Sidda Raghava rao
-
మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వివాహ వార్షికోత్సవ వేడుకలు
-
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కాపాడిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పరిఢవిల్లుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత శిద్ధా రాఘవరావు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి, సంక్షేమంలో మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. తాడేపల్లివైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం ఎప్పుడు ఏ కొత్త పథకం ప్రవేశపెడతారా.. అని దేశంలోని మిగితా ముఖ్యమంత్రులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారన్నారు. ఏపీ సీఎంను అందరూ ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగానికి గుర్తుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నవంబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించుకునే వాళ్లమన్నారు. అయితే, రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నిర్వాకంతో నవంబర్ ఒకటో తేదీ ప్రాధాన్యత తగ్గిపోయిందన్నారు. ఇలా చంద్రబాబు చేసిన పొరపాటును సీఎం జగన్ సరిదిద్ది ఆర్యవైశ్యుల ఆత్మగౌరవం కాపాడారని తెలిపారు. అలాగే, వాసవీ దేవాలయాలకు ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చినట్లుగానే, ఇప్పుడు సీఎం జగన్ మినహాయింపులు ఇస్తున్నారని తెలిపారు. -
వైఎస్సార్సీపీలో చేరిన శిద్దా రాఘవరావు
-
ప్రకాశం జిల్లాలో టీడీపీకి మరో షాక్
సాక్షి, తాడేపల్లి : ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్ పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. (ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లు కూడా..) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా శిద్ధా రాఘవరావు మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాను. సీఎం జగన్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏడాది కాలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు అనేకమంది లబ్ధి పొందుతున్నారు. భవిష్యత్తులోనూ అనేక సంక్షేమ పథకాలు సీఎం అమలు చేస్తారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. -
ఐదేళ్ల పాలనకు ఓ నమస్కారం!
సాక్షి, దర్శి (ప్రకాశం): టీడీపీ ప్రభుత్వ పాలనలోఐదేళ్లు వెనక్కు చూస్తే ప్రతి ఒక్కరికీ నష్టాలు తప్ప ఏం ఒరిగిందనే విమర్శలు మెండుగా ఉన్నాయి. 2014–15వ సంవత్సరంలో అక్రమ కేసులతో నియోజకవర్గం అట్టుడికింది. మంత్రి శిద్దారాఘవరావు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ నేతల పై దాడులు చేసి అక్రమ కేసుల పేరుతో నియోజకవర్గంలో భయభ్రాంతులు సృష్టించారు. ఆతరువాత రైతులకు సాగర్ జలాలు విడుదల చేశారు. రైతులు వరి నాటుకున్న తరువాత సాగర్ జలాలు పూర్తి స్థాయిలో అందజేయలేదు. దీంతో వరి పంట పూర్తి గా ఎండి పోయింది. కానీ మంత్రిగా ఉన్న శిద్దారాఘవరావు పట్టించుకోకుండా వదిలేశారు. అప్పట్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గా ఉన్న బూచేపల్లి శివప్రసాద్రెడ్డి సాగర్ కాలువలపై పర్యటన జరిపి కొంతమేర రైతులకు సాగర్ జలాలు అందించేందుకు కృషి చేశారు. మిరప రేట్లు బాగా ఉన్నా తెగుళ్లు రావడంతో రైతులు భారీగా నష్ట పోయారు. కంది వేసిన రైతులకు కనిస మద్దతు ధర కూడా రాలేదు. 2015–16లో సాగర్ జలాలు విడుదల చేయలేదు. రైతులు కంది, మిరప వంటి పంటలు వేసుకున్నారు. కందికి కొంత గిట్టుబాటు ధర ఉన్నప్పటికీ వర్షాభావ పరిస్థితులు అనుకూలించలేదు. 2016–17లో సాగర్ జలాలు విడుదల కాలేదు. వర్షాలు కురవక వేసిన పంటలు బాగా దెబ్బతిన్నాయి. మిరప మొదట్లో మంచి గిట్టుబాటు ధరలు ఉండటంతో రైతులు ఆపంటలే అధికంగా వేశారు. దీంతో రేటు పడిపోయి నానా ఇబ్బందులు పడ్డారు. 2017–18 సాగర్ జలాలు విడుదల కాలేదు. సంవత్సరం నియోజకవర్గంలో మరణ మృదంగంలా విషజ్వరాలు విజృంభించాయి. ప్రతి రోజూ ఒకటీ రెండు మరణాలు సంభవించడం జరిగింది. సుమారు 80 మందికి పైగా మరణించారు. ఈ ఏడాది సాగర్ జలాలు రాక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. వర్షాలు పూర్తి స్థాయిలో కురవక కురువు మేఘాలు కమ్ముకున్నాయి. కందులకు గిట్టు బాటు ధరలు రాలేదు. ఇతర రాష్ట్రాల్లో కందులు తక్కువ ధరలకు దిగుమతి చేసుకుని ఇక్కడి రైతుల పేరిట మార్క్ ఫెడ్, నాపెడ్ ద్వారా రైతులకు చెందాల్సిన గిట్టు బాటు ధరలను మంత్రి బినామీలే మింగేశారు. మిరప పంటలు వేసిన రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు. కరువు దెబ్బకు రైతులు కూడా కూలి పనులకు పోవడం మొదలు పెట్టారు. 2018 –19 సంవత్సరంలో ప్రభుత్వం సాగర్ జలాలు ఇస్తామని చెప్పడంతో వేసిన కందిని చెడగొట్టి వరి నాటుకున్నారు. వరి కంకి దశలోకి వచ్చేసరికి సాగర్ జలాలు నిలిపివేశారు. దీంతో కంది పంటకు ఎకరాకు రూ.5 వేలు, వరి పంటలో రూ.25 వేలు రైతులు నష్ట పోయారు. ఈ తరుణంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ వరి రైతుల పరిస్థితి చూసి చలించి పోయారు. వరి పొలాలు సందర్శించి రైతులకు సాగర్ జలాలు విడుదల చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. అయినప్పటికీ మంత్రి శిద్దారాఘవరావు కాని , జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ సాగర్ జలాలు తీసుకు రావడానికి కనీస ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో వేలాదిఎకరాలు ఎండి రైతులు నష్ట పోయారు. ఐదేళ్లుగా గొంతెండుతోంది.. ఎన్ఏపీ రిజర్వాయర్ ద్వారా ప్రతిరోజు దిగు నీరు అందిస్తున్నట్లు అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై బిల్లులు చేసుకుని ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు బొక్కుతున్నారు. ఇలా ప్రజలకు అందించాల్సిన తాగునీటిలో కూడా అవినీతిని పారించారు. నీరు చెట్టు పేరుతో భారీగా దోచుకున్నారు. ప్రతి పథకానికి జన్మభూమి కమిటీలు పెట్టి సామాన్యులకు పింఛన్లు , కార్పొరేషన్ లోన్లు రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలాల పంపిణీ పేరుతో అనాదీనం భూములను సాగు దారులనుంచి అతి తక్కువ ధరలకు కొనుగోనుగోలు చేసి ప్లాట్లుగా వేసి వాటిని అధిక లాభాలకు అమ్మకాలు చేసి వారికి ప్రభుత్వ పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఈ ముసుగులో ఈ పట్టాలన్నీ మంత్రి శిద్దా రాఘవరావు ఉచితంగా ఇచ్చినట్లు ప్రచారం చేసి పట్టాల ముసుగులో పక్కా దోపిడీకి పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం నియోజకవర్గంలో 12 విద్యుత్ సబ్స్టేషన్లలో 48 మంది నూతన సిబ్బందిని తీసుకున్నారు. వారిలో ఎస్సీల కోటాలో 15 శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్.. రోష్టర్ పాటించాలి. అయితే కేటాయించాల్సిన ఉద్యోగావకాశాలను కూడా ఇతర కులాలకు ఒక్కో ఉద్యోగానికి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు అమ్ముకుని ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం చేశారు. ఈ తతంగంలో మంత్రి శిద్దా హస్తం ఉన్నట్లు సమాచారం. దీంతో ఎస్సీ, ఎస్టీ సంఘ నాయకులు ఆయనకు దూరమయ్యారు. ఈకారణంతోనే టీడీపీకి చెందిన ప్రధాన ఎస్సీ, ఎస్టీ నాయకుతు గాలిమూటి దేవప్రసాద్, ఉప్పల పాటి కిరణ్ ప్రసాద్, జి. వరప్రసాద్, కవలకుంట్ల గోవింద్ ప్రసాద్, కే సన్నీబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర వంటి మంత్రికి ముఖ్య అనుచరులుగా ఉన్న ప్రధాన ఎస్సీ , ఎస్టీ నాయకులు మంత్రికి దూరమయ్యారు. హామీలు గాలికొదిలారు దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్, విమానాశ్రయం అభివృద్ధి, హెలికాప్టర్ల కంపెనీ, కార్ల విడిభాగాల కంపెనీలంటూ మంత్ర చెప్పారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే పిచ్చిచెట్లు దర్శిన మిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న హామీ నెరవేరక పోవడంతో వారంతా నిరాశలో ఉన్నారు. దర్శిలో డిగ్రీకళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, మినీ స్టేడియం, జీప్లస్ త్రీ కాంప్లెక్స్లు, శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. దర్శిలో ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పి కనీసం ఆ ఊసే ఎత్తలేదు. చందవరం సమీపంలోని గుండ్లకమ్మపై ఏర్పాటు చేసిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకుండానే ఇదే నా.. అభివృద్ది అంటూ మంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం ఆబ్రిడ్జిపై కనీసం ఆపార్టీ గుర్తు అయిన సైకిల్ కూడా తిరగడం లేదు. ఈసారి ఓటర్లు చూపు ఎటువైపు ఉంటుందో వేచి చూడాల్సిందే. -
వీరి మధ్యే అసలు పోటీ
సార్వత్రిక ఎన్నికల సమరం చివరి ఘట్టానికి చేరింది. మైకుల హోరు.. హామీల జోరుతో ముందుకు సాగిన నేతలు.. తమ తలరాతలు ఎలా మారబోతున్నాయోనని ఎదురు చూస్తున్నారు. ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. జన సేన ఉన్నప్పటికీ ఆ పార్టీ ప్రభావం జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా మూడు పార్లమెంట్, 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు వారి గుణగణాలు, విజయావకాశాలను ఒక్కసారి పరిశీలిద్దాం. సాక్షి, ఒంగోలు సిటీ: ఒంగోలు పార్లమెంట్ స్థానానికి ఘన చరిత్ర ఉంది. రాజకీయ ఉద్యమాలకు పురిటి గడ్డ ఇది. ఎందరో ఉద్దండులు, మహామహులు ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి, టీడీపీ తరఫున శిద్దా రాఘవరావు బరిలో నిలిచారు. మూడు దశాబ్దాలుగా మాగుంట కుటుంబం ఒంగోలు కేంద్రంగా రాజకీయాల్లో రాణిస్తూ ప్రజాసేవ చేస్తోంది. శిద్దా రాఘవరావు పదిహేనేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు కేంద్రంగా నివాసం ఉంటూ జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుండగా.. శిద్దా రాఘవరావు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి చెంది ఎంఎల్సీగా రాజకీయాల్లో కొనసాగారు. 2014లో దర్శి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన శిద్దా.. మాగుంట సహకారంతోనే ఆ ఎన్నికల్లో గట్టెక్కారని ఆయన సన్నిహతులే చెబుతుంటారు. శిద్దాకు రాష్ట్ర మంత్రి మండలిలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఇలా మాగుంట, శిద్దా.. జిల్లా రాజకీయాల్లో సుపరిచితులుగా ఉన్నారు. శిద్దా అందుబాటులో ఉన్నట్టే ఉంటారు. కొందరికే ఆయనను కలిసేందుకు అనుమతి ఉంటుంది. అన్ని వేళలా అందుబాటులో ఉండరు. ఫోన్ ఎత్తి మాట్లాడాలంటే కష్టమే. కొన్ని క్లిష్టతరమైన సందర్భాల్లో జనంపై చిర్రుబుర్రులాడతారు. జనం సమస్యలపై ఇచ్చే అర్జీల సంగతి పట్టించుకోరు. మంత్రిగా ఆయన ఇక్కడ సాధించిన విజయాలు అతి తక్కువే. కలుపుగోలుతనంగా ఉండరన్న విమర్శలున్నాయి. ఇటీవల యర్రగొండపాలెంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో నోటికొచ్చినట్లుగా మాట్లాడి తన నిజ రూపాన్ని ప్రదర్శించారని శిద్దా అనుచరులే అంటున్నారు. చేసే సాయం పది మందికీ తెలిసేలా చేయడం శిద్దా నైజం. తనకు ఇబ్బంది వచ్చే అంశాల నుంచి తప్పుకోవడానికి ఎంతటి వారినైనా ప్రలోభపెట్టడంలో ఆయకు ఆయనే సాటి అనే విమర్శ ఉంది. మాగుంట సౌమ్యంగా ఉంటారు. పది మందితో కలిసి ముందుకు సాగుతారు. కార్యకర్తలను కూడా పేరు పెట్టి పిలుస్తారు. ఎంతటి వారినైనా గౌరవిస్తారు. పిల్లలతో పిల్లవానిగా, పెద్దలతో పెద్దగా, మేధావులతో తలలో నాలుకలా వ్యవహరిస్తారు. అందరితో కలిసి భోజనం చేస్తారు. ఆప్యాయంగా పలకరిస్తారు. ఫోన్ చేస్తే నిద్రలో ఉన్నా లేచి మాట్లాడతారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే గుణం మాగుంట శ్రీనివాసరెడ్డిది. వ్యాపారాల్లో దిట్టలు మాగుంట శ్రీనివాసులురెడ్డి చెన్నై, హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. శిద్దా రాఘవరావుకు చీమకుర్తి గ్రానైట్తో పాటు పాలిషింగ్ యూనిట్ ఇతర వ్యాపారాలున్నాయి. బ్యాంకింగ్ రంగంలోనూ వీరికి పరిచయం ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వీరికి వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. ఇరువురూ ధార్మిక కార్యక్రమాలకు కొంత నగదు వెచ్చిస్తున్నారు. మాగుంట కుటుంబం గత 30 ఏళ్ల నుంచి సేవా రంగంలో ఉండి తన సొంత నిధులతో ప్రజలకు తాగునీరు, విద్య అందిస్తున్నారు. శిద్దా రాఘవరావు ధార్మిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. శిద్దా ఎక్కువగా మఠాధిపతులు, పీఠాధిపతులకు సమయం, ధనం వెచ్చిస్తారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ‘మాగుంట’కు ప్రజాభిమానం మెండు జిల్లా ప్రజానీకంతో మాగుంట కుటుంబానిది విడదీయరాని బంధం. జిల్లా ప్రజలు కరువుతో అల్లాడుతున్న వేళ తాగునీటికి సొంత నిధులు వెచ్చించి దప్పిక తీర్చారు. నేటికీ పలు ప్రాంతాల్లో ఉచితంగా నీరు సరఫరా చేస్తున్నారు. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజలకు సురక్షిత నీరు అందించే ఏర్పాట్లు చేశారు. విద్యా సంస్థలు నెలకొల్పి విద్యాదాతగా పేరుపొందారు. ఒంగోలు నగర అభివృద్ధిలో చెరగని ముద్ర వేసి ఇక్కడి ప్రజలతో మమేకమయ్యారు. వివాదాలకు దూరం రాజకీయ వివాదాలకు మాగుంట ఎంత దూరంగా ఉంటారో.. శిద్దా కూడా అంతే. ఏ విషయాన్నైనా పాజిటివ్గా మాగుంట ఆలోచిస్తారు. శిద్దా మాత్రం తన కుటుంబానికి ఎంత మేరకు ప్రయోజనం కలుగుతుందో బేరీజు వేసుకుని ఆచితూచి అడుగు వేస్తారన్న అభిప్రాయం ఉంది. ప్రజల నుంచి మంచితనాన్ని మాగుంట మూటగట్టుకున్నారు. శిద్దాకు గ్రానైట్ వ్యాపార రంగం నుంచి కొన్ని వివాదాలున్నా వాటిని బయటకు రానీయకుండా జాగ్రత్తగా రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారు. ఇటీవల ఒంగోలు పర్యటనకు వచ్చిన పవన్కళ్యాణ్ శిద్దా గ్రానైట్ వ్యాపారం, అక్రమ సంపాదన గురించి ప్రస్తావించడం గమనార్హం. నందిగం సురేష్, బాపట్ల పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ► సామాన్యుడిగా ఎంపీ టికెట్ సాధించారు ► ప్రజలు తమవాడిగా భావిస్తున్నారు ► నిత్యం నియోజకవర్గంలోనే ఉంటున్నారు ► ప్రతి సమస్యా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ► హోదా వాణిని ఢిల్లీలో వినిపిస్తానని చెబుతున్నారు ► యువకుడు కావడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు ► పార్టీకి ఉన్న సానుకూలత కలిసొస్తుందని నమ్ముతున్నారు. శ్రీరామ్ మాల్యాద్రి, బాపట్ల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి ► ఆర్థిక బలంతోనే ఎంపీ టికెట్ సాధించారు ► ప్రజలకు ఎప్పుడూ దూరంగా ఉంటారు ► ఎంపీ అయ్యాక నియోజకవర్గంలో ఉన్నది చాలా తక్కువ ► సమస్యలపై అవగాహన లేదు ► హోదాపై పోరాడిన దాఖలాలు లేవు ► ఎన్నికల సమయంలోనూ అంతంతమాత్రం ప్రచారమే.. ► టీడీపీపై వ్యతిరేకత ఉండడం ప్రతికూలాంశం -
శిద్దాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ కార్యకర్తలు డిమాండ్
-
‘శిద్దాకు ఎంపీ వద్దు.. ఎమ్మెల్యే ముద్దు’
సాక్షి, అమరావతి : మంత్రి శిద్దా రాఘవరావుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం దర్శి టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నివాసానికి వచ్చారు. ‘శిద్దాకు ఎంపీ వద్దు.. ఎమ్మెల్యే’ ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. మంత్రి శిద్దా రాఘవరావును పార్లమెంట్ బరిలో నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన శిద్దాను.. ఈసారి ఒంగోల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలంటూ అధిష్టానం నిర్ణయించింది. అటు దర్శి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఉగ్రనరసింహారెడ్డి పేరును టీడీపీ ప్రకటించింది. అయితే తాను ఎంపీగా పోటీ చేసేది లేదంటూ శిద్దా.. చంద్రబాబు నాయుడికి తేల్చి చెప్పారు. -
ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయండి
సాక్షి, దర్శి: ఈ నెల 28వ తేదీ ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే ముఖ్యమంత్రి ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖామంత్రి శిద్దా రాఘవరావు కోరారు. సోమవారం దర్శిలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శిద్దా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి ముఖ్యమంత్రి ఒంగోలులో చేపట్టే ధర్మపోరాట దీక్ష కార్యక్రమానికి ప్రజలందరూ హాజరై మద్దతు తెలపాలని కోరారు. అనంతరం పట్టణంలోని పుచ్చలమిట్టలో జరిగిన గ్రామదర్శిని– గ్రామ వికాసం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, ఎంపీపీ సంజీవయ్య, నాయకులు పాల్గొన్నారు. -
శిద్దా లాంటి నాయకులు అవసరమా..?
దర్శి: మంత్రి శిద్దా రాఘవరావు దర్శి నియోజకవర్గ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని, అలాంటి నాయకులు మనకు అవసరమా..? అని టీడీపీ దర్శి మండల మాజీ కన్వీనర్, బీసీ నాయకుడు బల్లగిరి శీనయ్య కరపత్రాలు ముద్రించారు. నియోజకవర్గ ప్రజలు దీనిపై ఆలోచించాలని కోరారు. ఆ కరపత్రాలు ప్రస్తుతం వాట్సాప్, ఫేస్బుక్లలో హల్చల్ చేస్తున్నాయి. పట్టణంలోని పలు దుకాణాలు, సెంటర్లలో కూడా దర్శనమిస్తున్నాయి. ఆ కరపత్రాల్లో ఏముందంటే... ‘పార్టీ అధికారంలో లేనప్పుడు నిస్వార్థంతో పనిచేసి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను మంత్రి మరిచిపోయారు. టీడీపీని నమ్ముకుని ఎంతో మంది కార్యకర్తలు తమ ఆస్తులను అమ్ముకుని రేయనక పగలనక, ఎండనక వాననక కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించారు. పార్టీ గెలిచిన తరువాత వారు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. బీసీలంటే ప్రాణం, బీసీలే పార్టీకి వెన్నుముక అని ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంటే.. దర్శి నియోజకవర్గంలో మంత్రి బీసీలను అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. మంత్రి స్వప్రయోజనాల కోసం ఎప్పటి నుంచో ఒకే తాటిపై కలిసి మెలిసి ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకుల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ వ్యతిరేకిస్తే ఇంకో నియోజకవర్గం చూసుకుంటానని, పార్టీ ఫండ్ ఇచ్చి ఎంఎల్సీ తీసుకుంటానని తనమనుషులతో చెప్పిస్తున్నారు. గతంలో ఈ నియోజక వర్గంలో ఓడిన వారు అడ్రస్ లేకుండా పోతున్నారని, గెలిచిన వారు చేసిన ఖర్చులు సంపాదించుకోవద్దా అని అనడమే తప్ప అభివృద్ధి గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. దొనకొండ పారిశ్రామిక హబ్ అని పేదల పొలాలు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పెద్దల నివాసాల వద్ద డ్రైనేజీలను వంకర్లు తిప్పి నిర్మించారు. నామినేటెడ్ పదవుల ఆశ చూపి ఖర్చులు చేయించి చివరకు వారికి పదవులు ఇవ్వకుండా మోసం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశలు చూపి ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, అభివృద్ధి పనులు, తదితర హామీలిచ్చి అమలు చేయలేదు. వీటన్నింటిపై విద్యావంతులు, అనుభవం కలిగిన పెద్దలు, యువకులు, ఉద్యోగులు. మేధావులు ప్రతిఒక్కరూ ఆలోచించాలి’ అని కరపత్రాల్లో పేర్కొన్నారు. అయితే, ఈ విషయమై బల్లగిరి శీనయ్యను ప్రశ్నించగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆ కరపత్రాలను తానే ముద్రించానని చెప్పారు. నియోజకవర్గంలో మంత్రి అతని సామాజికవర్గం వారిని తప్ప ఇతర సామాజికవర్గాల వారిని పట్టించు కోవడం లేదని ఆరోపించారు. టీడీపీ కోసం కష్టపడి పనిచేసిన వారిని దూరంగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మంత్రి శిద్దా ఇంటి ముందు డెయిరీ బాధితుల నిరసన
ఒంగోలు సబర్బన్: ఒంగోలు డెయిరీ బాధితులైన పాడి రైతులు, డెయిరీ ఉద్యోగులు, పాలు సరఫరా చేసిన ట్రాన్స్పోర్టర్స్ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఇంటి ముందు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి శిద్దా రెండు రోజుల నుంచి దాటవేత ధోరణితో వ్యవహరించటంతో సహనం కోల్పోయిన బాధితులు మంత్రి ఇంటి ముందు బైఠాయించారు. శాంతియుతంగా, సామరస్య పూర్వకంగా నిరసన చేయాలని నిర్ణయించిన బాధితులు మంత్రి ఇంటి రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలంలో బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. డెయిరీ బాధితులు చేపట్టిన నిరసనకు రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి శిరిగిరి లలిత సంఘీభావం ప్రకటించారు. అధికార తెలుగుదేశం హయాంలో జిల్లాలోని సహకార సంఘాలను నిలువునా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. అందులో మొదటిది ఒంగోలు డెయిరీ అన్నారు. కోట్ల రూపాయలు దోచుకోవటానికి సహకార సంఘాల్లో ఉన్న డెయిరీని కంపెనీ చట్టంలోకి తెచ్చి నిలువునా పాడి రైతులను, ఉద్యోగులను మోసం చేశారన్నారు. పొందూరు సహకార సొసైటీ అధ్యక్షుడు వేజెండ్ల రామారావు మాట్లాడుతూ మంత్రి హామీ ఇచ్చి కాలయాపన చేస్తున్నారన్నారు. రెండు రోజుల్లో వచ్చి డైరెక్టర్ల చేత రాజీనామా చేయిస్తానన్న మంత్రి రెండు రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోకుండా మళ్లీ పది రోజులని చెప్పి వెళ్లిపోవటం దారుణమని, అందుకే ఆయన ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. నాగులుప్పలపాడుకు చెందిన పాడి రైతు చుండూరి శ్రీరామమూర్తి మాట్లాడుతూ నెలల తరబడి గొడవలు లేకుండా పోరాటం చేస్తున్నామని అన్నారు. రైతులకు మేలు చేస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి ఒంగోలు డెయిరీని నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. డెయిరీ పాలకమండలి చేసిన అవినీతి, అక్రమాల వల్ల డెయిరీలో పూర్తిగా నష్టపోయింది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అభిమానులేనని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు డెయిరీలో ఉద్యోగులు కూడా పార్టీవాళ్లేనని వాపోయారు. ఒంగోలు డెయిరీ పాలు రాష్ట్రంలోనే నాణ్యమైనవని డెయిరీ మహిళా ఉద్యోగులు వివరించారు. ప్రతి రోజూ 1.70 లక్షల లీటర్లు వచ్చే పాలు నేడు రోజుకు 700 లీటర్లకు దిగజారిపోయిందంటే పరిస్థితి ఎంతటి దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. గుట్టుగా డెయిరీలో ఉద్యోగాలు చేసుకోవాల్సిన తాము చెట్ల కింద కూర్చొని తమ గోడు వెళ్లబోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. శిబిరం వద్దకు మంత్రి శిద్దా... మంత్రి ఇంటి ముందు డెయిరీ బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న మంత్రి శిద్దా రాఘవరావు నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లి వెంటనే హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న డెయిరీ బాధితులతో చర్చించారు. పది రోజుల్లో సమస్య పరిష్కరించేందుకు పూనుకుంటానని చెప్పాను కదా ఇంటి ముందు నిరసన ఏమిటని మండిపడ్డారు. దీంతో పాడి రైతులు, డెయిరీ ఉద్యోగులు నెలల తరబడి సమస్యను సాగదీస్తున్నారని, డెయిరీ మూత పడే పరిస్థితికి చేరుకుందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే వద్దకు వెళితే మండిపడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొండ్రగుంటపై మండిపడిన మంత్రి: తెలుగుదేశం పార్టీ రైతు విభాగం మాజీ జిల్లా అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య డెయిరీలో పాడి రైతులు, ఉద్యోగులు పడుతున్న బాధులు గురించి చెబుతున్నప్పుడు మంత్రి శిద్దా రాఘవరావు ఆయనపై మండిపడ్డారు. డెయిరీ వల్ల పూర్తిగా టీడీపీకి చెందిన వారే పూర్తిగా నష్టపోయారని వాపోయారు. డెయిరీ వల్ల తెలుగుదేశం పార్టీకి పూర్తిగా చెడ్డపేరు వస్తుందని అనటంతో మంత్రికి కోపం వచ్చింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇంట్లోకి రాండి మాట్లాడుకుందామని మంత్రి లోపలకు వెళ్లారు. మంత్రి ఇంటికి వెళ్లకుండా నిరసన దీక్ష వద్దే నిరసనకారులు భీష్మించుకు కూర్చున్నారు. ఇవరూ ఇంట్లోకి రాకపోవటంతో మంత్రే నడుచుకుంటూ తిరిగి నిరసన శిబిరం వద్దకు వచ్చారు. నిరసనకారులతో మాట్లాడుతూ జిల్లా ఇన్చార్జ్ మంత్రి నారాయణతోనూ, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావుతోనూ చర్చించి శనివారం ముఖ్యమంత్రితో డెయిరీ విషయం మాట్లాడతామని వివరించారు. ఆదివారం కొందరు ముఖ్యులు వస్తే డెయిరీ సమస్యపై లోతుగా ఆలోచన చేద్దామని హామీ ఇవ్వటంతో నిరసన విరమించారు. -
మాకిది కావాలని అడిగేవారు తక్కువ!
ఒంగోలు టౌన్: జిల్లాలో మాకిది కావాలని అడిగేవారు చాలా తక్కువగా ఉన్నారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. పదిరోజుల పాటు జరిగిన ఐదో విడత జన్మభూమి – మాఊరు కార్యక్రమ ముగింఫు సభ శుక్రవారం స్థానిక ఏ–1 కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు కావాలంటూ జిల్లాకు చెందిన ప్రజలు దరఖాస్తు చేసుకున్నారని, వాటన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో పోలీసు, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు క్లియర్ చేయడంతో జన్మభూమి–మాఊరు సాఫీగా సాగిందన్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు వస్తుంటాయని, ఆ సమస్యల పరిష్కారానికి జన్మభూమి–మాఊరు వేదికగా నిలిచిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో పనిచేసి ప్రభుత్వాలకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో అందరికీ అందేలా చూడాలన్నారు. సీఎంను నవ్వుతూ పంపించారు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవ్వేది చాలా తక్కువని, అలాంటి ఆయన్ను జిల్లాలో జరిగిన జన్మభూమి సభ అనంతరం అధికారులు నవ్వుతూ పంపించారని శాసనమండలి సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి ప్రశంసించారు. జిల్లాలో మైనస్ 72శాతం రెయిన్ ఫాల్ ఉందని, రాబోయో రోజుల్లో మరింత క్రిటికల్గా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ అధికారులపై చాలా ఒత్తిడి ఉంటుందన్నారు. లీకేజీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందుబాటులో ఉండే నీటిని సక్రమంగా సరఫరా చేసేలా చూడాలని సూచించారు. బాగా పనిచేశారు: కలెక్టర్ జన్మభూమి కార్యక్రమ నిర్వహణకు సంబంధించి భయం, ఆందోళనకరంగా ఉన్నా అధికారులు బాగా పనిచేశారని కలెక్టర్ వి. వినయ్చంద్ ప్రశంసించారు. చిట్టచివరి గ్రామాల వరకు జన్మభూమి గ్రామసభలు సజావుగా జరిగాయన్నారు. జన్మభూమి గ్రామసభల్లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఏరోజుకారోజు స్వీకరించి వాటిని ట్యాబ్ల ద్వారా అనుసంధానం చేసి నేరుగా తనతో పాటు ముఖ్యమంత్రి చూసే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండేందుకు డ్వాక్రా మహిళలను సాధికార మిత్రులుగా నియమించినట్లు తెలిపారు. 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమించి 15 రకాల భద్రతలు, 10 రకాల హామీలు ప్రజలకు చేరువయ్యే విధంగా చూస్తున్నారన్నారు. సభలో యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్రాజు, జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు పాల్గొన్నారు. దర్శిలో జన్మభూమి – మాఊరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించిన సమయంలో ఆయన్ను ఆకట్టుకున్న ముండ్లమూరు మండలం బృందావనం గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి విజయకుమార్ పేరున సీఎం ఆదేశాల మేరకు 50 వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ను మంత్రి శిద్దా అందించారు. బెస్టు అవార్డులు జన్మభూమి–మాఊరు కార్యక్రమాల్లో ప్రతిభ కనబరచిన జిల్లాస్థాయి అధికారులు, మండలాలు, నగర పంచాయతీ అధికారులకు బెస్టు అవార్డులు ప్రకటించారు. శుక్రవారం స్థానిక ఏ–1 కన్వెన్షన్ హాలులో జరిగిన ముగింపు సభలో మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్రాజు, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అవార్డులు అందించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రాజ్యలక్ష్మి, పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ రవీంద్రనాధ్ఠాగూర్, ఎల్డీఎం వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి యతిరాజు, ఐసీడీఎస్ పీడీ సరోజిని, సీపీఓ కేటీ వెంకయ్యలకు ఉత్తమ అధికారులుగా అవార్డులు అందించారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రత్యేక అధికారులు పోలప్ప (యర్రగొండపాలెం), రవి (దర్శి), ప్రభాకరరావు (పర్చూరు), శ్రీనివాసరావు (అద్దంకి), మురళి (చీరాల), శ్రీనివాసరావు (సంతనూతలపాడు), అన్నపూర్ణ (ఒంగోలు), మల్లికార్జున(కందుకూరు), ఉమాదేవి (కొండపి), కొండయ్య (మార్కాపురం), కిషోర్(గిద్దలూరు), కైలాస్ గిరీశ్వర్ (కనిగిరి)లకు అవార్డులు అందించారు. ఉత్తమ మండలాలుగా మార్కాపురం, జరుగుమల్లి మండలాలను ఎంపిక చేశారు. ఉత్తమ మునిసిపాలిటీలుగా కందుకూరుకు మొదటి స్థానం, మార్కాపురానికి రెండో స్థానం కింద అవార్డులు ఇచ్చారు. ఉత్తమ పంచాయతీలుగా అద్దంకి మండలం ధేనువకొండ, అర్ధవీడు మండలం అయ్యవారిపల్లి గ్రామాలకు అవార్డులు అందించారు. ఉత్తమ నగర పంచాయతీలుగా అద్దంకి, చీమకుర్తిలకు అవార్డులు అందించారు. చీరాల మునిసిపాలిటీలోని 1వ వార్డు, గిద్దలూరులోని 14వ వార్డు, కందుకూరులోని 12వ వార్డు, కనిగిరిలోని 15వ వార్డు, మార్కాపురంలోని 13వ వార్డు, ఒంగోలులోని 10వ డివిజన్ను ఎంపిక చేసి అవార్డులు అందించారు. చేదు అనుభవం ఐదో విడత జన్మభూమి–మాఊరు ముగింపు సభకు హాజరైన వారికి చేదు అనుభవం ఎదురైంది. సభకు జిల్లా నలుమూలల నుంచి అనేకమంది వచ్చారు. జిల్లా యంత్రాంగం వారికి అరకొరగా భోజన వసతి కల్పించింది. అతిథుల ప్రసంగాలు, సత్కారాలు ముగిసిన అనంతరం భోజనం చేసేందుకు వెళ్లిన వారికి అక్కడ టేబుళ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఒకవైపు జనాలు ఉండటంతో ఆతృతగా అక్కడకు వెళ్లారు. అక్కడి సర్వర్లు తమ వద్ద మిగిలిన కిళ్లీలను ఇవ్వడం ప్రారంభించడం గమనార్హం. -
ఎర్రచందనం కోసం రూ.22కోట్లతో గోదాము
విజయవాడ: ఎర్రచందనం కోసం నిర్మించిన గిడ్డంగులను త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. సుమారు రూ.22 కోట్లతో 25 ఎకరాల్లో ప్రభుత్వం తిరుపతిలో నిర్మించినట్లు ఆయన తెలపారు. బుధవారం ఆయన అటవీశాఖ విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఎర్రచందనం అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు 950 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. మరో 2 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మడానికి త్వరలోనే టెండర్లను పిలుస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఆరు వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. అటవీశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ముఖ్యమంత్రితో సంప్రదించి త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. -
ముహూర్తం ఖరారు
► ఏప్రిల్ 2న మంత్రివర్గ విస్తరణ ఖాయమంటున్న సర్కారు ► జిల్లాకు మరో మంత్రి పదవి దక్కేనా..? ► మాగుంటకు మండలి చైర్మన్, లేదా మంత్రి పదవి.. ► శిద్దా రాఘవరావు శాఖలో మార్పునకు అవకాశం ► జిల్లా ఇన్చార్జ్ మంత్రి రావెలకు పదవీగండం! సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఏప్రిల్ 2న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఖాయమన్న ప్రకటనతో జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందా.. రాదా అన్నవిషయం చర్చ నీయాంశంగా మారింది. నిన్నమొన్నటి వరకూ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. తాజాగా మంత్రి పదవి కాకుండా ఆయనకు మండలి చైర్మన్ పదవి ఇవ్వనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు జిల్లాకు రెండో మంత్రి పదవి లేదన్న ప్రచారమూ సాగుతోంది. జిల్లా నుంచి ఇప్పటి వరకూ శిద్దా రాఘవరావు ఒక్కరే మంత్రిగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు మరో మంత్రి పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఎమ్మెల్సీ మాగుంటకు మంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం జరిగింది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలోనే మంత్రి పదవి ఇస్తానని సీఎం చంద్రబాబు మాటిచ్చినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం ఉంది. నెల్లూరు జిల్లాకే చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే మాగుంటకు సమీకరణాలను బట్టి మండలి చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రెడ్డి సుబ్రమణ్యంకు మండలి వైస్ చైర్మన్ పదవి కట్టబెట్ట నుండడంతో చైర్మన్ పదవి రెడ్డి సామాజికవర్గానికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అందుకు మాగుంట సమర్ధుడని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. మాగుంట మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. సభా నియమ, నిబంధనలపై అవగాహన ఉంది. సౌమ్యుడు, అన్ని వర్గాల నుంచి సానుకూలత, సభను సజావుగా నడిపించే అవకాశం ఉంటుందనే అంశాలను బేరీజు వేసి ఆయనను మండలి చైర్మన్ చేస్తారా.. లేక మంత్రి పదవి ఇస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. శిద్దా శాఖలు మారనున్నాయా..!: జిల్లాకు మరో మంత్రి పదవి ఇచ్చినా.. ఇవ్వక పోయినా మంత్రి శిద్దా రాఘవరావు శాఖల్లో మార్పు ఉంటుందన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా రవాణాశాఖ లేదా రోడ్లు, భవనాల శాఖల్లో ఒక శాఖను ఆయన నుంచి తప్పించే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే శిద్దాపై ముఖ్య మంత్రికి సదాభిప్రాయమే ఉంది. నమ్మిన బంటుగా ఉన్న శిద్దా కోరుకున్నట్లే ముఖ్యమంత్రి నడుచుకునే అవకాశముందని, శిద్దాకు ఇష్టంలేని పక్షంలో ఆయన శాఖల్లో మార్పులు ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాల సమాచారం. రావెల పదవికి ఎసరు..: జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిషోర్బాబును మంత్రి వర్గం నుంచి తప్పించడం ఖాయమన్న ప్రచారం ఉంది. మంత్రి రావెల పనితీరుపై ముఖ్యమంత్రి ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయనను తప్పించి, మరొకరికి మంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే రావెలకు జిల్లా ఇన్చార్జి పదవి కూడా ఊడటం ఖాయంగా కనిపిస్తోంది. -
విజయవాడలో మూడు ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం
విజయవాడ : విజయవాడ నగరంలో మూడు ప్రభుత్వ కార్యాలయాలు బుధవారం ప్రారంభమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని గృహనిర్మాణ శాఖ మంత్రి కె. మృణాళిని ప్రారంభించారు. అలాగే ఇబ్రహీంపట్నంలో ఆర్ అండ్ బీ కార్యాలయాన్ని రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ప్రారంభించారు. అలాగే భూపరిపాలన కార్యాలయాన్ని ఆ శాఖ ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునీత ప్రారంభించారు. -
'పచ్చ' కలెక్టర్..!
ఒంగోలు : యద్దనపూడి మండలం చింతపల్లిపాడులో సోమవారం నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో కలెక్టర్ సుజాతశర్మ తెలుగుదేశం పార్టీ జెండాలతో అలంకరించిన ఎడ్లబండిపై ఊరేగడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పలు విమర్శలకు తావిచ్చింది. ఏరువాక కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కాదు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. తొలకరి వర్షాల నేపథ్యంలో ఏరువాక పౌర్ణమి నాడు వ్యవసాయ పనులు ప్రారంభించడం రైతులకు ఆనవాయితీ. ఈ ఏడాది తొలిసారిగా ఏరువాక కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి ఆత్మ శాఖ నిధులు వినియోగించుకోవాలని సూచించింది. ఇందుకోసం కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. దానిలో భాగంగా పర్చూరు నియోజకవర్గంలోని యద్దనపూడి మండలం చింతపల్లిపాడులో అధికారులు సోమవారం ఏరువాక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్తో పాటు జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, టీడీపీ నేత కరణం బలరాం, స్థానిక ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎడ్లబండిపై ఊరేగింపు నిర్వహించారు. అయితే, ఆ ఎడ్లబండిని తెలుగుదేశం జెండాలతో అలంకరించి పసుపుమయం చేశారు. అదే బండిపై మంత్రి, టీడీపీ నేతలతో కలిసి కలెక్టర్ సుజాతశర్మ ఊరేగారు. పార్టీలకతీతంగా జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాత్రం టీడీపీ జెండాలు కట్టిన బండిలో ఊరేగడం విమర్శలకు దారితీసింది. -
రవాణా శాఖలో అవినీతితో తలవంపులు: మంత్రి శిద్ధా
విజయవాడ : రవాణా శాఖలో అవినీతి తలవంపులు తెచ్చేలా ఉందని ఆ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. విజయవాడ ఏపీఆర్టీసీ భవన్లో ఏడాది కాలంలో శాఖ పనితీరుపై ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవరావు మాట్లాడుతూ... ఏసీబీ దాడుల్లో అధికారులు పట్టుబడితే అది వారి వ్యక్తిగతంగానే కాకుండా రవాణా శాఖకు కూడా తలవంపు వస్తుందన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు రవాణా శాఖ సేవల్లో మరింతగా ఆన్లైన్ విధానాన్ని అమలు చేయనున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న 1,140 ప్రాంతాలను గుర్తించామని... వాటిలో 840 చోట్ల రోడ్ల విస్తరణతోపాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. మిగిలిన చోట్ల స్థలాన్ని సేకరించి పనులు చేయాల్సి ఉందన్నారు. కాగా గతేడాది రూ.1,920కోట్ల ఆదాయ లక్ష్యానికి గాను రూ.2,128 కోట్లు వసూలైనట్టు ఈ సమీక్షలో మంత్రికి అధికారులు వివరించారు. -
హోదా తప్పక వస్తుంది : మంత్రి శిద్దా
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పక వస్తుందని రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై చర్చలు జరుగుతున్నాయన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానితో చర్చిస్తారని చెప్పారు. రవాణా శాఖలో అవినీతికి పాల్పడుతున్న అధికారుల సమాచారాన్ని ఏసీబీకి తామే ఇచ్చి దాడులు చేయిస్తామని అన్నారు. ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదించిన వాటిలో తమ శాఖకు చెందిన పోస్టులు కూడా ఉన్నాయని మంత్రి తెలిపారు. -
రవాణా అధికారుల రిలీవ్కు రెండో జీఓ జారీ
ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖలో జాయింట్ ట్రాన్స్పోర్టు అధికారి ఎస్ఏవీ ప్రసాదరావు, డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ వి.సుందర్లు ఉన్న ఫళంగా రిలీవ్ కావాల్సిందేనని ప్రభుత్వం శుక్రవారం మరో జీవో జారీ చేసింది. ఈ నెల 5న వీరిరువురు బదిలీలపై ప్రభుత్వం జీవో నెంబరు 5 జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే 6న రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం బదిలీలు నిలుపుదల చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖపై రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు, సీఎం పేషీ ఆగ్రహంతో ఉన్న వైనంపై శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. సర్కారు వెంటనే అధికారులిద్దరూ రిలీవ్ కావాల్సిందేనని రెండో జీవో జారీ చేసింది. దీంతో మంత్రి శిద్ధా, సీఎం పేషీ అధికారి ఒకరు తమ పంతం నెగ్గించుకున్నట్లయింది. రవాణా శాఖ కార్యాలయంలో జేటీసీగా పనిచేస్తున్న ప్రసాదరావు తన బాధ్యతల్ని అదనపు కమిషనర్కు అప్పగించి వెంటనే రిలీవ్ కావాలని, విజయవాడలో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విజయవాడలో పనిచేస్తున్న డీటీసీ సుందర్ అనంతపురంలో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.శాంబాబ్ ఉత్తర్వులిచ్చారు. -
నెల్లూరు జిల్లాలో 47 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో 47 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రులు పి.నారాయణ, శిద్దా రాఘవరావు తెలిపారు. బుధవారం మంత్రులు వరద ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సహాయక చర్యలను పర్యవేక్షించారు. అయితే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని కైవల్యానది, పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మనుబోలు వద్ద చెన్నై - కోల్కత్తా జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో రెండో రోజు కూడా ఈ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా నేడు కూడా జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ జానకి సెలవు ప్రకటించారు. -
'హెల్మెట్' ఈరోజు నుంచే తప్పనిసరి కాదు..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకం ఆదివారం నుంచే తప్పనిసరి కాదని రాష్ట్ర రవాణా శాఖమంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. హైదరాబాద్లో ఆదివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాకే హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడినప్పుడు హెల్మెట్ మనల్ని రక్షిస్తుందని, దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని మంత్రి వివరించారు. -
'ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం'
విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీకి ఏటా 600 కోట్ల రూపాయల నష్టం వస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. బుధవారం ఆర్టీసీ హౌస్లో మంత్రి వర్గం ఉపసంఘం సమావేశమైంది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. -
సర్ ఛార్జీలపై వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం
హైదరాబాద్ : గోదావరి పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేయకూడదని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. పుష్కరాలకు వెళ్లే బస్సుల్లో సాధారణ ఛార్జీలు వసూలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని నారాయణ అన్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో సర్ ఛార్జీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీకి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. -
ఆర్టీసీ బాదుడుకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాణికులపై ఆర్టీసీ బస్సు చార్జీల భారం పడనుంది. ఈ మేరకు బస్సు చార్జీల పెంపుదలకు రంగం సిద్ధమైంది. 20 శాతం మేరకు పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనల్ని ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు రెండ్రోజుల క్రితం సచివాలయంలో రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావును కలసి అందజేశారు. జూన్ మొదటి వారంలో ‘నవనిర్మాణ దీక్ష’ పేరిట ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నందున.. అవి పూర్తయిన వెంటనే ప్రయాణికులపై చార్జీల భారం మోపేందుకు నిర్ణయించారు. తొలుత తెలంగాణలో బస్సుచార్జీలను పెంచిన తర్వాత ఏపీలోనూ పెంచాలని భావించారు. అయితే ఆర్టీసీ ఆస్తుల విభజన మరో మూడు నెలలు వాయిదా పడటం, పరిపాలనపరంగా ఎప్పటి నుంచి వేర్వేరుగా పాలన జరుగుతుందో స్పష్టత లేకపోవడంతో మొత్తమ్మీద వీలైనంత త్వరగా బస్సుచార్జీలను పెంచేందుకు నిర్ణయించారు. జూన్ 2 నుంచి 8 వరకు నవ నిర్మాణ దీక్షలు, ఈ మధ్యలో జన్మభూమి-మా ఊరు గ్రామసభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన వెంటనే పల్లె వెలుగు బస్సుల నుంచి గరుడ ప్లస్, వెన్నెల బస్సుల వరకు అన్నింటికీ చార్జీల పెంపు వర్తించేలా ప్రతిపాదనలు రూపొందాయి. రెండేళ్లుగా బస్సుచార్జీలు పెంచలేదని, కాబట్టి తప్పక పెంచాలని సూచిస్తూ సంస్థ యాజమాన్యం ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనల్లో పేర్కొంది. బస్సు చార్జీల పెంపుతో రాష్ట్రంలోని ప్రయాణికులపై రూ.830 కోట్లకుపైగా భారం పడనుందని అంచనా. -
కార్మిక సంఘాలతో ఏపీ సర్కార్ చర్చలు ప్రారంభం
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఏపీ సర్కార్ చర్చలు బుధవారం హైదరాబాద్లో ప్రారంభించింది. ఈ చర్చలకు శిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో పాటు కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. 43 శాతం ఫిట్మెంట్ అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగలతో సమానంగా తమకు ఇవ్వాలని ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ కార్మికులు సమ్మెకు పిలుపు నిచ్చారు. వారు చేపట్టిన సమ్మె నేడు 8 వ రోజుకు చేరింది. అయితే అంత ఫిట్మెంట్ ఇవ్వలేమని చంద్రబాబు మంగళవారం తన కేబినెట్ భేటీలో పేర్కొన్నారు. ఓ వేళ అంత ఫిట్మెంట్ ఇస్తే... ప్రజలపై ఛార్జీల భారం పడుతుందని ఆయన భావిస్తున్నారు. దాంతో ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రవాణాశాఖ మంత్రి, ఎండీతో బుధవారం ఆర్టీసీ కార్మికులు చర్చలు జరుపుతున్నారు. -
ఆర్టీసీ ఎండీ, రవాణా మంత్రిపై చంద్రబాబు అసంతృప్తి
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు వైఖరి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన శనివారం ఆర్టీసీ సమ్మెపై సమీక్ష నిర్వహించారు. కార్మిక సంఘాలను కేబినెట్ సబ్ కమిటీతో మాట్లాడాలని సూచించారు. కార్మిక సంఘాలు చర్చకు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే పీఆర్సీ అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం నాడు జరిగిన చర్చల్లో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చర్చల మధ్య లోంచి లేచి వెళ్లిపోవడం, ఇక వారిని చర్చలకు పిలిచేది లేదని చెప్పడం తెలిసిందే. ఈ విషయంపైనే చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
మాకు మొండివైఖరి లేదు: మంత్రి శిద్దా
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు మొండివైఖరి విడనాడి సమ్మె విరమించాలని ఆయన కోరారు. ఆర్టీసీ ఎండీ సాంబశిరావుతో కలిసి సచివాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు చర్చలకు వస్తే స్వాగతిస్తామని, తమకు మొండి వైఖరి లేదన్నారు. ఏపీ ఎంసెట్ విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎంసెట్ కు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. శనివారం 60 శాతం బస్సులు నడుపుతామని మంత్రి చెప్పారు. -
వారిని చర్చలకు పిలిచే ప్రసక్తే లేదు!
హైదరాబాద్:గత రెండు రోజులుగా సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులు వెంటనే ఆ సమ్మెను విరమించాలని మంత్రి శిద్ధా రాఘవరావు విజ్ఞప్తి చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని చర్చలకు పిలిచే ప్రసక్తే లేదని.. ఒక వేళ వారు చర్చలకు వస్తే మాత్రం మాట్లాడతామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందని .. తాము 27 శాతానికి మించి ఫిట్ మెంట్ ఇవ్వలేమని మంత్రి శిద్ధా పేర్కొన్నారు. ఎంసెట్ విద్యార్ధుల కోసం ప్రతి జిల్లాలో 200 బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
సమ్మెచేయడం పద్దతి కాదు
-
ఇంకా నిర్ణయం తీసుకోలేదు: శిద్ధా
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే 64 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడతారని ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. కార్మికుల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం కార్యవర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిందని చెప్పారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో సమ్మె చేయడం తగదని అన్నారు. 43 శాతం ఫిట్ మెంట్ ఇస్తే ఏడాదికి రూ.930 కోట్ల భారం పడుతుందని తెలిపారు. 15 శాతం ఆర్టీసీ చార్జీలు పెంచాలని సీఎంకు ప్రతిపాదనలు పంపామని, ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. కాగా ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు విఫలం అవడంతో కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. -
పన్ను ఆలోచన విరమించుకొండి: శిద్దా
-
బస్సు ప్రమాదం ... ఉన్నతాధికారులపై వేటు
బెంగళూరు : మడకశిర ఘటనపై ఏపీ ప్రభుత్వం ఉన్నతాధికారులపై వేటు వేసింది. మడకశిర డిపో ఆర్ఎంతోపాటు ముగ్గురు ఆర్ అండ్ బీ అధికారులను సస్పెండ్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రవాణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడించారు. గురువారం బెంగళూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయనతోపాటు సహచర మంత్రులు పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావులు పరామర్శించారు. క్షతగాత్రులకు మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం కొలంబియా ఆసుపత్రికి తరలిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం మడకశిర నుంచి పెనుగొండ వెళ్లున్న ఆర్టీసి బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించారు. మరో 54 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం బెంగళూరు తరలించారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంతోపాటు రహదారులు సరిగాలేవని, బస్సు కండిషన్ కూడా బాగోలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలకు ఉపక్రమించింది. అందులోభాగంగా ఉన్నతాధికారులపై వేటు వేసింది. -
'సంక్రాంతికి అదనపు బస్సు చార్జీలు ఉండవు'
హైదరాబాద్: సంక్రాంతికి అదనపు బస్సు చార్జీలు ఉండవని ఆంధప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. ఇప్పుడున్న టికెట్ ధరల ప్రకారమే బస్సులు నడుపుతామని, అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రైవేటు ట్రావెట్ ఆపరేటర్లు టికెట్ ధరలు పెంచితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో 99 రహదారుల అభివృద్ధి కోసం రూ. 472 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. -
మంత్రి శిద్ధా రాఘవరావుకు అరెస్ట్ వారెంట్!
ఒంగోలు: ఏపీ రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్ధా రాఘవరావుకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2009లో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించినందుకు సంబంధించి రెండవ అదనపు మేజిస్ట్రేట్ ఈ వారెంట్ జారీ చేసింది. గత కొన్ని రోజులుగా ఆయన కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ వారెంట్ జారీ చేశారు. -
ఏపీని అగ్రగామిగా నిలబెడతాం
చీమకుర్తి: దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలబెడతామని రోడ్లు, భవనాలు, రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావు ధీమా వ్యక్తం చేశారు. అధికారం చేపట్టి 6 నెలలు పూర్తయిన సందర్భంగా ఆయన సోమవారం రాత్రి చీమకుర్తిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన దారుణ వైఖరి వలన రాష్ట్రం సర్వం కోల్పోయిందన్నారు. మన రాష్ట్రంలో కాకినాడ నుంచి చెన్నై వరకు అపారమైన వనరులున్న కారణంగా రానున్న రోజుల్లో సుందరంగా అభివృద్ధి చేయవచ్చన్నారు. బైపాస్కు శిలాఫలకం సిద్ధం చేసుకోవడమే తరువాయి: చీమకుర్తి బైపాస్కు రెండు మూడు రోజుల్లో శంకుస్థాపన చేస్తామని, దానికి శిలాఫలకం సిద్ధం చేసుకోవడమే తరువాయి అన్నారు. ఇప్పటికే సీఈతో మాట్లాడానని, రేపోమాపో భూమిపూజ చేస్తానన్నారు. దానితో పాటు స్థానిక నాయకులు గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు 8 సూట్లతో ఆర్ అండ్ బీ అతిథి గృహం మంజూరు చేస్తామని చెప్పారు. బస్టాండ్ నుంచి నెహ్రూనగర్ వరకు కర్నూల్రోడ్డు మార్జిన్లకు కూడా తారురోడ్డు వేయించనున్నట్లు తెలిపారు. చంద్రబాబునాయుడు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విలేకరుల సమావేశం అనంతరం మున్సిపల్ చైర్మన్ కౌత్రపు రాఘవరావు, వైస్చైర్మన్ కందిమళ్ల గంగాధర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీకి రావలసిన గ్రానైట్ సీనరేజి నిధులను ఇప్పించే లా చర్యలు తీసుకోవాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. మంత్రి శిద్దా దంపతులకు స్థానిక నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మన్నం శ్రీధర్బాబు, కాట్రగడ్డ రమణయ్య, గొల్లపూడి కోటేశ్వరరావు, చీమకుర్తి కమలమోహన్, మన్నం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్పై అవగాహన కల్పించాలి
ఒంగోలు సెంట్రల్:ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు జిల్లా ఎయిడ్స్ ఆధికారులను ఆదేశించారు. ఒంగోలులోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఎదుట ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సంధర్భంగా సోమవారం నిర్వహించిన ర్యాలీని శిధ్దా ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన జిల్లా కలెక్టర్ జిఎస్ఆర్కె ఆర్. విజయ కుమార్ మాట్లాడుతూ ఎయిడ్స్వ్యాధిపై ప్రతి ఒక్కరూ ఆప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎయిడ్స్ బారిన పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. ర్యాలీ అనంతరం అంభేద్కర్ భవన్లో సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ మాట్లాడుతూ ఎయిడ్స్కు మందులు లేవని, నివారణ ఒక్కటే మార్గమన్నారు. జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ సురక్షిత లైంగిక చర్యల వల్ల ఈ వ్యాధి రాదన్నారు. ఈ సంధర్బంగా పీ శాక్స్ కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ భరత్ మాట్లాడుతూ ఎఆర్టి మందులను సక్రమంగా వాడితే మంచిదన్నారు. జిల్లా జడ్జి మోహ న్ కుమార్ మాట్లాడుతూ ఎయిడ్స్ తో బాధపడుతున్న వారు వివక్షతకు గురైతే తనకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణా అధికారి డాక్టర్ పద్మావతి, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి టి. రమేష్, డాక్టర్ సరళాదేవి, డాక్టర్ జోసఫ్, నాగేంద్రయ్య, డెమోలు శ్రీనివాసరావు, పద్మజ, తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. -
తీరు మారకపోతే సస్పెన్షనే : మంత్రి శిద్దా ఆగ్రహం
ఈ సారి చూసేది ఉండదు, సస్పెన్షనే అని రిమ్స్ డైరక్టర్ డాక్టర్ అంజయ్యపై మంత్రి శిద్దా రాఘవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్లో మెడికోల బాలికల వసతి గృహాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించకపోవడంతో శనివారం మెడికోలు నిరసన వ్యక్తం చేసిన ఘటనపై స్పందించిన మంత్రి రిమ్స్ను సందర్శించి నిప్పులు చెరిగారు. చేతకాకపోతే సెలవు పై వెళ్లిపోవాలని, పనిచేసే అధికారులు రిమ్స్కు వస్తారని హెచ్చరించారు. ఒంగోలు సెంట్రల్ : ‘రిమ్స్ పరిస్థితిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూశా.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వచ్చినప్పుడు చూశా. ఈసారి చూసేది ఉండదు.. సస్పెన్షనే అని రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ అంజయ్యపై రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్ కళాశాల విద్యార్థినుల వసతి గృహాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించకపోవడంతో శనివారం మెడికోలు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మెడికోలను విచారించేందుకు మంత్రి ఆదివారం మధ్యాహ్నం రిమ్స్లోని బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు నాలుగు రోజులుగా వసతి గృహాల్లో విద్యుత్ సౌకర్యం లేదని, మంచినీటి వసతి లేదని, శానిటేషన్కు తామే డబ్బులు చెల్లిస్తున్నామని..తాగుబోతులు వసతి గృహ పరిసరాల్లో సంచరిస్తున్నారని, రోడ్ల మీద లైట్లు లేక భయంతో ఉంటున్నామని మంత్రి దృష్టికి తెచ్చారు. మొత్తం 260 మంది బాలికలు వసతి గృహంలో ఉంటున్నామన్నారు. దీనిపై స్పందించిన మంత్రి.. రిమ్స్ డెరైక్టర్ను మందలించారు. ఏదో ఒక హెడ్ నుంచి నిధులు వెచ్చించి సమస్యలు పరిష్కరించాలన్నారు. బాలికల వసతి గృహానికి విద్యుత్ అంతరాయంపై మంత్రి ప్రశ్నించడంతో విద్యుత్ శాఖ డీఈ రామ్మూర్తి సమాధానమిస్తూ వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని..అండర్ గ్రౌండ్ కేబుల్ను తెప్పిస్తున్నామని చెప్పారు. విద్యుత్ పునరుద్ధరించడం కూడా చేతకాకపోతే ఎందుకు, సెలవుపై వెళ్లాలని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా లైన్ వేసి విద్యుత్ను పునరుద్ధరించాలని సూచించారు. అనంతరం రిమ్స్ ప్రాంగణంలోని ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడంతో మంచినీరు రావడం లేదని విద్యార్థినులు తెలపగా..దానికి స్పందించిన నిర్మాణ శాఖ డీఈ జగన్నాథరావు మాట్లాడుతూ ఆర్వో ప్లాంట్లో చిన్నచిన్న విడిభాగాలు విజయవాడ నుంచి త్వరలోనే తెప్పిస్తామన్నారు. దీనికి ఆగ్రహించిన మంత్రి విజయవాడ నుంచి తెప్పించడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందని ..ఉన్న అధికారులంతా సెలవుపై వెళ్లిపోవాలని..పనిచేసే అధికారులు రిమ్స్కు వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు తీసుకుంటూ పనిచేయకపోతే ఎట్లా..చేతకాకపోతే తప్పుకోండి అన్నారు. రిమ్స్లో శానిటేషన్, మంచినీటి వసతి లేదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి కూడా వైద్యం చేయడం లేదని, మందులు ఉండవని తనకు అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. శనివారం యాక్సిడెంట్ కేసులో రిమ్స్కు వచ్చిన క్షతగాత్రులకు రాజశేఖర్ అనే వైద్యుడు చికిత్స చేయకుండా ప్రైవేటు వైద్యశాలకు వెళ్లాలని ఉచిత సలహా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఒకరు మృతి చెందారని..దీనికి ఎవరిని బాధ్యులను చేయాలని ప్రశ్నించారు. రిమ్స్లో భవన నిర్మాణాలను డిసెంబర్ 3వ తేదీకల్లా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై హైదరాబాద్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్తో సమావేశం నిర్వహించి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్లేట్లెట్ మిషన్ జిల్లాకు తెప్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రిమ్స్ డెరైక్టర్ మాట్లాడుతూ రిమ్స్కు రోజూ మూడున్నర లక్షల లీటర్ల నీరు అవసరమని..కార్పొరేషన్వారు ఆమేరకు సరఫరా చేయడంలేదని తెలిపారు. కొంత మేరకు పాత రిమ్స్ నుంచి పైపులైన్ల ద్వారా మంచినీటిని తెప్పిస్తున్నామన్నారు. మంత్రి వెంట ఆర్డీవో కమ్మ శ్రీనివాసరావు, తహశీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు, ఒంగోలు డీఎస్పీ, ఒన్టౌన్ సీఐ, ఎస్సై, వైద్యులు ఉన్నారు. -
'దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్'
హైదరాబాద్: ప్రకాశం జిల్లా దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ ప్రభుత్వం నిర్ణయించింది. 45 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు. సోలార్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్, గ్రానైట్ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. బీవోటీ(బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ ఫర్) విధానంలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని మంత్రి తెలిపారు. -
నేనేం పాపం చేశానయ్యా...!
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర రోడ్లు, భవనాల రవాణా శాఖమంత్రి శిద్దా రాఘవరావు సొంత నియోజకవర్గంలో గత 28 సంవత్సరాలుగా రేషన్ దుకాణం నిర్వహించుకుంటున్న ఓ వికలాంగుడి డీలర్షిప్ను రద్దు చేసి మరొకరి ఇచ్చేయడంతో ‘నేను ఏ అన్యాయం చేశానయ్యా’ అంటూ సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి తమ పరిస్థితిని మొరపెట్టుకున్నారు. దర్శి మండలం తానంచింతల గ్రామానికి చెందిన ఏకాశి శివయ్య 1986 నుంచి రేషన్ దుకాణం సక్రమంగా నిర్వహించుకుంటూ వస్తున్నాడు. ఏ తప్పు చూపించకుండానే అర్థంతరంగా తొలగించినట్లు ఈ ఏడాది అక్టోబర్ నెలలో దర్శి తహశీల్దార్ చెప్పటంతో శివయ్య కంగుతిన్నాడు. తాను ఏం నేరం చేస్తే రేషన్ షాప్ను తొలగించారని ప్రశ్నించినా తహశీల్దార్ నుంచి సమాధానం లేదు. అదే గ్రామానికి చెందిన సంధు నాగమణి అనే మహిళకు రేషన్ షాప్ను కేటాయించేశారు. ఓ పక్క పుట్టు వికలాంగుడిగా రెండు కాళ్ళు మెలికతిరిగి కర్ర ఆసరాతో సైతం నడవలేని స్థితిలో ఉన్న శివయ్య తన గోడును జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో విన్నవించుకునేందుకు సోమవారం ఒంగోలుకు చేరుకున్నాడు. ఈయన భార్య కూడా వికలాంగురాలు. వీరిరువురికితోడు వీరి బిడ్డ కూడా వికలాంగురాలిగానే పుట్టింది. -
అమర వీరుల త్యాగాలు మరువలేనివని..
ఒంగోలు క్రైం: పోలీసు అమర వీరుల త్యాగాలు మరువలేనివని రాష్ర్ట రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తొలుత కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్, ఎస్పీ చిరువోలు శ్రీకాంత్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ నూకసాని బాలాజీ, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావుతో కలిసి పోలీసు అమరవీరులకు శిద్దా శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ న్యాయాన్ని కాపాడటంలో పోలీసుల పాత్ర గణనీయమైందన్నారు. అమరుల త్యాగాలను ఆదర్శంగా తీసుకుని పోలీసులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని కోరారు. కలెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు విధులు నిర్వర్తించినప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందన్నారు. నిజాయితీగా పనిచేసే పోలీసులు, అధికారులు ప్రజల మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అణచివేతకు గురైన వారికి అండగా ఉండటమే పోలీసుల విధి అన్నారు. అమరుల త్యాగాలను ఇనుమడింపజేసేలా పోలీసుల పనితీరు ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పోలీసుల పనితీరు బాగుందని..అంతా స్నేహపూరిత వాతావరణంలో ఉండాలని సూచించారు. ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 642 మంది పోలీసులు అమరులయ్యారని, వారి ఆదర్శాలను తివాచీలుగా చేసుకుని ముందుకు నడవాలని కోరారు. వారి త్యాగాలను మననం చేసుకుంటూ విధులు నిర్వర్తించాలన్నారు. జిల్లాలో ఆరుగురు పోలీసులు, పోలీసు అధికారులు అమరులయ్యారని ప్రజలు వారిని ఎన్నటికీ మరువరన్నారు. అమరవీరుల కుటుంబాలకు అందరం కలిసికట్టుగా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని వీడినప్పుడే మంచి పోలీసులుగా పేరు తెచ్చుకుంటారని, పనితీరు మెరుగుపరుచుకుని విధులు నిర్వర్తిస్తే ప్రతి ఒక్కరికీ మంచి జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బీ రామానాయక్, ఏఆర్ ఏఎస్పీ జే కృష్ణయ్యలతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు. వీరితోపాటు రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యేలు డా.దివి శివరాం, బీఎన్ విజయకుమార్ తదితర నాయకులు కూడా పాల్గొన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో మంత్రితోపాటు కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేకంగా మాట్లాడారు. కుటుంబ సభ్యులు అమరులతో ఉన్న అనుబంధాలను మననం చేసుకుని కళ్లు చెమర్చారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీసు శాఖలోని పోలీసులు, అధికారులతోపాటు, వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రశంసపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. పోలీసుల ర్యాలీ... పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి పోలీసులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ శ్రీకాంత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కర్నూలురోడ్డు ఫ్లైఓవర్ మీదుగా కర్నూలురోడ్డు, ఆర్టీసీ డిపో, అద్దంకి బస్టాండ్ వరకు సాగింది. అనంతరం అక్కడి నుంచి తిరిగి ర్యాలీ పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరింది. -
రైతులు రుణాలు కట్టక్కర్లేదు
చీమకుర్తి: ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటుందని..రైతులు తీసుకున్న రుణాలు కట్టక్కర్లేదని రోడ్లు, భవనాలు, రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. చీమకుర్తి మున్సిపాలిటీలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రస్తుతం అసెంబ్లీ లేదు, రాజధాని లేదు..పూర్వ వైభవం రావాలంటే కనీసం 30 ఏళ్లకుపైగా పడుతుందన్నారు. రైతులకు రుణమాఫీ చేద్దామంటే రిజర్వ్ బ్యాంక్ కూడా సహకరించడం లేదన్నారు. అందుకే కొత్తగా రైతు సాధికారిక కార్పొరేషన్ ఈనెల 20న ప్రారంభించనున్నామని మంత్రి శిద్దా తెలిపారు. దాని ద్వారా రూ.5 వేల కోట్లతో రైతులు తీసుకున్న రుణాల్లో ఐదో వంతు తొలివిడతగా తీర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ పింఛన్ల వెరిఫికేషన్లో అనేక తప్పులు దొర్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారిలో ఒక్కరికి పింఛను తీసేసినా అన్యాయమేనని అన్నారు. ఇప్పటికే చీమకుర్తి మున్సిపాలిటీలో 595, మండలంలో 1165, జిల్లాలో 70 వేలు, రాష్ట్రంలో 9.16 లక్షల పింఛన్లు తొలగించారని గణాంకాలు వెల్లడించారు. వెరిఫికేషన్ల కమిటీలను పక్కన పెట్టి పింఛన్లపై రీసర్వే నిర్వహించి అర్హులైన వారందరికీ తిరిగి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రుణమాఫీపై రైతులు, డ్వాక్రా మహిళల్లో అనుమానాలు పెరుగుతున్నాయని సురేష్ అన్నారు. హామీలు ఇచ్చేముందు ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో నిజాయితీ ఉండాలని చంద్రబాబు ఇచ్చిన హామీలనుద్దేశించి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బీఎన్.విజయ్కుమార్ మాట్లాడుతూ గతంలో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పార్టీ ఇన్చార్జిగా ప్రభుత్వం తర ఫున కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. తొలుత ఐసీడీ ఎస్ అధికారులు ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్ను మంత్రి శిద్దా, ఎమ్మెల్యే సురేష్ పరిశీలించారు. అనంతరం పింఛన్లతో పాటు ఎన్ఎఫ్బీఎస్ చెక్కులు, స్కాలర్షిప్ చెక్కులను మంత్రి, ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌత్రపు రాఘవరావు, మన్నం శ్రీధర్, పమిడి వెంకట్రావు, కాట్రగడ్డ రమణయ్య, రామినేని యోగయ్య, పుట్టా బ్రహ్మయ్య, గొట్టిపాటి రాఘవరావు, కొండ్ర గుంట వెంకయ్య, మన్నం ప్రసాద్, గొల్లపూడి సుబ్బారావు, అవిశనేని వెంగన్న, అడిషనల్ జేసీ ఐ.ప్రకాష్కుమార్, తహశీల్దార్ పీ.మధుసూదన్రావు, కమిషనర్ ఏజే.మాధ్యూస్, మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. బైపాస్కు 20 రోజుల్లో శంకుస్థాపన ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న చీమకుర్తికి బైపాస్రోడ్డు నిర్మించేందుకు 20 రోజుల్లో శంకుస్థాపన చేస్తానని మంత్రి శిద్దా అన్నారు. చీమకుర్తి పట్టణానికి గతంలో ఫేజ్-1 కింద 4.71 కి.మీ దూరానికి రూ.9.60 కోట్లతో, ఫేజ్-2 కింద రూ.39 కోట్లతో రెండు రకాల బైపాస్లను నిర్మించేందుకు ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తారని స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మంత్రికి వినతిపత్రం రూపంలో విజ్ఞప్తి చేశారు. దానిపై మంత్రి స్పందిస్తూ బైపాస్రోడ్డు విషయం తన శాఖకు సంబంధించిందే కాబట్టి దాని గురించి పెద్దగా కంగారు పడాల్సిన పనేలేదని, 20 రోజుల్లోనే శంకుస్థాపన చేస్తానని చెప్పారు. దాంతో పాటు చీమకుర్తికి ఆర్అండ్బీ గెస్ట్హౌస్, పార్కు, అంతర్గత రోడ్లు మంజూరు చేసి మోడల్టౌన్గా తీర్చిదిద్దుతానని మంత్రి ప్రకటించారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లు ముమ్మరం
సాక్షి, ఒంగోలు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం జిల్లా పర్యటనకొస్తున్నారు. జిల్లాలో రెండుచోట్ల అధికారిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ రోజు ఉదయాన్నే 10 గంటలకు పర్చూరుకు చేరుకోనున్న చంద్రబాబు అక్కడ పొలం పిలుస్తోంది.. జన్మభూమి - మాఊరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. భోజన విరామం అనంతరం సాయంత్రం మూడు గంటలకు ఒంగోలు చేరుకుంటారు. స్థానిక మినీస్టేడియం ఆవరణలో ఏర్పాటుచేసిన జన్మభూమి కార్యక్రమానికి హాజరై రాత్రి బస కూడా నగరంలోనే చేస్తారని జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులతో మంత్రి ఆదివారం తన నివాసంలో సమీక్షించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. అనంతరం విలేకరులతో శిద్దా రాఘవరావు మాట్లాడుతూ అభివృద్ధి ప్రతిపాదనల్లో ప్రభుత్వం జిల్లాపై చిన్నచూపు చూస్తోందని కొందరు పనిగట్టుకుని విమర్శించడం మంచిదికాదన్నారు. జిల్లాలో స్మార్ట్సిటీ, ఎయిర్పోర్టు, రామాయపట్నం పోర్టుతో పాటు దొనకొండలో అతిపెద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటుకానుందని వివరించారు. అధికార పగ్గాలు చేపట్టే సమయంలో పార్టీ అధినేత చేసిన ఐదు సంతకాలు అమల్లోకి వచ్చాయని చెప్పారు. జిల్లాలో జన్మభూమి, ఎన్టీఆర్ సుజల స్రవంతి, ఎన్టీఆర్ భరోసా పేరిట పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశ పనులు పూర్తిచేయడం, గుండ్లకమ్మ ప్రాజెక్ట్ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. శనగ రైతుల సమస్యను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దొనకొండ పారిశ్రామికవాడకు అందుబాటులో 74 వేల ఎకరాల భూమి ఉండగా, ఇప్పటికే 28 వేల ఎకరాలను సద్వినియోగం చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని మంత్రి చెప్పారు. ఒకరిద్దరు బడా పారిశ్రామికవేత్తలు కూడా ముందుకొచ్చినట్లు చెబుతూ.. త్వరలోనే దొనకొండ పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి, పార్టీ నేతలు కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్, కందుల నారాయణరెడ్డి, బీఎన్ విజయకుమార్, అజిత, దివి శివరాం తదితరులు పాల్గొన్నారు. సభాప్రాంగణం పరిశీలన ఒంగోలు సెంట్రల్ : స్థానిక మినీస్టేడియంలో సీఎం చంద్రబాబు పాల్గొనే సభాప్రాంగణాన్ని మంత్రి శిద్దా రాఘవరావు పరిశీలించారు. సీఎం సభకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆయన వెంట ఉన్న ఎస్పీ శ్రీకాంత్ను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా బారికేడ్లు నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులతోచెప్పారు. భద్రత పటిష్టం: ఎస్పీ పర్చూరు : సీఎం చంద్రబాబు పర్యటనకు గట్టి భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చిన ఆయన.. సీఎం పర్యటన రూట్ మ్యాప్పై పోలీస్ అధికారులతో చర్చించారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ను పరిశీలించారు. ఆనంతరం వైఆర్ హైస్కూల్లో ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులతో సీఎం మాట్లాడే అవకాశం ఉందన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా సీఎం పరిశీలించే నాగులపాలెంలోని పత్తి పొలం వద్దకు ఎస్పీ చేలగట్లు దాటుకుంటూ వెళ్లారు. ఆయనతో పాటు ఏఎస్పీ రామానాయక్, డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఇంటిలిజెన్స్ సెకూ్యురిటీ డీఎస్పీ నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుమలరావు, ఇంకొల్లు సీఐ సత్యకైలాస్నాథ్, ఎస్సై మాధవరావు ఉన్నారు. సీఎం పర్యటన ఇలా.. ఒంగోలు టౌన్ : ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయల్దేరతారు. 10.45 గంటలకు పర్చూరు మార్కెట్ యార్డులో దిగుతారు. 11.00 నుంచి 11.30 గంటల వరకు అక్కడి వైఆర్ హైస్కూల్లో బడిపిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొంటారు. 11.30 నుంచి 12.00 గంటల వరకు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి 2.00గంటల వరకు జన్మభూమి - మా ఊరు గ్రామసభలో పాల్గొంటారు. 2.00 నుంచి 3.00 గంటల వరకు రిజర్వ్డు 3.00 గంటలకు పర్చూలోని హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. 3.25 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజీలోని హెలిపాడ్ వద్ద దిగుతారు. 3.30 గంటలకు మినీ స్టేడియం చేరుకుంటారు. 3.30 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు జన్మభూమి - మా ఊరు గ్రామసభ, అక్షర విజయం సక్సెస్మీట్లో పాల్గొంటారు. 6.30 గంటలకు మినీ స్టేడియం నుంచి ఎన్ఎస్పీ గెస్ట్హౌస్కు బయల్దేరతారు. 6.45 గంటలకు ఎన్ఎస్పీ గెస్ట్హౌస్కు చేరుకుంటారు. 7.00 నుంచి 8.00గంటల వరకు రిజర్వ్డ్. రాత్రికి అక్కడే బస చేస్తారు. 8వ తేదీ ఉదయం 9.45 గంటలకు ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కాలేజీలోని హెలిపాడ్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి వెళ్తారు. -
ఆర్టీసీని ఆదరిస్తేనే అందరికీ ఉపయోగం
ఒంగోలు నగరంలో సిటీ బస్సు సర్వీసులను మంత్రి శిద్దా రాఘవరావు శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. సిటీ బస్సులు నిలిపే బస్షెల్టర్లు కూడా ఆయన ప్రారంభించారు. త్వరలోనే మరిన్ని సిటీ సర్వీసులు నడుపుతామని చెప్పారు. ఒంగోలు: ఆర్టీసీని ఆదరిస్తేనే అందరికీ ఉపయోగంగా ఉంటుందని రాష్ట్ర రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండులో నూతనంగా ఏర్పాటు చేసిన 5 సిటీ సర్వీసులను శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. అనంతరం రిమ్స్ ఆస్పత్రి వద్ద, దక్షిణ బైపాస్లో ఏర్పాటు చేసిన బస్షెల్టర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ సేవలు పేద వర్గాలకు సైతం అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సిటీ సర్వీసులను ఏర్పాటు చేస్తామని, త్వరలోనే జేఎన్ఎన్యూఆర్ఎం పథకం ద్వారా మరిన్ని సిటీ సర్వీసులు నగరానికి తీసుకువస్తామన్నారు. అదనంగా సిటీ బస్సులు వస్తే అప్పుడు మరిన్ని రూట్లలో ప్రవేశపెడతామన్నారు. ఆర్టీసీ ఆర్ఎం వీ.నాగశివుడు మాట్లాడుతూ సిటీ సర్వీసుల కోసం ఎన్నాళ్ల నుంచో ప్రజాసంఘాలు తీవ్ర పోరాటం చేశాయన్నారు. రాష్ట్ర రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావు కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. నూతన బస్సులు వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో రూట్ల ఎంపిక చేపడతామన్నారు. సిటీ బస్సుల కోసం ప్రత్యేక స్టూడెంట్ పాసులు ఉంటాయని, అదే విధంగా ఉద్యోగులకు కూడా ప్రత్యేక బస్సు పాసులు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం రాజశేఖర్, సీఎంఈ రవికాంత్,ఒంగోలు డిపో మేనేజర్ మురళీ బాబు, అసిస్టెంట్ మేనేజర్ శ్యామల, ఎన్ఎంయూ, ఎంప్లాయీస్ యూని యన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బస్సుల సమయాలు ఇలా: మొత్తం 5 మార్గాల్లో ఏర్పాటు చేసిన ఈ సర్వీసులు పలు ముఖ్యమైన ప్రాంతాల్లో అందుబాటులో ఉండే సమయాలు విధంగా ఉన్నాయి. సూరారెడ్డిపాలెం: 5.45, 6.15, 6.45, 8.15, 8.35, 9.15, 10.45, 10.55, 11.45, 13.15, 13.15, 14.15, 15.00, 16.00, 17.15, 17.30, 18.20, 19.45, 20.00, 22.15 మద్దిపాడు: 6.30, 7.00, 8.30, 9.30, 10.30, 12.00, 12.30, 14.15, 15.00, 16.15, 17.00, 18.45, 19.00, 21.00 ,21.15, సంతనూతలపాడు: 5.30, 7.30, 8.00, 9.30, 10.30, 11.30,13.00, 13.30, 16.00, 16.00, 18.00, 18.30, 20.00, 21.00, 21.55 కరువది: 7.20, 9.40, 12.00, 14.15, 17.05,19.25, 21.45. యరజర్ల: 6.45, 9.15, 11.45, 14.15, 17.00, 19.30, 21.55. మంగమూరు: 5.30,8.00, 10.30, 13.00, 15.45, 18.15, 20.45. -
పండక్కి బస్సు ఛార్జీలు పెరగకుండా చర్యలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందరోజుల పాలన సంతృప్తినిచ్చిందని ఆ రాష్ట్ర రావాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆర్టీసీ 2,300 కోట్ల నష్టాల్లో ఉందన్నారు. ఆ నష్టాలను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వచ్చేయేడాది నుంచి గతుకులు లేని రోడ్లు నూరుశాతం నిర్మిస్తామని స్పష్టం చేశారు. దసరా సీజన్లో ప్రైవేట్ బస్సు ఛార్జీలు పెరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అందుకోసం ప్రైవేట్ బస్సు యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలపై నిర్ణయం తీసుకోలేదన్నారు. 100 రోజుల్లో 450 ప్రేవేట్ స్కూళ్ల బస్సులను సీజ్ చేశామని తెలిపారు.ఆర్టీసీ విభజనకు రెండు నెలల సమయం పడుతుందని... షీలాబిడే కమిటీ నివేదిక తర్వాతే విభజన పూర్తవుతుందన్నారు. -
ముందు అద్దం లేకుండా మున్ముందుకు...!
రవాణా శాఖా మంత్రి గారూ... ఆర్టీసీకి వంద రోజుల లక్ష్యం పెట్టారు ... సమస్యలేమైనా ఉంటే సరిచేయాలని సూచించారు ... డిపో ఆవరణల్లో ఆహ్లాదం .. బస్సుల్లోనేకాదు బస్టాండుల్లో పరిశుభ్రత ... బస్సు కండిషన్ బ్రహ్మాండంగా ఉండాలని ఒకటేమిటి ఎన్నో సూక్తులు చెప్పి ఊరించారు .. ప్రయాణికులే మన దేవుళ్లంటూ హారతి పళ్లెం తిప్పి బస్సు ఛార్జీలు పెంచేసి దక్షిణ లాగేసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు ... ఈ జిల్లాలోనే అందులోనూ ఒంగోలులోనే శనివారం వివిధ సమీక్షలతో బిజీబిజీగా ఉన్న మీ పక్క నుంచే చూడండి మీ శాఖను వెక్కిరిస్తూ బస్సు ఎలా దీనంగా వెళ్తుందో. ముందు అద్దం లేకుండానే పరుగులు తీస్తోంది. ఇదేదో పల్లె వెలుగు బస్సు అనుకుంటే పొరపాటే. కావలి - నెల్లూరు వైపు తిరిగే సూపర్ లగ్జరీ బస్సు. ‘ప్రయివేటీకరణ చేయం’ అంటున్న మీ మాటల్లో అంతరార్థం ఏమిటో లీలగా అర్థమవుతోంది. ఈ తరహా బస్సులు మరిన్ని తిప్పితే ప్రయాణికులే ఆర్టీసీ వద్దు ‘బాబూ’ అంటారనే కదా మీ ఉద్దేశం. ఇటు ఉద్యోగులను, అటు ప్రయాణికులను ఇలా సిద్ధం చేస్తున్నారా శిద్దా గారూ... -
పెరగనున్న ఆర్టీసి బస్ ఛార్జీలు
హైదరాబాద్: మరోసారి ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఛార్జీల పెంపును పరిశీలిస్తున్నట్లు ఏపి రోడ్లు, రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదిస్తే ఛార్జీలు పెంచుతామన్నారు. ఏడాది కిందట ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. డీజిల్ రేట్లు 7 సార్లు పెరగడంతో ఛార్జీలు పెంచకతప్పదన్నారు. ఏపిఎస్ఆర్టిసికి 250 కోట్ల రూపాయలు జమచేస్తామని చెప్పారు. ఉద్యోగులకు దసరా అడ్వాన్స్ ఇస్తున్నామన్నారు. నవంబర్లో డిఏపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి రాఘవరావు చెప్పారు. ** -
ఒంగోలులో దసరా నుంచి సిటీ బస్సులు
ఒంగోలు సెంట్రల్: ఒంగోలు నగరంలో విజయ దశమి నుంచి సిటీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి శిద్దారాఘవరావు తెలిపారు. నగరంలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు 500 నూతన బస్సులను అన్ని డిపోల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు నుంచి చెన్నై, చీరాల నుంచి బెంగళూరుకు రెండు సూపర్లగ్జరీ బస్ సర్వీసులను మంగళవారం ప్రారంభిస్తున్నామన్నారు. అదే విధంగా దర్శి నుంచి 5 పల్లెవెలుగు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దర్శి నుంచి దొనకొండకు వయా వెంకటాపురం, పొదిలి నుంచి దర్శికి వయా వేముల, కురిచేడు నుంచి దర్శికి వయా పొట్లపాడు, ఒంగోలు నుంచి పిడతలపూడికి వయా చీమకుర్తి, పొందూరు నుంచి టంగుటూరుకు వయా మల్లవరం, తూర్పునాయుడుపాలేలకు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతి డిపోకు పది పల్లెవెలుగు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ‘ఎన్టీఆర్ సుజల’ ప్రారంభానికి చర్యలు ఎన్టీఆర్ సుజల పథకాన్ని అక్టోబర్ 2 నుంచి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. నగరంలోని తన నివాసంలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లతో సోమవారం మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశలో మండలానికి ఒక గ్రామంలో ఎన్టీఆర్ సుజల పథకాన్ని ప్రారంభించడానికి ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వెయ్యి లీటర్ల మంచి నీటిని అందించేందుకు మిషనరీ, నిర్మాణ వ్యయం రూ.3 లక్షలు అవుతుందన్నారు. రెండో దశలో అన్ని గ్రామాల్లో తాగునీటి రక్షిత పథకాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్టీఆర్ సుజల పథకం ఏ గ్రామాల్లో ఏర్పాటు చేయాలో స్థానిక శాసనసభ్యుల సహకారం తీసుకోవాలన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజినీర్ వీవీఎస్మూర్తి, పొదిలి ఆర్డబ్ల్యూస్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీలో సమ్మెకు సై...
* 11 నుంచి సమ్మెపై వెనక్కు తగ్గేది లేదు: ఈయూ * ఆందోళనకు పార్టీలు, కార్మిక సంఘాల మద్దతు * 9న చర్చలకు ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వం రేపు చర్చలు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈనెల 9న ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కార్మిక సంఘాల నాయకులను పిలిచారు. ఇప్పటికే ఒకసారి మంత్రి సిద్ధా రాఘవరావు చర్చలు జరిపినా ఎలాంటి పురోగతి లేదు. సాక్షి, విజయవాడ బ్యూరో, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన చర్యలు తీసుకునేవరకూ పోరాటం చేయాలని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నిర్ణయించింది. ఈనెల 11వతేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో ఈయూ ఆధ్వర్యంలో ఆదివారం అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఎస్డబ్ల్యూఎఫ్, సీపీఐ, సీపీఎం ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ నేతలు దీనికి హాజరయ్యూరు. ఆర్టీసీ మనుగడ కోసం చేస్తున్న ఈ ఆందోళనకు అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు బాసటగా నిలవాలని ఈయూ నేతలు విజ్ఞప్తి చేశారు. గతంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు సంస్థను నిలబెట్టుకునేందుకు ఉద్యమ బాట పడుతున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీకి రూ.250 కోట్లు ఇస్తానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణం బకారుులు చెల్లించాలి ఆర్టీసీ చట్టం 1950 ప్రకారం 1: 2 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1995-96 తరువాత విస్మరించాయని ఈయూ నేతలు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద కార్మికులు దాచుకున్న రూ.444 కోట్లను యాజమాన్యం ఖర్చు చేసిందని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రూ.700 కోట్లు రావాల్సి ఉందన్నారు. బకారుుల విడుదల, ప్రైవేటీకరణను విరమించుకోవాలని, సీసీఎస్ సొమ్మును యాజమాన్యం నుంచి రికవరీ చేయాలనే 8 డిమాండ్లతో తీర్మానాలు చేశారు. సమ్మెకు పలు యూనియన్ల సంఘీభావం.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈయూ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగారుు. కడపలో ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి, ముఖ్య ఉపాధ్యక్షుడు పీవీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కడప మేయర్ కె.సురేష్బాబు, వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, టీడీపీ నేతలు దీనికి హాజరయ్యూరు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో టీడీపీ నేతలు గైర్హాజరుకాగా వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. గుంటూరు జిల్లాలో జోనల్ కార్యదర్శి ఎండీ ప్రసాద్ , సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆర్టీసీని ప్రైవేటుపరం చేయం: శిద్దా రాఘవరావు
మార్కాపురం: ఏపీలో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రైవేటు పరం చేసే ఆలోచన లేదని, రవాణా మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీకి రోజూ రూ. 2.70 కోట్ల నష్టం వస్తున్నప్పటికీ ప్రైవేటుపరం చేసే ఆలోచన లేదని, లాభాల బాటలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపా రు. పాత బస్సుల స్థానంలో కొత్తవి ప్రవేశపెడతామని, రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. -
ధైర్యానికి ప్రతీకప్రకాశం
‘టంగుటూరి ప్రకాశం పంతులు అంటే ఒక ధైర్యం... దేశభక్తి... పట్టుదల ... నిస్వార్థ ప్రజాసేవకుడు. చిన్ననాటి నుండే ఒక లక్ష్యాన్ని, ధ్యేయాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాలనుకునేవారికి ప్రకాశం పంతులు ఓ స్ఫూర్తి. - రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో నాగార్జునసాగర్, వెంకటేశ్వర యూనివర్శిటీలను స్థాపించారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో క్రమశిక్షణగా జీవించాలంటే ఇలాంటి పెద్దల జీవితాలను తెలుసుకోవాలి. - మంత్రి శిద్ధా రాఘవరావు నాటితరం నాయకులు ఎలాంటి స్వార్థం లేకుండా దేశం కోసం పని చేసి ప్రాణాలు అర్పించారు, ప్రస్తుతం ఎక్కువ మందిలో స్వార్థం పెరిగి పోయింది. మొదటితరం నాయకుల మంచి లక్షణాలను ఇప్పుడున్న తరం అలవర్చుకోవాలి. - కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఒంగోలు టౌన్ : ‘టంగుటూరి ప్రకాశం పంతులు అంటే ఒక ధైర్యం. ప్రకాశం పంతులు అంటే ఒక దేశభక్తి. ప్రకాశం పంతులు అంటే పట్టుదల. ప్రకాశం పంతులు అంటే నిస్వార్థ ప్రజాసేవకుడు’ అని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. స్థానిక ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో శనివారం జరిగిన ప్రకాశం పంతులు 143వ జయంతి ఉత్సవాల్లో ఆయన ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొని ప్రసంగించారు. ప్రకాశం పంతులు ఒక మహా మనీషి అని, ఆయన జన్మించిన ప్రాంతంలో పాదాభివందనంతోపాటు సాష్టాంగ నమస్కారం చేసేందుకు ఇక్కడకు వచ్చానని చెప్పారు. ప్రకాశం జీవన విధానం, నడవడిక, త్యాగనిరతి ప్రజలపై చెరగని ముద్ర వే శాయన్నారు. అన్ని వర్గాల బంధువుగా ఆయన నిలిచారని కొనియాడారు. ప్రకాశం పంతులు, ఎన్టీఆర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతోందన్నారు. ప్రతి ఇంటికీ మంచినీరు, సదుపాయాలు, ఇంటర్నెట్, ప్రతి ఎకరాకు నాణ్యమైన విద్యుత్, ప్రతి గ్రామానికి రోడ్లు ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ప్రకాశాన్ని ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి శిద్దా టంగుటూరి ప్రకాశం పంతులును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు కోరారు. పేదరికంలో పుట్టి మంచి నడవడికతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ముఖ్యమంత్రి అయ్యాక నాగార్జునసాగర్, వెంకటేశ్వర యూనివర్శిటీలను స్థాపించారన్నారు. ప్రకాశం బాటలో నడుద్దాం : కలెక్టర్ దేశ స్వాతంత్య్ర పోరాటంలో టంగుటూరి ప్రకాశం పంతులు ఘట్టం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ విజయకుమార్ చెప్పారు. ఆయన బాటలో నడిచేందుకు అందరూ ప్రయత్నించాలని కోరారు. నాటితరం నాయకుల్లో ఎలాంటి స్వార్థం లేకుండా దేశం కోసం పనిచేసి ప్రాణాలు అర్పించారని, నేటి తరంలో స్వార్థ పెరిగిందని చెప్పారు. జిల్లాపరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ త్యాగానికి మారుపేరు ప్రకాశం పంతులు అని అన్నారు. ప్రకాశం పంతుల జీవిత చరిత్రను జిల్లాపరిషత్ నిధులతో సంక్షిప్తంగా ముద్రించి జిల్లాలోని అన్ని జెడ్పీ పాఠశాలలకు పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్వీ శేషయ్య, జేసీ యాకూబ్ నాయక్, డీఆర్వో గంగాధర్గౌడ్ పాల్గొన్నారు. తొలుత ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు కరవది వెంకటేశ్వర్లు, అశ్వద్ధనారాయణలను సన్మానించారు. వర్ధమాన గాయకుడు నూకతోటి శరత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజు, డీఆర్డీఏ పీడీ పద్మజ బృందం ఆలపించిన ‘వందనం వందనం మాతృభూమి’ గీతం ఆకట్టుకుంది. మంత్రి శిద్దా, ప్రభుత్వ సలహాదారు పరకాల చేతుల మీదుగా ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన వివిధరకాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. డీఆర్డీఏ, మెప్మా ద్వారా పలు పొదుపు సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ప్లానింగ్ లేకపోవడంతో గందరగోళం మధ్య సాగింది. కార్యక్రమంలో ఎస్పీ సీహెచ్ శ్రీకాంత్, ప్రకాశం పంతులు మనవడు గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నం నాగులుప్పలపాడు : దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు టంగుటూరి ప్రకాశం అని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు. ప్రకాశం జయంతిని ప్రభుత్వం అధికారికంగా ఒక పండగలా జరపాలని సూచించిందన్నారు. అందులో భాగంగానే ప్రకాశం పుట్టిన ఊరు వినోదరాయునిపాలెం జెడ్పీ పాఠశాల ఆవరణలో ప్రభుత్వం తరఫున వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పరకాల మాట్లాడుతూ పేదరికంలో పుట్టి తన మేధాసంపత్తితో ఇంగ్లండ్లో బారిష్టర్ చదివి కోట్లు గడించాడని తెలిపారు. అప్పట్లో మద్రాసు హైకోర్టుకు 7 గుర్రాలపై వెళ్లిన జడ్జి కూడా లేరంటే అతిశయోక్తి కాదన్నారు. అలాంటి వ్యక్తి ఆ వృత్తికి సెలవుపెట్టి స్వాతంత్య్రం కోసం తెల్లదొరలపై పోరాడి తన ఆస్తినంతా దేశానికి పెట్టిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ప్రకాశం జీవిత విశేషాలను స్కూల్ విద్యార్థుల పాఠ్యాంశంగా చేర్చాలన్న ఎంపీపీ ముప్పవరపు వీరయ్య అభ్యర్థనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని పరకాల హామీ ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెడుతున్న రాజకీయ నాయకులు ప్రజలకు ఏమి చేస్తారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రకాశాన్ని ఆదర్శంగా తీసుకొని అలాంటి సంస్కృతికి సెలవు పలకాలని కోరారు. అనంతరం ప్రభాకర్, బాలాజీ, జెడ్పీ సీఈవో ప్రసాద్లు మొక్కలు నాటారు. తొలుత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకాశం విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థుల కళా నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లా రచయిత డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు రచించిన ప్రకాశం జిల్లా విశిష్ఠతను తెలియజేసే పాటకు వినోదరాయునిపాలెం విద్యార్థుల నృత్యం ఆకట్టుకుంది. నాగులుప్పలపాడు మండలం తక్కెళ్లపాడుకు చెందిన కరాటే కళాకారుడు హనుమంతరావు ఇనుప బండలను పగులకొట్టే ప్రదర్శన అబ్బురపరిచింది. ఎంపీడీఓ జాన్ శామ్యూల్, తహశీల్దార్ రమణయ్య, ఎంఈఓ ఈ.వి. రమణయ్య, వేటపాలెం సీడీపీఓ లిదియమ్మ, వినోదరాయునిపాలెం సర్పంచ్ ఉన్నం రవితో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. -
పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 68వ స్వాతంత్య్ర దినోత్సవాలు
ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన 68వ స్వాతంత్య్ర దినోత్సవానికి రోడ్లు భవనాలశాఖ మంత్రి శిద్దా రాఘవరావు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, కలెక్టర్ విజయకుమార్, జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి.. భవిష్యత్తులో ప్రగతి పరుగు.. ఎలా ఉంటుందో తన ఉపన్యాసంలో మంత్రి ప్రస్తావించారు. - సాక్షి ప్రతినిధి, ఒంగోలు పరిశ్రమలు: మొదటి దశలో ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు స్థాపిస్తున్నాం. ఇప్పటికే 13 వేల ఎకరాల భూమిని గుర్తించాం. దొనకొండ ప్రాంతంలో ప్రభుత్వ భూములు లభ్యంగా ఉండటం వల్ల అక్కడ పరిశ్రమలు స్థాపన కోసం చర్యలు తీసుకుంటున్నాం. పోర్టు, విమానాశ్రయం : రామాయపట్నం, వాడరేవులలో పోర్టుల ఏర్పాటు, ఒంగోలులో విమానాశ్రయం నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. రుణమాఫీ : జిల్లాలో నాలుగు లక్షల మంది రైతులకు 3,600 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నాం. విద్యుత్తు వెలుగుల కోసం : మెరుగైన విద్యుత్ అందించేందుకు రూ.232 కోట్ల ఖర్చుతో 400 కేవీ సబ్స్టేషన్ను పొదిలి దగ్గర, రూ.95 కోట్లతో 200 కెవీ సబ్స్టేషన్ను కందుకూరు వద్ద, రూ. 35 కోట్లతో నాలుగు 131 కెవీ సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో రూ.361 కోట్లతో 52 మెగావాట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఉపాధి జిల్లాలో జాతీయ పెట్టుబడుల ఉత్పత్తుల మండలి (నిమ్జ్) ఏర్పాటు ద్వారా మొదటి దశలో 60 వేల మందికి ఉపాధి కల్పిస్తాం. ప్రకాశం జిల్లాలో నిమ్జ్ ద్వారా పామూరు, వలేటివారిపాలెం, పెదచెర్లోపల్లి మండలాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎంపికచేశాం. జిల్లాలో ఇప్పటి వరకూ 2,066 కోట్ల రూపాయల పెట్టుబడితో 70 భారీ, మధ్య తరహా పరిశ్రమల స్థాపన ద్వారా 16,950 మందికి ఉపాధి కల్పించాం. మరో రూ.2,220 కోట్లతో 25 పరిశ్రమలు నెలకొల్పుతున్నాం. పర్యాటకం : ఒంగోలు పరిసరాల్లో ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో శిల్పారామం, కొత్తపట్నం, వాడరేవు బీచ్లలో, గుండ్లకమ్మ జలాశయం వద్ద పర్యాటక కేంద్రాల అభివృద్ధి చేస్తాం. ఆరోగ్య సేవ : ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం ద్వారా పేదలకు, ఉద్యోగులకు, పాత్రికేయులకు రెండున్నర లక్షల రూపాయల వరకూ నగదు రహిత వైద్యం అందించనున్నాం. జాతీయ రహదారి : 278 కిలోమీటర్ల పొడవుగల మాచర్ల- యర్రగొండపాలెం - మార్కాపురం - కనిగిరి - పామూరు రహదారి, దోర్నాల - శ్రీశైలం రహదారిని జాతీయ రహదారులుగా చేశాం. -
రాష్ట్రావ్యాప్తంగా వాహనాలు తనిఖీ: శిద్దా రాఘవరావు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీ, స్కూల్ బస్సులను తనిఖీ చేసి... రేపటి సాయంత్రంలోగా నివేదిక అందజేయాలని 13 జిల్లాల ఆర్డీవోలను ఆదేశించినట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో శిద్ధా రఘవరావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో రోడ్ల పరిస్థితి బాగోలేదన్ని తెలిపారు. రోడ్ల పరిస్థితిపై కూడా నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నష్టాలలో ఉన్న అర్టీసీ గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అందులోభాగంగా అర్టీసీ సంస్థకు సంబంధించిన ఖాళీ స్థలాలు గుర్తించి... వాటిని లీజు ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. త్వరలో జేఎన్ఎన్యూఆర్ఎమ్ కింద 500 బస్సులు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. 1000 పల్లె వెలుగు బస్సులు కొనుగోలు చేస్తామని శిద్దా రాఘవరావు చెప్పారు. -
కలెక్టర్ బదిలీ తప్పదా?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : కలెక్టర్ విజయకుమార్పై బదిలీ వేటు పడనుందా..? జెడ్పీ చైర్మన్ ఎన్నిక విషయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడంపై విజయకుమార్ పట్ల ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. మెజారిటీ లేకపోయినా ఏదో విధంగా జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నాలు చేశారు. స్వయంగా మంత్రి శిద్దా రాఘవరావు, ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసినా నిబంధనల మేరకే తాను నడుచుకుంటానని కలెక్టర్ స్పష్టం చేయడం తెలుగుదేశం పార్టీ నేతలకు నచ్చలేదు. విజయకుమార్ను పంపించి వేయాలని టీడీపీ నేతలు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కోరారు. జెడ్పీ ఎన్నికల విషయంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా వ్యవహరించడం వారికి కంటగింపుగా మారింది. ఒకదశలో పోడియం ఎదుట బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులను పోలీసుల సాయంతో పక్కకు తొలగించేందుకు చేసిన ప్రయత్నంతో అధికార పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. పైనుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సాయంత్రం 5.45 గంటల వరకూ సభను వాయిదా వేయకుండా ఎన్నిక జరిపేందుకు ఎన్నికల అధికారి హోదాలో విజయకుమార్ చేసిన ప్రయత్నాలను వారు అవమానంగా భావిస్తున్నారు. దీంతో ఈ నెల 13న జరిగే జెడ్పీ ఎన్నికల్లోగా కలెక్టర్ను బదిలీ చేయాలంటూ చంద్రబాబును కోరినట్లు సమాచారం. మరోవైపు అధికార పార్టీ దౌర్జన్యాలపై ఎన్నికల సంఘం స్పందించింది. జిల్లాలో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో గుర్తించి.. తక్షణమే విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలకు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు కలెక్టర్ విజయకుమార్, ఎస్పీ పి. ప్రమోద్కుమార్కు ఈసీ ఆదేశాలందాయి. కనిగిరి, అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్సీపీ సభ్యులను బలవంతంగా టీడీపీ నేతలు లాక్కెళ్లడంపై ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ను ప్రభుత్వం బదిలీ చేస్తుందా.. లేకుంటే జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరిగే వరకూ వేచిచూస్తుందా అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
చెడ్డ పేరు వస్తే.. మేం తలెత్తుకోలేం
ఒంగోలు కలెక్టరేట్ : ‘ప్రజలకు మంచినీటిని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. మీ దగ్గర పనులు సరిగా జరగడం లేదు. దొనకొండ మండలంలో మంచినీటి సమస్య ఉందని స్వయంగా నేను చెప్పినా మీ బుర్రకు ఎక్కలేదు. పది ట్రాక్టర్లు పెట్టించి నీటిని సరఫరా చేస్తున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రేపు రిమార్క్స్ వస్తే మేం తలకాయ ఎత్తుకోలేం. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలకు సంబంధించి మినిట్ టు మినిట్ తెప్పించుకుంటున్నారు. నిధులు కావాలంటే తెప్పిస్తా. మీరు బాగా పనిచేయకపోతే మీకు, మాకు, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది’ అని ఆర్డబ్ల్యూస్ అధికారులను రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాలశాఖ మంత్రి శిద్దా రాఘవరావు సున్నితంగా మందలించారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, చాలామంది వడదెబ్బకు గురై మరణించారని మంత్రి చెప్పారు. అనేక హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచామని, జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మంచినీటి సమస్య గురించి చర్చించే సమయంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మూర్తి దర్శి నియోజకవర్గ పరిధిలోని వివరాలు అందిస్తుండగా తాను మంత్రిని, జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని శిద్దా రాఘవరావు ఆదేశించారు. ‘నా నియోజకవర్గంలో బోర్వెల్స్ లేవు. సాగర్ నీరు విడుదల చేసినప్పుడు చెరువులు నింపరు. చెరువుల్లోకి నీరు వచ్చినా అక్కడి ఫిల్టర్ బెడ్ పనిచేయదు. మంచినీటి పథకాలకు నీరు తరలించరు. సరైన ప్రణాళిక లేదు. రివ్యూలో అడిగినప్పుడే సమస్యలపై బుర్ర పెడుతున్నారు. మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది’ అని పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పనితీరును ఎండగట్టారు. కొండపి శాసనసభ్యుడు బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ కొన్ని పంచాయతీలకు పాలక వర్గాలు మారగానే ఉద్దేశపూర్వకంగా మంచినీటి పథకాలను మూలనపడేస్తున్నారని ఆరోపించారు. వర్క్ ప్రోగ్రెస్ లేదు.. చేసిన ఖర్చు చూపలేదు : ఎమ్మెల్యే సురేష్ ‘సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకర్గ పరిధిలో చీమకుర్తి, అమ్మనబ్రోలులో చేపట్టిన మంచినీటి పథకాల నిర్మాణాల్లో ప్రోగ్రెస్ లేదు. ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారో లెక్కలు చూపలేదు. నాలుగు మండలాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని కోరాను. అధికారులు దాన్ని సీరియస్గా తీసుకోలేదు’ అని శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. సంతనూతలపాడులోని కొన్ని గ్రామాలను ఒంగోలు నగర పాలకసంస్థలో కలిపారని, వారికి మంచినీటిని అందించడం లేదన్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు రవాణా చేయాలని ఎవరూ తనను అడగలేదని కమిషనర్ విజయలక్ష్మి సమాధానం చెప్పడంపై కలెక్టర్ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శిద్దా జోక్యం చేసుకుంటూ మంచినీటి సరఫరాపై ఒంగోలులో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, ఎన్ని రోజులకు ఒకసారి నీరు విడుదల చేస్తున్నారని కమిషనర్ను అడిగితే విద్యుత్ కోతల కారణంగా సరిగా ఇవ్వడం లేదని ఆమె నీళ్లు నమిలారు. ఇలాగే ఉంటే పబ్లిక్లో డ్యామేజ్ అవుతామని, అవసరమైతే అదనంగా 15 ట్యాంకర్లను పెంచి నీరు సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత బెల్ట్షాపులు తొలగిం పుపై సంతకం చేశారని, ఇప్పటికీ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అవి రన్ అవుతున్నాయని మంత్రి శిద్దా రాఘవరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ కాలువ నీటి విడుదల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎన్ఎస్పీ అధికారులకు మంత్రి శిద్దా సూచించారు. రిమ్స్ గురించి చర్చిస్తున్న సమయంలో మంత్రి మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ చెత్తతో మురికిమయంగా ఉందని, రూ.వందల కోట్లు ఖర్చుచేసినా పాతకాలం నాటి పరుపులు వేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. క్లీన్గా ఉంటే రోగాలు తగ్గుతాయని రిమ్స్ డెరైక్టర్కు సూచించారు. విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, సంక్షేమశాఖల గురించి సమావేశంలో మంత్రి చర్చించారు. -
ఆర్టీసీ రూ. 2,600 కోట్ల నష్టంలో ఉంది: సిద్దా
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ రూ.2,600 కోట్ల నష్టంలో ఉందని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి సిద్దా రాఘవరావు వెల్లడించారు. గురువారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆర్టీసీకి రోజుకు రూ. 2.75 కోట్ల నష్టం వస్తుందని తెలిపారు. నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించడం కోసం 15 శాతం ఛార్జీలు పెంచాలని అధికారులు కొరుతున్నారని చెప్పారు. ఛార్జీల పెంపుపై తాము సుముఖంగా లేమని ఆయన స్సష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలలో రహదారుల నిర్మాణానికి చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి మండలాన్ని జిల్లా కేంద్రానికి అనుసంధానం చేసేందుకు చర్యలు చేపడతామని సిద్దా రాఘవరావు వివరించారు. -
మంత్రి శిద్దాను కలసిన మాగుంట
ఒంగోలు: రాష్ట్ర రహదారులు, భవనాలు, రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావును ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి బుధవారం ఉదయం ఆయన స్వగృహంలో కలిసి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరూ దాదాపు అర్ధగంటపాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల ఎన్నికల కోడ్ సందర్భంగా మంజూరు చేయించిన పలు పథకాల పనులు ఆగిపోయాయని, వాటిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో వారిని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్, సంతనూతలపాడు టీడీపీ ఇన్చార్జి మన్నెం శ్రీధర్, ఒంగోలు సూపర్బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం తదితరులు కలిశారు. సిటీ బస్సులు నడపాలి: ఒంగోలు నగరంలో సిటీ బస్సులు నడపాలని సీపీఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావు, సయ్యద్సర్థార్ తదితరులు మంత్రి శిద్దా రాఘవరావును కలిసి విజ్ఞప్తి చేశారు. ఆటో చార్జీలు ప్రయాణికులకు పెనుభారంగా మారాయని, అందువల్ల సిటీ బస్సులు నడపాల్సిన అవసరం ఉందన్నారు. ఒంగోలు డిపో అధికారులు సిటీ బస్సులు నడపకుండా వంకలు చెబుతున్నారన్నారు. జేఎన్యూఆర్ఎం నిధులతో సంబంధం లేకుండానే సిటీ బస్సులు నడిపేందుకు దృష్టి సారించాలని, దాంతోపాటు పలు మార్గాల్లో పల్లె వెలుగు బస్సులు నడిపేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఆర్టీసీ అధికారులతోను, రవాణాశాఖ అధికారులతో సమీక్షిస్తానని, తప్పకుండా అభివృద్ధి పనులు చేపడదామంటూ మంత్రి వారికి హామీ ఇచ్చారు. మంత్రికి అభినందనల వెల్లువ: మంత్రి శిద్దా రాఘవరావుకు అధికారులు, అనధికారులు పలువురు అభినందనలు తెలిపారు. ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్, ఆర్టీసీ సీఎంఈ రవికాంత్, ఆర్టీసీ నాయకులు తిరుమలేషు, పలువురు ఎక్సయిజ్ అధికారులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. వీరితోపాటు పలువురు జనసేన నాయకులు కూడా శిద్దాను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. -
బస్టాండా... బందెల దొడ్డా
ఒంగోలు: ‘ఎక్కడ చూసినా అపరిశుభ్రంగా ఉంది. ఆర్టీసీ బస్టాండు అనుకుంటున్నారా..బందెల దొడ్డనుకుంటున్నారా..’ అని రాష్ట్ర రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావు ఆర్టీసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండును సోమవారం మధ్యాహ్నం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండు ఆవరణ అంతా అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహించారు. వేలాది మంది సంచరించే ప్రదేశం ఇంత అపరిశుభ్రంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. ఎక్కడి చెత్త అక్కడే ఉంది..దుమ్ము, ధూళి పేరుకుపోయింది..శుభ్రం చేస్తున్న దాఖలాలే కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అధికారులు పారిశుధ్య కార్మికులను పరుగులెత్తించారు. = మరోవైపు బస్టాండు ఆవరణలో సీలింగ్ మొత్తం వైర్లు వేలాడుతూ చిందరవందరగా ఉండటాన్ని ప్రశ్నించగా..పెయింట్ వర్క్, మరమ్మతులు జరుగుతున్నాయని అధికారులు చెప్పుకొచ్చారు. = కొణిజేడు బస్సులు ఆగే ప్రాంతంలో కనీసం షెల్టర్ లేకపోవడాన్ని గుర్తించి వెంటనే బస్టాండు ఎక్స్టెన్షన్కు ఎంతమేర నిధులు అవసరమవుతాయో అంచనాలు రూపొందించి తనకు పంపాలని ఆదేశించారు. = స్టాల్స్లో కూడా పరిశుభ్రత కనిపించడం లేదని శిద్దా అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో క్యాంటిన్కు ఇచ్చిన స్థానంలో ప్రస్తుతం వోల్వో కార్నర్ ఏర్పాటు చేస్తున్నామని, మిగతా భాగానికి సంబంధించి ఇటీవలే క్యాంటిన్ నిర్వహణకు టెండర్ ఖరారైంద ని అధికారులు తెలిపారు. త్వరలోనే వారు క్యాంటిన్ ప్రారంభిస్తారన్నారు. బస్టాండుకు పశ్చిమం వైపున టాయిలెట్ల నిర్మాణం పూర్తయిందని అవి కూడా ప్రారంభానికి సిద్ధం చేస్తున్నామన్నారు. = బస్టాండు పల్లంలో ఉండటంతో వర్షాకాలంలో తీవ్ర సమస్యగా ఉందని అధికారులు తెలపగా..సమస్య పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుంది..ఎంత మేర నిధులు అవసరమవుతాయో అంచనాలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. = పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే సహించేది లేదని..కనీసం మంచినీరు కూడా సక్రమంగా, ఉచితంగా అందించలేకపోతే ఎలా అని ఆగ్రహించారు. పది రోజులు వేచి చూస్తానని ఈలోగా బస్టాండు వాతావరణం మొత్తం మారిపోవాలని మంత్రి సూచించారు. ఆయన వెంట ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. మంత్రి శిద్దాను కలిసిన ఒంగోలు డిపో మేనేజర్: రవాణ శాఖా మంత్రి శిద్దా రాఘవరావును సోమవారం ఉదయం ఆయన నివాసగృహంలో ఆర్టీసీ ఒంగోలు డిపో మేనేజర్ మురళీబాబు కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా పలు విషయాల గురించి ప్రశ్నించారు. ఒంగోలు నుంచి ముఖ్య ప్రాంతాలైన చెన్నై, వైజాగ్, తిరుపతికి ఎన్ని బస్సులు నడుపుతున్నారని ప్రశ్నించారు. ఒంగోలు డిపో నుంచి ఆ ప్రాంతాలకు ఎటువంటి బస్సులు నడపడం లేదని, ఇతర డిపోలైన అద్దంకి, పొదిలి, చీరాల తదితర ప్రాంతాల నుంచి నడుపుతున్నట్లు మేనేజర్ చెప్పారు. అది సరికాదని..ఒంగోలు నుంచి ఆ ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఒంగోలు నుంచి హైదరాబాద్కు వోల్వో బస్సు ఉందా అని ప్రశ్నించగా లేదని..కందుకూరు నుంచి ఉందని మేనేజర్ చెప్పారు. ఇక నుంచి ఆ బస్సును ఒంగోలు నుంచే నడపాలని, ఆదాయంతో ముడిపెట్టి పల్లె వెలుగు బస్సులను నిలిపేయవద్దని మంత్రి ఆదేశించారు. -
రాష్ట్ర మంత్రిగా శిద్దా రాఘవరావు
ఒంగోలు, న్యూస్లైన్: రాష్ట్ర మంత్రివర్గంలో శిద్దా రాఘవరావుకు స్థానం దక్కింది. ఆదివారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శిద్దా రాఘవరావు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు(వైద్య,ఆరోగ్యశాఖామంత్రి),గొట్టిపాటి హనుమంతరావు(పౌరసరఫరాలు), డాక్టర్ పాలేటి రామారావు(పశుసంవర్థకశాఖ), ముక్కు కాశిరెడ్డి(పట్టు పరిశ్రమ శాఖ), జాగర్లమూడి లక్ష్మీపద్మావతి(వాణిజ్య పన్నుల శాఖ), దామచర్ల ఆంజనేయులు (దేవాదాయ, ధర్మాదాయ శాఖ - మార్కెటింగ్ శాఖ) మంత్రి పదవులు నిర్వహించారు. ఇప్పటి వరకు నలుగురు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు, ఒకరు రెడ్డి సామాజిక వర్గం, ఒకరు యాదవ సామాజికవర్గానికి చెందిన వారు మంత్రి పదవులు నిర్వహించారు. తాజాగా ఈ జాబితాలో వైశ్య సామాజికవర్గానికి చెందిన శిద్దా రాఘవరావు పేరు చోటు చేసుకుంది. -
శిద్దాకు మంత్రి పదవి ఖరారు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొత్తగా ఏర్పడనున్న తెలుగుదేశం ప్రభుత్వంలో దర్శి ఎమ్మెల్యే శిద్దా రాఘవరావుకు మంత్రి పదవి దాదాపు ఖరారైనట్టు తెలిసింది. బుధవారం తిరుపతిలో జరిగిన తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశం అనంతరం శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ మేరకు ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. గురువారం ఉదయం కూడా చంద్రబాబునాయుడుతో శిద్దా సమావేశమైనట్టు తెలిసింది. ఆయనకు వాణిజ్య శాఖ అప్పగించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాఘవరావుకు సీనియర్ నాయకుడిగా తెలుగుదేశంలో గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై వెయ్యికిపైగా ఓట్లతో గెలుపొందినా, సీనియర్ నాయకుడిగా ఆయనకు అవకాశం కల్పించడానికి సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో పాటు అధికారంలో లేని కాలంలో ఆయన పార్టీకి అండగా ఉంటూ వచ్చారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆయన పెద్ద దిక్కుగా నిలిచారని పార్టీ నాయకులు తెలిపారు. ఆయనతో పాటు టీడీపీకి మరో పెద్దదిక్కయిన మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఆయన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా కోరుతున్నట్లు తెలిసింది. దీనికి చంద్రబాబు సుముఖంగా లేరని అంటున్నారు. జిల్లాకు మరో మంత్రి పదవి కూడా ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. ఒంగోలు దిగ్గజంగా పేరుపొందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిపై గెలిచిన దామచర్ల జనార్దన్కు మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏలూరి సాంబశివరావు, చంద్రబాబు తనయుడు లోకేష్ ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. లోకేష్కు, ఏలూరి సాంబశివరావుకు మధ్య సత్సంబంధాలు ఉన్నట్లు సమాచారం. దీంతో లోకేష్ ఏలూరికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. జనార్దన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, ఎన్నికల సమయంలో తన సమర్ధతను నిరూపించుకున్నారని, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడమే సముచితమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ కరణం బలరామకృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేసు కోవాల్సిన ఆవశ్యకత లేదని అన్నారు. దీనికి చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. ఆయనకు ఇస్తే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి కూడా ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. దివి శివరాం, కందుల నారాయణరెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారని, వారికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవులు కట్టబెట్టాల్సి ఉంటుందని అన్నారు. ఏది ఏమైనా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం శిరోధార్యమని అన్నారు. -
పదవుల కోసం ఆరాటం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో, ఆ పార్టీ నాయకులు పదవుల కోసం అర్రులు జాస్తున్నారు. జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులు కోరుతుండగా, ఓడిన వారు ఎమ్మెల్సీ పదవి కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పదేళ్ల తరువాత పార్టీ అధికారంలోకి రావడంతో ఏదో విధంగా లబ్ధి పొందాలనే ఆతృతతో తెలుగు తమ్ముళ్లున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయనుండగా, జిల్లాకు చెందిన ఎమ్మెల్యే శిద్దా రాఘవరావుకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా తమకు మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. పదేళ్లలో తొలిసారిగా ఐదునియోజకవర్గాల్లో విజయం సాధించామని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా పని చేసిన దామచర్ల జనార్దన్, తాను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై భారీ మెజారిటీలో గెలిచానని తనకు మంత్రి పదవి ఎందుకివ్వరని ప్రశ్నిస్తున్నారు. కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు తాను బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడనని, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తనకు లోకేష్ సన్నిహితుడని వారితో సిఫారసు చేయించుకుని మంత్రి పదవి దక్కించుకుంటామని అంటున్నారు. దాదాపు అందరూ ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవులు కావాలని కోరుతుండగా, ఓడిన వారు కూడా తమకు నామినేటెడ్ పదవులో, ఎమ్మెల్సీలనో కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కందుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన దివి శివరాం తనకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోరుకున్నట్లు తెలిసింది. అయితే ఆ పదవిని తిరుపతి టీడీపీ నాయకుడు చదలవాడ కృష్ణమూర్తికి కేటాయించినట్లు, ఆయనకే ఆ పదవిని ఇవ్వనున్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో మాగుంట కినుక వహించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత, తనకు న్యాయం జరగలేదని తన సన్నిహితులతో అన్నట్లు తెలిసింది. సంతనూతలపాడు నియోజకవర్గంలో పోటీ చేసి పరాజయం పొందిన బీఎన్ విజయకుమార్ కూడా తనకు నామినేటెడ్ పదవి ఇప్పించాలని సుజనా చౌదరి ద్వారా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పదవి ఖరారయినట్లు భావిస్తున్న శిద్దా రాఘవరావు తన సన్నిహితులకు నామినేటెడ్ పదవులు కోరుతున్నట్లు సమాచారం. టీడీపీ సీనియర్ నాయకుడు కరణం బలరాం రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని, లేనిపక్షంలో తన కుమారుడు కరణం వెంకటేష్కు ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబు వద్ద గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు తెలిసింది. ఇదేవిధంగా ప్రతీ నాయకుడు తనకు పదవి కావాలని కోరుతున్నారు. సామాన్య కార్యకర్త కూడా తనకు రేషన్ దుకాణం లెసైన్సు ఇప్పించాలని డిమాండు చేస్తున్నట్లు తెలిసింది. -
టీడీపీ అభ్యర్థి కారు నుంచి రూ.25 లక్షలు స్వాధీనం
ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అందులోభాగంగా శనివారం ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.25 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... దర్శి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావుకు చెందినదని వారు వెల్లడించారు. నగదుతో పాటు కారును సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. అలాగే అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓటర్లుకు నగదు పంచుతున్న ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 20 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.