తున్నాడు. ఈ నెల 14న సచిన్ ఫస్ట్ లుక్ టీజర్ను విడుదల చేయనున్నారు.