Published
Sun, Nov 1 2015 3:07 PM
| Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకం ఆదివారం నుంచే తప్పనిసరి కాదని రాష్ట్ర రవాణా శాఖమంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. హైదరాబాద్లో ఆదివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాకే హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడినప్పుడు హెల్మెట్ మనల్ని రక్షిస్తుందని, దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని మంత్రి వివరించారు.