ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి | At least six people were killed and several others injured in a blast in Lahore today. | Sakshi

ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి

Published Wed, Apr 5 2017 12:27 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి - Sakshi

ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి

పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు.

లాహోర్‌: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. జనాభా లెక్కలు సేకరించే వారిని లక్ష్యంగా చేసుకొని బుధవారం లాహోర్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు సైనికులతో పాటు ఇద్దరు జనాభా లెక్కలు సేకరించే వారు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారని పంజాబ్‌ గవర్నమెంట్‌ స్పోక్స్‌ పర్సన్‌ మాలిక్‌ అహ్మద్‌ వెల్లడించారు.

ఉగ్రదాడిలో ఎంత మంది పాల్గొన్నారనే విషయం ఇప్పుడే తెలియరాలేదని ఆయన తెలిపారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి షాబాజ్‌ షరిఫ్‌ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరిలో లాహోర్‌లోని ఓ షాపింగ్‌ సెంటర్‌ వద్ద జరిగిన పేలుడులో 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement