బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ మహిళ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది.
హైదరాబాద్: బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ మహిళ శంషాబాద్ విమానాశ్రయ పోలీసులకు దొరికిపోయింది. హైదరాబాద్కు చెందిన ఓ మహిళ గురువారం సాయంత్రం అబుదబి నుంచి వచ్చింది. ఆమె వెంట తెచ్చుకున్న లగేజిని తనిఖీ చేసిన రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు మిక్సర్ గ్రైండర్ను పరీక్షగా చూడగా అందులోని మోటార్లో ఉన్న దాదాపు 1.29 కేజీల బంగారం బయటపడింది. ఈ మేరకు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.