Lahore
-
CT 2025: ‘రూ. 739 కోట్ల నష్టం’.. పాక్ క్రికెట్ బోర్డు స్పందన ఇదే!
దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) రూపంలో ఐసీసీ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇచ్చింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో నిర్వహణ హక్కులు దక్కించుకున్న పాక్.. టీమిండియా కోసం హైబ్రిడ్ విధానానికి అంగీకరించాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా రోహిత్ సేనను అక్కడకు పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిరాకరించగా.. ఐసీసీ జోక్యంతో పాక్ క్రికెట్ బోర్డు (PCB) వెనక్కి తగ్గింది.ఈ నేపథ్యంలో టీమిండియా తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడింది. గ్రూప్ దశలో మూడు, సెమీస్, ఫైనల్ మ్యాచ్లను అక్కడే పూర్తి చేసుకుంది. మరోవైపు.. పాకిస్తాన్ పది మ్యాచ్ల నిర్వహణకు సిద్ధంకాగా.. వర్షం వల్ల కేవలం ఎనిమిది మ్యాచ్లు మాత్రమే సజావుగా సాగాయి.రూ. 739 కోట్ల మేర నష్టం?ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ నేపథ్యంలో పీసీబీకి రూ. 739 కోట్ల మేర నష్టం వాటిల్లిందనే వార్తలు వచ్చాయి. అయితే, పీసీబీ అధికార ప్రతినిధి ఆమిర్ మిర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జావేద్ ముర్తజా ఈ వదంతులను ఖండించారు. ఐసీసీ ఈవెంట్ నిర్వహించడం ద్వారా తమకు ఎలాంటి నష్టం రాలేదని.. పైగా రూ. 100 కోట్ల మేర ఆదాయం చేకూరిందని చెప్పడం గమనార్హం.‘‘టోర్నమెంట్కు సంబంధించి అయిన ఖర్చు మొత్తాన్ని ఐసీసీ సమకూర్చింది. టికెట్ల అమ్మకం, ఇతర మార్గాల ద్వారా పీసీబీకి పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరింది’’ అని ఆమిర్ మిర్ స్పష్టం చేశాడు. తమ అంచనాలకు మించి రెవెన్యూ వచ్చిందని.. ఆడిట్ తర్వాత ఈ మొత్తం ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాడు.ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి తమకు రూ. 300 కోట్ల మేర ఆదాయం చేకూరిందని పీసీబీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఆదాయంలో ఏకంగా 40 శాతం పెరుగుదల నమోదైందని.. ప్రపంచంలో తాము ఇప్పుడు టాప్-3 సంపన్న బోర్డుల జాబితాలో చేరామని పేర్కొన్నాయి.అత్యంత సంపన్న బోర్డుగా బీసీసీఐకాగా దాదాపు 19 వేల కోట్లకు పైగా రూపాయలతో బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డుగా కొనసాగుతోంది. క్రికెట్ ఆస్ట్రేలియా రూ. 689 కోట్లు, ఇంగ్లండ్ &వేల్స్ బోర్డు రూ. 513 కోట్ల మేర సంపదతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతుండగా.. రూ. 300 కోట్ల సంపద కలిగి ఉన్నామన్న చెపుతున్న పీసీబీ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. తాము టాప్-3లో ఉన్నామంటూ బోర్డు వర్గాలు వెల్లడించడం గమనార్హం.చాంపియన్గా టీమిండియాఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీల-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీ పడ్డాయి. గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి. తొలి సెమీస్లో భారత్.. ఆసీస్ను.. రెండో సెమీస్లో న్యూజిలాండ్ ప్రొటిస్ జట్టును ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. దుబాయ్లో మార్చి 9న జరిగిన ఫైనల్లో టీమిండియా కివీస్ జట్టును ఓడించి చాంపియన్గా అవతరించింది.ఇదిలా ఉంటే.. పాకిస్తాన్లో రావల్పిండి, కరాచీ, లాహోర్ మైదానాలు చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చాయి. ఈ మెగా వన్డే ఈవెంట్ కోసం ఈ మూడు స్టేడియాలలో భారీ ఖర్చుతో పీసీబీ మరమతులు చేపట్టింది. అయితే, వర్షం కారణంగా రావల్పిండి, లాహోర్లలో మ్యాచ్లు రద్దు కావడం.. అక్కడి డ్రైనేజీ వ్యవస్థ దుస్థితికి అద్దం పట్టాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేనపుడు ఇలాంటి మెగా టోర్నీలను నిర్వహిస్తామని పట్టుబట్టడం సరికాదంటూ పీసీబీ తీరుపై విమర్శలు వచ్చాయి. చదవండి: 'సెహ్వాగ్ నన్ను అవమానించాడు.. అందుకే మాట్లాడటం మానేశా' -
CT 2025, 2nd Semi Final: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లోకి న్యూజిలాండ్.. సెమీస్లో సౌతాఫ్రికా చిత్తుఛాంపియన్స్ ట్రోఫీ-2025 రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మార్చి 9న జరిగే ఫైనల్లో టీమిండియాతో అమీతుమీకి అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్ 49 పరుగులతో రాణించగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, రబాడ 2, ముల్దర్ ఓ వికెట్ పడగొట్టారు.భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి లక్ష్యానికి 51 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బవుమా (56), డసెన్ (69) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు ఆడి మిల్లర్ మెరుపు సెంచరీ (100 నాటౌట్) బాదాడు. మిల్లర్ చివరి బంతికి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 3 వికెట్లు తీసి సౌతాఫ్రికా విజయావకాశాలను దెబ్బకొట్టాడు. మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ తలో 2, బ్రేస్వెల్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు.ఓటమి అంచుల్లో సౌతాఫ్రికా363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 212 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. డేవిడ్ మిల్లర్ (25), కేశవ్ మహారాజ్ క్రీజ్లో ఉన్నారు. సాంట్నర్ (7-0-29-3) సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. ఐదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. మార్క్రమ్ ఔట్189 పరుగుల వద్ద (32.6వ ఓవర్) సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. రచిన్ రవీంద్ర బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ (31) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా.. క్లాసెన్ ఔట్167 పరుగుల వద్ద (28.4వ ఓవర్) సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్లో హెన్రీకి క్యాచ్ ఇచ్చి క్లాసెన్ (3) ఔటయ్యాడు. మార్క్రమ్ (19), డేవిడ్ మిల్లర్ క్రీజ్లో ఉన్నారు. డసెన్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 161 పరుగుల వద్ద (26.5వ ఓవర్) మూడో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ బౌలింగ్లో డసెన్ (69) క్లీన్ బౌల్డయ్యాడు. మార్క్రమ్ (16), క్లాసెన్ క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా గెలవాలంటే ఇంకా 202 పరుగులు చేయాలి.రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా125 పరుగుల వద్ద (22.2వ ఓవర్) సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (56) రెండో వికెట్గా వెనుదిరిగాడు. సాంట్నర్ బౌలింగ్లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి బవుమా ఔటయ్యాడు. డసెన్కు (50) జతగా మార్క్రమ్ క్రీజ్లోకి వచ్చాడు. ఆచితూచి ఆడుతున్న డసెన్, బవుమా363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటర్లు బవుమా (42), డసెన్ (34) ఆచితూచి ఆడుతున్నారు. 17 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 94/1గా ఉంది. రికెల్టన్ 17 పరుగులు చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్లో ఔటయ్యాడు.పది ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు:టెంబా బవుమా 25, డసెన్ 14 పరుగులతో ఉన్నారు. 56-1తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా4.5: మ్యాట్ హెన్రీ బౌలింగ్లో ర్యాన్ రెకెల్టన్ బ్రేస్వెల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 12 బంతులు ఎదుర్కొన ఈ ఓపెనింగ్ బ్యాటర్ 17 పరుగులు చేసి నిష్క్రమించాడు. రచిన్, విలియమ్సన్ శతకాలు.. న్యూజిలాండ్ భారీ స్కోర్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. 300 దాటిన న్యూజిలాండ్ స్కోర్45.3వ ఓవర్: మార్కో జన్సెన్ బౌలింగ్లో గ్లెన్ ఫిలిప్స్ బౌండరీ బాదడంతో న్యూజిలాండ్ స్కోర్ 300 దాటింది. ఈ బౌండరీ అనంతరం ఫిలిప్స్ వరుసగా మరో మూడు బౌండరీలు బాదాడు. 47వ ఓవర్ తొలి బంతికి ఎంగిడి బౌలింగ్లో రబాడకు క్యాచ్ ఇచ్చి డారిల్ మిచెల్ (49) ఔటయ్యాడు. 46.3 ఓవర్ల తర్వాత కివీస్ స్కోర్ 317/5గా ఉంది. ఫిలిప్స్తో పాటు బ్రేస్వెల్ క్రీజ్లో ఉన్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్41.1 ఓవర్: 257 పరుగుల వద్ద న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్లో టామ్ లాథమ్ (4) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డారిల్ మిచెల్కు (19) జతగా గ్లెన్ ఫిలిప్స్ క్రీజ్లోకి వచ్చాడు. సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఔటైన విలియమ్సన్39.5వ ఓవర్: సెంచరీ పూర్తి చేసిన ఓవర్లోనే విలియమ్సన్ (102) ఔటయ్యాడు. ముల్దర్ బౌలింగ్లో ఎంగిడికి క్యాచ్ ఇచ్చి కేన్ మామ పెవిలియన్ బాట పట్టాడు. 40 ఓవర్ల అనంతరం న్యూజిలాండ్ స్కోర్ 252/3గా ఉంది. టామ్ లాథమ్ (1), డారిల్ మిచెల్ (17) క్రీజ్లో ఉన్నారు.సెంచరీ పూర్తి చేసుకున్న విలియమ్సన్39.1 ఓవర్: ముల్దర్ బౌలింగ్లో బౌండరీ బాది కేన్ విలియమ్సన్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కేన్కు ఇది 15వ సెంచరీ. కేన్ తన సెంచరీ మార్కును 91 బంతుల్లో చేరుకున్నాడు. రచిన్ అవుట్రచిన్ రవీంద్ర రూపంలో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. రబడ బౌలింగ్లో రచిన్ క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి 108 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. విలియమమ్సన్ 80 పరుగులతో ఉండగా.. డారిల్ మిచెల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 213/2 (33.5) శతక్కొట్టిన రచిన్.. విలియమ్సన్ ఫిఫ్టీసౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ దంచికొడుతున్నారు. 32 ఓవర్లు పూర్తయ్యేసరికి రచిన్ 95 బంతుల్లో 105 పరుగులతో నిలవగా.. విలియమ్సన్ 74 బంతుల్లో 72 రన్స్ సాధించాడు. దీంతో న్యూజిలండ్ స్కోరు 201కి చేరింది.నిలకడగా ఆడుతున్న రచిన్, విలియమ్సన్అర్ధ శతకం పూర్తి చేసుకున్న రచిన్ రవీంద్ర, విలియమ్సన్తో కలిసి 76 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేశాడు. 22 ఓవర్ల ఆట ముగిసే సరికి రచిన్ 67, విలియమ్సన్ 31 పరుగులతో ఉన్నారు.పదమూడు ఓవర్లలో న్యూజిలాండ్ స్కోరు: 67-1విలియమ్సన్ 11, రచిన్ రవీంద్ర 34 పరుగులతో ఉన్నారు.7.5: తొలి వికెట్ కోల్పోయిన కివీస్విల్ యంగ్ రూపంలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింఘ్లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి యంగ్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. విలియమ్సన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు 48-1(8)టాస్ గెలిచిన కివీస్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 రెండో సెమీ ఫైనల్కు రంగం సిద్ధమైంది. సౌతాఫ్రికా- న్యూజిలాండ్(South Africa Vs New Zealand) మధ్య లాహోర్ వేదికగా మ్యాచ్కు నగారా మోగింది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘వికెట్ బాగుంది. అందుకే మేము తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.పిచ్ కాస్త పొడిగానే ఉంది. న్యూజిలాండ్ కెప్టెన్గా పనిచేయడం నాకు దక్కిన గౌరవం. మా జట్టు అద్భుతంగా ఆడుతోంది. గత మ్యాచ్లో మేము దుబాయ్లో పిచ్ పరిస్థితిని అంచనా వేయలేకపోయాం. అయితే, ఇక్కడ త్రైపాక్షిక సిరీస్ ఆడిన అనుభవం అక్కరకు వస్తుంది.గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే సౌతాఫ్రికాతోనూ ఆడబోతున్నాం. ధాటిగా ఆడి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడతాం’’ అని సాంట్నర్ తెలిపాడు. ఇక సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ.. ‘‘తొలుత బ్యాటింగ్ చేయాలా, బౌలింగ్ చేయాల అన్న అంశంలో మాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు.నా ఆరోగ్యం బాగానే ఉందిమా బౌలర్లు ముందుగా వాళ్ల పని పూర్తి చేస్తే.. ఆ తర్వాత బ్యాటర్లు కూడా తమ విధిని నిర్వర్తిస్తారు. ఈ మ్యాచ్లో మేము ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం. నేను జట్టులోకి వచ్చేశాను. ప్రసుతం నా ఆరోగ్యం బాగానే ఉంది.గత ఐసీసీ టోర్నమెంట్లలో సెమీ ఫైనల్స్, ఫైనల్స్ నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం. కీలక సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దని నిశ్చయించుకున్నాం. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇది సెమీ ఫైనల్ కాబట్టి మేము ఒత్తిడికి లోనుకాము. సాధారణ మ్యాచ్లాగే దీనిని చూస్తాం’’ అని పేర్కొన్నాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తుదిదశకు చేరుకుంది. దుబాయ్లో జరిగిన తొలి సెమీ ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరింది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్ల ఫలితం.. భారత్ ప్రత్యర్థి ఎవరన్న అంశాన్ని తేల్చనుంది.ట్రై సిరీస్లో కివీస్దే విజయంఇక ఈ వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి. ఇందులో భారత్, న్యూజిలాండ్.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరగా.. ఆసీస్ను టీమిండియా నాకౌట్ చేసింది. ఇక గ్రూప్-‘బి’ టాపర్గా ఉన్న సౌతాఫ్రికా కివీస్తో మ్యాచ్లో ఏ మేరకు రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు పాకిస్తాన్తో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ట్రై సిరీస్ ఆడగా.. కివీస్ పాక్, సౌతాఫ్రికాలను ఓడించి విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్లో ట్రోఫీ లీగ్ దశ చివరి మ్యాచ్లలో సౌతాఫ్రికా ఇంగ్లండ్ను ఓడించగా.. న్యూజిలాండ్ భారత్ చేతిలో ఓటమిపాలైంది. చాంపియన్స్ ట్రోఫీ-2025: రెండో సెమీ ఫైనల్- సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ తుదిజట్లుసౌతాఫ్రికార్యాన్ రికెల్టన్, టెంబా బావుమా(కెప్టెన్), రాసీ వాన్ డెర్ డసెన్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి.న్యూజిలాండ్విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైలీ జెమీసన్, విలియం ఒ'రూర్కీ.చదవండి: రోహిత్ గురించి ప్రశ్న.. ఇచ్చి పడేసిన గంభీర్! నాకన్నీ తెలుసు... -
Aus vs Afg: కరుణించిన వరుణుడు.. సెమీస్ రేసు సమరానికి సై
వరణుడు కరుణించాడు. అఫ్గనిస్తాన్- ఆస్ట్రేలియా(Afghanistan vs Australia) మధ్య మ్యాచ్కు మార్గం సుగమం చేశాడు. ఫలితంగా లాహోర్ వేదికగా ఇరుజట్ల మధ్య సెమీస్ రేసు సమరానికి నగారా మోగింది. టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) మొదలైన విషయం తెలిసిందే. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ ఈ వన్డే టోర్నమెంట్ బరిలో దిగాయి. ఇక ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి భారత్(Team India), న్యూజిలాండ్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టగా.. గ్రూప్-‘బి’ సెమీ ఫైనలిస్టులు శుక్రవారం నాటి ఆఫ్గన్- ఆసీస్ మ్యాచ్ ఫలితంతో ఖరారు కానున్నాయి.గెలిస్తే నేరుగా సెమీస్కేగ్రూప్-‘బి’లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్లో అఫ్గన్ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. అనంతరం ఆస్ట్రేలియాతో రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. మొత్తంగా మూడు పాయింట్లు సాధించిన ప్రొటిస్ జట్టు నెట్ రన్రేటు(+2.140) పరంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఇక ఇదే గ్రూపులో ఉన్న ఆసీస్ కూడా ప్రస్తుతం మూడు పాయింట్లతో ఉండగా.. ఇంగ్లండ్ను ఓడించిన అఫ్గనిస్తాన్ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. మరోవైపు.. ఇప్పటికే ఆసీస్, అఫ్గన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ ఇంటిబాట పట్టగా.. సెమీస్ రేసులో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ పోటీపడుతున్నాయి.ఇందులో భాగంగా లాహోర్లోని గడాఫీ స్టేడియంలో శుక్రవారం నాటి మ్యాచ్ తొలి సెమీ ఫైనలిస్టును ఖరారు చేయనుంది. అఫ్గన్- ఆసీస్ పోరులో గనుక కంగారూ జట్టు గెలిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. అఫ్గన్ గెలిచినా నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది. అయితే, అప్పుడు ఆస్ట్రేలియా సౌతాఫ్రికా- ఇంగ్లండ్ ఫలితం కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.అందుకే ముందుగా బ్యాటింగ్ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గుచూపాడు. ‘‘వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగా కనిపిస్తోంది. ద్వితీయార్థ భాగంలో కాస్త మందకొడిగా ఉంటుందనిపిస్తోంది. అందుకే ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇంగ్లండ్పై గెలిచిన జట్టుతోనే ఆస్ట్రేలియాతో మ్యాచ్లోనూ బరిలోకి దిగుతున్నాం’’ అని హష్మతుల్లా తెలిపాడు.మరోవైపు.. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. తాను టాస్ గెలిస్తే ముందుగా బౌలింగే ఎంచుకునేవాడినని తెలిపాడు. పిచ్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయని.. ఏదేమైనా తమ ఆటగాళ్లు దూకుడుగా ముందుకు వెళ్లడం ఖాయమన్నాడు.తాము కూడా ఎలాంటి మార్పుల్లేకుండా.. ఇంగ్లండ్తో ఆడిన జట్టుతోనే ఆడబోతున్నట్లు తెలిపాడు.అఫ్గనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా తుదిజట్లుఅఫ్గనిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిది(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నాయిబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ.ఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.చదవండి: #Jos Buttler: అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం! -
అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో ఇంగ్లండ్ ప్రయాణం ముగిసిపోయింది. అఫ్గనిస్తాన్(Afghanistan vs England)తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో బట్లర్ బృందానికి చేదు అనుభవమే మిగిలింది. ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో అఫ్గన్ గెలుపొంది ఇంగ్లండ్ను టోర్నమెంట్ నుంచి బయటకు పంపింది. తమదైన రోజున ఎంతటి పటిష్ట జట్టునైనా ఓడిస్తామని హష్మతుల్లా బృందం మరోసారి నిరూపించింది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) తీవ్ర నిరాశకు గురికాగా.. అఫ్గనిస్తాన్ సారథి హష్మతుల్లా పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. ఇక ఓటమిపై స్పందించిన బట్లర్.. తామే చేజేతులా కీలక మ్యాచ్ను చేజార్చుకున్నామని విచారం వ్యక్తం చేశాడు. గెలిచే మ్యాచ్లోనూ ఓడిపోవడం కంటే బాధ మరొకటి ఉండదని అన్నాడు.రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు‘‘టోర్నమెంట్ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం నిరాశను మిగిల్చింది. అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో గెలిచేందుకు మాకు అన్ని అవకాశాలు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఈరోజు రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి పది ఓవర్లలో అంతా తారుమారైంది.క్రెడిట్ తనకేఏదేమైనా ఇబ్రహీం జద్రాన్ అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడికి క్రెడిట్ ఇవ్వాలి. ఇక దురదృష్టవశాత్తూ మార్క్ వుడ్ మోకాలికి గాయమైంది. అయినా సరే తను బౌలింగ్ చేయడం ప్రశంసనీయం. డెత్ ఓవర్లలో ఇలా కీలక బౌలర్ గాయపడటం తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లు ఒకడిగా ఉన్నా నా నుంచి ఇలాంటి ప్రదర్శన ఎంతమాత్రం సరికాదు. అయినా ఈ ఉద్వేగ సమయంలో నేను ఎలాంటి నిర్ణయాలు(రిటైర్మెంట్) తీసుకోను’’ అని బట్లర్ పేర్కొన్నాడు.ఇబ్రహీం జద్రాన్ ప్రతిభావంతుడైన ఆటగాడుఇక అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది మాట్లాడుతూ.. ‘‘ఇది సమిష్టి విజయం. ఈ గెలుపుతో మా దేశం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. 2023లో ఇంగ్లండ్ను తొలిసారిగా మేము ఓడించాం. అప్పటి నుంచి రోజురోజుకు మరింతగా మా ఆటకు మెరుగులు దిద్దుకుని.. ఇప్పుడు మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేశాం.నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో మాదే పైచేయి కావడం ఆనందంగా ఉంది. ఇబ్రహీం జద్రాన్ ప్రతిభావంతుడైన ఆటగాడు. ఒత్తిడిలోనూ అతడు అద్బుతంగా ఆడాడు. నేను చూసిన వన్డే ఇన్నింగ్స్లో ఇదొక అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పగలను.అజ్మత్ కూడా బాగా ఆడాడు. జట్టులో నైపుణ్యాలు గల సీనియర్లతో పాటు జూనియర్లుకూడా ఉండటం మా అదృష్టం. ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటో తెలుసు’’ అని తెలిపాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్-బి లో ఉన్న అఫ్గనిస్తాన్- ఇంగ్లండ్ మధ్య బుధవారం వన్డే మ్యాచ్ జరిగింది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(177) భారీ శతకంతో దుమ్ములేపగా.. హష్మతుల్లా(40), అజ్మతుల్లా(41), మహ్మద్ నబీ(40) రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గన్ 325 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ఇక లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 317 పరుగులకే పరిమితమైంది. జో రూట్ శతకం(120) సెంచరీ చేయగా.. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం నలభై పరుగుల మార్కు అందుకోలేదు దీంతో ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్కు పరాజయం తప్పలేదు. ఇక ఈ ఓటమితో టోర్నీ నుంచి బట్లర్ బృందం నిష్క్రమించింది. ఈ గ్రూపు నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ రేసులో ఫేవరెట్లుగా ఉండగా.. అఫ్గనిస్తాన్ తానూ పోటీలో ఉన్నానంటూ ముందుకు వచ్చింది.చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు -
లష్కరే నేత అబ్దుల్ రెహ్మాన్ మక్కి మృతి
లాహోర్: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బావమరిది, నిషేధిత జమాత్ ఉద్–దవా ఉపాధ్యక్షుడు హఫీజ్ అబ్దుల్ రహ్మాన్(76) మక్కి లాహోర్లో చనిపోయాడు. మధుమేహం ముదిరిపోవడంతో కొంతకాలంగా అతడు లాహోర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, శుక్రవారం వేకువజామున గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడని జమాత్ ఉద్–దవా తెలిపింది. ఉగ్ర నిధుల కేసులో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఇతడికి 2020లో ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2023లో ఇతడిని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. దీంతో, మక్కి ఆస్తుల సీజ్తోపాటు ప్రయాణ, ఆయుధ నిషేధం అమల్లో ఉంది. అప్పటి నుంచి మక్కి బహిరంగంగా కనిపించడం మానేశాడు. అప్పట్నుంచి, జమాత్ ఉద్ దవా పేరుతో విరాళాలు సేకరించడం, కొత్త వాళ్లను చేర్చుకోవడం ప్రారంభించాడు. 2008 డిసెంబర్ 26న సముద్ర మార్గం ద్వారా దొంగచాటుగా ముంబైలోకి ప్రవేశించిన ముష్కరులు యథేచ్ఛగా కాల్పులు జరుపుతూ భయానక వాతావరణం సృష్టించారు. వీరి కాల్పుల్లో 100 మందికిపైగా చనిపోవడం తెలిసిందే. పాకిస్తాన్లో ఉంటున్న హఫీజ్ సయీద్ అనారోగ్యంతో చనిపోయినట్లు ఏప్రిల్లో సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. -
Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు
కరాచీ: పొరుగుదేశం పాకిస్తాన్ వాయు కాలుష్యంతో విలవిలలాడిపోతోంది. ప్రపంచంలో తీవ్రమైన కాలుష్యం బారిన పడిన నగరాల్లో రెండవ స్థానంలో నిలిచిన లాహోర్లో ఇప్పుడు వాయు కాలుష్యం తారా స్థాయికి చేరింది. ఇక్కడి గాలి విషపూరితంగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన 15 వేల మంది అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులలో చేరారు.పాక్లోని లాహోర్ నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 1900ను దాటింది. ఫలితంగా ఇక్కడి ప్రజలు ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముల్తాన్లో కూడా ఏక్యూఐ 750 దాటింది. నాసాకు చెందిన మోడరేట్ రిజల్యూషన్ ఇమేజింగ్ స్పెక్టర్ రేడియోమీటర్ ఉత్తర పాకిస్తాన్లో, ముఖ్యంగా లాహోర్, దాని పరిసరాలలో ఆకాశంలో వ్యాపించిన పొగమంచు చిత్రాలను షేర్ చేసింది.శీతాకాలం ప్రారంభమైనప్పటి నుండి అంటే నవంబర్ నుండి లాహోర్ ఆకాశంలో దట్టమైన పొగమంచు కనిపిస్తోందని, ఫలితంగా గాలి నాణ్యత గణనీయంగా పడిపోయిందని నాసా తెలిపింది. లాహోర్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. పాఠశాలలు మూసివేశారు. పొడి దగ్గు, శ్వాస ఆడకపోవడం, న్యుమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలతో లాహోర్లోని మాయో ఆసుపత్రిలో 4,000 మంది బాధితులు చేరారు. అలాగే జిన్నా ఆసుపత్రిలో 3,500 మంది, పిల్లల ఆసుపత్రిలో 2,000 మందికి పైగా రోగులు చేరారు.ఆస్తమా, హృద్రోగులు బయటకు వెళ్ల కూడదని వైద్యులు హెచ్చరించారు. వాహనాల నుంచి వెలువడుతున్న విషపూరిత పొగ, నిర్మాణ స్థలాల నుంచి వెలువడుతున్న దుమ్ము మొదలైనవి లాహోర్లో వాయు కాలుష్యానికి కారణంగా నిలిచాయి. లాహోర్లో మూడు నెలల పాటు వివాహాలను నిషేధించారు. పాకిస్తాన్లోని తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో తీవ్ర వాయు కాలుష్యం కారణంగా గత నెలలో 18 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.ఇది కూడా చదవండి: పొగబారిన ఉత్తరాది.. 50 రైళ్లు, పలు విమానాలపై ప్రభావం -
పాక్ స్టేడియాల్లో కనీస వసతులు లేవు.. ఒక్కటీ..: పీసీబీ చీఫ్
పాకిస్తాన్ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా లేవని ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అన్నారు. చాలా స్టేడియాల్లో కనీస వసతులు కూడా లేవని పెదవి విరిచారు. చాంపియన్స్ ట్రోఫీ నాటికి ఈ దుస్థితిని మార్చే దిశగా ప్రక్షాళన చర్యలు చేపట్టామని తెలిపారు.వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేడియాలను పునరుద్దరించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన పీసీబీ పనులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో లాహోర్లో గల ప్రసిద్ధ గడాఫీ స్టేడియాన్ని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ సందర్శించారు.మన స్టేడియాలు బాలేవుఈ సందర్భంగా నఖ్వీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మన స్టేడియాలకు.. అంతర్జాతీయ స్టేడియాలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. మన స్టేడియాల్లో ఒక్కటీ అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా లేదు. ఆ పరిస్థితిని మార్చేందుకు మేము ప్రక్షాళన చర్యలు చేపట్టాం. ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ రాత్రిపగలూ తేడా లేకుండా ఎంతో కష్టపడుతోంది.ప్రథమ ప్రాధా న్యం అదేప్రపంచంలోని అత్యుత్తమ స్టేడియాలలో ఒకటిగా మన స్టేడియాలను తీర్చిదిద్దుతాం. అయితే, అంతకంటే ముందు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించడమే మొదటి ప్రాధాన్యంగా పనిచేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో క్రికెట్ స్టేడియాల పునరుద్ధరణలో భాగంగా పీసీబీ ఇప్పటికే 17 బిలియన్ల పాక్ రూపాయలను కేటాయించినట్లు సమాచారం.ఇక ఈ మెగా టోర్నీ నిర్వహణ కోసం ఐసీసీ పీసీబీకి 70 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. అయితే, ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు టీమిండియా పాక్కు వెళ్లబోదని బీసీసీఐ పెద్దలు చెబుతుండగా.. హైబ్రిడ్ విధానానికి తాము ఒప్పుకోమని పీసీబీ అంటోంది. ఈ విషయంపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి!!చదవండి: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదిక అదే: పీసీబీ చీఫ్ -
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదిక అదే: పీసీబీ చీఫ్
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ వేదికను ఖరారు చేసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపాడు. లాహోర్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీ తుది మ్యాచ్ నిర్వహించనున్నట్లు వెల్లడించాడు. గఢాఫీ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు సోమవారం ప్రకటించాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా మాత్రం అక్కడికి వెళ్లే సూచనలు కనిపించడం లేదు. ఆసియా వన్డే కప్-2023 మాదిరిగానే హైబ్రిడ్ విధానంలో.. టీమిండియా మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరినట్లు సమాచారం.ఫైనల్ వేదికపై పీసీబీ చీఫ్ ప్రకటనఇందుకు ఐసీసీ కూడా సానుకూలంగానే స్పందించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పాకిస్తాన్ బోర్డు మాత్రం టీమిండియాను తమ దేశానికి రప్పించే బాధ్యత ఐసీసీదేనని.. హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు.. టీమిండియా మ్యాచ్లన్నీ లాహోర్లో నిర్వహించేందుకు పాక్ బోర్డు షెడ్యూల్ ఖరారు చేసినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.ఆ మూడు మైదానాల్లోఅయితే, ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాత్రం ఫైనల్ వేదిక గురించి స్పష్టతనివ్వడం విశేషం. ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025లో హాట్ ఫేవరెట్గా టీమిండియా బరిలోకి దిగనుంది. టైటిల్ రేసులో ముందున్న రోహిత్ సేనను దృష్టిలో పెట్టుకుని.. పాక్ బోర్డు ఈ మేరకు వేదికను ఫిక్స్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ మెగా టోర్నమెంట్ మ్యాచ్లకు లాహోర్, కరాచీ, రావల్పిండి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. టీమిండియాను పాకిస్తాన్కు పంపించే విషయంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం పేర్కొన్నాడు.చదవండి: PAK Vs BAN Test Series: తొలి టెస్టుకు పాక్ తుదిజట్టు ప్రకటన.. యువ పేసర్ రీ ఎంట్రీ -
టీమిండియా మ్యాచ్లన్నీ అక్కడే!.. నో చెప్పిన ఐసీసీ!
చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్కు వెళ్తుందా? లేదా? ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సర్వసభ్య సమావేశంలో ఈ విషయంపై స్పష్టత వస్తుందని భావించినా.. అలా జరుగలేదు. రోహిత్ సేనను పాకిస్తాన్కు పంపేదేలేదని బీసీసీఐ పట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే.అయితే, నిబంధనల ప్రకారం మ్యాచ్లన్నీ తమ దేశంలోనే నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. భారత జట్టును పాకిస్తాన్కు తీసుకువచ్చే బాధ్యత ఐసీసీకే అప్పగించినట్లు సమాచారం.టీమిండియా మ్యాచ్లన్నీ లాహోర్లోనే!ఈ విషయం గురించి పీసీబీ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య దేశంగా.. తమ కర్తవ్యాలకు అనుగుణంగా పీసీబీ డ్రాఫ్ట్ షెడ్యూల్తో పాటు టోర్నీ ఫార్మాట్కు సంబంధించిన వివరాలను ఐసీసీకి సమర్పించింది.ఈ అంశాల గురించి మిగతా దేశాల బోర్డులతో చర్చించి.. షెడ్యూల్ను ఖరారు చేయాల్సిన బాధ్యత ఐసీసీ మీద ఉంది. డ్రాఫ్ట్ షెడ్యూల్లో భాగంగా టీమిండియా మ్యాచ్లు అన్నీ(ఒకవేళ అర్హత సాధిస్తే సెమీ ఫైనల్, ఫైనల్లతో సహా) లాహోర్లో నిర్వహిస్తామని తెలిపింది.అంతేకాదు.. అక్కడి టాక్స్ విధానం, వేదికల ఎంపిక, టీమిండియా మ్యాచ్ల నిర్వహణకు ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అనుమతుల గురించి కూడా రాతపూర్వకంగా వివరాలు అందించింది’’ అని తెలిపాయి.ఐసీసీ నో చెప్పినట్లే!చాంపియన్స్ ట్రోఫీ-2025లో తమ మ్యాచ్లకు వేదిక మార్చాలన్న బీసీసీఐ డిమాండ్కు ఐసీసీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సర్వసభ్య సమావేశంలో భాగంగా టోర్నమెంట్ నిర్వహణ కోసం అయ్యే ఖర్చుకు గతంలో కంటే అదనపు మొత్తాన్ని బడ్జెట్లో చేర్చినట్లు తెలుస్తోంది.ఒకవేళ ఇండియా మ్యాచ్లను హైబ్రిడ్ విధానంలో పాక్ వెలుపల నిర్వహిస్తే దాని పర్యవసనాలు, అందుకు అయ్యే ఖర్చు కోసం ఈ మొత్తాన్ని పక్కనపెట్టినట్లు సమాచారం. కాగా డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం మార్చి 1న టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్కు ముహూర్తం ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
నా జీవితంలో ఈ సినిమా చాలా ప్రత్యేకం: ప్రీతీ జింటా
ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ నటి ప్రీతీ జింటా మళ్లీ తెరపై కనిపించనుంది. సన్నీడియోల్ హీరోగా రాజ్కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘లాహోర్ 1947’. హీరో ఆమిర్ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాలోని ప్రీతీ జింటా పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో ఆమె ఈ విషయాన్ని చెబుతూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది.'లాహోర్ 1947'లో ప్రీతీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఆరేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనున్నడంతో ఆమె ఇలా చెప్పింది. 'ఈ సినిమాలో నా పాత్రకు సంబంధించి నా షూటింగ్ ముగిసింది. నా జీవితంలో చాలా సినిమాల్లో నటించాను అయితే, ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఇప్పటి వరకు నేను నటించిన ప్రాజెక్టుల కన్నా కఠినమైన సినిమా ఇదే. లాహోర్లో 1947లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అభిమానులందరికీ సినిమా తప్పకుండా నచ్చుతుంది. నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు.' అని ఆమె తెలిపింది.ఈ సంగతి ఇలా ఉంచితే... 2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్హిట్’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్ 1947’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తున్నట్లు తెలిసిన రోజు నుంచి ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించటం పాక్ తప్పే: నవాజ్ షరీఫ్
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీష్ భారత్తో చేసుకున్న ఒప్పదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1999లో తాను,అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సంతకాలు చేసిన ‘లాహోర్ డిక్లరేషన్’ఒప్పందం ఉల్లంఘించామని తెలిపారు. ఆయన మంగళవారం పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) పార్టీ సమావేశంలో మాట్లాడారు.‘మే 28, 1998న పాకిస్తాన్ ఐదు అణుబాంబు పరీక్షలు చేపట్టింది. అనంతరం భారత్ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి లాహోర్కు వచ్చారు. ఆయన మాతో లాహోర్ ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ ఒప్పందాన్ని మేం ఉల్లంఘించాము. అది మా తప్పే. అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉద్దేశపూర్వకంగా అగ్రిమెంట్ను అతిక్రమించారు’ అని అన్నారు.మార్చి,1999లో ముషారఫ్ పాక్ ఆర్మీకి ఫోర్ స్టార్ జనరల్గా ఉన్నారు. లడ్డాక్లోని కార్గీల్లో రహస్యంగా చొరబాడటానికి ఆదేశించారు. ఈ విషయంతో అప్రమత్తమైన ఇండియా యుద్ధం చేసి విజయం సాధించింది. ఆ సమయంలోనే తాను ప్రధానిగా ఉన్నానని నవాజ్ షరీఫ్ గుర్తుచేశారు. పాకిస్తాన్ మొదటి అణు బాంబు పరీక్షించి 26 ఏళ్లు అవుతోందని తెలిపారు.‘అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆనాడు పాక్.. అణుపరీక్ష ఆపేందుకు 5 బిలియన్ డాలర్లను ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ, నేను అమెరికా అఫర్ను తిరస్కరించాను. ఆ సమయంలో మాజీ ప్రధానిగా ఇమ్రాన్ ఉండి ఉంటే క్లింటన్ ఆఫర్కు అంగీకరించేవాడు’అని ఇమ్రాన్పై విమర్శలు గుప్పించారు.లాహోర్ డిక్లరేషన్ ఇరు దేశాల మధ్య ఏర్పాటు చేసుకున్న శాంతి ఒప్పందం. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు 21, ఫిబ్రవరి 1999లో సంతాకాలు చేశారు. అనంతరం పాకిస్తాన్ జమ్ము కశ్మీర్లోని కార్గిల్లోకి చొరబడటంతో యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఇక..ద తాజాగా మంగళవారం నవాజ్ షరీష్ మరోసారి పీఎంఎల్-ఎన్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
Pak vs NZ: చావో రేవో.. గట్టెక్కిన పాకిస్తాన్! ఆఖరికి..
న్యూజిలాండ్తో ఆఖరి టీ20లో పాకిస్తాన్ గట్టెక్కింది. తొమ్మిది పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది సిరీస్ను సమం చేసుకుంది. కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం కివీస్ జట్టు పాక్ పర్యటనకు వెళ్లింది.బాబర్ ఆజం కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్కు ఇదే తొలి సిరీస్. అది కూడా సొంతగడ్డపై జరుగుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ క్రమంలో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్లో ఆతిథ్య పాక్ విజయం సాధించింది. ఆ మరుసటి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసిన కివీస్.. నాలుగో టీ20లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు 1-2తో వెనుకబడింది. కివీస్ ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో బాబర్ ఆజం బృందంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరి టీ20లో పాక్ గెలుపొందింది. తద్వారా సిరీస్ను 2-2తో సమం చేయగలిగింది.లాహోర్లో టాస్ ఓడిన పాక్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. బాబర్ ఆజం(44 బంతుల్లో 69), ఉస్మాన్ ఖాన్(24 బంతుల్లో 31), ఫఖర్ జమాన్(33 బంతుల్లో 43), షాబాద్ ఖాన్(5 బంతుల్లో 15 నాటౌట్) రాణించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్ తడబడింది. ఓపెనర్ టిమ్ సెఫార్ట్ (33 బంతుల్లో 52), జోష్ క్లార్క్సన్(26 బంతుల్లో 38 నాటౌట్) మాత్రమే మెరుగ్గా ఆడారు.మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 19.2 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొమ్మిది పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. నాలుగు వికెట్లతో రాణించిన షాహిన్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. Scenes in Lahore following the fifth T20I as the series is squared 🏆🤝#PAKvNZ | #AaTenuMatchDikhawan pic.twitter.com/pBm4SmQi7j— Pakistan Cricket (@TheRealPCB) April 27, 2024 -
పెళ్లి వేడుకలో కాల్పులు.. పాక్ గ్యాంగ్స్టర్ మృతి
లాహోర్: పాకిస్థాన్లో మరో గ్యాంగ్స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. లాహోర్ అండర్వరల్డ్ డాన్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ చీఫ్ అమీర్ బలాజ్ టిపును ఓ దుండగుడు కాల్చివేశాడు. ఆదివారం లాహోర్లోని చంగ్ ప్రాంతంలో ఓ వివాహ వేడుకకు హాజరైన అమీర్తోపాటు మరో ఇద్దరు అతిథులపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన ఆమీర్ సహాయకులు ఎదురు కాల్పులు జరపగా ఆ కాల్పుల్లో షూటర్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన వారిని హుటాహుటిన జిన్నా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అమీర్ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆయనపై దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. కాగా 2010లో అల్లమా ఇక్బాల్ విమానాశ్రయంలో జరిగిన ఘోరమైన తుపాకీ కాల్పుల్లో ఆమీర్ తండ్రి ఆరిఫ్ అమీర్, అలియాస్ టిప్పు ట్రక్కన్వాలా మృతిచెందాడు. బలాజ్ తాత కూడా గతంలో గొడవలో పాత్ర ఉన్నవాడే. వీరి కుటుంబం మొత్తం హింసాత్మక చరిత్రను కలిగి ఉంది. -
బ్రైడల్ ఫ్యాషన్ షో.. ర్యాంప్ వాక్ తో అదరగొట్టిన మోడళ్లు (ఫొటోలు)
-
పాక్నూ కాటేస్తున్న వాయుకాలుష్యం.. లాహోర్ ప్రజలు విలవిల!
భారత్ మాత్రమే కాదు.. పాకిస్తాన్లోనూ గాలి అత్యంత విషపూరితంగా మారింది. పాక్లోని రెండో అతిపెద్ద నగరమైన లాహార్ పొగమంచు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగరంలోని లక్షలాది మంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పలువురి జీవనోపాధి దెబ్బతింటోంది. స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం లాహోర్లో గాలి నాణ్యత ప్రపంచంలోనే అధ్వాన్నంగా ఉంది. ఇక్కడి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ‘ప్రమాదకర’ స్థాయిని సూచిస్తూ 470 వద్ద ఉంది. పాక్ మీడియా డాన్ పేర్కొన్న వివరాల ప్రకారం వాహన ఉద్గారాలు, పారిశ్రామిక కాలుష్యం, పంటలను కాల్చడం కారణంగానే కాలుష్యం కమ్ముకుంది. పొగమంచు కారణంగా లాహోర్ నగరంలో దృశ్యమానత(విజిబులిటీ) తగ్గింది. వైమానిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. లాహోర్కు చెందిన పలువురు విషపూరితమైన గాలి కారణంగా శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధుల బారిన పడ్డారని తెలుస్తోంది. పొగమంచు నుండి తప్పించుకునేందుకు కొందరు నగరాన్ని విడిచిపెట్టారు. పాక్లోని లాహోర్, పంజాబ్లలో పొగమంచు సంక్షోభం కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో ఇటువంటి పరిస్థితులే కనిపిస్తుంటాయి. ఇది కూడా చదవండి: దక్షిణాసియాలోనే అధిక కాలుష్యం ఎందుకు? కట్టడి ఎలా? -
రాజస్థాన్ ఎన్నికలపై పాక్ కన్ను.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఢిల్లీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి..మరోసారి నోరుజారి వార్తల్లోకెక్కారు. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి.. రాజస్థాన్లోని టోంక్ నియోజకవర్గానికి ఎన్నికల ఇంచార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఈమేరకు ఆయన మంగళవారం ఓ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. భారతదేశంతోపాటు పాకిస్థాన్ కూడా రాజస్థాన్ ఎన్నికలపై కన్నేసి ఉంచిందని అన్నారు. టోంక్ స్థానంపై లాహోర్ కన్నేసిందన్నారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సభ్యులకు టోంక్ ప్రజలు ఆశ్రయం కల్పిస్తున్నరని ఆరోపించారు. ‘ఇక్కడి ఎన్నికలపై లాహోర్ నిఘా ఉంచింది. ఎన్నికల తర్వాత లాహోర్లో లడ్డూలు పంపిణీ చేయకుండా జాగ్రత్త వహించాలి. రాబోయే ఎన్నికల ఫలితాలపై హమాస్ వంటి ఉగ్రవాదుల కన్ను కూడా ఉంది’ అంటూ బిధూరి వ్యాఖ్యానించారు. కాగా టోంక్ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ పోటీ చేస్తుండటం గమనార్హం. చదవండి: సుప్రీంకోర్టు మొట్టికాయ.. మరోసారి తమిళనాడు గవర్నర్ వివాదాస్పద నిర్ణయం అయితే బిధూరి ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం ఇదేం తొలిసారి కాదు. గత పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ కున్వర్ డానిష్ అలీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బిధురిపై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను సీరియస్గా పరిగణించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.. ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్లో నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న ఈ ఎన్నికలు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీకి కీలకంగా మారాయి. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే రాజస్థాన్లో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా వరసగా రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకోలేకపోవడంతో.. ఈ అవకాశంతో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. డిసెంబర్ 3న వెలువడబోయే ఫలితాలతో రాజస్థాన్ ఎవరి వశం కాబోతుందో తెలనుంది. -
Asia Cup 2023: అయ్యో అఫ్గనిస్తాన్.. సూపర్-4లో శ్రీలంక
లాహోర్: శ్రీలంకతో మ్యాచ్లో అఫ్గానిస్తాన్ విజయలక్ష్యం 292 పరుగులు... అయితే 37.1 ఓవర్లలో దీనిని ఛేదిస్తేనే ఆ జట్టు ‘సూపర్–4’కు చేరుతుంది. దీనిని సవాల్గా తీసుకొని బ్యాటర్లంతా విజృంభించారు. అందరూ దూకుడుగా ఆడి జట్టును విజయానికి చేరువగా తెచ్చారు. 37 ఓవర్లలో స్కోరు 289 పరుగులకు చేరింది. మరో బంతికి 3 పరుగులు తీస్తే గెలుపు సొంతమవుతుందనగా వికెట్ కోల్పోయింది. అయితే తర్వాతి 3 బంతుల్లో మరో 6 పరుగులు చేసినా విజయానికి లెక్క సరిపోయేది. కానీ అదీ సాధ్యం కాలేదు. చివరకు 2 పరుగులతో గెలిచిన శ్రీలంక ‘సూపర్–4’ దశకు అర్హత సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన లంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (92; 6 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్. అనంతరం అఫ్గానిస్తాన్ 37.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. నబీ (32 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్లు), హష్మతుల్లా (59; 3 ఫోర్లు, 1 సిక్స్), రహమత్ షా (45; 5 ఫోర్లు, 1 సిక్స్), రషీద్ ఖాన్ (16 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. చదవండి: Asia Cup 2023: మొహమ్మద్ నబీ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు -
పీసీబీకి థాంక్స్.. ఇండియా- పాక్ మ్యాచ్ అంటే: పాకిస్తాన్ పర్యటనలో బీసీసీఐ బాస్
BCCI President Roger Binny Visit To Pakistan: పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ ధన్యవాదాలు తెలిపారు. తమను పాకిస్తాన్కు ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆసియా కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేది లేదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడు జై షా స్పష్టం చేశారు. ఈ క్రమంలో చర్చోపర్చల అనంతరం శ్రీలంకతో కలిసి హైబ్రిడ్ విధానంలో ఈ వన్డే ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చేందుకు పీసీబీ సిద్ధపడింది. ఆ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఇందుకు తగ్గట్లుగానే భారత జట్టు ఆడే మ్యాచ్లన్నింటితో పాటు ఫైనల్ కూడా శ్రీలంకలోనే జరుగనుంది. ఇదిలా ఉంటే.. ఏసీసీ సభ్యులు, ఆసియా కప్లో భాగమైన జట్ల క్రికెట్ బోర్డు మెంబర్స్ను పీసీబీ డిన్నర్కు ఆహ్వానించింది. PC: PCB ఈ క్రమంలో బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీతో పాటు.. ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సోమవారం నాటి పీసీబీ విందుకు హాజరయ్యారు. లాహోర్లో జరిగిన ఈ కార్యక్రమంలో రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. దాయాదుల పోరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థాంక్యూ పీసీబీ ‘‘మమ్మల్ని ఇక్కడకు ఆహ్వానించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ తరఫున కృతజ్ఞతలు చెబుతున్నా. బీసీసీతో పాటు భారత్లో ఉన్న క్రికెట్ ప్రేమికుల తరఫున కూడా నేనే విష్ చేస్తున్నా. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అందరికీ పండుగ. రోడ్లు మొత్తం ఖాళీ అవుతాయి మ్యాచ్ మొదలైందంటే చాలు.. ప్రతి ఒక్కరు అలెర్ట్ అయిపోతారు. పనులన్నీ పక్కనపెట్టేస్తారు. రోడ్లు మొత్తం ఖాళీ అయిపోతాయి. ప్రతి ఒక్కరు క్రికెట్ చూసేందుకు టీవీ ముందు కూర్చుంటారు’’ అంటూ రోజర్ బిన్నీ చిరకాల ప్రత్యర్థుల క్రికెట్ పోరు గురించి కామెంట్ చేశారు. పల్లెకెలెలో మ్యాచ్ అద్భుతంగా సాగిందని.. వర్షం అంతరాయం కలిగించి ఉండకపోతే.. ఫలితం చూసే వాళ్లమని పేర్కొన్నారు. పీసీబీ ఆహ్వానం మేరకు సరిహద్దులు దాటి వచ్చామన్న బిన్నీ.. ఇదొక అద్భుతమైన అనుభవమని సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఆసియా కప్-2023లో భారత్- పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. అది స్వర్ణయుగం ఇక రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. 2004 తర్వాత మళ్లీ పాకిస్తాన్కు రావడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. అప్పట్లో ఇండియా- పాకిస్తాన్కు స్వర్ణయుగమని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. కాగా పాకిస్తాన్ వేదికగా ఆగష్టు 30న ఆరంభమైన ఆసియా టోర్నీ సెప్టెంబరు 17న శ్రీలంకలో జరుగనున్న ఫైనల్తో ముగియనుంది. చదవండి: WC 2023: ఇద్దరూ తుదిజట్టులో ఉంటే తప్పేంటి?: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ BCCI President Roger Binny's speech at the PCB Gala Dinner at the Governor's House in Lahore.#AsiaCup2023 pic.twitter.com/Zl2tq5MHxW — Pakistan Cricket (@TheRealPCB) September 4, 2023 BCCI Vice-President Rajeev Shukla's speech at the PCB grand gala dinner at Governor's House, Lahore.#AsiaCup2023 pic.twitter.com/OdOmI4Ddcl — Pakistan Cricket (@TheRealPCB) September 4, 2023 -
పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంఛైజీ ముల్తాన్ సుల్తాన్స్ యజమాని ఆత్మహత్య!
Alamgir Tareen, Owner Of Pakistan Super League Franchise: పాకిస్తాన్ సూపర్ లీగ్ జట్టు ముల్తాన్ సుల్తాన్స్ శిబిరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముల్తాన్ సుల్తాన్స్ ఫ్రాంఛైజీ యజమాని ఆలంగిర్ తరీన్ ఆత్మహత్య చేసుకున్నాడు. లాహోర్లోని గుల్బర్గ్లో గల తన నివాసంలో బలన్మరణానికి పాల్పడ్డట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా ముల్తాన్ సుల్తాన్స్ సీఈఓ హైదర్ అజర్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఆలంగిర్ కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించాడు. ‘‘మా జట్టులో అత్యంత కీలకమైన, గౌరవనీయులైన వ్యక్తి ఆలంగిర్ తరీన్ హఠాన్మరణం చెందారు. ఈ కష్టకాలంలో ఆ దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని మనమంతా ప్రార్థిద్దాం’’ అని హైదర్ ప్రకటన విడుదల చేశాడు. ఇక ముల్తాన్ సుల్తాన్స్ సైతం ట్విటర్ వేదికగా స్పందించింది. ప్రైవసీకి భంగం కలిగించకండి ‘‘మా ప్రియమైన యజమాని ఆలంగిర్ ఖాన్ తరీన్ ఇక లేరన్న విషాదకర వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి. దయచేసి ఎవరూ కూడా తరీన్ కుటుంబ గోప్యతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించకూడదని ఈ సందర్భంగా విజ్జప్తి చేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక’’ అని విచారం వ్యక్తం చేసింది. ఇక పీఎస్ఎల్లోని ఇతర ఫ్రాంఛైజీ లాహోర్ ఖలందర్స్ కూడా ఆలంగిర్ మృతి పట్ల సంతాపం తెలిపింది. కాగా 2021లో ముల్తాన్ సుల్తాన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. తాజా సీజన్లో ఈ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఇదిలా ఉంటే.. ఆలంగిర్ ఆత్మహత్యకు కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఉన్నత విద్యావంతుడు ఆలంగిర్ తరీన్(63) ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీలో విద్యనభ్యసించాడు. దక్షిణ పంజాబ్లో మేటి వ్యాపారవేత్తగా ఎదిగిన అతడికి క్రీడల పట్ల ఆసక్తి మెండు. పాకిస్తాన్లోనే అత్యంత పెద్దదైన నీటి శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తున్న ఆలంగిర్.. పీఎస్ఎల్లో భాగమయ్యే క్రమంలో ముల్తాన్ సుల్తాన్స్ జట్టును కొనుగోలు చేశాడు. ఆ జట్టు ఇప్పటి వరకు ఒకే ఒకసారి ట్రోఫీ గెలిచింది. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: భారత్లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా? 'టీమిండియాతో మ్యాచ్ మాకు గొప్పేమి కాదు.. కేవలం ఒక్క గేమ్ మాత్రమే' إنا لله وإنا إليه راجعون It is with deep sadness that we share the news of the passing of our beloved team owner, Alamgir Khan Tareen. Our thoughts and prayers are with Mr. Tareen’s family. We request you all to kindly respect his family’s privacy. May his soul rest in… pic.twitter.com/aISUQtAqI5 — Multan Sultans (@MultanSultans) July 6, 2023 -
పాకిస్థాన్లో భారీ వర్షం...రోడ్లన్ని జలమయం (ఫొటోలు)
-
కాటేస్తున్న కాలుష్యం
సాక్షి, అమరావతి : ప్రపంచవ్యాప్తంగా 99 శాతం మంది ప్రజలు కలుషితమైన గాలిని పీలుస్తున్నారు. ఒక్క ఏడాదిలో 66.67 లక్షల మంది శ్వాసకోశ వ్యాధుల బారిన పడి మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యం అత్యధికంగా ఉన్న 20 నగరాల్లో మన దేశానికి చెందిన 14 నగరాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) నివేదిక వెల్లడించింది. అవన్నీ ఉత్తర భారత దేశ నగరాలే కావడం గమనార్హం. గాలి కాలుష్యంపై డబ్ల్యూహెచ్వో 2022లో నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డబ్ల్యూహెచ్వో ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్ గాలిలో కలుషిత పదార్థాలు 2.5 మైక్రో గ్రాములకు మించకూడదు. అయితే అన్ని దేశాల్లో గాలిలో కలుషిత పదార్థాల తీవ్రత నిర్దేశించిన ప్రమాణాల కంటే నాలుగైదు రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. కలుషితమైన గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడి తీవ్రమైన రక్తపోటుతో 2019లో ఏకంగా 66.67 లక్షల మంది మరణించినట్లు వెల్లడైంది. పట్టణాల్లో ప్రమాదకర స్థాయిలో.. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాలు, నగరాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉంది. ప్రపంచంలో గాలి కాలుష్య తీవ్రత అధికంగా ఉన్న నగరాల్లో పాకిస్తాన్లోని లాహోర్ మొదటి స్థానంలో నిలవగా చైనాలోని హటన్ రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ ఆళ్వార్ జిల్లాలోని బివాడీ కాలుష్య తీవ్రత అత్యధికంగా ఉన్న నగరాల్లో మూడో స్థానంలో నిలిచింది. కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయిలో ఉన్న నగరాల్లో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉండగా న్యూఢిల్లీ తొమ్మిదో స్థానంలో ఉంది. పరిశ్రమలు, వాహనాల పొగ.. గడ్డి కాల్చివేతతో వాహనాల రద్దీ అధికంగా ఉండటం వల్ల వాటి నుంచి వెలువడే పొగ... ప్రమాణాలు పాటించని పరిశ్రమలు... వ్యర్థాలను అడ్డగోలుగా కాల్చేయడం... నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేయడం.. పంట కోతల తర్వాత గడ్డిని పొలాల్లోనే కాల్చేయడం వల్ల ఓజోన్ పొరకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాౖMð్సడ్, నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి విష వాయువుల విడుదలతో గాలి కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంటున్నట్లు డబ్ల్యూహెచ్వో పేర్కొంది. -
విపత్తు దిశగా పాక్.. పిరికిపందల్లా పారిపోను: ఇమ్రాన్ ఖాన్
లాహోర్: పాకిస్తాన్లో నెలకొన్న రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని పీటీఐ(తెహ్రీక్ ఎ ఇన్సాఫ్) అధినేత ఇమ్రాన్ ఖాన్ అన్నారు. గతంలో మాదిరి మిగతా రాజకీయ నేతల్లా తాను దేశం విడిచి వెళ్లనని, చివరిశ్వాస వరకు ఇదే గడ్డ మీద ఉంటానని గురువారం తన సందేశంలో పేర్కొన్నారు. పాకిస్థాన్ విపత్తు దిశగా వెళ్తోందన్న ఇమ్రాన్ ఖాన్.. తూర్పు పాకిస్తాన్ మాదిరి దేశం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తన పార్టీకి, ఆర్మీకి మధ్య ఘర్షణ వాతావరణం తెచ్చేందుకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. తాను ఆర్మీని విమర్శించానంటే తన పిల్లలను మందలించినట్లుగా భావించాలన్నారు. పాక్లో నెలకొన్న రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని చెప్పారు. తాను ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లేది లేదని, చివరి శ్వాస వరకు ఇక్కడే ఉంటానన్నారు. ఇక్కడి నుండి పరారై లండన్ లో ఉన్న నవాజ్ షరీఫ్ వంటి నేతలు ఈ దేశ రాజ్యాంగం గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు. దేశంలో వ్యవస్థలు, పాక్ ఆర్మీకి వస్తోన్న చెడ్డపేరు గురించి వారికి ఆలోచన ఉందా? అని నిలదీశారు. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ నివాసాన్ని చుట్టుముట్టిన పారామిలిటరీ దళాలు, పోలీస్ బలగాలు.. ఏ క్షణంలోనైనా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ సుప్రీం కోర్టు, ఇస్లామాబాద్ హైకోర్టులు ఇమ్రాన్ ఖాన్కు ఇచ్చిన ఊరట ఆదేశాలను సైతం పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోపక్క పాక్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. పీటీఐ కార్యకర్తల ఆగడాలను భరించేది లేదని ఆర్మీ ఛీప్ ప్రకటించారు కూడా. -
రైలులో మంటలు..ఏడుగురు సజీవదహనం
కరాచీ: పాకిస్తాన్లో ఎక్స్ప్రెస్ రైలులో చెలరేగిన మంటల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న రైలు ఏసీ బోగీలో బుధవారం అర్ధరాత్రి తర్వాత మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే టాండో మస్తి ఖాన్ స్టేషన్లో రైలును ఆపేసి, మంటలు అంటుకున్న బోగీని వేరు చేశారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ దుర్ఘటనలో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఆరు మృతదేహాలు గుర్తు పట్టడానికి కూడా వీలు లేనంతగా కాలిపోయాయి. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు చెప్పారు. -
ODI WC 1996: అప్పుడు కారు.. ఇప్పుడు మీరు! ఈ క్రికెటర్ని గుర్తుపట్టారా?
Sanath Jayasuriya- “Golden memories”: శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య 1996 ప్రపంచకప్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. నాటి వన్డే వరల్డ్కప్ టోర్నీలో తన అత్యుత్తమ ప్రదర్శనకు ప్రతిఫలంగా లభించిన కారుతో ఉన్న ఫొటోలు పంచుకున్నాడు. ఇన్స్టాలో షేర్ చేసిన ఈ అపురూప చిత్రానికి.. ‘‘మరుపురాని జ్ఞాపకాలు: 27 ఏళ్ల క్రితం.. 1996 వరల్డ్కప్ మ్యాన్ ఆఫ్ సిరీస్ కార్తో ఇలా’’ అని తన పాత, ప్రస్తుత ఫొటోను జతచేసి క్యాప్షన్ ఇచ్చాడు. సనత్ జయసూర్య అభిమానులను ఆకర్షిస్తున్న ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అప్పుడు కారు మెరిసింది.. ఇప్పుడు మీరు మెరుస్తున్నారు అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కంగారూ జట్టును చిత్తుచేసి ప్రపంచకప్- 1996 ఫైనల్లో లాహోర్ వేదికగా శ్రీలంక- ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో లంక ఆసీస్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కంగారూ జట్టును చిత్తు చేసి జగజ్జేతగా అవతరించింది. ఇక ఈ మెగా టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించి 221 పరుగులు సాధించడంతో పాటు.. ఏడు వికెట్లు తీసిన లంక ఆల్రౌండర్ సనత్ జయసూర్య మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఈ క్రమంలో అతడికి ఆడి కారు బహుమతిగా లభించింది. ఇదిలా ఉంటే.. సనత్ జయసూర్య తన కెరీర్లో 445 వన్డేల్లో 13,430, 110 టెస్టుల్లో 6973 పరుగులు, 31 టీ20 మ్యాచ్లలో 629 పరుగులు సాధించాడు. ఇందులో 42 సెంచరీలు, మూడు ద్విశతకాలు ఉన్నాయి. ఇక ఈ స్పిన్ ఆల్రౌండర్ తన కెరీర్ మొత్తంలో వన్డే, టెస్టులు, టీ20లలో వరుసగా.. 323, 98, 19 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2023- Bhuvneshwar Kumar: నువ్వసలు పనికిరావు.. పైగా ఇలా మాట్లాడతావా? చెత్తగా ఆడిందే గాక.. IPL 2023: ధోనికి సరైన వారసుడు.. అతడికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో!: సెహ్వాగ్ View this post on Instagram A post shared by Sanath Jayasuriya (Official) (@sanath_jayasuriya) -
నన్ను చంపేస్తారు.. భద్రత కల్పించండి: ఇమ్రాన్ ఖాన్
లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ప్రాణ భయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు భద్రత కల్పించాలంటూ ఆ దేశ చీఫ్ జస్టిస్ బుమర్ అట బండయల్కు ఓ లేఖ రాశారు. పలు కేసుల్లో విచారణ నిమిత్తం కోర్టులకు హాజరయ్యే అవకాశం ఉన్నందున తనకు భద్రత అవసరమంటూ అందులో విజ్ఞప్తి చేశారాయన. నా ప్రభుత్వాన్ని కూలదోసినప్పటి నుంచి పరిస్థితి చాలా దారుణంగా మారింది. నాపై కేసులు నమోదు అవుతున్నాయి. చివరికి.. నన్ను చంపేయత్నం కూడా జరిగింది అని లేఖలో పేర్కొన్నారాయన. తాను దేశ మాజీ ప్రధాని అయినప్పటికీ తగిన భద్రత కల్పించడం లేదని ఇమ్రాన్ ఖాన్.. పాక్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో తనపై జరిగిన హత్యాయత్నంలో ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రమేయం ఉందని ఆరోపించారు. తనపై మరో హత్యాయత్నం జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఇవాళ్టి వరకు నాపై 74 కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్లో అతి పెద్ద రాజకీయ పార్టీకి ఛైర్మన్ నేను. కాబట్టే, నేను ఎక్కడికి వెళ్లినా జనసందోహం ఎక్కువగానే ఉంటుంది. ఇదే అదనుగా నన్నే చంపేందుకు కుట్ర పన్నుతున్నారు. ఇందుకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు కూడా అందుతున్నాయి అని లేఖలో పేర్కొన్నారాయన. గతంలో లాహోర్ హైకోర్టుకు వెళ్లినప్పుడు భద్రతా వైఫల్యం తలెత్తిందని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని, తన ప్రాణాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని అన్నారాయన. మరోవైపు తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఆదివారం లాహోర్లోని ఆయన ఇంటి వద్ద పెద్ద హైడ్రామానే నడిచింది. -
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్కు రంగం సిద్ధం!
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం లాహోర్లోని జమాన్ పార్క్లో ఉన్న ఆయన నివాసం వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. తోషాఖానా కేసులో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పీటీఐ కార్యకర్తలు అక్కడికి భారీ ర్యాలీతో చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉంటే.. పీటీఐ నేత, పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌద్రి, ఇమ్రాన్ ఇంటి వద్దకు భారీగా చేరుకోవాలని కార్యకర్తలకు ట్విటర్ ద్వారా పిలుపు ఇచ్చారు. అంతేకాదు ఖాన్ను అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారాయన. ఇదిలా ఉంటే.. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి జఫర్ ఇక్బాల్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేశారు. ఫిబ్రవరి 28వ తేదీతో ఆ వారెంట్ ఉంది. కోర్టుకు గైర్హాజరు అవుతుండడంపై మండిపడ్డ న్యాయస్థానం ఈ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. పీడీఎం ప్రభుత్వం పాక్లో కొలువు దీరాక.. ఇమ్రాన్ ఖాన్ హయాంలో జరిగిన అవినీతి కూపి లాగడం ప్రారంభించింది. ఇందులో భాగంగా.. ప్రభుత్వానికి దక్కిన కానుకలను ఇమ్రాన్ ఖాన్ సొంతంగా ఉపయోగించుకున్నారని, వాటి వివరాలను.. లెక్కలను కూడా ఎక్కడా రికార్డుల్లో భద్రపరచ్చలేదని తేల్చింది. పాక్ ఎన్నికల సంఘం సైతం ఇదే విషయాన్ని నిర్ధారించింది. తోషాఖానా(కేబినెట్ పర్యవేక్షణలోని ప్రభుత్వానికి దక్కిన కానుకలను పర్యవేక్షించే విభాగం) కేసుగా ఇది ప్రాముఖ్యత దక్కించుకుంది. -
సికందర్ రజా సునామీ ఇన్నింగ్స్.. వరుసగా నాలుగో విజయం
Pakistan Super League 2023: పాకిస్తాన్ సూపర్లీగ్-2023లో లాహోర్ ఖలండర్స్ వరుసగా నాలుగో విజయం సాధించింది. క్వెటా గ్లాడియేటర్స్ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రజా విధ్వంసకర ఇన్నింగ్స్తో జట్టుకు గెలుపు అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో గురువారం రాత్రి లాహోర్ ఖలండర్స్, క్వెటా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన క్వెటా గ్లాడియేటర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సర్ఫరాజ్ నమ్మకాన్ని నిర్ణయానికి సార్థకత చేకూరుస్తూ.. క్వెటా బౌలర్లు అదరగొట్టారు. ఉమైద్ అసీఫ్ లాహోర్ ఓపెనర్లు మీర్జా బేగ్(2), ఫఖర్ జమాన్(రనౌట్)లను తక్కువ స్కోర్లకే పరిమితం చేసి శుభారంభం అందించాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ షఫీక్ 15 పరుగులు చేయగా, వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ (2) పూర్తిగా నిరాశపరిచాడు. ఐదో స్థానంలో వచ్చిన హుసేన్ తలట్ కూడా కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించగా.. ఆరోస్థానంలో వచ్చిన కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇలా వరుస వికెట్లు కోల్పయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ సికందర్ రజా తన అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. 34 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి లాహోర్ 148 పరుగుల మెరుగైన స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. క్వెటా బౌలర్లలో నసీం షా, ఓడియన్ స్మిత్, ఉమైద్ అసీఫ్ ఒక్కో వికెట్ తీయగా.. నవీన్ ఉల్ హక్, మహ్మద్ నవాజ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెటా గ్లాడియేటర్స్ను లాహోర్ బౌలర్లు హారిస్ రవూఫ్(3 వికెట్లు), రషీద్ ఖాన్(2 వికెట్లు) దెబ్బ కొట్టారు. వీరికి తోడు డేవిడ్ వీస్ ఒక వికెట్తో రాణించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన క్వెటా గ్లాడియేటర్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పటి వరకు ఒకే ఒక్క గెలుపు నమోదు చేసిన క్వెటా గ్లాడియేటర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. చదవండి: Ind Vs Aus 3rd Test: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. రోహిత్ సేనపై 9 వికెట్ల తేడాతో విజయం IND vs AUS: ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే! వీడియో వైరల్ View this post on Instagram A post shared by Pakistan Super League (@thepsl) -
ఇమ్రాన్ఖాన్పై కాల్పులు.. తొలిసారి స్పందించిన పాకిస్తాన్ మాజీ ప్రధాని
లాహోర్: పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ గురువారం పార్టీ ర్యాలీలో తనపై జరిగిన హత్యాయత్నం అనంతరం పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి స్పందించారు. తనకు దేవుడు మరో జీవితాన్ని(పునర్జన్మ) ఇచ్చాడని వ్యాఖ్యానించారు. అల్లా మరో అవకాశం ఇచ్చారని, తన పోరాటాన్ని తిరిగి కొనసాగిస్తానని పేర్కొన్నారు. అంతేగాక తనపై జరిగిన దాడికి ఎవరినీ నిందించడం లేదని అన్నారు. కాగా ఇమ్రాన్ ఖాన్ పంజాబ్ ప్రావిన్స్లోని వజీరాబాద్లో జరిగిన నిరసన ప్రదర్శనలో కంటైనర్ ట్రక్కుపై నిల్చొని మాట్లాడుతుండగా గుర్తు తెలియని యువకుడు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇమ్రాన్ రెండు కాళ్లకు బుల్లెట్ తగిలి గాయం కాగా.. పీటీఐ పార్టీకి చెందిన పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వీరిని లాహోర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చదవండి: సుదీర్ఘకాలంగా కరోనాతో పోరాటం.. 411 రోజుల తర్వాత విముక్తి Footage of the firing. Assassination attempt on Imran Khan. pic.twitter.com/fmSgI2E8jc — Ihtisham Ul Haq (@iihtishamm) November 3, 2022 ఘటన జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకే ఇమ్రాన్ ఖాన్ను చంపేందుకు వచ్చానని నిందితుడు తెలిపాడు. ఇమ్రాన్ను మాత్రమే చంపాలని ప్రయత్నించానని.. ఇంకెవరిని కాదని అన్నాడు. తాను ఏ పార్టీకి, ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడిని కాదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ కుడి కాలుకి గాయంతో పట్టి వేసుకొని ఆసుపత్రి బెడ్పై పడుకొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ సమయంలో అతను కళ్లు తెరిచి ఎవరితోనే చిన్నగా మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. చదవండి: Imran Khan Rally: ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో ఫైరింగ్.. నలుగురికి గాయాలు -
Pak Vs Eng: పాకిస్తాన్కు భారీ షాక్! ఆస్పత్రిపాలైన స్టార్ పేసర్
Pakistan vs England, 5th T20I: ఇంగ్లండ్తో ఐదో టీ20 మ్యాచ్ ఆరంభానికి ముందు పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ నసీం షా అనారోగ్య కారణాల వల్ల జట్టుకు దూరమయ్యాడు. తీవ్రమైన జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్ వచ్చిన నేపథ్యంలో నసీం షా ఆస్పత్రి పాలయ్యాడు. లాహోర్లోని ఓ ఆస్పత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి జియో టీవీతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. టీమిండియాతో మ్యాచ్తో అరంగేట్రం ప్రస్తుతం నసీం కోలుకుంటున్నాడని.. అయితే మిగతా రెండు మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉంటాడో లేదో రిపోర్టులు వచ్చిన తర్వాతే తెలుస్తుందన్నారు. కాగా ఆసియా కప్-2022లో టీమిండియాతో మ్యాచ్లో అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేసిన 19 ఏళ్ల నసీం షా.. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టోర్నీలో మొత్తంగా ఈ పేసర్ ఏడు వికెట్లు పడగొట్టాడు. అయితే, స్వదేశంలో ఇంగ్లండ్తో తొలి టీ20లో మాత్రం తేలిపోయాడు. నసీం షా(PC: PCB) స్వదేశంలో మొదటి టీ20లో మాత్రం నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన నసీం షా 41 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ క్రమంలో మిగతా మూడు మ్యాచ్లలో తుది జట్టులో అతడికి స్థానం దక్కలేదు. ఇక కీలకమైన ఐదో టీ20 ఆడతాడనుకుంటే అనారోగ్యం పాలయ్యాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022 జట్టులో నసీం షా చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు పాక్.. స్వదేశంలో ఇంగ్లండ్తో ఏడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు జరుగగా ఇరు జట్టు రెండేసి విజయాలతో 2-2తో సమంగా ఉన్నాయి. చదవండి: Ind Vs SA 1st T20: అతడు లేని జట్టు బలహీనం.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్ LLC 2022: దంచికొట్టిన కింగ్స్ బ్యాటర్లు.. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడ్డ సెహ్వాగ్ సేన -
ఒకప్పుడు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్.. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ దుస్తులు అమ్ముతూ!
ICC Elite Panel Umpire Asad Rauf: ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో ఒకప్పుడు అంపైర్గా ఉన్న పాకిస్తాన్ ఆటగాడు అసద్ రవూఫ్.. ప్రస్తుతం దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. క్రికెట్కు పూర్తిగా దూరమైన అతడు సెకండ్ హ్యాండ్ దుస్తులు, బూట్లు, ఇతర వస్తువులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు పాక్టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో చాలా డబ్బు చూశానని, ఇప్పుడు తన షాప్లో పనిచేసే వర్కర్ల కోసమే పని చేస్తున్నానని పేర్కొన్నాడు. కాగా 71 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 40 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడిన ఈ మాజీ బ్యాటర్.. ఆయా మ్యాచ్లలో మొత్తం కలిపి 3423, 611 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అంపైర్గా మారిన అతడు ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో చోటు దక్కించుకుని కెరీర్లో ఉన్నత స్థితికి చేరుకున్నాడు. ఇక 2000-2013 వరకు 98 వన్డేలు, 49 టెస్టులు, 23 టీ20 మ్యాచ్లకు అంపైర్గా వ్యవహరించిన అసద్ రవూఫ్.. ఐపీఎల్-2013 సందర్భంగా బుకీల నుంచి ఖరీదైన బహుమతులు తీసుకున్నాడనే ఆరోపణల నేపథ్యంలో నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఆటకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ క్రమంలో లాహోర్లోని లాండా బజార్లో షాప్ నడుపుతున్న 66 ఏళ్ల అసద్ను స్థానిక మీడియా సంప్రదించగా.. తన జీవితంలో ఏ విషయానికి పశ్చాత్తాప పడటం లేదని పేర్కొన్నాడు. తాను చేస్తున్న పనితో సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. తనకు దురాశ లేదని, ఉన్నంతలో సర్దుకుంటానని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘ఇది నాకోసం చేయడం లేదు. నా షాపులో పనిచేసే సిబ్బందికి రోజూ కూలీ చెల్లించాలనే ఉద్దేశంతోనే నేను కూడా పనిలో భాగమవుతున్నా. నా లైఫ్లో చాలా డబ్బు చూశాను. ప్రపంచం మొత్తం తిరిగాను. నా కుటుంబం విషయానికొస్తే.. నాకు దివ్యాంగుడైన కుమారుడు ఉన్నాడు. మరో కుమారుడు అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నిజానికి నేను ఏ రంగంలో ఉన్నా అందులో తారస్థాయికి చేరుకోవాలని కోరుకుంటాను. క్రికెట్ ఆడే సమయంలో, అంపైరింగ్లో టాప్లో ఉండేవాడిని. ఇప్పుడు షాప్కీపర్గా కూడా ఉన్నత స్థితికి చేరుకునేందుకు కృషి చేస్తున్నా. నేను చేస్తున్న పనితో పూర్తి సంతృప్తిగా ఉన్నాను’’ అని అసద్ చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్లో ఆ చేదు అనుభవం మినహా మిగతాకాలమంతా ఎంతో అత్యుత్తమంగా గడిచిందని పేర్కొన్నాడు. చదవండి: India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు! Jos Buttler ODI Records: వన్డేల్లో చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. 17 ఏళ్ల ధోని రికార్డు బద్దలు..! -
నిబంధన తుంగలో తొక్కిన పాక్ కెప్టెన్.. పీసీబీ సీరియస్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిబంధనలను తుంగలో తొక్కాడు. లాహోర్లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్ అత్యంత మౌళిక సదుపాయాలు కలిగి ఉంటుంది. ఈ సెంటర్కు పీసీబీ అధికారులు, అంతర్జాతీయ ఆటగాళ్లు, ఫస్ట్క్లాస్, జూనియర్ క్రికెటర్లు మినహా వేరెవరికి ప్రవేశం లేదు. ఇటీవలే బాబర్ ఆజం తన సోదరుడు సఫీర్ ఆజంను ప్రాక్టీస్కు తీసుకొచ్చాడు.కాగా సఫీర్ ఆజం ఇంతవరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడలేదు. తన సోదరుడితో నెట్ ప్రాక్టీస్లో బౌలింగ్ చేయించి శిక్షణలో మెళుకువలు ఇచ్చాడు. స్వయంగా తానే పరిశీలించిన బాబర్ బౌలింగ్ టెక్నిక్స్ వివరించాడు.ఈ తతంగాన్ని అంతా బాబర్ ఆజం సోదరుడు సఫీర్ ఆజం ట్విటర్లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాబర్ ఆజం చేసిన పనిపై పీసీబీ కాస్త గుర్రుగానే ఉంది. నిబంధనలను అతిక్రమించిన బాబర్పై పీసీబీ ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. బాబర్ ఆజం మూడు నాలుగు రోజుల క్రితమే తన సోదరుడితో కలిసి క్యాంప్ను సందర్శించాడు. అయితే కేవలం చూడడానికి వచ్చాడనుకొని అనుమతి ఇచ్చామని.. కానీ సఫీర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడన్న విషయం తొలుత మా దృష్టికి రాలేదు. తాజాగా ఈ విషయం తెలియడం.. ఆపై ఏం చేయాలన్న దానిపై మాకు ఒక క్లారిటీ ఉంది అని పీసీబీ అధికారి ఒకరు వెల్లడించారు. చదవండి: Sourav Ganguly New House: ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిన బీసీసీఐ అధ్యక్షుడు pic.twitter.com/u4eZFklQLl — safeer azam (@safeerazam10) May 14, 2022 -
పాకిస్తాన్ ముందు భారీ టార్గెట్.. ఓటమి తప్పదా!
లాహోర్: ఆస్ట్రేలియా, పాకిస్తాన్ టెస్టు సిరీస్ ఉత్కంఠభరిత ముగింపునకు చేరింది. మూడో టెస్టులో 351 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన పాక్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 73 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హఖ్ (42 బ్యాటింగ్), అబ్దుల్లా షఫీఖ్ (27 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. నేడు చివరి రోజు ఆ జట్టు చేతిలో 10 వికెట్లతో మరో 278 పరుగులు చేయాల్సి ఉంది. అంతకు ముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్ను 3 వికెట్లకు 227 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖాజా (178 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు) సిరీస్లో రెండో సెంచరీ సాధించగా, డేవిడ్ వార్నర్ (51) అర్ధ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్తో టెస్టుల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న స్టీవ్ స్మిత్ అందరికంటే వేగంగా (151 ఇన్నింగ్స్లు) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్ 2022కు ఉగ్రదాడి ముప్పు..?! -
ఏ ముహుర్తానా పాక్ గడ్డపై అడుగుపెట్టిందో అన్ని విచిత్ర పరిస్థితులే; తాజాగా
ఆస్ట్రేలియా జట్టు ఏ ముహుర్తానా పాక్ గడ్డపై అడుగుపెట్టిందో కానీ.. అన్ని విచిత్ర పరిస్థితులే ఎదురవుతున్నాయి. 24 ఏళ్ల అనంతరం పాకిస్తాన్లో మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టి20 ఆడేందుకు ఆస్ట్రేలియా వచ్చింది. వచ్చీ రాగానే పెషావర్లో బాంబుల మోత.. తమను స్వాగతం పలికామా అన్నట్లుగా ఆస్ట్రేలియా జట్టును ఉలిక్కిపడేలా చేసింది. మసీదును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో సుమారు 50 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అప్పటికే పక్కనే ఉన్న రావల్పిండి సిటీలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ మొదలైంది. సిరీస్ రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లు అనుమానాలు వచ్చినప్పటికి.. పీసీబీ ఆసీస్ ఆటగాళ్ల భద్రత మాదేనని పేర్కొంది. అలా మొదటి టెస్టు పూర్తి కాగానే.. దేశంలో రాజకీయ సంక్షోభ దుమారం రేగింది. అధికారంలో ఉన్న ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. ఇమ్రాన్ఖాన్కు వ్యతిరేకంగా తమ పార్టీలు ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం కారణంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. తాజాగా రాజకీయ సంక్షభం సెగ పాకిస్తాన్- ఆస్ట్రేలియా సిరీస్ను తాకింది. మూడు వన్డేల సిరీస్తో పాటు ఏకైక టి20 మ్యాచ్ మార్చి 29, 31, ఏప్రిల్ 2, 4 తేదీలలో రావల్పిండి వేదికగా జరగాల్సి ఉంది. అయితే రాజకీయ సంక్షోభం కారణంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్తో పాటు పక్కనే ఉన్న రావల్పిండిలో అల్లర్లు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా రావల్పిండి నుంచి లాహోర్కు మ్యాచ్ వేదికలను మారుస్తున్నట్లు దేశ విదేశాంగ మంత్రి షేక్ రషీద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. లాహోర్ వేదికగా అవే తేదీల్లో మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ జరగనుందని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే మూడో టెస్టు కోసం ఇరుజట్లు లాహోర్లోని గడాఫీ వేదికగా ఆడనున్నాయి. ఇక సిరీస్లో మిగిలిన మ్యాచ్లు కూడా అక్కడే ఆడనున్నట్లు పీసీబీ తెలిపింది. ఈ విషయాన్ని ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలిపామని.. వారు తమ క్రికెటర్ల క్షేమ సమాచారాలు మాత్రమే అడిగారని.. సిరీస్ ముగిశాక జాగ్రత్తగా పంపించాలని కోరారని షేక్ రషీద్ తెలిపారు. చదవండి: 'ఇప్పుడు కాదు రోహిత్.. ఆస్ట్రేలియాపై గెలిచి చూపించు' Glenn Maxwell Marriage: గర్ల్ఫ్రెండ్ను పెళ్లాడిన ఆసీస్ విధ్వంసకర ఆటగాడు -
పబ్జీ ఆడొద్దన్నందుకు కుటుంబాన్నే కాల్చేశాడు..!
ఇస్లామాబాద్: సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు వినడానికి మొబైల్ ఫోన్లు కొనిస్తున్నారు. అయితే, కొందరు పిల్లలు వీటిని ఆటల కోసం, అశ్లీల వీడియోలు చూస్తూ ఫోన్ను దుర్వినియోగం చేస్తున్నారు. అయితే, కొందరు పిల్లలు పబ్జీ ఆటలకు, ఇతరవాటికి బానిసలుగా మారి వికృతంగా ప్రవర్తిస్తున్నారు. పబ్జీ గేమ్కు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు బానిసలుగా మారిన విషయం మనకు తెలిసిందే. పబ్జీ ఆటకు బానిసలుగా మారి కొందరు తమ విచక్షణను కోల్పోతున్నారు. దీని కోసం.. కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు ఆడొద్దని వారించిన వారిని చంపిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్లో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నహిద్ ముబారక్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కహ్నా ప్రాంతంలో ఉండేవాడు. ఈ క్రమంలో అతనికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, 14 ఏళ్ల అతని కుమారుడు కొన్ని రోజులుగా చదువుపై శ్రద్ధపెట్టడంలేదని అతని తల్లి వారించింది. అతను పబ్జీ ఆటను మానేయాలని హెచ్చరించింది. దీంతో విచక్షణ కోల్పోయిన బాలుడు.. తన తల్లితో సహా ఇద్దరు మైనర్ సోదరీమణులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. ఆ తర్వాత సదరు బాలుడు.. ఇంటి బయటకు వచ్చి అలారం శబ్ధం చేశాడు. తన కుటుంబాన్ని ఎవరో చంపారని తెలిపాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కాగా, నహిద్ తన కుటుంబ రక్షణ కోసం లైసెన్స్డ్ రివాల్వర్ను తన ఇంట్లో పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల తర్వాత నిందితుడు గన్ను ఎక్కడ పారేశాడో తెలియలేదు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. కాగా, పాక్ పత్రిక డాన్ ప్రకారం.. ఆన్లైన్ పబ్జీ గేమ్ సంబంధించి ఇది నాల్గవ నేరమని తెలిపింది. కాగా, డబ్ల్యూహెచ్వో ఇప్పటికే గేమింగ్ డిజార్డర్ను ఒక వ్యాధిగా గుర్తించింది. వీరు ఈ ఆటకు బానిసలుగా మారి తమ విచక్షణను కోల్పోయి విపరీతంగా ప్రవర్తిస్తారని తెలిపింది. చదవండి: బీజేపీని ఓడించడమే తమ ఉమ్మడి సంకల్పం: అఖిలేష్ యాదవ్ -
మహిళా సాధికారతకు ప్రతీక.. పాకిస్తాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్
సంప్రదాయ ముస్లిం మెజారిటీ గల పాకిస్థాన్ దేశ న్యాయ చరిత్రలో ఒక మహిళ న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టులోని సెరిమోనియల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ ఆహ్మద్ 55 ఏళ్ల జస్టిస్ మాలిక్తో ప్రమాణం చేయించారు. దీనికి పెద్ద సంఖ్యలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, లాయర్లు, లా అధికారులు.. హాజరయ్యారు. జస్టిస్ మాలిక్ 2012లో లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ విధంగా పాకిస్థాన్ న్యాయవ్యవస్థలో చరిత్ర సృష్టించారు ఆయేషా మాలిక్. జూన్ 2031లో పదవీ విరమణ పొందేవరకు ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారు. జస్టిస్ మాలిక్ పదోన్నతిని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ గత శువ్రారం నోటిఫికేషన్ను జారీ చేసింది. జూన్ 2030లో పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం కూడా ఆయేషా మాలిక్కు ఉంది. ఆ విధంగా ఆమె మళ్లీ పాకిస్థాన్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి గా చరిత్రలో నిలిచిపోనున్నారు. ఆమె ఘనతను చెప్పే స్థాయి.. వేడుక ముగిసిన తర్వాత చీఫ్ జస్టిస్ అహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ ‘జస్టిస్ మాలిక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యేంత సమర్ధురాలు, ఆమె ఘనతను చెప్పేంత స్థాయి ఎవరికీ లేదు’ అన్నారు. సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి, జస్టిస్ మాలిక్ సాధించిన ‘మైలు రాళ్ల’కు అభినందనలు తెలిపారు. శ్రీ ఫవాద్ ట్వీట్ చేస్తూ ‘ఒక శక్తిమంతమైన చిత్రం. పాకిస్థాన్లో మహిళా సాధికారతకు ప్రతీక’ అని ప్రమాణ స్వీకారోత్సవ చిత్రంతో పాటు, జస్టిస్ ఆయేషా దేశ ‘న్యాయ వ్యవస్థ’కు ఒక ఆస్తిగా ఉంటారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. మహిళ అనే ఆశ్చర్యమా! లాహోర్ హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నప్పటికీ జస్టిస్ మాలిక్ అత్యుత్తమ స్థానానికి ఎంపికైనప్పుడు చాలామంది తమ కనుబొమలను పైకెత్తారు. ఆమె నామినేషన్ను పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ (జేసీపీ) గతేడాది తిరస్కరించింది. కానీ, కమిషన్ ఈ నెల ప్రారంభంలో ఆమె పేరును రెండోసారి పరిశీలనకు తీసుకురాగా స్వల్ప మెజారిటీతో ఆమెదించింది. అత్యున్నత న్యాయవ్యవస్థకు న్యాయమూర్తులను నామినేట్ చేసే అత్యున్నత సంస్థ జెసీపీ సమావేశానికి చీఫ్ జస్టిస్ అహ్మద్ అధ్యక్షత వహించారు. సుపీరియర్ జ్యూడీషియరీ నియామకంపై జేసీపీ తర్వాత ద్వైపాక్షిక పార్లమెంటరీ కమిటీ ఆమోదం కోసం మాలిక్ నామినేషన్ ముందుకు వచ్చింది. మాలిక్ లాహోర్ హైకోర్ట్కి మొదటి మహిళా అత్యున్నత న్యాయమూర్తి కావడం వల్ల సీనియారిటీ సూత్రాన్ని పక్కన పెట్టి, కమిటీ ఆమె నామినేషన్ను ఆమోదించింది. సాధారణంగా హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. సుప్రీంకోర్టుకు వారి పదోన్నతిని ఆమోదించేటప్పుడు, గత సంవత్సరం ఆమె పేరును జేసీపీ తిరస్కరించడానికి ఇదీ ఓ కారణం. 1966లో జన్మించిన మాలిక్ పారిస్, న్యూయార్క్, కరాచీలోని పాఠశాలల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆమె లాహోర్లోని పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా లో ‘లా’ చదివారు. హార్వర్డ్ లా స్కూల్ నుండి ఎల్ఎల్ఎమ్ చేశారు. జూన్ 2021లో లైంగిక వేధింపుల నుండి బయటపడిన వారి పరీక్ష కోసం కన్యత్వ పరీక్షలు ‘చట్ట విరుద్ధం, పాకిస్థాన్ రాజ్యాంగానికీ వ్యతిరేకం’ అని ఆమె ఇచ్చిన తీర్పు ఒక మైలురాయి. సోమవారం ఇస్లామాబాద్లోని సుప్రీంకోర్టు భవనంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేస్తున్న ఆయేషా మాలిక్. -
పాకిస్తాన్లో భారీ బాంబు పేలుడు.. ఆస్ట్రేలియా పర్యటన ఇక..!
Australias tour of Pakistan: పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో భారీ బాంబు పేలుడు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 30 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ దేశ కేంద్ర మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన వాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్తో పాటు ఆస్ట్రేలియా పర్యటనను అడ్డుకోవడమే బాంబు పేలుళ్ల ప్రధాన ఉద్దేశ్యమని అతను అభిప్రాయపడ్డారు. కాగా పాకిస్తాన్ సూపర్ లీగ్-2022 జనవరి 27న ప్రారంభం కానుంది. "దేశంలో శాంతి నెలకొనడంతో పాకిస్తాన్ను అస్థిరపరిచేందుకు ముష్కరులు ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్, చారిత్రాత్మక ఆస్ట్రేలియా పర్యటనను అడ్డుకోవడమే ఈ పేలుడు ముఖ్య ఉద్దేశ్యం. కానీ మేము దానిని జరగనివ్వము" అని రషీద్ అహ్మద్ పేర్కొన్నారు. ఇక 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు తొలి సారిగా పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మార్చిలో ఆస్ట్రేలియా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ను పాకిస్తాన్తో ఆడనుంది. అయితే ఈ పేలుడుతో ఆసీస్ పర్యటన మరోసారి సందిగ్ధంలో పడింది. చదవండి: హైదరాబాదీ ఆల్రౌండర్కి బంఫర్ ఆఫర్.. భారత జట్టులో చోటు! -
పాకిస్తాన్లో భారీ పేలుడు.. ముగ్గురి మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. లాహోర్లోని అనార్కలి మార్కెట్ పాన్ మండి వద్ద భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 20 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బాంబు పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారని లాహోర్ పోలీసు అధికారి నాణా ఆరీఫ్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారతీయ వస్తువులు అమ్ముతారని తెలిపారు. ఈ పేలుడుకు ఏ ఉగ్ర సంస్థ కూడా బాధ్యత వహించలేదని చెప్పారు. చదవండి: ప్రేయసి కళ్లలో ఆనందం కోసం ప్రియుడి కిడ్నీ దానం.. ట్విస్ట్ ఏంటంటే -
లాహోర్ రోడ్లపై పరుగెత్తిన నిప్పుకోడి.. వీడియో వైరల్
లాహోర్: ఎగరలేని పక్షి జాతుల్లో నిప్పుకోడి అతిపెద్దది. ఆకర్షణీయమైన ఈకలు, చర్మం కలిగి ఉండే ఈ పక్షి ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా పాకిస్తాన్ రోడ్లపై దర్శనమిచ్చింది ఒక ఆస్ట్రిచ్. లాహోర్ సమీపంలోని అడవుల నుంచి తప్పించుకొని రెండు ఆస్ట్రిచ్లు రోడ్ల మీదకు వచ్చాయి. కెనాల్ రోడ్లో వాహనదారులకు పోటీగా వేగంగా పరుగెత్తుతూ అందరినీ ఆశ్చర్య పరిచింది. కొందరు వాహనదారులు వాటిని పట్టుకొని ఫోటోలు తీసుకోడానికి ప్రయత్నించడంతో మెడకు గాయమై ఒకటి మృత్యువాత పడినట్లు పాక్ న్యూస్ వెబ్సైట్ తెలిపింది. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్తోనా.. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో పోస్టు చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిలియన్ వ్యూవ్స్తో దూసుకుపోతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘చాలా వేగంగా పరుగెత్తుతుంది. ట్రాఫిక్లో ప్రతి రోజు ఉదయం బస్ను అందుకోవాడనికి నేను అలాగే పరుగెత్తుతాను. ఈ సందర్భాన్ని కేవలం కవ్బాయ్ మాత్రమే హ్యండిల్ చేయగలడు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: కిరీటం, చెప్పు జారిపోయిన బెదరలేదు.. 5 మిలియన్ల మంది ఫిదా -
జైలుకెళ్లొచ్చాక కూడా బిడ్డలపై అత్యాచారం చేస్తా: తండ్రి
ఇస్లామాబాద్: సమాజంలో ఆడవారిపై అకృత్యాలు పెరుగుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి.. వావివరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. పాము తన పిల్లలను తానే తిన్న చందంగా.. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడతున్నాడు. ఏం చేయాలో.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక పసిమొగ్గలు నలిగిపోతున్నాయి. భార్యకు విషయం తెలిసినా ప్రతిఘటించలేని పరిస్థితులే ఎక్కువ. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కన్న తండ్రి బిడ్డను చెరబట్టాడు. ఏడాది నుంచి బిడ్డపై తన పశువాంఛ తీర్చుకుంటున్నాడు. విషయం తల్లికి తెలిసింది. భర్తకు వ్యతిరేకంగా పోరాటం చేయలేని పరిస్థితుల్లో ఉంది. తన బిడ్డను కాపాడమంటూ కోర్టులోనే ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. లాహోర్కు చెందిర ఓ మహిళకు ఐదుగురు సంతానం. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం భార్యాభర్తలిద్దరు విడిపోయారు. ముగ్గురు ఆడపిల్లలు భర్త దగ్గర ఉంటుండగా.. ఇద్దరు భార్యతో ఉంటున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి.. ఏడాది నుంచి 15 ఏళ్ల కుమార్తెపై దారుణానికి ఒడిగడుతున్నాడు. దీని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించడంతో బాలిక మౌనంగా దారుణాన్ని భరిస్తూ వస్తోంది. (చదవండి: డైరెక్టర్ శంకర్ అల్లుడు, క్రికెటర్ రోహిత్పై లైంగిక వేధింపుల కేసు!) ఈ క్రమంలో భార్త చేస్తోన్న దారుణం గురించి భార్యకు తెలిసింది. ‘‘ఏంటీ పని’’ అని నిలదీస్తే.. ‘‘నా ఇష్టం.. పోలీసులుకు చెప్పుకుంటావా.. చెప్పు. జైలు నుంచి వచ్చాక మళ్లీ నీ బిడ్డలందరిపై అత్యాచారం చేస్తాను’’ అని బెదిరించాడు. ఈ క్రమంలో బిడ్డను ఎలా కాపాడుకోవాలో ఆ తల్లికి అర్థం కాలేదు. భర్తపై వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఆమె ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. ఏం చేయాలో పాలుపోని మహిళ.. ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. (చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్.. అలా 100 మందికి పైగా.. చివరికి ఇలా చిక్కాడు) ఈ క్రమంలో సదరు మహిళ సెషన్స్ కోర్టులో ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. సజీవ దహనం చేసుకోవాలని భావించింది. కానీ చుట్టూ ఉన్న జనాలు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సెషన్ కోర్టు జడ్జి మహిళ భర్తపై తగిన చర్యలు తీసుకోవాలని.. బాధిత బాలికకు రక్షణ కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. చదవండి: పాక్కు భారత రహస్యాలు చేరవేస్తున్న కానిస్టేబుల్ అరెస్టు -
లాహోర్లోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
-
ఆ మారణకాండను ప్రత్యక్షంగా చూసింది అతడే!!
ప్రపంచ నాగరికత మీద తడి ఆరని నెత్తుటి సంతకం జలియన్వాలాబాగ్ దురంతం. దీనిని సమకాలీన ప్రపంచం నిర్ద్వంద్వంగా నిరసించలేదు. చిత్రంగా శ్వేత జాత్యహంకారానికి నిలువెత్తురూపం వంటి విన్స్టన్ చర్చిల్ వంటివారు ఈ ఘాతుకాన్ని నిరసించారు. దర్యాప్తు జరిపించాలని ప్రపంచ పత్రికారంగం అభిప్రాయపడింది. కానీ, నోబెల్ సాహిత్య పురస్కారం (1906) స్వీకరించిన రడ్యార్డ్ కిప్లింగ్ ఆ దురంతానికి పాల్పడిన జనరల్ డయ్యర్ను ‘భారతదేశ పరిరక్షకుడు’ అని శ్లాఘించాడు. రడ్యార్డ్ కిప్లింగ్ బొంబాయిలోనే పుట్టాడు. కవి, నవలాకారుడు. తండ్రి అక్కడే జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో శిక్షకుడు. ఈనాటికీ భారతీయ బాలలు చదువుకునే జంగిల్ బుక్ కథలు కిప్లింగ్ రాసినవే. భారతదేశంలోని అడవులలో నివసించే జంతువుల లక్షణాలను భారతీయులకంటే ఎక్కువగా కిప్లింగ్ ఆకళింపు చేసుకున్నాడని పేరు. కానీ బ్రిటిష్ జాతిలో మనిషి రూపంలో పుట్టిన జనరల్ రెజినాల్డ్ డయ్యర్లోని క్రూర జంతువు లక్షణాన్ని గుర్తించడానికి నిరాకరించాడు. అందుకు ఆ నోబెల్ గ్రహీతకి జాత్యహంకారం అడ్డొచ్చింది. వైట్మ్యాన్స్ బర్డెన్ సిద్ధాంతకర్తలలో ఆయనా ఒకడు కదా! చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. బాగ్ దురంతం తరువాత జనరల్ డయ్యర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఓడ్వయ్యర్ ఇద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించారు. వీరిలో ‘భారత పరిరక్షకుడు’ జనరల్ డయ్యర్ను నిధితో సత్కరించాలని ‘మార్నింగ్ పోస్ట్’ అనే ఇంగ్లండ్ పత్రిక నడుం కట్టింది. అంతటి చర్య దిగకపోతే 1857 నాటి పరిస్థితులు తలెత్తేవనీ, తమ జాతీయులు ఎందరో బలైపోయేవారనీ వారి అంచనా. జనరల్ డయ్యర్ చర్యతో విప్లవం వస్తుందని చెబుతున్నవారు ఒక వాస్తవం గుర్తించాలనీ, అసలు విప్లవమే రాకుండా ఆ చర్య తోడ్పడిందనీ చెప్పినవారు ఉన్నారు. 1920 జూలై 17న డయ్యర్ సహాయ నిధికి కిప్లింగ్ పది పౌండ్లు అందించాడు. మరొక నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత (1913) రవీంద్రనాథ్ టాగోర్ , బాగ్ నెత్తుటికాండ, ‘బ్రిటిష్ పాలితులుగా భారతీయుల నిస్సహాయ స్థితి ఎలా ఉందో వాళ్ల మెదళ్లకు తెలియచెప్పింది’ అన్నారు. యావద్దేశం వలెనే టాగోర్కూ ఆలస్యంగానే ఆ సమాచారం అందింది. వెంటనే 1919 మే 30న వైస్రాయ్ చెమ్స్ఫర్డ్కు లేఖ రాశారు. అందులో మొదటి వాక్యం అదే. చరిత్రలో కనీవినీ ఎరుగని ఇలాంటి రక్తపాతానికి పాల్పడిన ప్రభుత్వం ఇచ్చిన బిరుదును అలంకరించుకోలేను అంటూ ‘సర్’ పురస్కారాన్ని (1915) వెనక్కి తిరిగి ఇస్తున్నట్టు ప్రకటించారాయన. చదవండి: పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా నో ప్రాబ్లం.. వాటే ఐడియా గురూ..!! ఇంతటి దురాగతం పట్ల పాలకులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం ఇంకా పెద్ద నేరమని టాగోర్ వాపోయారు. వంగి వంగి దండాలు పెట్టించుకోవడానికి బ్రిటిష్ జాతి భారతీయులకు నేర్పిన ‘పాఠం’ ఎలాంటిదో, దాని వెనుక అమానుషత్వం ఎంతటిదో ఆ పరిణామంతో సంబంధం ఉన్న అధికారులనైనా అడిగి తెలుసుకోకుండా మీ జాతీయులు పరస్పరం అభినందించుకుంటూ ఉండి ఉంటారని ఆవేదనతో రాశారు టాగోర్. బాగ్ ఘటన నూరేళ్ల సందర్భంగా కలకత్తాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలో ఈ లేఖను కూడా ఉంచారు. ఆ అక్షరాలన్నీ కన్నీటి జడులలో తడిసినవే. గాంధీజీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ‘కైజర్ ఏ హింద్’ బిరుదును వదిలిపెట్టారు. కానీ జనరల్ డయ్యర్ను క్షమించదలచారు. బాగ్ నెత్తుటికాండకు ఆనాడు రక్తకన్నీరు కార్చినవారే ఎక్కువ. గుండెలో అగ్నిపర్వతాలు పగిలినవారూ ఉన్నారు. అలాంటివారిలో చరిత్ర విస్మరించలేని వ్యక్తి ఉద్దమ్ సింగ్. 1919 ఏప్రిల్ 13న జలియన్వాలాబాగ్ దురంతం జరిగింది. ఆ తరువాత ఒక ఆశయం ఊపిరిగా ప్రపంచమంతా తిరిగాడాయన. ఉద్దమ్ సింగ్ అసలు పేరు షేర్సింగ్. తండ్రి తహల్సింగ్.. ఉపల్ అనే చోట రైల్వే క్రాసింగ్ కాపలాదారు. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తరువాత అమృత్సర్కు కాపురం మార్చిన తండ్రి కూడా 1907లో మరణించారు. దీనితో ఉద్దమ్ను, ఆయన అన్నగారు ముక్తాసింగ్ను ఎవరో సెంట్రల్ ఖాల్సా అనాథ శరణాలయంలో చేర్పించారు. అక్కడే ఆ సోదరులకి సిక్కు దీక్ష ఇచ్చారు. షేర్సింగ్ ఉద్దమ్ సింగ్ అయ్యారు. ముక్తాసింగ్ పేరు సాధుసింగ్ అయింది. 1917లో సాధుసింగ్ కూడా మరణించారు. 1918లో మెట్రిక్యులేషన్ చదివిన తరువాత ఉద్దమ్ అనాథాశ్రమం వీడారు. జలియన్వాలా బాగ్ కాల్పులను చూసిన వారిలో ఉద్దమ్ ఒకరని చెబుతారు. సంవత్సరాది వైశాఖి సందర్భంగా ఆ రోజు బాగ్కు వచ్చిన అందరికీ ఉద్దమ్, ఆయన మిత్రులు స్వచ్ఛంద సేవకులుగా మంచినీళ్లు అందించారని కూడా కొందరు చెబుతారు. చదవండి: ఆ వ్యాధితో గతేడాది కోటిన్నర మంది మృతి.. కరోనా ఎంతపని చేసింది..? ఆ రోజు సాయంత్రం వేళ కాల్పులు జరిగాయి. కాల్పులలో రత్తన్దేవి అనే ఆమె భర్త గాయపడగా, ఆయనను మోసుకు వస్తూ ఉద్దమ్ కూడా గాయపడ్డారు. కాల్పుల తరువాత కర్ఫ్యూ విధించారు. చీకటి పడింది. చావుబతుకుల మధ్య ఉన్నవారికి వైద్య సదుపాయం అందలేదు. దిగ్భ్రాంతికి గురైన వారికి కనీసం మంచినీళ్లు కూడా అందలేదు. 1200 మంది క్షతగాత్రులని ప్రభుత్వమే చెప్పింది. ఎంతటి దుర్భరస్థితిని ఆ చీకటిరాత్రి పంజాబీలు చూశారో ఊహించవచ్చు. తరువాతి కాలాలలో సైఫుద్దీన్ కిచ్లూ స్థాపించిన స్వరాజ్ ఆశ్రమంలో ఉద్దమ్ కొద్దికాలం ఉన్నారు. పంజాబ్ మీద గదర్ పార్టీ ప్రభావం ఎక్కువ. ఉద్దమ్కు భగత్సింగ్ ఆదర్శం. ఆయనను కలుసుకున్నప్పటి నుంచి గురువుగారు అని పిలవడం ప్రారంభించాడు. రామ్ప్రసాద్ బిస్మిల్ కవిత్వం అంటే ప్రాణం. ఒక కాంట్రాక్టర్ దగ్గర కూలీగా చేరి, అతడి వెంటే ఆఫ్రికా వెళ్లాడు ఉద్దమ్. అక్కడ నుంచి అమెరికా వెళ్లాడు. అక్కడే గదర్ పార్టీ ఆశయాలకు మరింత చేరువయ్యారు. భగత్సింగ్ తదితరులు స్వదేశం వచ్చి పనిచేయమని ఉద్దమ్కు సూచించారు. ఒక అమెరికన్ మహిళ సాయంతో ఆయుధాలు సంపాదించి భారత్ చేరుకున్నాడాయన. లాహోర్లో ఉంటూ విప్లవ కార్యకలాపాలకు సహకరించేవారు. అక్రమంగా ఆయుధాలు కలిగిన ఉన్నాడన్న ఆరోపణ మీద ఉద్దమ్ను 1927 ఆగస్ట్ 30న అరెస్టు చేశారు. ఇదే కాకుండా గదర్ పత్రిక ‘గదర్ ది గూంజ్’ ప్రతులు కూడా పోలీసులకు దొరికాయి. నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవించి 1931 అక్టోబర్ 23న జైలు నుంచి విడుదలయ్యారు. 1933లో మారుపేరుతో అతి కష్టం మీద ఇంగ్లండ్ చేరుకున్నాడు. 1940 మార్చి 13న ఈస్టిండియా అసోసియేషన్, రాయల్ సెంట్రల్ ఏసియన్ సొసైటీలు లండన్లోని కాక్స్టన్ హాలులో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాయి. ఆ కార్యక్రమానికి అచ్చం ఆంగ్లేయుడి మాదిరిగానే ఉన్న నలభయ్ ఏళ్ల వ్యక్తి చేతిలో పుస్తకంతో వచ్చాడు. అతడే ఉద్దమ్. వేదిక మీద ఓడ్వయ్యర్ ఉన్నాడు. సభ ముగుస్తూ ఉండగా, వేదిక ముందుకు వెళ్లి, పుస్తకంలో లోపల అమర్చిన 45 స్మిత్ అండ్ వీసన్ రివాల్వర్ తీసి ఓడ్వయ్యర్కు గురిపెట్టి ఆరుసార్లు కాల్చాడు. 21 సంవత్సరాల నిరీక్షణ గురి తప్పకుండా చేసింది కాబోలు. ఒక తూటా గుండెలలో, మరొకటి మూత్రపిండాలలోకి చొచ్చుకుపోయాయి. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఓడ్వయ్యర్. ఆ సభలోనే పాల్గొన్న భారత స్టేట్ సెక్రటరీ జట్లండ్, పంజాబ్ మరో మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ లూయిస్ డేన్, బొంబాయి ప్రావిన్స్ మాజీ గవర్నర్ ల్యామింగ్టన్ కాల్పులలో గాయపడ్డారు. ఉద్దమ్ పారిపోలేదు. తన పేరును రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ అని చెప్పుకున్నారాయన. ఉద్దమ్ తరఫున వీకే కృష్ణమీనన్ కేసు వాదించారు. 1940 జూన్ 12న ఇంగ్లండ్లోనే పెంటాన్విల్లె కారాగారంలో ఉద్దమ్ను ఉరితీశారు. ఆ అమరుడి చితాభస్మాన్ని 1975లో భారత్కు తెచ్చారు. చదవండి: ఆ పెట్రోల్ బంక్లో మూడు రోజులపాటు పెట్రోల్ ఫ్రీ.. కారణం ఇదేనట!! -
Lahores Heera Mandi: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు..
దాయాది దేశమైన పాకిస్థాన్లోని హీరామండి గురించిన ఆసక్తికర విషయాలు... ఇది లాహోర్లో ఉంది. హీరామండి (డైమండ్ మార్కెట్) చాలా మంది వివాదాస్పద ప్రదేశంగా పేర్కొంటారు. అందుకు బలమైన కారణాలు లేకపోలేదు. ఇక్కడ స్త్రీలు పేదరికం కారణంగా తమ కుటుంబాలను పోషించుకోవడానికి వేశ్యా వృత్తి తమ జీవనశైలిగా బతుకుతున్నారు. ఇది ఎందుకిలా మార్చబడిందో తెలుసుకోవాలంటే చరిత్రపుటల్లోకి తొంగిచూడాల్సిందే.. మిగతానగరాలు ఆధునీకరించబడినప్పటికీ ఈ నగరం మాత్రం చారిత్రక అవశేషంగా ఎందుకు మిగిలిపోయిందో తెలుసుకుందాం.. ఆ మార్కెట్ స్థాపకుడు ఇతడే.. సిక్కుల మహారాజైన రంజిత్ సింగ్ మంత్రి అయిన హీరా సింగ్ పేరు మీదనే దీనికా పేరు వచ్చింది. హీరా సింగ్ అక్కడ ఓ ధాన్యం మార్కెట్ను స్థాపించాడు. అంతేకాకుండా తరచుగా తవైఫ్ (నర్తకి) లను కూడా ఆ మార్కెట్ తీసుకొచ్చేవాడు. సిక్కు రాజైన రంజిత్ సింగ్ ఆ ప్రాంతాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండేవాడు. దీనికి షాహి మొహల్లా అని కూడా పేరుంది. లాహోర్ కోట పక్కనే ఉండటం వల్ల దీనికాపేరు వచ్చింది. మొగల్ రాజుల కాలంలో... మొగలుల సామ్రాజ్యంలో లాహోర్ కూడా ఒక భాగమే. దీని ఇతర నగరాల్లో హీరామండి ఒకటి. వీరికాలంలో ఆఫ్గనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ల నుంచి అందమైన మహిళలను (వేశ్యలు) ఇక్కడికి తీసుకొచ్చేవారు. వారికి ముజ్రాస్ అనే సంప్రదాయ నృత్యాన్ని కఠిన శిక్షణతో నేర్పేవారు (ఆ కాలంలో డాన్స్, సంగీతం, లలిత కళలు, పెయింటింగ్లకు ఈ ప్రదేశం ప్రసిద్ధి). వీరితో ధనవంతులు కచేరీలు నిర్వహించేవారు. తర్వాత కాలంలో భారతదేశం నుంచి కూడా మహిళలు ఇక్కడికి రావడం ప్రారంభించారు. వీరు మొగల్ రాజుల ముందు శాస్త్రీయ నృత్యం చేసేవారు. తర్వాత కాలంలో ఈ నృత్యం కుటుంబ సంప్రదాయంగా మారింది. చివరికి మొగలుల వైభవం మసకబారసాగింది. విదేశీ దండయాత్రల కాలంలో రాజ భవనంలో ప్రత్యేకంగా నిర్మించిన తవైఫ్ఖానా ధ్వంసమైపోయింది. కాలక్రమేణా నృత్యకారిణుల ప్రతిష్ట దెబ్బతిని వేశ్యలుగా మారారు. క్రమంగా ఇది వేశ్యా కూపంగా మారింది. ఇప్పుడు అక్కడ నపుంసకులు నృత్యం చేస్తున్నారు. ప్రస్తుతం తవైఫ్ అనేపదం వేశ్యకు పర్యాయపదంగా అక్కడ వాడబడుతుంది. రెండు రకాలైన జీవనశైలి వాస్తవానికి ఇక్కడ రెండు రకాలైన జీవనశైలి కలిగిన స్త్రీలు నివసిస్తున్నారు. నిజానికి రాత్రిళ్లు 11 నుంచి1 గంటల మధ్య సమయంలో ఈ నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. తమ కష్టమర్లు వెళ్లిపోగానే మామూలు మహిళల్లానే వారిళ్లకు చేరుకుంటారు. ముజ్రా నృత్యం చేసేవారు సాధారణంగా ఈ రొంపిలోకి దిగరు. వీరు తమ వృత్తి పట్ల నిబద్థత, అంకిత భావం, గౌరవం ప్రదర్శిస్తున్నారు. తాము ముజ్రా నృత్యకారినులని గర్వంగా చెప్పుకొంటారు కూడా. ఇక మరొక రకం కేవలం రూ. 200 నుంచి 400 లకు వేశ్యా వృత్తిని జీవనోపాధిగా బతికేవారు. ఇది చాలా బాధాకరమైన విషయమైనప్పటికీ వాస్తవం మాత్రం ఇది. ఎందుకంటే వీరి అజ్ఞానం, నిరక్ష్యరాస్యత అక్కడి పురుషుల విలాసానికి ప్రతీకగా ఎంచబడుతున్నారు. అక్కడి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే ఇది ఇలాగే కొనసాగే ప్రమాదం ఉంది. ఈ కథనం ఆధారంగా.. పగలంతా ఈ ప్రదేశం మామూలు మార్కెట్లా కనిపిస్తుంది. కానీ చీకటైతే మాత్రం రెడ్లైట్ ఏరియాగా మారిపోతుంది. కళంక్ సినిమాలో ఇక్కడి పరిస్థితిని కొంతమట్టుకు చూపారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ హీరా మండిపై సినిమాను తెరకెక్కించనున్నాడు. చదవండి: టీచర్ దారుణం.. స్నాక్స్ ఉన్నాయని 300 గుంజిళ్లు... చివరకు.. -
పాక్లో దారుణం: మహిళా టిక్టాకర్పై 300 మంది దాడి!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా టిక్టాకర్పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్ట్14 పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఓ టిక్టాకర్ తన ఆరుగురు స్నేహితులతో కలిసి లాహోర్లోని మినార్-ఇ-పాకిస్తాన్ వద్ద టిక్టాక్ వీడియోను చిత్రీకరించాలనుకున్నారు. ఆ సమయంలో సుమారు 300మంది ఆమెను చుట్టిముట్టి దాడికి పాల్పడ్డారు. ఆమెను గాల్లోకి ఎగరేస్తూ దుస్తులు చించడానికి యత్నించారు. ఆమె చుట్టూ చేరిన వందలాది మంది నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఎంతకు సాధ్యం కాలేదు. ఈ పరిస్థితిని గమనించిన సెక్యూరిటీ గార్డు మినార్-ఇ-పాకిస్తాన్ గేటు తెరవటంతో అక్కడి నుంచి తన స్నేహితులతో ఆమె బయటపడింది. బలవంతంగా ఆమె చేతి ఉన్న ఉంగరం, చెవి రింగులు, తన స్నేహితుల వద్ద ఉన్న మోబైల్ ఫోన్, ఐడీ కార్డు, రూ.15 వేలను లాక్కున్నారు. ఈ ఘటనపై సదరు టిక్టాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. This is one of the many videos that are being shared on WhatsApp groups showing how men were groping her and touching her. Look at the number of people in this video!! All she wanted to do was celebrate Independence Day at minar e Pakistan. Is that a crime? pic.twitter.com/9LPaWAo4wQ — Nida Abbas (@OutOnAbudget) August 16, 2021 -
పాక్లో రాజా రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం
లాహోర్: సిక్కు వర్గానికి చెందిన మహారాజా రంజిత్ సింగ్ కంచు విగ్రహాన్ని తెహ్రీక్ ఈ లబ్బైక్ పాకిస్తాన్ (టీఎల్పీ) కార్యకర్త ధ్వంసం చేశాడు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సుకు చెందిన లాహోర్ ఫోర్ట్ వద్ద ఈ విగ్రహం ఉంది. పలు నినాదాలు చేస్తూ, విగ్రహాన్ని ఓ వైపు నుంచి కూల్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అనంతరం మరో వ్యక్తి వెళ్లి విగ్రహపు చేతిని ధ్వంసం చేయడం వీడియోలో కనిపించింది. 2019లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఎత్తు 9 అడుగులు ఉంటుంది. సిక్కు సంప్రదాయ రూపంతో కత్తి పట్టుకొని గుర్రం మీద మహారాజ రంజిత్ సింగ్ కూర్చొని ఉంటారు. దీనిపై పాక్ ప్రభుత్వం స్పందించింది. సమాచార మంత్రి ఫవాద్ చౌధరి మాట్లాడుతూ.. ఇలాంటి నిరక్షరాస్యుల వల్ల అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు పోతోందని వ్యాఖ్యానించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ సలహాదారు షబ్నాజ్ గిల్ మాట్లాడుతూ, నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిందితున్ని ఇప్పటికే పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై భారత్ స్పందించింది. మైనారిటీల్లో భయం పోగొట్టడంలో పాక్ ప్రభుత్వం విఫలమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పాక్లో తరచుగా జరుగుతున్నాయని అన్నారు. విగ్రహాలు ధ్వంసం చేయడం ఇది మూడో ఘటన అని పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల్లో ఈ తీరు వల్ల భయాందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. -
పాక్లో దుశ్చర్య: మహారాజా రంజిత్సింగ్ విగ్రహం ధ్వంసం
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో కొందరు యువకులు రెచ్చిపోయారు. సిక్కుల ఆరాధ్య దైవం మహారాజ రంజిత్సింగ్ విగ్రహాన్ని మూడోసారి పగులగొట్టి వారి విద్వేషాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ ఘటన పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లోని లాహోర్ కోటలో జరిగింది. లాహోర్ కోట సమీపంలో ప్రతిష్టించిన రంజిత్ సింగ్ విగ్రహాన్ని తాజాగా మంగళవారం కూల్చివేశారు. తెహ్రీక్-ఇ-లబైక్ (టీఎల్ఎఫ్) అనే రాడికల్ గ్రూప్ సభ్యులు విగ్రహంపై దాడి చేసి ధ్వంసం చేశారు. సిక్కుల ఆరాధ్య దైవం రంజిత్సింగ్. ఆయన లాహోర్ రాజధానిగా సిక్కు రాజ్యాన్ని ఏర్పాటుచేశాడు. ఆయన జ్ఞాపకార్థం లాహోర్ కోట సమీపంలో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని 180వ వర్ధంతి సందర్భంగా 2019 జూన్లో ఆవిష్కరించారు. ఇప్పటికే రెండుసార్లు రంజిత్సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో రెండు నెలల కిందట కొత్తగా ఏర్పాటుచేశారు. ఈ విగ్రహాన్ని వాల్డ్సిటీ ఆఫ్ లాహోర్ అథారిటీ (డబ్ల్యూసీఎల్ఏ) ఆధ్వర్యంలో యూకేకు చెందిన సిక్కు హెరిటేజ్ ఫౌండేషన్ నిర్మించింది. తాజాగా మరోసారి విగ్రహం ధ్వంసం చేయడంపై సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విగ్రహానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ప్రేమించి పెళ్లాడి ఉగ్రవాదిగా మారిన భారత డెంటిస్ట్.. జైల్లోనే చదవండి: మొదలైన తాలిబన్ల అరాచకం: ఇంటింటికెళ్లి నగదు లూటీ TLP worker pulling down Ranjit Singh's statue at the Lahore Fort. The statue had previously been vandalized by TLP workers on at least two different occasions in the past. pic.twitter.com/IMhcZmPj7e — Ali Usman Qasmi (@AU_Qasmi) August 17, 2021 -
మోడల్ దారుణ హత్య: గొంతు కోసి.. నగ్నంగా మార్చి
Model Nayab Nadeem: పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రఖ్యాత మోడల్ అనుమానాస్పద రీతిలో దారుణ హత్యకు గురైంది. ఆమె గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేసి.. నగ్న శరీరాన్ని ఇంట్లో పడేసి వెళ్లారు దుండగులు. సవతి సోదరుడి ఫిర్యాదుతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. పాకిస్తాన్ ప్రఖ్యాత మోడల్ నయాబ్ నదీమ్ ఆదివారం అనుమానాస్పద రీతిలో హత్య గావించబడ్డారు. లాహోర్లోని ఆమె నివాసంలో ఈ దారుణం చోటు చేసుకున్నట్లు పాకిస్తాన్ న్యూస్ పేపర్ డ్వాన్ వెల్లడించింది. నిందితులు ఆమె ఇంట్లోకి చొరబడి దారుణంగా హత్య చేశారని పేర్కొన్నది. నయాబ్ సవతి సోదరుడిచ్చిన ఫిర్యాదతో పోలీసులు కేసు నమోదు చేశారు. 29 ఏళ్ల నయాబ్ ఇంకా వివాహం చేసుకోలేదు. లాహోర్లోని డిఫెన్స్ ఏరియాలో ఆమె ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈ సందర్భంగా నయాబ్ సవతి సోదరుడు నసీర్ మాట్లాడుతూ.. ‘‘శనివారం అర్థరాత్రి మేం ఐస్క్రీం తినడానికి బయటకు వెళ్లాం. ఆ తర్వాత నేను తనను ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లాను. ఇంటికి వెళ్లాక నాకు నయాబ్ కాల్ చేసింది. కానీ పడుకుని ఉండటంతో తన కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆదివారం ఉదయం తిరిగి తనకు కాల్ చేశాను. లిఫ్ట్ చేయలేదు. దాంతో తనను చూడటానికి వచ్చిన నాకు భయానక దృశ్యం కనిపించింది’’ అని తెలిపాడు. ‘‘గొంతు దగ్గర గాయంతో.. రక్తం మడుగులో నగ్నంగా పడి ఉన్న నయాబ్ శరీరం కనిపించింది. ఆ దృశ్యం చూడగానే భయంతో బిగుసుకుపోయాను. ఆ తర్వాత తేరుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాను. నయాబ్ బాత్రూం కిటికి పగిలిపోయి ఉంది. దుండగులు దాని గుండా ఇంట్లో చొరబడి తనను హత్య చేసి ఉంటారు. ఇక తన నగ్న శరీరాన్నీ టీవీ రూంలో పడేశారు’’ అని నసీర్ తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. -
హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో పేలుడు, ఇద్దరు మృతి
కరాచీ: ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ నివాసానికి సమీపంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్లోని జోహర్ టౌన్లో మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. హఫీజ్ సయీద్ను లక్ష్యంగా చేసుకొని పేలుడు జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడిగా ఉన్న హఫీజ్ సయీద్.. ప్రస్తుతం జమాత్ ఉద్ దువాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్న హఫీజ్ సయీద్పై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. 2008 ముంబై దాడుల వెనుక ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ అమెరికా 10 లక్షల డాలర్లు వెల కట్టింది. కాగా కశ్మీర్ అంశంపై కేంద్రం రేపు శాంతియుతంగా చర్చలు జరపనున్న నేపథ్యంలో బాంబు దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. చదవండి: విషాదం: ప్రపంచ రికార్డ్ కోసం ఫీట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు -
ఆసీస్ వికెట్ కీపర్కు తీవ్ర గాయాలు.. పెదాలపై ఏడు కుట్లు
అబుదాబీ: పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ఆరవ సీజన్ పునఃప్రారంభానికి ముందు లాహోర్ ఖలందర్స్కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు వికెట్ కీపర్, ఆస్ట్రేలియా ఆటగాడు బెన్ డంక్ ప్రాక్టీస్ సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు. అబుదాబిలో క్యాచ్ ప్రాక్టీస్ సమయంలో బంతి అతని ముఖానికి బలంగా తాకడంతో పెదవులపై ఏకంగా ఏడు కుట్లు పడ్డాయి. దీంతో అతను శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాహోర్ ఖలందర్స్ జట్టులో డంక్ కీలక ఆటగాడు కావడంతో ఆ జట్టు విజయావకాశాలపై ప్రభావం పడనుందని ఆ ఫ్రాంఛైజీ సీఈఓ సమిన్ రానా పేర్కొన్నాడు. పీఎస్ఎల్ 2021 తొలి భాగంలో డంక్.. 40 సగటుతో 80 పరుగులు సాధించి, ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. కరాచీ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 57 పరుగలతో అజేయంగా నిలిచి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే, కరోనా కారణంగా వాయిదా పడిన పీఎస్ఎల్ యూఏఈ వేదికగా జూన్ 9 నుంచి పునఃప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. పీఎస్ఎల్లో ప్రస్తుతం ఖలందర్స్ జట్టు నాలుగు మ్యాచ్ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ జట్టులో పాకిస్తాన్ స్టార్ ఆటగాళ్ళు షాహీన్ అఫ్రిది, ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, హరిస్ రౌఫ్తో పాటు విదేశీ స్టార్లు రషీద్ ఖాన్, డేవిడ్ వీజ్, సమిత్ పటేల్ ఉన్నారు. ఇదిలా ఉంటే, బెన్ డంక్ ఆస్ట్రేలియా తరఫున ఐదు టీ 20 మ్యాచ్లు ఆడాడు. 34 ఏళ్ల డంక్.. 2014 నవంబర్లో తొలిసారిగా ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించారు. చదవండి: డబ్యూటీసీ ఫైనల్లో టీమిండియాకు కష్టమే.. -
బ్రిటీష్ యువతికి పెళ్లి పేరిట వల.. ఆపై దారుణం
ఇస్లామాబాద్: బ్రిటీష్ దేశానికి చెందిన యువతి పాకిస్తాన్లో ఉంటుండగా ఇద్దరు యువకులు ఆమెను ఇష్టపడ్డారు. వారిద్దరూ ఆమెకు లవ్ ప్రపోజల్స్ చేశారు. అయితే వారు ప్రపోజల్ చేసిన కొన్నాళ్లకే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో పాకిస్తాన్లో కలకలం రేపింది. ఆ యువతి మరణం మిస్టరీగా మారింది. దీనిపై అక్కడి పోలీసులతో పాటు బ్రిటీష్ అధికారులు కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బెల్జియంకు చెందిన లా విద్యార్థి మైరా జుల్ఫికర్ (25) పాకిస్తాన్లోని లాహోర్లో తన స్నేహితురాలు ఇఖ్రాతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. మూడు నెలల కిందట బ్రిటన్ నుంచి పాకిస్తాన్కు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు సాద్ అమీర్ భట్, జాహీద్ జడూన్ పరిచయమయ్యారు. ఆ ఇద్దరు యువకులు ఆమెను పెళ్లి చేసుకుంటామని ప్రతిపాదించారు. అయితే వారిని తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఆమె సోమవారం తుపాకీ తూటాలకు బలైంది. లాహోర్లో నివసించే ఆమె బాబాయి మహ్మద్ నాజీర్ విషయం తెలుసుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆమె హత్య విషయమై ఫిర్యాదు చేశాడు. మైరాకు ఇద్దరు పెళ్లి ప్రతిపాదన చేయగా దాన్ని తిరస్కరించినప్పటి నుంచి ఆమెకు ప్రాణహాని పొంచి ఉందని ఫిర్యాదులో ఆమె బాబాయి పేర్కొన్నాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. మెడ వద్ద.. తొడ భాగాన రెండు బుల్లెట్లను గుర్తించారు. అయితే వారిద్దరూ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోవాలనే కోణంలో విచారణ చేయగా.. వారిద్దరూ ఆమెను పెళ్లి చేసుకుంటే బ్రిటన్ వీసా లభిస్తుందనే ఆశించారట. అయితే ఆమె పెళ్లికి నిరాకరించిందనే ఆక్రోశంతో ఆమెపై కాల్పులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. మైరా జుల్ఫీకర్ హత్యలో అమీర్ భట్ హస్తం ప్రధానంగా ఉందని పోలీస్ అధికారి సిద్రా ఖాన్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఇస్లామాబాద్, లాహోర్లో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై బ్రిటన్ అధికారులు కూడా ఆరా తీశారు. చదవండి: కొత్తగా పెళ్లయిన కమెడియన్ జంటకు షాకిచ్చిన పోలీసులు చదవండి: ఒకే రోజు లాక్డౌన్ ప్రకటించిన రెండు రాష్ట్రాలు -
పాక్ హక్కుల కార్యకర్త రెహ్మాన్ మృతి
లాహోర్: ప్రముఖ పాకిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత ఐఏ రెహ్మాన్(90) సోమవారం లాహోర్లో కన్నుమూశారు. పాక్లోని హిందు, క్రైస్తవ మైనారిటీల తరఫున గళం వినిపించి, రాజ్యాంగంలో దైవదూషణకు సంబంధించిన కఠినమైన చట్టాలను రద్దు కోసం పోరాడారు. భారత్–పాక్ల మధ్య శాంతి నెలకొనేందుకు విశేష కృషి చేశారు. డయాబెటిస్తోపాటు తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో రెండు రోజులుగా ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని కుటుంబసభ్యులు తెలిపారు. రెహ్మాన్కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అవిభాజ్య భారత్లోని హరియాణాలో 1930లో జన్మించిన రెహ్మాన్ జర్నలిస్ట్గా వివిధ పత్రికల్లో 65 ఏళ్లపాటు పనిచేశారు. పాకిస్తాన్–ఇండియా పీపుల్స్ ఫోరం ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ వేదిక వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరు. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (హెచ్ఆర్సీపీ)కి రెండు దశాబ్దాలపాటు డైరెక్టర్గా ఉన్నారు. ఆయన మృతికి హెచ్ఆర్సీపీ చైర్పర్సన్ జోహ్రా యూసఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
లాహోర్ యూనివర్సిటీలో లవ్ ప్రపోజ్
-
క్యాంపస్లో కౌగిలించుకున్నారు, కట్ చేస్తే..
లాహోర్: ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమను వ్యక్తీకరించడం గొప్ప అంటుంటారు. కానీ ఇలా ఏకంగా చదువుల నిలయమైన యూనివర్సిటీలో ప్రపోజ్ చేసుకోవడం కొంత ఆశ్చర్యకరమే! అందులోనూ అందరి ముందే హగ్గులిస్తూ ప్రేమలో తూలి తేలిపోవడం మరింత విడ్డూరకరం. ఈ అరుదైన ఘటన పాకిస్తాన్లోని లాహోర్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఇద్దరు ప్రేమ పక్షులు వారి మనసులోని భావాలను ఒకరికొకరు చెప్పుకునేందుకు క్యాంపస్నే ఎంచుకున్నారు. అందరూ చూస్తుండగానే యువతి మోకాలిపై కూర్చుని మనసు పడ్డ వ్యక్తికి పువ్వులు ఇస్తూ ప్రపోజ్ చేసింది. దీంతో అతడు ఆమెను అక్కున చేర్చుకుని కౌగిలితంల్లో బంధించాడు. దీన్నంతటినీ అక్కడున్న విద్యార్థులు ఫోన్లలో చిత్రీకరించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూనివర్సిటీ అధికారులు ఆ ఇద్దరినీ తమముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను వారు బేఖాతరు చేశారు. దీంతో క్రమశిక్షణారాహిత్యం కింద వారిని యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు, వారు యూనివర్సిటీకి సంబంధించిన ఏ క్యాంపస్లోనూ అడుగు పెట్టేందుకు వీల్లేదని నిషేధం విధించారు. కాగా ఈ వీడియో గత వారం నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిద్దరినీ డిబార్ చేసినట్లు యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించడంతో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. వాళ్లు తీసుకున్న నిర్ణయం మంచిదేనని కొందరు హర్షిస్తే వాళ్లు ప్రేమించుకుంటే మీకేంటంటా? అంటూ మరికొందరు మండిపడుతున్నారు. చదవండి: మాస్క్ ధరించమన్నందుకు ఉబర్ డ్రైవర్పై మహిళ దాడి వైరల్: ఆకలేస్తే అంతేమరీ! -
జూలో ఘటన: కరోనాతో పులులు మృతి
లాహోర్: కరోనా మహమ్మారికి మనిషైనా.. పెద్దపులి అయినా బలి కావాల్సిందే. ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి. తాజాగా కరోనా వైరస్ బారిన పడిన రెండు పులులు మృతి చెందాయి. ఈ ఘటన పాకిస్థాన్లోని జూ పార్క్లో జరిగింది. లాహోర్ నగరంలోని జూ పార్క్లో 11 వారాల వయసున్న రెండు తెల్ల పులి పిల్లలు ఉండేవి. అవి జనవరిలో అనారోగ్యానికి గురయ్యాయి. దీన్ని గమనించిన జూ అధికారులు వాటికి చికిత్స అందించారు. అయితే నాలుగు రోజుల చికిత్స తర్వాత ఆ పులి పిల్లలు జనవరి 30వ తేదీన మృతి చెందాయి. అవి ఎలా చనిపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన అక్కడి అధికారులు విచారణ చేపట్టారు. పులి కూనలకు పోస్టుమార్టం చేయగా వాటి ఊపిరితిత్తులు బాగా పాడైనట్లు తెలిసింది. దీనిపై మరింత విచారించగా అవి కరోనా వైరస్తో మృతి చెందాయని జూ అధికారులు నిర్ధారించారు. ఎందుకంటే జూలో పని చేసే సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ఆరుగురికి పాజిటివ్గా తేలింది. ఆ ఆరుగురిలో పులి పిల్లల బాగోగులు చేస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు. అతడి ద్వారా వాటికి కరోనా వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై విచారణ మొదలుపెట్టారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
అంధకారంలో పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ చిమ్మచీకట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. విద్యుత్ సరఫరా గ్రిడ్లో సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో అంధకారం నెలకొంది. కరాచి, రావల్పిండి, ఇస్లామాబాద్, లాహోర్, ముల్తాన్, ఫైజలాబాద్ తదితర ప్రధాన నగరాల్లో శనివారం అర్ధరాత్రి ఒకే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే కొన్ని నగరాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు పాకిస్తాన్ ఇంధన శాఖ మంత్రి ఒమర్ అయూబ్ ఖాన్ ఆదివారం వెల్లడించారు. సింధ్ ప్రావిన్స్లోని గుడ్డు పవర్ ప్లాంట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం అర్ధరాత్రి 11.41 గంటలకు గ్రిడ్ కుప్పకూలిపోయింది. ఈ గ్రిడ్ నుంచే అత్యధిక నగరాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. దీంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, కొన్ని నగరాల్లో పాక్షికంగా విద్యుత్ని పునరుద్ధరించారు. పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా జరగడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ అత్యంత పురాతనమైనది కావడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి షిబ్లిఫరాజ్ అన్నారు. -
పాకిస్తాన్: ‘అందుకే విగ్రహం ధ్వంసం చేశా’
ఇస్లామాబాద్: లాహోర్లో ప్రతిష్టించిన మహరాజా రంజిత్ సింగ్ విగ్రహం మరోసారి ధ్వంసమైంది. ఈ ఘటనలో జీషన్ అనే టీనేజర్ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. రంజిత్ సింగ్ 180వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన స్మారకార్థం 2019 జూన్లో పాకిస్తాన్లోని లాహోర్ కోటలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. తొమ్మిది అడుగుల ఎత్తుతో చెక్క రాడ్లు, కోల్డ్ బ్రాంజ్తో దీనిని తయారు చేశారు. సిక్కు చరిత్రకారుడు, ఫిల్మ్మేకర్ బాబీ సింగ్ బన్సల్ లండన్లోని తన ఎస్కే ఫౌండేషన్ ద్వారా ఇందుకు నిధులు సమకూర్చారు. వాల్డ్ సిటీ ఆఫ్ అథారిటీ ఆధ్వర్యంలో దీనిని నెలకొల్పారు.(చదవండి: తాలిబన్ నేతకు పాక్లో బీమా ) ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో తహ్రీక్-ఇ- లబాయిక్ పాకిస్తాన్కు చెందిన ఇద్దరు వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రంజిత్ సింగ్ పాలన, భారత్లో మోదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో అధికారులు విగ్రహానికి మరమతులు చేయించారు. కాగా తహ్రీక్-ఇ- లబాయిక్ పాకిస్తాన్ చీఫ్ ఖదీం రిజ్వీ ప్రసంగాలతో ప్రేరేపితుడైన జీషన్ డిసెంబరు 12న మరోసారి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించాడు. విగ్రహం చేతులు విరగొట్టాడు. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డులు వెంటనే అతడిని అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు. ఇక విచారణంలో భాగంగా.. తన పాలనాకాలంలో ముస్లింలకు వ్యతిరేకంగా రజింత్ సింగ్ అనేక అత్యాచారాలకు పాల్పడినందు వల్లే దాడి చేశానని జీషన్ చెప్పాడు. కాగా అతడి పాకిస్తాన్ పీనల్ కోడ్ సెక్షన్ 295 , 295-ఏ, 427 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ విషయంపై స్పందించిన బాబీ సింగ్ బన్సల్.. కులమతాలకు అతీతంగా రంజిత్ సింగ్ అందరికీ సమాన ఉద్యోగవకాశాలు కల్పించారని, తన హయాంలో ఎన్నో మసీదులను పునర్నిర్మించారని పేర్కొన్నారు. ముస్లిం మహిళ గుల్ బేగంను ఆయన వివాహమాడినట్లు తెలిపారు. విద్వేషంతో ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. -
‘గురుద్వార్ను మసీదుగా మార్చడాన్ని ఖండిస్తున్నాం’
చండీగఢ్ : లాహోర్లోని చారిత్రాత్మక గురుద్వార్ను మసీదుగా మార్చడానికి పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మంగళవారం ఖండించారు. ఈ అంశంపై భారత్ ఇప్పటికే పాకిస్థాన్పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై పంజాబ్ సీఎం స్పందిస్తూ..సిక్కుల సమస్యలను పొరుగు దేశానికి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ‘లాహోర్లోని పవిత్ర గురుద్వార్ శ్రీ షాహిది అస్తాన్ను మసీదుగా మార్చడానికి చేసిన ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సిక్కుల గౌరవ ప్రదేశాలను కాపాడటానికి పంజాబ్ ఆందోళనలను పాకిస్తాన్కు బలంగా తెలియజేయాలని విదేశాంగ మంత్రి జైశంకర్ను కోరుతున్నాం’ అని సింగ్ ట్వీట్ చేశారు. (పంజాబ్లో పెన్షన్ స్కామ్ కలకలం) కాగా గురుద్వార్ షాహిది అస్తాన్ 1745లో భాయ్ తరు సింగ్ ప్రాణాంతకంగా గాయపడిన ప్రదేశంలో నిర్మించిన చారిత్రక మందిరం. గురుద్వార్ సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. లాహోర్లోని గురుద్వార్ను మసీదుగా మారుస్తున్నట్లు వచ్చిన వార్తలపై పాకిస్తాన్ హైకమిషన్కు భారత్ సోమవారం తీవ్ర నిరసన తెలిపింది. ఈ సంఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని, ఈ విషయంపై దర్యాప్తు జరిపి తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్కు పిలుపునిచ్చినట్లు ఎంఈఎం ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. పాకిస్తాన్లో మైనారిటీ సిక్కు సమాజానికి న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. (కరోనా కల్లోలం: భారత్లో కొత్తగా 47,704 కేసులు) -
పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం
-
పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం
-
కుప్పకూలిన విమానం : 100 మంది..
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. లాహోర్ నుంచి ప్రయాణికులతో కరాచీ వెళ్తుండగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ- ఏ320)కు చెందిన విమానం కుప్పకూలింది. కరాచీ ఎయిర్పోర్టుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో విమానం కూలినట్లు అక్కడి అధికారుల ద్వారా తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విమాన ప్రమాద ప్రాణనష్టంపై స్పష్టత రాలేదు. కరాచీలోని మహ్మద్ ఆలీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్కు సిద్దమవుతున్న సమయంలో ఎయిర్ బస్ 320 కుప్పకూలిందని పాక్ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలిందని, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయని తెలిపింది. ఇక ప్రజలు నివశిస్తున్న ప్రదేశంలో విమాన ప్రమాదం చోటుచేసుకోవడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండచ్చని తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఆదేశ ఆర్మీ వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేసింది. క్షతగ్రాతులను సమీపంలో జిన్నా ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఓవైపు దేశంలో కరోనా వైరస్తో జనజీవనం అస్థవ్యస్థమవుతుండగా తాజాగా విమాన ప్రమాదం ఆ దేశ వాసులను తీవ్రంగా కలచివేస్తోంది. -
అలెక్స్ హేల్స్కు కరోనా సోకిందా?
లాహోర్ : ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ రమీజ్రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ సూపర్లీగ్లో ఆడేందుకు వచ్చిన హేల్స్ అతను వెళ్లే ముందు కరోనా లక్షణాలు ఉన్నట్లుగా అనుమానమొచ్చిందని పేర్కొన్నాడు. లాహోర్లో మీడియా సమావేశంలో పాల్గొన్న రమీజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతకుముందు పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగంగా మంగళవారం జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్లతో పాటు ఫైనల్ను కూడా వాయిదా వేస్తున్నట్లు పీసీబీ తెలిపింది. 'అలెక్స్ హేల్స్ కు కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో స్పష్టంగా తెలీదు.. కానీ అతను పరీక్షలు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం.మేము కూడా ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో పీఎస్ఎల్ను వాయిదా వేసి పీసీబీ మంచి పని చేసింది. ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహించడం వ్యర్థమైన పని.. ఇలాగే సెమీస్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహించి ఉంటే లీగ్ అట్టర్ఫ్లాఫ్ అయ్యేది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. ఈ సమయంలో లీగ్ను వాయిదా వేయడం తప్ప ఇంకో అవకాశం తీసుకోదలచుకోలేదు ' అని రమీజ్ పేర్కొన్నాడు. (కరోనా సోకి యువ కోచ్ మృతి) కాగా పీఎస్ఎల్లో అలెక్స్ హేల్స్ కరాచీ కింగ్స్ తరపున ప్రాతినిథ్యం వహించాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు లీగ్ మధ్యలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. లీగ్ నిర్వాహకులు వారందరికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి వారి స్వదేశానికి పంపించింది. ఇదే విషయమై.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సీఈవో వసీమ్ ఖాన్ మాట్లాడుతూ.. ' లీగ్లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లలో కొందరు కరోనా బారీన పడ్డారేమోనని మాకు అనుమానంగా ఉంది. కానీ వారి పేర్లు వెల్లడించడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే లీగ్లో పాల్గొన్న ఆటగాళ్లతో పాటు నిర్వాహకులకు, బ్రాడ్కాస్టర్లకు కోవిడ్ టెస్టులు చేయించామని' తెలిపాడు. కాగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 బారీన పడి 7వేలకు పైగా మృతి చెందగా, ప్రపంచవ్యాప్తంగా 1, 82,611 కరోనా కేసులు నమోదయ్యాయి. క్వారంటైన్లో నువ్వు.. బయట నేను! -
కీపింగ్ వదిలేసి కాళ్లు మొక్కుతావేంట్రా నాయనా!
లాహోర్: క్రికెట్లో ఫీల్డింగ్ చేసే జట్టు.. బ్యాట్స్మన్ కొట్టే బంతుల్ని ఆపడానికి యత్నించడమే సాధారణంగా చేసే పని. మరి ఫీల్డింగ్ చేసే క్రికెటర్ బంతిని వదిలేసి బ్యాట్స్మన్ పట్టుకుంటే ఏమనాలి. బ్యాట్స్మన్ పరుగు తీయకుండా చేయడానికి చేసిన ఒక ప్రయత్నమనే అనుకోవాలి. ఇది తొందరపాటులో జరిగినా అది చూసిన అభిమానులకు మాత్రం సరదాగా మారిపోతుంది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఇదే జరిగింది. ఆదివారం లాహోర్ క్వాలండర్స్-కరాచీ కింగ్స్ల మధ్య మ్యాచ్ జరిగింది. దీనిలో భాగంగా లాహోర్ క్వాలండర్స్ ఛేజింగ్కు దిగిన సమయంలో సెకండ్ డౌన్ ఆటగాడు బెన్ డంక్ ఇచ్చిన క్యాచ్ పట్టుకోవడంలో విఫలమైన కరాచీ వికెట్ కీపర్ చాడ్విక్ వాల్టన్ చేసేది లేక చివరికి ఇలా బ్యాట్స్మన్ను చుట్టేశాడు. (తాహీర్ ఓవరాక్షన్ చూడలేకపోతున్నా!) డెల్పోర్ట్ వేసిస10 ఓవర్ ఐదో బంతిని బెన్ డంక్ రివర్స్ స్వీప్ ఆడబోయాడు. అది కాస్తా ఎడ్జ్ తీసుకుని పైకి లేచింది. అయితే ఆ బంతి బ్యాట్స్మన్కు పైనే లేవడంతో కీపర్ చాడ్విక్ తడబడ్డాడు. ఆ బంతి బ్యాట్స్మన్ భుజానికి తాకిన గ్రౌండ్ను తాకే సమయంలో ఎక్కడుందో కనబడలేదు. దాంతో బెన్ డంక్ కాళ్లను అమాంతం చుట్టేశాడు. క్యాచ్ వదిలేసి ఇలా కాళ్లను చుట్టేయడం మాత్రం ఫన్నీగా అయ్యింది. ఆ సమయానికి బెన్ డంక్ 10 పరుగుల వద్ద ఉండగా, ఆపై వీరబాదుడు బాదాడు. 40 బంతుల్లో 12 సిక్స్లు, 3 ఫోర్లతో అజేయంగా 99 పరుగులు సాధించాడు. డంక్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో ఇంకా ఐదు బంతులు ఉండగానే లాహోర్ విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా, దాన్ని లాహోర్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా, సోషల్ మీడియాలో వైరల్గా మారిన బెన్ డంక్-చాడ్విక్ల ఫన్నీ వీడియోకు మాత్రం సెటైర్లు పేలుతున్నాయి. ఇది కేవలం పీఎస్ఎల్లో మాత్రమే జరుగుతుందని కొంతమంది అభిమానులు ఎద్దేవా చేయగా, కీపింగ్ చేయకుండా కాళ్లు మొక్కుతావేంట్రా నాయనా అని మరి కొంతమంది జోకులు పేల్చుతున్నారు. One of the best scene of PSL 😂😂#KKvLQ #PSL2020 pic.twitter.com/4gJnzSRmJF — ثناء ہتھوڑی 😂😂 (@PakiPakori) March 8, 2020 -
మైనర్ అదృశ్యం: ‘జూ’ బోనులో ముక్కలై
లాహోర్ : కనిపించకుండాపోయిన బాలుడు స్థానిక జూలోని సింహపుబోనులో ముక్కలై కనిపించడం కలకలం రేపింది. లాహోర్ సఫారి పార్క్లో సోమవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సఫారి పార్క్ లాహోర్ డైరెక్టర్ చౌదరి షాఫ్కత్ అందించిన సమాచారం ప్రకారం మరణించిన మైనర్ బాలుడిని బిలాల్ (18) గా గుర్తించారు. అతని బట్టలు ఆధారంగా బాలుడుని తండ్రి గుర్తించగా, అయితే బోనులోకి బిలాల్ ఎలా ప్రవేశించాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని హత్య చేసి అనంతరం బోనులోకి విసిరి వుంటారా అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. సోమవారం నుంచి తమ కుమారుడు కనిపించకుండాపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పార్క్ అధికారులను సంప్రదించారు. దీంతో మృతదేహానికి సంబంధించిన తల, చేతులు లాంటి శరీర భాగాలను సింహం బోనులో జూ అధికారులు కనుగొన్నారు. దీంతో పాటు కొడవలి, గడ్డిని కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గడ్డి కోసుకునేందుకు జూ ఫెన్సింగ్ గోడ ఎక్కి పార్కులోకి ప్రవేశించినపుడు బాలుడిపై సింహాలు దాడి చేసి వుంటాయని జూ అధికారులు భావిస్తున్నారు. కాగా బిలాల్ మామయ్య ఇదే పార్కులో ఉద్యోగిగా ఉన్నాడు. -
పాకిస్తాన్లో టీమిండియా ఆడాలని..
లాహోర్: టీమిండియా-పాకిస్తాన్ క్రికెట్ జట్లు ఒక ద్వైపాక్షిక సిరీస్ ఆడి చాలా ఏళ్లే అయ్యింది. చివరిసారి 2008లో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ జరిగితే.. ఐసీసీ నిర్వహించే మేజర్ ఈవెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. 2013 నుంచి ఇరు జట్ల మధ్య ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా జరగలేదు. అయితే తమతో టీమిండియా ఆడాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పదే పదే విజ్ఞప్తి చేసినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కాగా, పాకిస్తాన్లో క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం టీమిండియా క్రికెట్ జట్టు తమ దేశం రావాలని కోరుకుంటున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అభిమానులు ప్లకార్డుల పట్టుకుని మరీ తమ కోరికను వెల్లడించారు. భారత క్రికెట్ జట్టు తమ దేశం రావాలని వారు బ్యానర్లతో స్టేడియంలో కనిపించారు. దీనిని పాకిస్తాన్ జర్నలిస్టు సజ్ సిద్ధిక్ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీనికి ‘లాహోర్ ఫ్యాన్స్ భారత్ను పాకిస్తాన్ రావాలని కోరుకుంటున్నారు’ అని క్యాప్షన్లో ఇచ్చాడు. ఇటీవల షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది లాంటి మాజీ క్రికెటర్లు భారత్ తమ దేశం రావాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల రాజకీయ సమస్యలను పక్కన పెట్టి క్రీడను క్రీడగా చూడాలని వారు కోరారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్లను ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. -
టి20 ప్రపంచకప్ తర్వాత వీడ్కోలు
లాహోర్: పాకిస్తాన్ ఆల్రౌండర్ మొహమ్మద్ హఫీజ్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పనున్నట్లు ప్రకటించాడు. 38 ఏళ్ల ఈ మాజీ కెప్టెన్ను బంగ్లాదేశ్తో టి20 సిరీస్ కోసం జట్టులోకి తీసుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లో ఆసీస్లో జరిగే టి20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్కు వీడ్కోలు పలుకుతానని అతను చెప్పాడు. 2003లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా అరంగేట్రం చేసిన హఫీజ్ పాక్ టాపార్డర్ బ్యాట్స్మన్గా కీలకపాత్ర పోషించాడు. స్పిన్నర్గాను రాణించాడు. అయితే 2015లో అతని బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని 12 నెలలు బౌలింగ్ వేయకుండా నిషేధం విధించారు. హఫీజ్ పాకిస్తాన్ టి20 జట్టుకు సారథ్యం కూడా వహించాడు. అతని కెప్టెన్సీలో పాక్ 29 మ్యాచ్లు ఆడగా... 17 గెలిచి, 11 మ్యాచ్ల్లో ఓడింది. ఒకటి టైగా ముగిసింది. , , -
అందుకే ఈ జువెల్లరీ వేసుకున్నా..!!
ఇస్లామాబాద్ : పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఓ యువతి తన పెళ్లి వేడుకలో వినూత్న ఆభరణాలు ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. బంగారానికి బదులు టమోటాలతో తయారైన జువెల్లరీ ధరించి వార్తల్లోకెక్కింది. వివరాలు.. పాకిస్తాన్లోని లాహోర్కు చెందిన ఓ యువతికి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో ఆమె పెళ్లి వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా బంగారు వర్ణపు గాగ్రా ధరించిన సదరు యువతి... పాపిట బిళ్ల, హారం, గాజులు, చెవి దుద్దులు ఇలా అన్నీ కూడా టమోటాలతో కూడిన ఆభరణాలే ధరించింది. ఈ విషయం గురించి సదరు యువతిని ఓ విలేకరి ఇంటర్వ్యూ చేయగా... ‘ బంగారం ధరలు అంబరాన్ని అంటుతున్నాయి. అంతేకాదు టమోటా ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. అందుకే నా పెళ్లికి బంగారు ఆభరణాలకు బదులు టమోటాలతో కూడిన ఆభరణాలు ధరించాలని నిశ్చయించుకున్నా అంటూ సమాధానం ఇచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో.. పెళ్లి కూతురి హాస్య చతురత అద్భుతం అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఇదంతా చేసిందని.. నిజంగా తన పెళ్లి జరుగుతున్నట్లయితే చేతులకు మెహందీ ఎందుకు లేదంటూ లాజిక్కులు వెదికే పనిలో పడ్డారు. ఇక పసిడి ధర రూ. నలభై వేలకు చేరువలో ఉండగా.. పాకిస్తాన్లో కిలో టమోటాల ధర 300 రూపాయలట. ఏదైమేనా ఈ కొత్త జువెల్లరీ భలే అందంగానూ, ప్రత్యేకంగానూ ఉంది కదా.. ఏమంటారు అమ్మాయిలు?! Tomato jewellery. In case you thought you've seen everything in life.. pic.twitter.com/O9t6dds8ZO — Naila Inayat नायला इनायत (@nailainayat) November 18, 2019 -
లాహోర్ బిడ్డ
నవంబర్ 12న గురునానక్ జయంతి. ఇండో–పాక్ సరిహద్దుకు ఆవల ఉన్న గురుద్వారా సందర్శనకు రెండు దేశాలు కలసి తలపెట్టిన కర్తార్పూర్ కారిడార్ ఈ నెల 9న ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సందర్భాల నేపథ్యంలో.. దేశ విభజన సమయంలో లాహోర్ నుంచి ఇండియాకి వచ్చి, పెళ్లితో హైదరాబాద్కి వచ్చి, ఇక్కడే స్థిరపడిపోయి, మురికివాడల్లోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతున్న 84 ఏళ్ల రవీందర్ కౌర్తో మాటామంతి. 1947. స్వాతంత్య్రం వచ్చిందని దేశమంతా సంబరాలు చేసుకుంటోంది. సరిగ్గా ఆ సమయంలో కోటీ ఇరవై లక్షల మంది శరణార్థులు.. విడిపోయిన భూభాగం నుంచి కట్టుబట్టలతో వచ్చి భారత్ను ఆశ్రయించారు. వాళ్లలో ఓ పన్నెండేళ్ల అమ్మాయి రవీందర్ కౌర్. లాహోర్ నుంచి సరిహద్దు రేఖ దాటి ఇండియాలో అడుగుపెట్టింది. ఇది జరిగిన పదేళ్లకు ఆమె పెళ్లి చేసుకుని కోడలిగా హైదరాబాద్కు వచ్చింది. బస్తీ నానమ్మ రవీందర్ కౌర్ నివాసం హైదరాబాద్, దేవర కొండ బస్తీలో. ఆమె రోజూ సాయంత్రం బస్తీ పిల్లలకు ట్యూషన్ చెప్తుంటారు. కౌర్ ఇచ్చిన అసైన్మెంట్ పూర్తి చేసిన తర్వాత పిల్లలు ‘‘ఇక చాయ్ తాగుతాం’’ అని సొంత నానమ్మను అడిగినట్లే ఆమెను తడుతూ అడుగుతుంటారు. ఫీజు తీసుకోకుండా చదువు చెప్పడమే కాకుండా పిల్లలకు చాయ్ బిస్కెట్ ఇవ్వడం కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చుకున్నారు కౌర్. ‘‘గురునానక్ చెప్పిన సూక్తులతో నన్ను నేను ఇలా మలుచుకున్నాను’’ అంటారు రవీందర్ కౌర్. దేశం కోసం పోరాటం ‘‘ఇండియా విభజన ముందు ఏడవ తరగతి వరకు లాహోర్లో ఉన్నాం. మా తాత భగవాన్దాస్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి. ఆయన పేరు మీద లాహోర్లో వీధి కూడా ఉంది. నాన్న వైపు ముత్తాత ఖడక్ సింగ్ ఫ్రీడమ్ ఫైటర్. ఆయన పేరుతో ఢిల్లీలో ఇప్పటికీ బాబా ఖడక్ సింగ్ మార్గ్ ఉంది. దేశ స్వాతంత్య్రం కోసం జీవితాలను అంకితం చేసిన కుటుంబాలు మావి. తీరా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ ఫలాలను అందుకోవాల్సిన తరుణంలో బతుకుజీవుడా అని పారిపోవాల్సి వచ్చింది. కారులో స్కూలుకెళ్లిన బాల్యం గుర్తుంది. విభజన తర్వాత కాందిశీకుల్లా ఇండియాకి వచ్చిన తర్వాత కొత్త షూస్ కొనుక్కోలేక పగిలిపోయిన బూట్లతోనే స్కూలుకెళ్లిన బాల్యాన్నీ మర్చిపోలేను. బీఎస్సీ, బీఈడీ వరకు స్కాలర్షిప్తో చదువుకున్నాను. ఏ పరిస్థితిలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. నా భర్త మన్మోహన్ సింగ్ది కూడా పార్టిషన్ సమయంలో పొట్ట చేత పట్టుకుని వచ్చిన కుటుంబమే. వాళ్లు కొన్నాళ్లు నార్త్లో ఉండి తర్వాత ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డారు. అలా నేను పెళ్లితో హైదరాబాద్ కోడలినయ్యాను. నానక్ నాకు స్ఫూర్తి నాకు చదువుకోవడం, చదువు చెప్పడం రెండూ ఇష్టమే. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన విషయాలను నలుగురిని పోగేసి చెప్పేదాన్ని. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అత్తగారింట్లో వాళ్లకు చదువు చెప్పాను. ఆర్థిక అవసరాలు చుట్టుముట్టినప్పుడు సంపన్న వర్గాల పిల్లలకు ట్యూషన్ చెప్పాను. నా పిల్లలు ముగ్గురూ బాగా చదువుకుని పెద్ద పొజిషన్లో స్థిరపడ్డారు. నా భర్త ఇంజనీర్గా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యారు. డబ్బు అవసరం తీరింది. అయినా నేను పని చేయడం మాత్రం మానలేదు. ఓ ముప్పై ఏళ్ల కిందట హైదరాబాద్లో బస్తీల్లో గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఆ స్కూళ్లకు, పిల్లలకు చేయాల్సింది ఎంతో ఉందనిపించింది. గురునానక్ చెప్పిన తొలి సూక్తి ‘షేర్ అండ్ కేర్’. నాకున్న నాలెడ్జ్ని షేర్ చేయడం మొదలుపెట్టాను. ఆ పిల్లల పట్ల కేరింగ్గా ఉండడంతో ప్రభుత్వ అధికారులు నాకో బాధ్యత అప్పగించారు. ప్రభుత్వం స్కూళ్ల కోసం రూపొందించిన పథకాలు అమలవుతున్న తీరును పర్యవేక్షించడానికి ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ‘ఎదుటి వారిని సంతోషంగా ఉంచడానికి నీకు చేతనైన పని చెయ్యి’ అని చెప్పారు నానక్. ఆయన సూక్తిని ఆచరణలో పెట్టడానికి నాకు అవకాశం అంది వచ్చినట్లయింది. నా బాధ్యతలను సమర్థంగా సమన్వయం చేసినందుకు 2010లో రాష్ట్రపతి అవార్డు అందుకున్నాను. ఖైరతాబాద్లోని నిష్షుల్క్, బంజారాహిల్స్ బస్తీల్లో ఉన్న మరో రెండు స్కూళ్లలో ఇప్పటికీ వారానికి ఒకటి రెండుసార్లు వెళ్లి పిల్లలకు కొత్త టాస్క్లు ఇస్తున్నాను. స్కూళ్ల వరకు ఫర్వాలేదిప్పుడు. కానీ అంగన్వాడీల్లో చేయాల్సిన పని ఇంకా ఉంది. నాకిప్పుడు శక్తి తగ్గింది. చురుకైనవాళ్లు ముందుకు రావాలి’’ అని ముగించారు రవీందర్ కౌర్. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: కె. రమేష్ కుమార్ మంచి అనే మొక్కలు గురునానక్ సమాజంలో స్త్రీ స్థానాన్ని చాలా గొప్పగా చెప్పారు. సమాజాన్ని నిలబెట్టే శక్తి స్త్రీకి మాత్రమే ఉందని చెప్పారు. ఇతరుల కోసం పనిచేసే ఆసక్తి ఉన్న స్త్రీలు ఇంటి గుమ్మం దాటి బయటకు రావాలి. ఆడవాళ్ల నిర్వహణలో ఉన్న సమాజంలో అకృత్య భావనలు అంకుర దశలోనే అంతరించిపోతాయి. ఆయన సూక్తులను ఉర్దూ, ఇంగ్లిష్లో కవితలు రాసి పిల్లలకు నేర్పిస్తున్నాను. నా వంతుగా సమాజంలో మంచి అనే మొక్కలను కొన్నింటిని నాటుతున్నాను. – రవీందర్ కౌర్ -
షాకింగ్ : అమ్మాయి శవంలో అబ్బాయి డీఎన్ఏ
లాహోర్ : సాధారణంగా ప్రతీ ఒక్కరి శరీరంలో జన్యు కణాలను గుర్తించేందుకు డీఎన్ఏ ప్రముఖ పాత్ర పోషిస్తాయన్న సంగతి మనందరికి తెలిసిందే. కానీ పాకిస్తాన్లో మాత్రం వింత ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన యువతి మృతదేహంలో యువకుడికి సంబంధించిన డీఎన్ఏ కణాలను గుర్తించినట్లు పాకిస్తానీ ఇన్వెస్టిగేషన్ టీమ్ వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లోని లర్ఖానా జిల్లాలోని బీబీ ఆసిఫా డెంటల్ కాలేజీలో నిమృత కుమారి ఫైనల్ ఇయర్ చదువుతుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే నిమృత ఈ ఏడాది సెప్టెంబర్ 16న తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. డీఎన్ఏ పరీక్షల కోసం సెప్టెంబర్ 17న నిమృతా మృతదేహం, ఆమె వేసుకున్న బట్టలపై పడిన రక్త నమూనాను జంషోరూ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. పరీక్షల నిర్వహణ సమయంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడినట్లు పోలీస్ అధికారి మసూద్ బంగాశ్ వెల్లడించారు. 'నిమృతా దేహం నుంచి సేకరించిన రక్త నమూనాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాము. అయితే ఆ నివేదికలో మాత్రం అబ్బాయికి సంబంధించిన డీఎన్ఏ వివరాలు రావడం మమ్మల్ని ఆశ్చర్యపరిచిందని' మసూద్ తెలిపారు. ఇన్నాళ్లు మేం నిమృతా ఆత్మహత్య చేసుకుందన్న కోణంలో భావించాము. కానీ ఎప్పుడైతే డీఎన్ఏలో వేరొకరికి సంబంధించిన వివరాలు రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగిందని ఆయన పేర్కొన్నారు. దీంతో విషయం తెలుసుకున్న నిమృత కుటుంబసభ్యులు ఆమెని ఎవరో హత్య చేశారని ఆరోపణలతో సింద్ హైకోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించిన సింధ్ న్యాయస్థానం... నిమృత కేసులో జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. నిమృతది హత్యా? ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా సెప్టెంబర్లో కాలేజ్లో హిందూ, మైనారిటీకి సంబంధించి ప్రిన్సిపాల్తో జరిగిన గొడవలో నిమృత ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి 32 మందితో పాటు మృతురాలి కాల్డేటా ఆధారంగా తోటి విద్యార్థులైన మెహ్రాన్ అబ్రో, అలీ షాన్ మెమన్లను అనుమానితులుగా భావించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విషయమై కాలేజీలో విచారించగా నిమృత తన హాస్టల్ గదిలోనే సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోయిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఇదే విషయమై నిమృతా సోదరుడు విశాల్ స్పందిస్తూ.. నా సోదరిది ముమ్మాటికి హత్యేనని, ఆమె మెడకు కేబుల్ వైర్తో బిగించిన గుర్తులు ఉన్నాయని, అంతేగాక ఆమె చేతులను ఎవరో బలవంతంగా పట్టుకున్న గుర్తులు కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. అయితే పోలీసులు మాత్రం మెహ్రన్ అబ్రో, నిమృతాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, శారీరకంగా కూడా దగ్గరయ్యారని చెబుతున్నారు. నిమృతా పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అబ్రో ఈ అఘాయిత్యానికి ఏమైనా ఒడిగట్టాడా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. Young Medical student Nimirta Kumari's dead body found in Chandika medical college hostel larkana, Further couldn't get Reasons behind it .... She was final year student RIP... pic.twitter.com/WSrOJlhF8D — Sanjay Soni (@sanjaysindhi65) September 16, 2019 -
పాక్ను మట్టికరిపించిన శ్రీలంక
లాహోర్: పాకిస్తాన్తో వన్డే సిరీస్ను కోల్పోయిన శ్రీలంక జట్టు టి20 సిరీస్లో ఆకట్టుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టి20ల సిరీస్ను శ్రీలంక 2–0తో కైవసం చేసుకుంది. లాహోర్లో సోమవారం జరిగిన రెండో టి20లో లంక 35 పరుగుల తేడాతో పాకిస్తాన్పై గెలిచింది. మొదట లంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. రాజపక్స (77; 4 ఫోర్లు, 6 సిక్స్లు) చెలరేగాడు. తర్వాత పాక్ 19 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఇమద్ వసీమ్ (47) రాణించాడు. రేపు ఆఖరి మ్యాచ్ ఇక్కడే జరుగుతుంది. శ్రీలంక సీనియర్ జట్టులో పది మంద వరకూ పాక్ పర్యటనకు రావడానికి వెనుకాడితే.. ‘జూనియర్’ జట్టుతోనే పోరుకు సిద్ధమైంది. అయితే వన్డే సిరీస్ను కోల్పోయిన లంకేయులు.. టీ20 సిరీస్లో అంచనాలు మించి రాణించారు. వరుస రెండు టీ20ల్లోనూ విజయం సాధించి తాము ఎంత ప్రమాదకరమో చాటిచెప్పారు. టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న పాకిస్తాన్ను శ్రీలంక మట్టికరిపించడం గమనార్హం. -
మోదీని పాములతో బెదిరించిన పాక్ మహిళపై కేసు
లాహోర్: భారత ప్రధాని నరేంద్ర మోదీపైకి తన పాములను పంపించి వాటికి విందు చేస్తానని పాకిస్తాన్కు చెందిన ప్రముఖ సింగర్ ఎగతాళి చేస్తూ చేసిన వీడియో ఆమెను చిక్కుల్లో పడేసింది. పాక్ పాప్ సింగర్ రబీ పిర్జాదా సెప్టెంబర్ 2న మోదీని దుమ్మెత్తిపోస్తూ ఓ వీడియో చేసింది. కశ్మీరీలను హింసిస్తున్న మోదీకి తన స్నేహితులైన పాములు, మొసళ్లు తగిన గుణపాఠం చేప్తాయంటూ చేసిన ఆ వీడియో భారత్, పాక్ దేశాల్లో వైరల్ అయింది. తన వద్ద ఉన్న నాలుగు అనకొండలను, ఒక మొసలిని మోదీకి గిఫ్ట్గా పంపిస్తానని, ‘కశ్మీరీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోదీ.. నరకంలో చావడానికి సిద్ధంగా ఉండు. నా స్నేహితులు నిన్ను విందు చేసుకుంటాయని ఆమె పదేపదే వ్యాఖ్యానించారు. ఆ వీడియోపై భారత నెటిజన్లు కామెంట్ల రూపంలో ‘తగిన’ కౌంటర్ కూడా ఇచ్చారు. కాగా, వీడియోలో అరుదైన జాతులకు చెందిన పాములను చూపించటమే ఆమె ప్రస్తుత తిప్పలకు కారణం. అరుదైన వన్యప్రాణులతో వీడియో చేసినందుకు, వాటిని పెంపుడు జంతువుల వలె ఇంట్లో పెట్టుకున్నందుకు పిర్జాదాపై పంజాబ్లోని పాక్ వ్యనప్రాణి సంరక్షణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దర్యాప్తుకు ఆదేశించింది. పిర్జాదాపై నేరం రుజువైతే ఆమెకు రెండేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ‘పాక్ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఇటువంటి ఆరుదైన జంతువులను ఇంట్లో పెట్టుకోవడం నేరం. వాటిని పెంపుడు జంతువులుగా చూసేందుకు చట్టం అంగీకరించదని’ ఓ పాక్ అధికారి వెల్లడించారు. వన్యప్రాణులను తన బ్యూటీ సెలూన్లో బంధించినందుకు ఆమెపై కేసు నమోదు చేశామన్నారు. తనపై కేసు నమోదు కావడంతో పిర్జాదా స్పందించారు. మోదీపై వ్యాఖ్యల కారణంగానే తనపై కక్ష కట్టారని, తనపై కేసుకు కారణం వన్యప్రాణులు కాదని ఆమె ఆరోపించారు. 'అనుమతి లేకుండా వన్యాప్రాణులను ఇంట్లో ఎలా పెంచుకున్నావంటూ కొందరు నన్ను ప్రశ్నిస్తున్నారు. మరి మోదీపై విమర్శలకు ముందు నాపై ఇటువంటి ఆరోపణలు ఎందుకు రాలేదు. అప్పుడు కూడా మా ఇంట్లో పాములు ఉన్నాయ్ కదా? అని ప్రశ్నించారు. నాపై ఎందుకు దర్యాప్తు ప్రారంభమైందో మీకు ఇంకా అర్ధం కావట్లేదా?' అంటూ ట్వీట్ చేశారు. కాగా, రబీ పిర్జాదా పాక్ ఆక్రమిత కశ్మీర్కు చెందిన ఓ ఆర్మీ అధికారి కూతురు. కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచి ఆమె భారత వ్యతిరేక ఆందోళనలలో చురుకుగా పాల్గొంటోంది. ఇటీవలే కశ్మీరీలకు మద్దతుగా ‘సేవ్ కశ్మీర్’ అంటూ ఓ ర్యాలీని కూడా నిర్వహించింది. తాజాగా తన వ్యతిరేకత శృతిమించడంతో కటకటాల పాలవుతోంది. (చదవండి : మోదీ అమెరికా సభకు అనుకోని అతిథి!) -
ఢిల్లీ–లాహోర్ బస్సు రద్దు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అనంతరం లాహోర్–ఢిల్లీ బస్ సర్వీసులను పాక్ రద్దు చేసిన నేపథ్యంలో, భారత్ కూడా ఢిల్లీ–లాహోర్ బస్ సర్వీసును రద్దు చేసిందని ప్రజారవాణా సీనియర్ అధికారి తెలిపారు. ఈ బస్సు సోమవారం ఉదయం 6 గంటలకు లాహోర్కు వెళ్లాల్సి ఉండగా ప్రస్తుతం రద్దు అయింది. తమ దేశం నుంచి వస్తున్న బస్ సర్వీసులన్నీ సోమవారం నుంచి నిలిచిపోతాయని శనివారమే పాక్ స్పష్టం చేసింది. 1999 ఫిబ్రవరిలో ఈ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. -
పాకిస్తాన్ మరో దుశ్చర్య
ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 రద్దుతో ఇప్పటికే కశ్మీర్పై కాలుదువ్వుతున్న పాకిస్తాన్ మరో దుశ్చర్యకు పాల్పడింది. సిక్కు పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి లాహోర్ సమీపంలో చోటుచేసుకుంది. ఘటనపై స్పందించిన లాహోర్ సిటీ అధికార ప్రతినిధి తానియా ఖురేషి.. విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఘటనకు పాల్పడ్డ ఇద్దరి వ్యక్తులను గుర్తించామని, వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్తిగా దెబ్బతిన్న విగ్రహానికి మరమత్తులు చేపిస్తామని పేర్కొన్నారు. కాగా జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి హోదాను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అనంతరం... పాకిస్తాన్లోని కొన్ని సంఘాలు నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా పలు హింసాత్మక ఘటనలకు కొందరు వ్యక్తులు పాల్పడ్డారు. దానిలో భాగంగానే సిక్కు పాలకుడైన రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. భారత్ నిర్ణయంపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇదివరకే విషంకక్కిన విషయం విధితమే. -
ఎయిర్పోర్టులో కాల్పులు: ఇద్దరి మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని లాహోర్ విమానాశ్రయంలో దుండగుల కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం ఉదయం పదిగంటలకు జరిగింది. సౌదీలో పవిత్ర ఉమ్రా యాత్ర ముగించుకుని వచ్చిన ప్రయాణీకులు విమానం దిగి ఇంటర్నేషనల్ లాంజ్లో ఉండగా, బయటినుంచి చొరబడ్డ వ్యక్తులు కాల్పులు జరిపారు. దుండగుల చర్యతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాల్పులపై సమాచారం అందడంతో ఎయిర్పోర్టు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను మూసేసిన పోలీసులు అర్షద్, షాన్ అనే ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా భావించి తమ కస్టడీలోకి తీసుకున్నారు. -
బయటకు తీసుకురావడానికి గోడని కూల్చేశారు!
పాకిస్తాన్ భారీకాయుడు నూర్ హస్సన్ను చికిత్స నిమిత్తం లాహోర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ రెస్క్యూ టీంల సహకారంతో నూర్ హస్సన్ను పంజాబ్లోని సదిక్వాబాద్ నుంచి మిలిటరీ హెలికాప్టర్లో లాహోర్కు తరలించారు. అతని తరలింపు, చికిత్స కోసం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమార్ జావేద్ బజ్వా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థూలకాయుడు హస్సన్ 330 కిలోల బరువుండి కదలడానికి కూడా వీలు లేని స్థితిలో ఉన్నాడు. దీంతోపాటు బరువు కారణంగా వచ్చిన ఇతర ఆరోగ్య సమస్యలు అతన్ని బాధిస్తున్నాయి. ప్రస్తుతం బరువు తగ్గడం కోసం లాపొరోస్కోపీ సర్జరీ చేయించుకోనున్నాడు. అతన్ని చికిత్సకు తరలించడానికి రెస్క్యూ టీం నానాకష్టాలు పడింది. అతని శరీరం పెద్దదిగా ఉండి ఇంటి ప్రధాన ద్వారంలో పట్టకపోవడంతో ఇంటి గోడను కూల్చి బయటకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో లాహోర్కు తరలించారు. పాకిస్తాన్ మీడియా నూర్ హస్సన్ను ఆ దేశంలోనే అతి భారీకాయుడిగా వర్ణిస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం తెలియరాలేదు. 2017లో 360 కిలోల బరువున్న ఊబకాయుడు కూడా లాపొరోస్కోపీ సర్జరీ ద్వారా 200 కిలోలకు తగ్గాడు. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే నూర్ హస్సన్ ఉన్నాడు. ఓ నివేదిక ప్రకారం పాకిస్తాన్లో 29 శాతంమంది అధిక బరువుతో బాధపడుతుండగా అందులో 51 శాతం ఊబకాయుల లిస్టులో ఉన్నారు. -
లాహోర్లో పేలుడు, పోలీసులు మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లోని లాహోర్లో బుధవారం ఉదయం జరిగిన పేలుళ్లలో ముగ్గురు పోలీస్ అధికారులుతో సహా తొమ్మిదిమంది మృతి చెందారు. మరో 24మంది గాయపడ్డారు. ప్రసిద్ధిగాంచిన దాతా దర్బార్ షరీన్ వెలుపల ఈ పేలుళ్లు సంభవించాయి. పోలీసులను లక్ష్యంగా చేసుకుని... పోలీస్ వాహనాలకు దగ్గరలో బాంబు పేలింది. బాంబు పేలుడు ధాటికి పలు వాహనలు ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల భవనాలు అద్దాలు పలిగిపోయాయి. ఇవాళ ఉదయం 8:45 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. గాయపడినవారిలో ఎనిమిదిమంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా పోలీసులే లక్ష్యంగా దాడి జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదని పంజాబ్ ఐజీ ఆరీఫ్ నవాజ్ తెలిపారు. కాగా అత్యంత ప్రసిద్ధి గాంచిన దాతా దర్బార్ షరీన్ను సందర్శించుకునేందుకు ప్రతి ఏడాది పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడకు తరలివస్తారు. తాజా దాడుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. -
భారతీయ పాటకు గొంతు కలిపిందని..వైరల్!
-
పొరుగు దేశం పాట పాడినందుకు పాక్ యువతిపై..
లాహోర్ : భారతీయ పాటకు గొంతు కలిపిందనే కారణంతో పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది పాక్ యువతిపై చర్యలు చేపట్టింది. పాక్ జాతీయ జెండా ఉన్న టోపీని ధరించి ఇండియన్ సాంగ్ను ఆలపించిందనే కారణంతో ఎయిర్పోర్ట్లో పనిచేసే యువతిపై అధికారులు చర్యలు తీసుకోవడం చర్చకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. నియమావళిని ఉల్లంఘించినందుకు 25 ఏళ్ల మహిళా ఉద్యోగినికి ఇంక్రిమెంట్లు, పెర్క్స్ను నిలిపివేశారు. భవిష్యత్లో ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని అధికారులు ఆమెను హెచ్చరించారు.సోషల్ మీడియాలో ఎలాంటి వివాదాస్పద కార్యకలాపాల్లో తలదూర్చరాదని ఎయిర్పోర్ట్ అధికారులు తమ సిబ్బందిని హెచ్చరించారు. కాగా పాక్ యువతి గత రెండేళ్లుగా సియోల్కోట్ ఎయిర్పోర్ట్లో విధులు నిర్వహిస్తున్నారు. పాక్ యువతి చర్యపై నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో విచారణను ప్రారంభించింది. -
సిద్ధూ చేసింది తప్పే..
చండీగఢ్/లాహోర్ : అటు క్రికెట్లోను.. ఇటు రాజకీయాల్లోను నవజ్యోత్ సింగ్ సిద్ధూకు వివాదాలు కొత్తేమీ కాదు. అయితే భారత్–పాక్ సంబంధాలు దిగజారిన ప్రస్తుత తరుణంలో.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారంలో ఆ దేశ ఆర్మీ చీఫ్తో కౌగిలింతలు, ముచ్చట్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాజ్పేయి మరణంతో విషాదంలో ఉన్న దేశ ప్రజల మనోభావాల్ని సిద్ధూ విస్మరించారని, అతను క్షమాపణ చెప్పాలని బీజేపీ, అకాళీదళ్లు ఇప్పటికే డిమాండ్ చేయగా.. ఇప్పుడు పంజాబ్ సీఎం అమరీందర్ కూడా తన కేబినెట్ సహచరుడి చర్య సమర్ధనీయం కాదంటూ గట్టి షాకిచ్చారు. సిద్ధూ మాత్రం తన తప్పేమీ లేదని సమర్ధించుకున్నారు. నిజానికి సిద్ధూ పాకిస్తాన్ వెళ్లడాన్ని ఎవరూ పెద్దగా తప్పుపట్టలేదు. అయితే పాక్ ఆర్మీ చీఫ్ను ఆప్యాయంగా హత్తుకుని ముచ్చటించడం, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని పక్కన కూర్చోవడం వివాదాస్పమైంది. ఆర్మీ కెప్టెన్గా కూడా పనిచేసిన అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పట్ల సిద్ధూ వాత్సల్యం సరికాదు. ప్రతి రోజూ మన జవాన్లు అమరులవుతున్న విషయం అర్థం చేసుకోవాలి’అని ఘాటుగా స్పందించారు. సిద్ధూ పర్యటన అతని వ్యక్తిగతమని, అలాగే తన పక్కన కూర్చున్న వ్యక్తి పీఓకే చీఫ్ అన్న విషయం తెలిసుండకపోవచ్చని మరో ప్రశ్నకు అమరీందర్ సమాధానమిచ్చారు. దేశ ప్రతిష్టను సిద్ధూ ప్రమాదంలోకి నెట్టారని బీజేపీ విమర్శించగా.. పాక్ పర్యటనతో మన మర్యాదను మంటగలిపారని శిరోమణి ఆకాలీదళ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే పీఓకే చీఫ్ పక్కన కూర్చున్నా: సిద్ధూ ఇక ఆదివారం అట్టారి– వాఘా సరిహద్దు వద్ద భారత్ భూభాగం చేరుకున్నాక సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒకరు(పాక్ ఆర్మీ చీఫ్) నా వద్దకు వచ్చి.. మనం ఒకే సంస్కృతికి చెందినవారం. గురునానక్ దేవ్ 550వ జయంతి వేడుకల నాటికి పాకిస్తాన్లోని గురుద్వారా కర్తార్పూర్ షాహిబ్ సందర్శనకు మార్గం సుగమం చేయాలని కోరినప్పుడు నేనేం చేయాలి?’అని ప్రశ్నించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని పక్కనే కూర్చోవడంపై వివరణిస్తూ.. ‘మీరు ఎక్కడికైనా అతిథిగా వెళ్తే.. వారు కేటాయించిన చోట కూర్చోవాలి. నిజానికి నేను వేరే చోట కూర్చున్నాను. అయితే నన్ను పీఓకే చీఫ్ పక్కన కూర్చోమన్నారు’అని చెప్పారు. భారత్ చేరుకోక ముందు లాహోర్లో మాట్లాడుతూ.. ‘ఇక్కడ లభించిన ప్రేమానురాగాలకు నేనెంతో ముగ్ధుడినయ్యాను. రెండు దేశాల మధ్య శాంతి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను’అని సిద్ధూ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు తాను సానుకూలమని.. ఐపీఎల్, పీఎస్ల్ విజేతల మధ్య పోటీ మంచి ఆలోచనని చెప్పారు. మరోవైపు వాఘా వద్ద సిద్ధూకు నిరసన సెగ తగిలింది. భారత్కు చేరుకునే సమయంలో ‘పగ్రీ సంబాల్ జట్టా’సంస్థకు చెందిన కార్యకర్తలు సిద్ధూకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. -
ఓటేసిన అంతర్జాతీయ ఉగ్రవాది
లాహోర్, పాకిస్తాన్ : అందరూ చూస్తుండగానే ఓ అంతర్జాతీయ ఉగ్రవాది ఓటేశాడు. బుధవారం పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా లాహోర్లోని ఓ ఓటింగ్ కేంద్రానికి వెళ్లిన 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కర్-ఈ-తోయిబా(ఎల్ఈటీ), జైష్-ఈ-మొహమ్మద్ ఉగ్ర సంస్థల చీఫ్ హఫీజ్ సయీద్ ఓటు వేశాడు. ముంబై ఉగ్రదాడి వెనుక హఫీజ్ సయీద్ ఉన్నాడని నిర్ధారించిన అమెరికా 2012 అతన్ని పట్టించిన వారికి 10 మిలియన్ డాలర్ల అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సయీద్ ఓటు వేసేందుకే పరిమితం కాలేదు. అతనికి చెందిన 200 మంది అభ్యర్థులు ఎన్నికల్లో తలపడుతున్నారు. గతేడాది ఆగష్టులో సయీద్ మిల్లీ ముస్లిం లీగ్(ఎమ్ఎమ్ఎల్) పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించడానికి ప్రయత్నించాడు. అయితే, అమెరికాతో పాటు పలు దేశాలు దీన్ని ముక్తకంఠంతో ఖండించాయి. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ అతని పార్టీకి గుర్తింపు ఇవ్వలేమని పేర్కొంది. అయినా ఎలాంటి ఒత్తడికి గురవని సయీద్ అతి సునాయాసంగా తన అభ్యర్థులను అల్లా-ఓ-అక్బర్ తెహ్రీక్(ఏఏటీ) ద్వారా బరిలో నిలిపాడు. పాకిస్తాన్ ఎన్నికల్లో పార్లమెంట్లోని 272 స్థానాలకు 3,459 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. 4 రాష్ర్టాల అసెంబ్లీలోని 577 స్థానాలకు 8,396 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్, పాకిస్థాన్ ముస్లిం లీగ్కు మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని సర్వేలు వెల్లడించాయి. -
నవాజ్ షరీఫ్ అరెస్ట్
లాహోర్: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ స్వదేశంలో అడుగుపెట్టిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మరియమ్ అరెస్టయ్యారు. పనామా పత్రాల కేసులో షరీఫ్కు పదేళ్లు, మరియమ్కు ఏడేళ్ల జైలుశిక్ష పడింది. శుక్రవారం రాత్రి లాహోర్ విమానాశ్ర యంలో దిగిన వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. భద్రతా అధికారులు విమానంలోకి ప్రవేశించి వారి పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఎదురుచూస్తున్న షరీఫ్ తల్లిని కలుసుకునేందుకు వారికి అనుమతిచ్చారు. తర్వాత ఇద్దరినీ ప్రత్యేక హెలికాప్టర్లో ఇస్లామాబాద్కు తరలించారు. అనంతరం షరీఫ్ను రావల్పిండిలోని అదియాలా జైలుకు, మరియమ్ను తాత్కాలిక సబ్జైలుగా ఏర్పాటుచేసిన సీహాలా రెస్ట్ హౌజ్కు తీసుకెళ్లారు. లాహోర్లో ఉత్కంఠ.. పాక్కు రాగానే షరీఫ్ను అరెస్ట్ చేస్తామని అధికారులు ప్రకటించడంతో లాహోర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 10 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 300 మంది షరీఫ్ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. లాహోర్ వెళ్లే అన్ని దారులను మూసివేశారు. విమానాశ్రయానికి రాకపోకలపై ఆంక్షలు విధించారు. 144వ సెక్షన్ అమల్లో ఉన్నా షరీఫ్ సోదరుడు షాబాజ్ తన అనుచరులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. విమానాశ్రయం సమీపంలో షరీఫ్ మద్దతుదారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. లాహోర్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. లండన్ నుంచి పాకిస్తాన్కు బయల్దేరిన షరీఫ్, మరియమ్లు మూడు గంటలు ఆలస్యంగా లాహోర్ చేరుకున్నారు. లండన్ నుంచి అబుదాబికి నిర్ణీత సమయంలోనే చేరుకున్నా అక్కడి నుంచి లాహోర్ రావాల్సిన విమానం ఆలస్యంగా బయల్దేరింది. ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్లో అడుగుపెట్టడం మంచి నిర్ణయమేనా? అని అబుదాబి విమానాశ్రయంలో విలేకరులు షరీఫ్ను ప్రశ్నించగా..దేశంలోని పరిస్థితుల గురించి తనకు తెలుసని అన్నారు. దేశ తలరాత మార్చేందుకే తాను తిరిగొస్తున్నట్లు చెప్పారు. గుడ్డిగా ప్రతీకారం తీర్చుకునేందుకే.. అంతకుముందు, నవాజ్ షరీఫ్ తన దేశ పౌరులనుద్దేశించి ప్రసంగించిన వీడియోను మరియమ్ ట్వీట్ చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దేశ భవిష్యత్తును మార్చడానికి తనకు మద్దతుగా నిలవాలని షరీఫ్ కోరారు. ‘అసలు ఇందులో కేసు లేదు, తీర్పు లేదు. గుడ్డిగా ప్రతీకారం తీర్చుకునేందుకు ఆటలు ఆడుతున్నారు. నాకు వ్యతిరేకంగా కేసులే లేవు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనుకున్నాను కాబట్టే.. ఫిక్సింగ్కు పాల్పడి రాజకీయాల నుంచి నన్ను దూరంగా ఉంచడానికి పనామా పత్రాల కేసును తెరపైకి తెచ్చారు. నేనేం చేయాలో అదే చేశాను. నాకు పదేళ్ల శిక్ష పడిందని తెలుసు. పాక్లో అడుగుపెట్టిన మరుక్షణమే జైలుకు తరలిస్తారని తెలుసు. నేను చేస్తున్నదంతా మీకోసమేనన్న సంగతిని గ్రహించండి’ అని అన్నారు. పంజాబ్ ప్రావిన్సులో తన అనుచరులపై కొనసాగుతున్న అణచివేత..ప్రభుత్వానికి తానంటే ఉన్న భయాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. అందుకే లాహోర్ విమానాశ్రయానికి వేలాది మంది మంది మద్దతుదారులు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆసుపత్రిలో తన తల్లి వెంటిలేటర్పై ఉన్న చిత్రాలను కూడా మరియమ్ పోస్ట్ చేశారు. -
‘మమల్ని దేశం నుంచి వెళ్లగొడుతున్నారు’
ఇస్లామాబాద్ : సిక్కులను పాకిస్తాన్ నుంచి బలవంతగా గెంటివేస్తున్నారని పాక్కు చెందిన గూలాబ్ సింగ్ అనే వ్యక్తి పేర్కొన్నారు. సిక్కుల నుంచి పాక్ మొదటి పోలీసు అధికారిగా నియమితులైన గులాబ్ సింగ్ లాహోర్కు సమీపంలోని దేరా చహల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పోలీసు అధికారులు తనను దేశం విడిచివెళ్లాలని దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. గులాబ్ సింగ్ బుధవారం మాట్లాడుతూ ‘మా కుటుంబం 1947 నుంచి పాక్లోనే ఉంటుంది. పాక్లో ఎన్ని అల్లర్లు జరిగినా మేం దేశం విడిచిపోలేదు. ఇప్పుడు ప్రభుత్వం సిక్కులను బలవంతంగా దేశం నుంచి తరివేయాలని చుస్తోంది. ఇంటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెత్తికి చుట్టుకున్న పాగాను బలవంతంగా లాగారు. గత కొంత కాలంగా నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు’ అని గులాబ్ సింగ్ పేర్కొన్నారు. ఇంటిని ఖాళీ చేయాడానికి తమకు కొంత సమయం అడిగిన పోలీసులు ఇవ్వలేదని గులాబ్ సింగ్ తెలిపారు. కాందిశీకులకు చెందిన ఓ ట్రస్ట్ బోర్డు తమను అక్కడి నుంచి ఖాళీ చెయించిందని, ఆ సంస్థ చైర్మన్ సయ్యద్ ఆసీఫ్ ఆక్తర్పై స్థానిక పోలీస్ స్టేషన్లో గులాబ్ సింగ్ ఫిర్యాదు చేశాడు. గురుద్వార్కు సంబంధించిన స్థలాన్ని 2011లో గులాబ్ సింగ్ అక్రమంగా కొనుగోలు చేశారని, దానిని స్వాధీనం చేసుకునే బాధ్యతను పాక్ సుప్రీంకోర్టు ట్రస్ట్ చైర్మన్కు అప్పగించినట్లు బోర్డు సభ్యులు తెలిపారు. My house is sealed with all belongings including my slippers inside. Even this 'patka' on my head is an old rag which I just wrapped. I was harassed, beaten and my faith was disrespected: Gulab Singh, Pakistani Policeman who was forcibly evicted from his house in Lahore pic.twitter.com/va1tOGk3UM — ANI (@ANI) July 11, 2018 -
నవాజ్ షరీఫ్పై షూ విసిరిన యువకుడు
-
మైకు దగ్గరకు రాగానే షూ..
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్పై లాహోర్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఓ యువకుడు షూ విసిరిన ఘటన కలకలం రేపింది. వేదికపై షరీఫ్ మాట్లాడుతుండగా అనూహ్యంగా షూ ఆయనపైకి దూసుకొచ్చింది. లాహోర్కు సమీపంలోని గర్హి షాహులో జామియనీమియా సెమినరీకి మాజీ ప్రధాని హాజరైన క్రమంలో సెమినరీ మాజీ స్టూడెంట్ షరీఫ్పైకి షూ విసిరారు. ప్రేక్షకుల నుంచి విసిరన షూ నేరుగా షరీఫ్ ఛాతీకి తగిలింది. షూ విసిరిన యువకుడు వేదికపైకి వచ్చి నినదించడంతో అతడిని నిర్భందించిన నిర్వాహకులు పోలీసులకు అప్పగించారు. వివాదం సద్దుమణిగిన అనంతరం నవాజ్ షరీఫ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
కోర్టులో కాల్పులు..ఇద్దరు లాయర్ల మృతి
-
కోర్టులో కాల్పులు..ఇద్దరు లాయర్ల మృతి
లాహోర్ : పాకిస్తాన్లోని లాహోర్ సెషన్స్ కోర్టులో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు లాయర్లు మృతిచెందారు. మృతిచెందిన వారు రాణా ఇష్తియక్, ఓవైస్ తాలిబ్ అనే లాయర్లుగా గుర్తించారు. కాల్పులు జరిపిన కాషిఫ్ రాజ్పుత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు రాణా ఇష్తియక్, కాషిఫ్ రాజ్పుత్కు వరసకు సోదరుడవుడాడు. కాల్పులను అడ్డుకోబోయిన తాలిబ్పై కూడా రాజ్పుత్ కాల్పులు జరపడంతో తీవ్రగాయాలు అయ్యాయి. తాలిబ్ను ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ కాసేపటికే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి షెబాజ్ షరీఫ్ ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. -
కోర్టు వెలుపల కాల్పులు..ఇద్దరి మృతి
పాక్షిస్తాన్ : లాహోర్ సెషన్స్ కోర్టు వెలుపల బుధవారం జరిగిన కాల్పుల్లో ఓ హెడ్ కానిస్టేబుల్, మరో నిందితుడు మృతిచెందారు. మరొక నిందితుడు హాసన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయుధాలతో వచ్చి ఓ వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా సెషన్స్కోర్టు గేట్లు అన్నీ మూసి వేశారు. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. పూర్తిగా గాలించిన తర్వాత కాల్పులు జరిపిన వ్యక్తి పరారైనట్లు గుర్తించారు. విచారణ అనంతరం కాల్పులు జరిపిన వ్యక్తి తౌకీర్గా తేల్చారు. ఈ ఘటనలో చనిపోయిన నిందితుడు మాలిక్ అంజద్ కుటుంబసభ్యులు సంఘటనాస్థలంలో నిరసనకు దిగారు. రెండు వర్గాల మధ్య కొన్నిరోజులుగా వివాదం ఉన్నట్లు సమాచారం అందింది. వ్యతిరేక వర్గానికి చెందిన వ్యక్తి కాల్పులు జరిపినట్లు గుర్తించారు. -
అమృత్సర్-లాహోర్ మధ్య వ్యాపారం ఉండకూడదా?!
సాక్షి, అమృత్సర్ : పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్సింగ్ సిద్ధూ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమృత్సర్-లాహోర్ మధ్య వ్యాపార సంబంధాలపై సిద్ధూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పో సందర్భంగా.. సిద్ధూ కేంద్రప్రభుత్వం విమర్శలకు దిగారు. సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబై-కరాచీ మధ్య ట్రేడ్ పార్టనర్ షిప్ ఉన్నపుడు లాహోర్-అమృత్సర్ మధ్య ఉంటే తప్పేంటని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. పంజాబ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పోకు పాకిస్తాన్ వ్యాపారవేత్తలు పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకే పంజాబ్ ఎక్స్పో 12 సార్లు జరగ్గా.. పాకిస్తాన్ వ్యాపరవేత్తలు ఇందులో పాల్గొనకపోవడం వరుసగా రెండో ఏడాది అని ఆయన గుర్తు చేశారు. పంజాబ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోకు పాకిస్తాన్ వ్యాపారులను అనుమతివ్వడానికి ఎటవంటి ప్రత్యేక కారణాలు లేకపోయినా.. కేంద్రం మాత్రం మొండి వైఖరిని అనుసరించిందని అన్నారు. అమృత్సర్లో రాయి విసిరితే.. లాహోర్ పడుతుంది...అంత దగ్గరగా ఉండే ఈ నగరాల మధ్య వ్యాపారాన్ని కేంద్రం అనుమతించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. -
పెళ్లి దుస్తుల్లో మోడల్స్ మెరుపులు
-
లాహోర్లో మళ్లీ పేలుడు
లాహోర్: పాకిస్తాన్ రెండో ఆర్థిక రాజధాని లాహోర్ మరోసారి పేలుడుతో దద్దరిల్లింది. పండ్లతో నిండిన ట్రక్కులో అమర్చిన శక్తిమంతమైన బాంబు పేలడంతో 34 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పండ్ల మార్కెట్ వద్ద సోమవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు, భవంతులు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని లాహోర్ ప్రభుత్వ ఉన్నతాధికారి అబ్దుల్ ఖాన్ సుంబాల్ మీడియాకు తెలిపారు. బాంబు అమర్చిన వాహనం ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కొద్ది రోజుల కిందటే లాహోర్లోని ప్రఖ్యాత కూరగాయల మార్కెట్లో పాక్తాలిబన్లు జరిపిన పేలుళ్లలో 26 మంది చనిపోగా, పదుల మంది గాయపడిన సంగతి తెలిసిందే. తాజా ఘటనకు బాధ్యులు ఎవరనేది తెలియాల్సిఉంది. -
సీఎం ఇంటివద్ద పేలుళ్లు.. 20మంది మృతి!
లాహోర్: పాకిస్థాన్ మరోసారి నెత్తురోడింది. లాహోర్లోని పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్ నివాసానికి సమీపంలో సోమవారం భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు 20మంది చనిపోగా, 30మంది గాయపడ్డారు. పోలీసులు లక్ష్యంగా ఈ దాడి జరిగిందని, ఇది ఆత్మాహుతి పేలుడు అని లాహోర్ పోలీసు చీఫ్ కప్టెన్ ఆర్ అమిన్ తెలిపారు. మృతుల్లో పోలీసులు కూడా ఉన్నారు. పంజాబ్ సీఎం, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ఈ పేలుడు జరగడం గమనార్హం. షాబాజ్ నివాసానికి సమీపంలో ఉన్న ఆర్ఫా కరీం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్లోని రద్దీ మార్కెట్లో పేలుడు జరిగింది. ఈ ఉగ్రదాడా? కాదా? అన్నది నిర్ధారించలేదు. ఏ గ్రూప్ కూడా తమదే బాధ్యత అని ప్రకటించలేదు. పేలుడు జరిగిన ప్రాంతంలో స్థానిక మున్సిపాలిటీ అక్రమ కట్టడాలకు వ్యతిరేకంగా ఆపరేషన్ చేపడుతున్నది. ఈ సమయంలోనే పేలుడు జరగడంతో భారీ అగ్నిప్రమాదం కూడా చోటుచేసుకుంది. సమీపంలోని పలు భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. -
ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి
లాహోర్: పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. జనాభా లెక్కలు సేకరించే వారిని లక్ష్యంగా చేసుకొని బుధవారం లాహోర్లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు సైనికులతో పాటు ఇద్దరు జనాభా లెక్కలు సేకరించే వారు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారని పంజాబ్ గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ మాలిక్ అహ్మద్ వెల్లడించారు. ఉగ్రదాడిలో ఎంత మంది పాల్గొన్నారనే విషయం ఇప్పుడే తెలియరాలేదని ఆయన తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరిఫ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరిలో లాహోర్లోని ఓ షాపింగ్ సెంటర్ వద్ద జరిగిన పేలుడులో 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
లాహోర్లో పేలుడు: 8 మంది మృతి
లాహోర్: పాకిస్తాన్లోని లాహోర్లో గురువారం భారీ పేలుడు సంభవించింది. రక్షణ శాఖకు చెందని ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా 15 మంది గాయాలపాలైనట్లు చెప్పింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
నెత్తురోడిన లాహోర్
► ఆత్మాహుతి దాడిలో 13 మంది మృతి.. 71 మందికి గాయాలు ► మృతుల్లో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు లాహోర్: ఆత్మాహుతి బాంబు దాడితో పాకిస్తాన్ లోని లాహోర్ సోమవారం రక్తమోడింది. నగరంలోని పంజాబ్ అసెంబ్లీ ముందు నిరసన ప్రదర్శన జరుగుతుండగా ఒక వ్యక్తి తనను తాను పేల్చేసుకోవడంతో 13 మంది మరణించగా... దాదాపు 71 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో దాదాపు 11 మంది పరిస్థితి విషమంగా ఉందని పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి సల్మాన్ రఫీక్ తెలిపారు. మృతుల్లో లాహోర్ ట్రాఫిక్ పోలీసు చీఫ్ అహ్మద్ మొబీన్ , సీనియర్ ఎస్పీ జహీద్ కూడా ఉన్నారని లాహోర్ పోలీసు కమిషనర్ అమిన్ వైన్స్ చెప్పారు. లాహోర్ పోలీసులే లక్ష్యంగా దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని పోలీసు అధికారులు వెల్లడించారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ ఫార్మాస్యూటికల్స్ తయారీదారుల ఆందోళన నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆందోళనకారులతో చర్చించేందుకు ట్రాఫిక్ పోలీసు చీఫ్ మొబీన్ ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మోటారుసైకిల్పై వచ్చిన దుండగుడు తన వాహనాన్ని పోలీసు అధికారుల సమీపంలోకి తీసుకెళ్లి పేల్చేసుకున్నాడు. ముందే హెచ్చరించినా అడ్డుకోలేకపోయాం పంజాబ్ అసెంబ్లీ భవనం, గవర్నర్ నివాసాలపై ఉగ్రవాదులు దాడికి పాల్పడవచ్చని నిఘా సంస్థలు ముందే హెచ్చరించాయని, భద్రతను కూడా పటిష్టం చేశామని పంజాబ్ న్యాయ శాఖ మంత్రి రానా సనుల్లాహ్ తెలిపారు. పంజాబ్ అసెంబ్లీ ముందు ఆందోళన నిర్వహించకుండా అడ్డుకుని ఉంటే పేలుడు జరిగి ఉండేదికాదని ఆయన పేర్కొన్నారు. -
బ్రైడల్ ఫ్యాషన్ వీక్ అదరహో
-
ప్రముఖ నటి దారుణహత్య
షో ముగించుకుని ఇంటికి తిరిగి బయలుదేరిన ఆమెను ఆగంతకులు వెంటాడారు. ఆమె ప్రయాణిస్తున్న కారుకు అడ్డంగా బైక్ల ఆపి యాక్సిడెంట్ చేశారు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే సాయుధులు ఆమెను చుట్టుముట్టారు. ‘ఇప్పుడు చెయ్యగలవా డాన్స్..’ అని కోపంగా అరుస్తూ తుపాకులతో నటి కాళ్లు, చేతులు, పొట్టభాగంలో విచక్షనారహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. స్థానికులు నటిని, ఆమె డ్రైవర్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావంతో ఆమె కన్ను మూసింది. ఆమె పేరు.. కిస్మత్ బేగ్. ప్రముఖ పాకిస్థానీ రంగస్థలనటి. లాహోర్ నగరంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న కిస్మత్ బేగ్ హత్యోదంతం పాకిస్థానీ కళారంగాన్ని కుదిపేసింది. కిస్మత్ మాజీ ప్రియుడు, ఫైసలాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘ఇక నువ్వు డాన్స్ ఎలా చేస్తావో చూస్తాం..’అని హంతకులు మాట్లాడటాన్నిబట్టి ఇది ప్రతీకార హత్యగా భావిస్తున్నట్లు, సదరు ఫైసలాబాద్ వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకొని ప్రశ్నించనున్నట్లు దర్యాప్తు అధికారి అస్గర్ హుస్సేన్ మీడియాకు చెప్పారు. పోస్ట్మార్టం అనంతరం కిస్మత్ మృతదేహంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన నిర్వహించారు. నిందితులను అరెస్ట్చేయాలని నినాదాలు చేశారు. గడిచిన కొద్ది నెలలుగా పాకిస్థాన్ టీవీ, రంగస్థల నటీమణులపై దాడులు పెరిగిపోయాయి. గత జులైలో టాప్ మోడల్ ఖందిల్ బలూచ్ దారుణ హత్య, అంతకుముందు టీవీ యాంకర్పై విషప్రయోగం, మరో తొమ్మిది మంది కళాకారిణుల హత్యలు.. పాకిస్థాన్లో శాంతిభద్రతల లేమిని తెలియజేస్తాయి. అభిమానినని చెప్పుకున్న ఓ దుండగుడు విషం కలిపిన ఐస్క్రీమ్ తినిపించిన ఘటనలో టీవీ యాంకర్ ప్రాణాలు కోల్పోయింది. నద్రా, నగూ, యాస్మిన్, నైనా, నగీనా, మార్వీ, కరిష్మా, సంగమ్, ఆర్జూ లాంటి రంగస్థల నటీమణులు లాహోర్, ముల్తాన్ నగరాల్లో దారుణ హత్యలకు గురయ్యారు. -
లాహోర్ టు ఇస్లామాబాద్: హఫీజ్ భారీ ర్యాలీ
లాహోర్: ముంబై దాడుల సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ మంగళవారం కశ్మీర్ కు స్వాతంత్ర్యం(కశ్మీర్ కారవాన్) పేరుతో భారీ ర్యాలీ చేపట్టాడు. లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు (264 కిలోమీటర్లు) సాగనున్న ఈ ర్యాలీలో వేల మంది జమాత్ ఉల్ దవా కార్యకర్తలు, వందలాది వాహనాల్లో దేశ రాజధాని వైపు కదిలారు. బుధవారానికి ర్యాలీ ఇస్లామాబాద్ చేరుకోనుంది. అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించి కశ్మీర్ విషయంలో పాక్ సెనెటర్లు, ఇతర నేతలపై ఒత్తిడి ఒత్తిడి పెంచుతామని హఫీజ్ మీడియాకు చెప్పాడు. కశ్మీర్ లోయలో హిజబుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం చెలరేగిన ఆందోళనలు 11 రోజులు గడిచినా చల్లారడంలేదు. ఇప్పటికే ఒక జవాన్ సహా 43 మంది పౌరులు చనిపోయారక్కడ. కశ్మీర్ లో ఉద్రిక్తతలు పార్లమెంట్ ను సైతం కుదిపేశాయి. సోమవారం రాజ్యసభలో కశ్మీర్ పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్.. 'లోయలో ఆందోళనలన్నీ పాకిస్థాన్ ప్రోద్బలంతో జరుగుతున్నవే'అని అన్నారు. మంగళ, బుధవారాల్లో జరిగే ర్యాలీ ద్వారా కశ్మీర్ అంశాన్ని తిరిగికి ప్రాముఖ్యత తీసుకురావాలన్నది హఫీజ్ వ్యూహంగా కనిపిస్తోంది. -
ఉత్తర భారతం, పాకిస్థాన్లలో భూప్రకంపనలు!
న్యూఢిల్లీ: ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలతోపాటు ఆగ్నేయ పాకిస్థాన్ లో ఆదివారం సాయంత్రం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉదయం గుజరాత్ లో భూమి కంపిన కొద్దిగంటలకే మళ్లీ పంజాబ్, పాక్ లలో ప్రకంపనలు రావడంతో జనం బెంబేలెత్తిపోయారు. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతగా నమోదయిన భూకంపం.. పంజాబ్ లోని అమృత్ సర్, జలంధర్ పట్టనాలతోపాటు పాకిస్థాన్ లోని లాహోర్, షేక్ పురాల్లో ప్రభావం చూపింది. ఆయా నగరాలు, వాటి పరిసర ప్రాంతాలు కొన్ని క్షణాలు కంపించాయి. ఈ మేరకు భూకంప అధయయన శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. అంతకంటే ముందే ప్రజలు తమ నగరాల్లో భూకంపం వచ్చినట్లు సోషల్ మీడియాలో వెల్లడించడం గమనార్హం. ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన సమాచారం తెలియాల్సిఉంది. Earthquake of Magnitude:4.6, Occurred on:17-07-2016,17:24 IST, Lat:31.1 N Long: 74.3 E, Depth:15Km,Region:India (Punjab)- Pak Border Region — IMD-Earthquake (@IMD_Earthquake) 17 July 2016 -
ఆయన లేకుండా హనీమూన్కి వెళ్లి..
బాలీవుడ్ 'క్వీన్' గుర్తుందా! ఆ సినిమాలో ఒంటరిగా హనీమూన్ కి వెళ్లే యువతిగా కంగనా రనౌత్ నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. దాదాపు క్వీన్ లాంటిదే ఓ మహిళ నిజజీవిత గాథ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. భర్త లేకుండా హనీమూన్ కి వెళ్లిన హుమా.. వాళ్లాయన లేని లోటును ఫీలవుతూ దిగిన ఫొటోలు ఫొటోలు వైరల్ అయ్యాయి. పాకిస్థాన్ లోని లాహోర్ కు చెందిన హుమా, అర్సలాన్ దంపతులు తమ రెండో హనీమూన్ కోసం చారిత్రక గ్రీస్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కూడా అత్తమామల్ని కూడా తీసుకెళ్లాలనుకున్నారు. అయితే గ్రీస్ ఎంబసీ అర్సలాన్ కు వీసా నిరాకరించడంతో కథ 'క్వీన్' తరహా మలుపు తిరిగింది. అత్తమామలు కూడా ఉన్నప్పటికీ ప్రియమైన భర్త తోడు లేని లోటును ప్రతిక్షణం ఫీలవుతూ హుమా పర్యాటక ప్రదేశాల్లో ఫొటోలు దిగింది. -
స్టార్ క్రికెటర్ పొలిటికల్ ఎంట్రీ!
సమకాలీన క్రికెట్ లో విలక్షణ విధ్వంసకారుడిగా పేరు పొందిన స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. సమీప భవిష్యత్ లోనే పాకిస్థాన్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపాడు. ఇప్పటికే 'షాహిద్ అఫ్రిది ఫౌండేషన్' ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న అఫ్రిది.. ప్రజలకు మరింత సేవ చేసేందుకే పాలిటిక్స్ లోకి రాబోతున్నట్లు పేర్కొన్నాడు. లాహోర్ లోని తన నివాసం నుంచి 'బీబీసీ ఉర్దూ' వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది తన మనోభావాలను వెల్లడించాడు. 'నా దృష్టిలో రాజకీయ నాయకులంటే ప్రజా సేవకులు. వారి పరమ ధర్మం ప్రజా సేవే అయి ఉండాలి. నిజానికి నేను రాజకీయాల్లోకి రాకపోయినా ప్రజాసేవ చేయగలను. మా ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే చాలా కార్య్రమాలు అమలవుతున్నాయి. అయితే మరింత మందికి సేవచేసేందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా. రాజకీయాల్లోకి వెళ్లొద్దని ఆప్త మిత్రులు కొందరు సలహా ఇచ్చారు. నేను మాత్రం భవిష్యత్ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నా' అంటూ తన ప్రణాళికను వివరించాడు అఫ్రిది. (చదవండి: ఆఫ్రిది.. నువ్వెప్పుడు?) ఇంటర్నేషనల్ క్రికెట్ లో పాక్ తరఫున అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లలో ఒకడైన షాహిద్ అఫ్రిది.. అధికారికంగా వన్ డే, టెస్ట్ లకు గుడ్ బై చెప్పలేదు. ప్రస్తుతం ఇంగ్లీష్ కౌంటీల్లో హాంప్ షైర్ జట్టుకు ఆడుతున్నాడు. మళ్లీ జట్టులోకి ప్రవేశించే అవకాశాలు దాదాపు కనుమరుగవుతున్న నేపథ్యంలోనే పొలిటికల్ ఎంట్రీపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. -
నెత్తురోడిన లాహోర్
- పార్కులో ఆత్మాహుతి దాడి - 69 మంది దుర్మరణం - ఈస్టర్ పండుగపూట విషాదం - మృతుల సంఖ్య పెరిగే అవకాశం - ఘటనను ఖండించిన ప్రధాని మోదీ లాహోర్: పాకిస్తాన్ వాణిజ్య రాజధాని లాహోర్ రక్తపు మడుగైంది. ఆదివారం సాయంత్రం చిన్నపిల్లల పార్కులో ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు దాడితో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో 69 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని లాహోర్ డీఐజీ హైదర్ అష్రఫ్ తెలిపారు. ఈ హఠాత్పరిణామంతో పిల్లల పార్కు రక్తపు మడుగులా మారింది. మహిళలు, చిన్నారుల మృతదేహాలతో పార్కులో పరిస్థితి భీతావహంగా మారింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సొంత ప్రాంతం, అత్యంత రద్దీగా ఉండే లాహోర్ టౌన్ ప్రాంతంలోని గుల్షన్-ఎ-ఇక్బాల్ పార్క్ ప్రధాన గేటు వద్ద ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో అందరూ పార్కు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగిందని.. అందువల్లే దీని తీవ్రత ఎక్కువగా ఉందని ప్రాథమిక విచారణలో తేలింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, వైద్య బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. భద్రతా దళాలు పార్కును తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఘటనతో లాహోర్లోని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఘటన జరిగిన సమయంలో పార్కు వద్ద సరైన భద్రత లేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 5-6 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించటం వల్ల భారీ శబ్దం వచ్చిందన్నారు. మృతుల్లో.. ఈస్టర్ సెలవు సందర్భంగా కాసేపు సరదాగా గడపుదామని పార్కుకు వచ్చిన క్రిస్టియన్ కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని.. అంతమాత్రాన క్రిస్టియన్లే లక్ష్యం దాడి జరిగిందని చెప్పలేమని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో పంజాబ్ ప్రావిన్స్లో మూడురోజుల సంతాప దినాలు ప్రకటించారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, తెహ్రిక్-ఏ-ఇన్సాప్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఈ ఘటనను ఖండించారు. పాకిస్తాన్ క్రిస్టియన్ నాయకులు కూడా ఈ ఆత్మాహుతి దాడిని తీవ్రంగా ఖండించారు. ‘పిల్లలు ఆడుకుంటుండటంతో.. వారిని చూస్తూ కూర్చున్నాను. ఇంతలో భారీ శబ్దం రావటంతో నేను నేలపై పడిపోయాను. తలకు దెబ్బతగలటంతో స్పృహ కోల్పోయాను. కాసేపటికి తేరుకుని చూస్తే.. అందరూ పరుగులు పెడుతున్నారు. పిల్లల కోసం వెతికాను. దేవుడి దయవల్ల ఓ చోట వారు స్వల్ప గాయాలతో కనిపించారు’ అని ఓ బాధితుడు బోరున విలపించింది. ముక్త కంఠంతో ఖండించిన భారత్ లాహోర్ ఘటనపై తొలి స్పందన భారత ప్రధాని నరేంద్ర మోదీదే. ఈ ఘటనను ఖండించిన మోదీ.. బాధితుల కుటుంబాలను సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ట్విట్టర్లో తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాక్లో ఆత్మాహుతి ఘటనను తీవ్రంగా ఖండించారు. అమాయకులు ప్రాణాలు కోల్పోవటం పట్ల ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ, క్రికెట్, బాలీవుడ్ ప్రముఖులు కూడా లాహోర్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలుస్తున్నట్లు ట్వీట్లు చేశారు. -
లాహోర్లో ఉగ్ర పంజా.. 38 మంది మృతి
లాహోర్: పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. లాహోర్లోని పబ్లిక్ పార్కులో ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికిపాల్పడటంతో 38మంది ప్రాణాలుకోల్పోయారు. 100మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆదివారం కావడంతో లాహోర్ లోని గుల్షన్ ఈ ఇక్బాల్ పార్క్కు భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ఈ పార్క్ సమీపంలోనే చిన్నారుల ఊయలలు ఊగే పెద్ద చోటు కూడా ఉంది. ఇదే అదనుగా చేసుకున్న ఉగ్రవాది ఒక్కసారిగా తనను తాను పేల్చుకోవడంతో అక్కడికక్కడే 38మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య 50కి చేరే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆహ్లాదంగా కనిపించిన పార్క్ ఒక్కసారిగా శవాల కుప్పగా కనిపించింది. చనిపోయినవారిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఎక్కడ చూసిన బాధితుల ఆర్తనాధాలే వినిపిస్తున్నాయి. అయితే, ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. -
ఎలిజబెత్ రాణి క్షమాపణ చెప్పాలి
లాహోర్: భారత స్వాతంత్ర రణధీరుడు సర్దార్ భగత్సింగ్ను 1931లో ఉరితీసినందుకు బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 క్షమాపణ చెప్పాలని, ఆయన వారసులకు పరిహారం ఇవ్వాలని పాకిస్తాన్లోని మానవహక్కుల సంఘాల కార్యకర్తలు గురువారం డిమాండు చేశారు. భగత్ సింగ్ 85వ వర్ధంతి సందర్భంగా బుధవారం పంజాబ్ ప్రావిన్స్లోని రెండు ప్రాంతాల్లో ఆయన సృ్మత్యర్థం హక్కుల సంఘాలు కార్యక్రమాలు నిర్వహించాయి. వీటిలో ఒకటి ఆయన జన్మస్థలంలో చేపట్టగా, మరొకటి భగత్సింగ్ ఆయన సహచరులను ఉరితీసిన ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమాలకు వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు హాజరై అమర వీరునికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు బ్రిటన్ రాణినుంచి క్షమాపణ కోరుతూ తీర్మానించారు. -
'క్వీన్ ఎలిజెబెత్ సారీ చెప్పాలి'
లాహోర్: బ్రిటన్ క్వీన్ ఎలిజెబెత్ 2 క్షమాపణలు చెప్పి తీరాలని పాకిస్థాన్లో ఓ హక్కుల కార్యకర్త డిమాండ్ చేశాడు. 1931లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ను పట్టుకొని ఉరితీసినందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని అన్నారు. మార్చి 23న భగత్ సింగ్ 85 వర్దంతి సందర్భంగా అతను రెండు ప్రాంతాల్లో భగత్ సింగ్ కు ఘననివాళి అర్పించాడు. ఒకటి భగత్ సింగ్ జన్మ స్థానం అయిన ఫైసలాబాద్లోని జరన్ వాలాకు సమీపంలోని బంగా చౌక్ లో నిర్వహించగా మరొక కార్యక్రమాన్ని భగత్ సింగ్ను తన అనుచరులు రాజ్ గురు, సుఖ్ దేవ్తో కలిపి ఉరితీసిన షాద్ మాన్ చౌక్ ప్రాంతంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భగత్ సింగ్ అభిమానులు తరలివచ్చి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. 'గొప్ప స్వాతంత్ర్య పోరాట యోధుడు భగత్ సింగ్ను ఉరితీసినందుకు క్వీన్ ఎలిజెబెత్ -2 తప్పకుండా క్షమాపణలు చెప్పి తీరాలి' అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. దీనికి అంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. -
గవర్నర్ హంతకుడిని ఉరితీశారు
లాహోర్: పంజాబ్ మాజీ గవర్నర్ సల్మాన్ తాసిర్ను హత్య చేసిన పాకిస్థాన్ పోలీసు కమాండర్ ముంతాజ్ ఖాద్రిని పాక్ పోలీసులు సోమవారం ఉదయం ఉరితీశారు. రావల్పిండి జైలులో అతడిని ఉరి తీసినట్లు అధికారులు చెప్పారు. 2011లో గవర్నర్ సల్మాన్ ను ఆయన ఇంటికి సమీపంలోని ఓ మార్కెట్ వద్ద ముంతాజ్ హత్య చేశాడు. దేశ చట్టాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడనే కారణంతో ఆయనను చంపేసినట్లు చెప్పాడు. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక కోర్టుకు అప్పగించగా అది ఉరి శిక్షను విధించింది. దీంతో రావల్పిండిలోని అడియాల జైలులో అతడిని ఉరి తీశారు. 2015లో ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్లిన అతడికి క్షమాభిక్ష దొరకలేదు. -
ఎవరీ హఫీజ్ సయీద్?
డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ సయీద్ గిలానీ వీడియో కాన్ఫరెన్స్ విచారణతో 26/11 ముంబై దాడుల కేసు కీలక ఘట్టానికి చేరుకుంది. దాడుల కీలక సూత్రధారి హఫీజ్ మొహమ్మద్ సయీద్ పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతూ .. భారత్ కు వ్యతిరేకంగా మరింతమంది కసబ్ లను తయారుచేసేపనిలోఉన్నాడు. అయితే అందరు ఉగ్రవాద నాయకుల్లాగా రహస్యంగా దాక్కోకుండా.. బహిరంగంగా సంచరించడం, పెద్ద ఎత్తున జనాలన సమీకరించి సభలు నిర్వహించడం హఫీజ్ ప్రత్యేకత. జమాత్-ఉద్-దవా(జేయూడీ)పై నిషేధం ఉన్నప్పటికీ హఫీజ్ ను ఎందుకు నిలువరించలేకపోతున్నారు? నిజంగానే పాకిస్థాన్ లో ఆయనకు ప్రజాబలం ఉందా? లేక వాపును చూసి బలుపనుకుని అతణ్ని కట్టడిచేసేందుకు పాక్ ప్రభుత్వం వెనకడుగువేస్తోందా? ఒక్కసారి హఫీజ్ గురించిన వాస్తవాలను తెల్సుకొని ఈ ప్రశ్నలకు జవాబులు వెదుకుదాం.. ఏకాలంలోనైనా ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయలు సంవృద్ధిగా పండే నేల అది. కాస్త వివరంగా చెప్పాలంటే.. అమృతకశంలాంటి ఆ ప్రాంతాన్ని వదులుకోలేకే దాయాది దేశం మనతో యుద్ధాలు చేసింది. మారిన పరిస్థితుల్లో తాను ప్రత్యక్షంగా రంగంలోకి దిగలేక.. బీ టీమ్ లైన ఉగ్రవాదులన ఎగదోస్తోంది. ఆ 'ఆక్రమిత కశ్మీర్' లోని ముఖ్యనగరాల్లో ఒకటైన సర్గోదా.. హఫీజ్ మొహమ్మద్ సొంత ఊరు. 1950, మార్చి 10 ఆయన పుట్టినరోజు. తండ్రి పేరు కమాలుద్దీన్. ఇస్లామిక్ పండితుడైన కమాలుద్దీన్ వ్యవసాయం కూడా చేసేవాడు. హఫీజ్ తల్లితోపాటు బంధువర్గంలో చాలామంది విద్యావంతులే. హఫీజ్ పూర్వీకులది ఇండియానే ముస్లిం గుర్జర్లయిన హఫీజ్ పూర్వీకులది హర్యానాలోని హిస్సార్. దేశవిభజన సమయంలో అటువైపునకు బయలుదేరిన వారి కుటుంబం.. నాలుగు నెలల ప్రయాణం తర్వాతగానీ పాకిస్థాన్ కు చేరుకోలేదు. అదే సమయంలో చెలరేగిన హిందు- ముస్లిం ఘర్షణల్లో ఆ కుటుంబానికి చెందిన 36 మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్నప్పుడే మతపరమైన బోధనలకు ఆకర్షితుడైన హఫీజ్ 12 ఏళ్లకే పవిత్రగ్రంథాన్ని కంఠతాపట్టాడు. అయితే కేవలం మతానికే పరిమితమైపోకుండా సాధారణ చదువుల్లోనూ రాణించాడు. 1966లో మెట్రిక్యులేషన్, 68లో ప్లస్ టూ పూర్తిచేసి, లాహోర్ లోని పంజాబ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తోపాటు రెండు మాస్టర్ డిగ్రీలను సాధించాడు. ఆసియాలోని మొదటి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(లాహోర్)లో ప్రొఫెసర్ గా చేరాడు. కొంతకాలం తర్వాత సౌదీలోని కింగ్ సౌద్ యూనివర్సిటీలో చేరి అరబి భాష స్పెషలైజేషన్ గా మరో డిగ్రీ విత్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇస్లామిక్ స్టడీస్ తోపాటు ప్రాపంచిక అవగాహన కలిగిఉన్నాడనే భావనతో.. ప్రొఫెసర్ హఫీజ్ సయీద్ ను కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ(మత పరమైన విషయాల్లో పాక్ ప్రభుత్వానికి సలహాలిచ్చే రాజ్యాంగ సంస్థ) సభ్యుణ్ని చేశాడు నాటి పాక్ అధ్యక్షుడు జియా ఉల్ హక్. అప్పటి నుంచి దేశ రాజకీయాల్లో కీలక వ్యక్తిగామారిపోయాడు హఫీజ్. 1979లో ప్రారంభమైన అఫ్ఘాన్- సోవియట్ యుద్ధంలో ఆఫ్ఘన్లకు మద్దతుగా లష్కరే తోయిబా(అల్లాహ్ సైన్యం) అనే సంస్థను స్థాపించారు హఫీజ్ సయీద్, అబ్దుల్లా యూసుఫ్ ఆజం(ఈయనా ఇస్లామిక్ స్కాలరే, అల్- ఖాయిదా వ్యవస్థాపకుల్లో ఒకడు). యుద్ధం చివరిదశలో అంటే 1986లో ప్రారంభమైన ఈ సంస్థ వేలమంది పాకీస్థానీ యువకులకు జిహాదీ పాఠాలు నేర్పించి ఆఫ్ఘన్లకు మద్దతుగా సోవియట్ తో పోరాడేందుకు పురిగొల్పేది. లష్కరేకు మొదట్లో ఒసామా బిన్ లాడెనే ప్రధాన ఆర్థిక వనరు. అప్పట్లో అది అస్థిత్వపోరాటంగా ప్రాచుర్యం పొందింది. అయితే 1988లో సోవియెట్ యుద్ధం నుంచి వెనుకడుగు వేయటం, 1991 నాటికి ఏకంగా సోవియట్ యూనియనే కుప్పకూలడంతో యుద్ధంలోపోరాడిన ఇస్లామిక్ గ్రూపులన్నీ తలోదారి వెతుక్కున్నాయి. వాటిల్లో ఒకటైన అల్- కాయిదా అఫ్ఘానిస్థాన్ లో రాజకీయపట్టుకు ప్రయత్నించగా.. దిక్కుతోచకే 'ఆజాద్ కశ్మీర్' నినాదం హఫీజ్ నేతృత్వంలోని లష్కరే 'కశ్మీర్ విముక్తి'పై దృష్టిసారించింది. దాయాది దేశంతో యుద్ధం తర్వాత భారత భూభాగంలో ఉండిపోయిన కశ్మీర్ ను పాకిస్థాన్ లో కలపాలనే ప్రధాన డిమాండ్ తో ఆ సంస్థ మళ్లీ జిహాదీ పోరాటం ప్రారంభించింది. అటు ఉగ్రవాద కార్యకలాపాలతోనేకాక స్వదేశంపై రాజకీయపరమైన ఒత్తిడి పెంచాలనేది హఫీజ్ వ్యూహం. 1990ల్లో కశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున యువకుల్ని ఆకర్షించి, భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించిన లష్కరే.. కశ్మీర్ ను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించడంలో సఫలమైంది. అయితే 2001లో భారత పార్లమెంట్ పై దాడి అనంతరం అంతర్జాతీయంగా తలెత్తిన ఒత్తిడితో పాక్ ప్రభుత్వం లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా గుర్తించి దానిపై నిషేధం విధించింది. దీంతో లష్కరే నుంచి విడిపోయి 'జమాత్-ఉద్-దవా(జేయూడీ)' అనే కొత్త సంస్థను ప్రారంభించాడు హఫీజ్. పేరుతోపాటే విధివిధానాల్లోనూ పలు కీలక మార్పులు తెచ్చాడు. పాకిస్థాన్ లోని అనేక పట్టణాల్లో ఆసుపత్రులు, స్కూళ్లు నిర్మించి సేవకార్యక్రమాలను ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా విస్తరించిన జేయూడీ కార్యకర్తలు సంస్థ కోసం పెద్ద ఎత్తున నిధులు సేకరించగల సమర్థులు. కేవలం జీహాదీ గ్రూప్ గానేకాక.. రాజకీయ సంస్థగానూ జమాత్- ఉద్- దవాను తీర్చిదిద్దాలన్నది హఫీజ్ సయీద్ ప్రణాళిక. కానీ ముంబై దాడుల తర్వాత అతనికి, అతని సంస్థకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. లష్కరేతో తనకుగానీ, జేయూడీకిగానీ సంబంధాలు లేవని ఎంత బుకాయించినప్పటికీ ఆ బంధం తాలుకూ సాక్ష్యాధారాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం జేడీయూపైనా నిషేధం విధించింది. హఫీజ్ ను అరెస్టు చేసి కొంతకాలం జైల్లో పెట్టగలిగిందికానీ ఎప్పటిలాగే కోర్టు ఆదేశాల మేరకు అతణ్ని విడుదలచేసింది. ఆ సంస్థ పేరుచెబితే ఒళ్లుమంట 'బ్రిటన్ ప్రధానులు నాలుగు గదుల ఇంట్లో సాధారణంగా జీవిస్తుంటే మా దేశ నాయకులు మాత్రం మహల్లలో రాజభోగాలు అనుభవిస్తారు. ఇది ఇస్లాంకు విరుద్ధం' అని 'ది న్యూయార్క్ టైమ్స్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హఫీజ్.. పాకిస్థానీ పాలకులను తూర్పారబట్టాడు. అందుకు ప్రతీకారంగా అదనుచూసి అతణ్ని దెబ్బకొట్టాలని అక్కడి పాలకులు భావిస్తుండొచ్చు. అయితే తనదైన ఇస్లామిస్ట్ మార్క్ తో పాక్ ఆర్మీతో ఆయన ఏర్పర్చుకున్న సంబంధాలు, సయూద్ శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులు కశ్మీర్ లో పాక్ ఆర్మీకి బీ టీమ్ గా ఉండటం, భారత్ ను అస్థిరపర్చే క్రమంలో ఆ మూకలుచెప్పుకోదగ్గ విధ్వంసాలకు పాల్పడటం వంటి కారణాలు హఫీజ్ సయీద్ పూర్తికాల అరెస్టుకు ప్రతిబంధకాలని చెప్పొచ్చు. ఇండియాలో చోటుచేసుకునే పొలిటికల్ డెవలప్ మెంట్ల పై నిమిషాల వ్యవధిలో కామెంట్లు చేసే హఫీజ్ సయ్యిద్ కు స్వదేశంలోనూ శత్రువులు లేకపోలేరు. పాక్ ను నాశనం చేస్తామని కంకణం కట్టుకున్న పాక్ తాలిబన్లంటే ఆయనకు మంట. అందుకే ఆ సంస్థను భారత్ ప్రోత్సహిస్తోందంటూ నిరాధారమైన ఆరోపణలు గుప్పిస్తాడు. పార్లమెంట్ పై దాడి అనంతరం అరడజనుకుపైగా దేశాలు లష్కరేను ఉగ్రవాద సంస్థగా ప్రకటించగా, ముంబై దాడుల తర్వాత యావత్ ప్రపంచం మొత్తం హఫీజ్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా, ఆయన జేయూడీని ఉగ్రసంస్థగా గుర్తించింది. అమెరికా హఫీజ్ తలపై రూ.60 కోట్ల బహుమతిని ప్రకటించింది. ముంబైలో దాడుల్లో సజీవంగా దొరికిన కసబ్ లాంటి చిన్నచేపలు వెల్లడించిన సమాచారాన్ని బట్టి హఫీజ్ సయీద్ మాటలతో మత్తుమందు జల్లుతాడు. జిహాద్ కోసం ఎంతటి క్రౌర్యానికౌనా ఒడిగట్టేలా మనుషుల్ని మృగాలుగా మారుస్తాడు. లాహోర్ లోని ఓ మధ్యతరగతి నివాస ప్రాంతంలోని హఫీజ్ ఇంటిచుట్టూ ఆయన ప్రైవేటు బలగాలు తుపాకులతో పహారా కాస్తుంటారు. హఫీజ్ భార్య పేరు మైమూనా. వారికి ముగ్గురు సంతానం. కొడుకు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కుతుళ్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. -
అగ్నిప్రమాదం : ఆరుగురు సజీవదహనం
లాహోర్ : పాకిస్థాన్లోని లాహోర్ నగరంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమైయ్యారు. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో చోటు చేసుకుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఘటన స్థలం ఇరుకు ప్రాంతంలో ఉండటంతో ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోలేపోయారు. దీంతో కొద్ది దూరం నుంచి అగ్నిమాపక సిబ్బంది దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి మంటలార్పివేశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతుల్లో నాలుగేళ్ల బాబు కూడా ఉన్నారని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే నలుగురిని రక్షించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
నోరు పారేసుకున్న క్రికెటర్
లాహోర్: వివాదాలకు చిరునామాగా ఉండే పాకిస్థానీ ఆల్ రౌండర్, టీ20 జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి నోటి దురుసుతనాన్ని ప్రదర్శంచాడు. బుధవారం లాహోర్ లోని గడాఫీ నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్ కు ముందు మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అఫ్రిది.. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులు చెప్పలేక ఆగ్రహంతో ఊగిపోయాడు. అతణ్ని దూషిస్తూ సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయాడు. అక్కడ అసలేం జరిగిందంటే.. మార్చిలో భారత్ లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో పాల్గొనే పాక్ జట్టుకు అఫ్రిదియే సారధి. అయితే టీ20 కెప్టెన్ గా మిగతా అందరికంటే అఫ్రిదీకి చెత్త రికార్డుంది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'మీ ఆట, జట్టు తీరును ఎలా మెరుగుపర్చుకుంటారు?' అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దీనికి బదులుగా 'నువ్వింత ఏడుపుగొట్టు, చచ్చు ప్రశ్న అగుడుతావని నాకు ముందే తెలుసు' అనేసి కోపంగా వెళ్లిపోయాడు అఫ్రిది. క్రికెటర్ చర్యతో విస్తుపోయిన విలేకరులు.. క్షమాపణ చెప్పాల్సిందిగా డ్రస్సింగ్ రూమ్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అయితే పీసీబీ చైర్మన్ షహర్యాన్ ఖాన్ దీనినొక చిన్న సంఘటనగా కొట్టిపారేశారు. -
పాకిస్తాన్ మహిళలకోసం 'గాల్స్ ఎట్ డాబాస్'!
అనాదిగా నెలకొన్న దురాచార, పురుషాధిక్య సమాజం నుంచీ ఇప్పుడిప్పుడే పాకిస్తాన్ మహిళలు బయటకు వస్తున్నారు. వివక్షత, వేధింపులు, హింసలకు గురయ్యే నేపథ్యం నుంచి... గౌరవంగా, హక్కుగా, స్వేచ్ఛగా బతికేందుకు ప్రయత్నిస్తున్నారు. పురుషుడు తోడులేనిదే బయటకు రాని పరిస్థితి నుంచీ... ఒంటరిగా, ధైర్యంగా తిరిగే స్థాయికి చేరారు. మహిళల్లో అటువంటి మార్పే ధ్యేయంగా ఏర్పాటు చేసిన 'గాల్స్ ఎట్ డాబాస్' అందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. పాకిస్తాన్ లోని బహిరంగ ప్రదేశాల్లో.. పురుషులు తోడు లేకుండా మహిళలు పబ్లిక్ ప్లేస్ లో ఒంటరిగాగాని, సమూహంతోగాని స్వేచ్ఛగా, ఆనందంగా గడిపే క్షణాల ఫొటోలను పోస్ట్ చేయమంటూ ప్రారంభించిన ఉద్యమానికి అనూహ్య స్పందన లభించింది. భారత మహిళల 'వై లాయ్ టర్' ఉద్యమానికి స్పందిచిన కరాచీ జర్నలిస్ట్ సదియా ఖత్రి.. పాకిస్తాన్ మహిళల్లోనూ అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. 'గాల్స్ ఎట్ డాబాస్' పేరిట ఉద్యమానికి నాంది పలికింది. భారత నగరాల్లోని మహిళలను . 'వై లాయ్ టర్' ఎలా ప్రోత్సహించిందో తెలుసుకొని, భారతీయ నిర్వాహకులతో కలిసి పాకిస్తాన్ లో ఉద్యమం తెచ్చేందుకు నిర్ణయించింది. 'వై లాయ్ టర్' ద్వారా మహిళలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, కచ్చితంగా మాట్లాడగల్గుతున్నారని... భారతదేశంలో జరిగిన ప్రచారాన్నే పాకిస్తాన్ కు పరిచయం చేయాలని ప్రతిన బూనింది. కరాచి, ఇస్లామాబాద్, లాహోర్లతోపాటు అనేక పాకిస్తానీ నరగాల్లో కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసింది. పాకిస్తానీ మహిళలు తమ ఇళ్ళనుంచి బయటకు వచ్చి... సమావేశాల్లో పాల్గొని, ఎటువంటి ఆందోళనా లేకుండా సమయం గడపడంతో ఖత్రి ప్రయత్నం కొంతవరకూ సఫలమైంది. పాకిస్తాన్ లో పబ్లిక్ ప్లేస్ లు మహిళలకు నరక కూపాలుగా ఉన్నాయని, రోడ్లపై 25 మంది పురుషులకు ఒక్క మహిళ కనిపించడం కష్టమని, ఈ నిష్పత్తి ఇలా ఉంటే ఇక మహిళలు హాయిగా వీధుల్లో తిరగడం కనిపించే అవకాశమే లేదని ఖత్రి అంటుంది. ఎటువంటి అవసరం ఉన్నా పురుషుడు తోడు లేనిదే బయటకు వెళ్ళలేని పరిస్థితి అక్కడి మహిళలదని, అత్యవసర పరిస్థితుల్లోనూ ఒకరికోసం వేచి చూడాల్సిందేనని అంటుంది. 'వై లాయ్ టర్' స్ఫూర్తిగా పాకిస్తానీ మహిళల్లో స్ఫూర్తిని రగిల్చేందుకు ఖత్రి సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంది. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లను వినియోగించుకొని మహిళలు తమ అభిప్రాయాలను హాయిగా వెలిబుచ్చేందుకు వేదికలుగా మార్చింది. తోడు లేకుండా బయటకు రాలేని నిస్సహాయ స్థితి నుంచి వారు స్వేచ్ఛా ప్రపంచంలో విహరించేట్టు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే పురాతన దురాచారాల లోతుల్లో పాతుకుపోయిన భావాలనుంచి అక్కడి మహిళలను బయటకు తేవడం కొంత కష్టమే అయినా... పదిమంది సభ్యులు కలిగిన 'గాల్స్ ఎట్ డాబాస్' టీమ్.. సోషల్ మీడియాద్వారా అవగాహన కల్పిస్తూ మహిళల్లో మార్పుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటువంటి ఉద్యమాన్నికేవలం సోషల్ మీడియా ద్వారా నడపడం కష్టమేనంటున్న టీమ్... కనీసం విలువలు, హక్కుల గురించైనా తెలిపేందుకు ఇదో ప్రమాదంలేని, ఉచిత మార్గమని భావిస్తోంది. అయితే ప్రస్తుతం మహిళలను అగౌరవంగా, అతి హేయంగా చూస్తున్న సమాజంలో ఉన్నామని, కనీసం ఓ డాబా వద్ద చాయ్ తాగేందుకు, పబ్లిక్ ప్లేస్ లో ఆనందంగా గడిపేందుకు అవకాశం లేకుండా ఉందని ఖత్రి అంటోంది. హక్కులు, స్వేచ్ఛపై పాకిస్తానీ మహిళల్లో అవగాహనకు తమ ప్రయత్నం కొంత మాత్రమైనా సహకరిస్తుందని ఖత్రి ఆశాభావం వ్యక్తం చేస్తోంది. -
’మాఫియా గన్ కల్చర్ మొదలైంది అక్కడే’
-
భగత్సింగ్పై హత్యకేసు విచారణ వేగవంతం!
లహోర్: భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్సింగ్పై నమోదైన హత్యకేసు విచారణను వేగవంతంలో చేయాలని కోరుతూ పాకిస్థాన్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. భగత్సింగ్ ఉరికంభం ఎక్కకముందు 83 ఏళ్ల కిందట బ్రిటిష్ అధికారులు ఈ హత్యకేసును నమోదుచేశారు. బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ పీ సాండర్స్ను హత్య చేశాడంటూ భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులపై అభియోగాలు మోపారు. ఈ కేసులో ఆ ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించాలని కోరుతూ భగత్సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్, అడ్వకేట్ ఇంతియాజ్ రషీద్ ఖురేషి గతంలో లాహోర్ హైకోర్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ వేగవంతం చేయాలని, ఇందుకు ధర్మాసనం వాదనలు వినాలని కోరుతూ ఆయన సోమవారం లాహోర్ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. అవిభాజ్య భారత్ స్వాతంత్ర్యం కోసం భగత్సింగ్ వీరోచితంగా పోరాడారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. సామ్రాజ్యవాద బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపన్నారనే ఆరోపణలపై 1931 మార్చ్ 23న భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను ఉరితీశారు. అయితే వారిపై నమోదు చేసిన కేసుల నకిలీవని, బూటకపు కేసులో ఇరికించి.. వారికి మొదట జీవితఖైదు విధించి.. ఆ తర్వాత ఉరిశిక్షగా దానిని మార్చి అమలుచేశారని ఖురేషి పేర్కొన్నారు. భారత ఉపఖండంలో సిక్కులే కాకుండా ముస్లింలు సైతం భగత్సింగ్ను గౌరవిస్తారని, పాకిస్థాన్ స్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా ఆయనకు రెండుసార్లు నివాళులర్పించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. -
భవనం కుప్ప కూలి.. 10 మంది మృతి
లాహోర్: పాకిస్తాన్లో ఓ ఫ్యాక్టరీ భవనం పై కప్పు కుప్పకూలి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. బుధవారం సాయంత్రం లాహోర్ లోని పరిశ్రమల ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది ఇప్పటికే రిపేరులో ఉండటంతో మరమ్మత్తులు చేసేందుకు సిద్ధం చేసి ఉంచగా ఈ ప్రమాదం సంభవించింది. మొత్తం నాలుగు అంతస్తులుగా ఉన్న ఈ భవనంలో షాపింగ్ బ్యాగులు తయారు చేస్తుంటారు. మృతులు గాయపడిన వారు శిథిలాల కింద ఉన్నవారు అంతా కూడా అందులో పనిచేసే వర్కర్లు అని తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం 100 మందికి పైగా కూలీలు శిథిలాల కింద ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన జరిగే సమయంలో 150మంది పనిచేస్తున్నట్లు సమాచారం. -
'పాక్- జింబాబ్వే క్రికెట్ మ్యాచ్' లక్ష్యంగా దాడి
పాకిస్థాన్- జింబాబ్వేల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటన ఆసల్యంగా వెలుగుచూసింది. శుక్రవారం లాహోర్లోని గడాఫీ స్టేడియంలో ఈ రెండు జట్లు రెండో వన్ డే ఇంటర్నేషన్ మ్యాచ్ ఆడాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదిని పోలీసులు అడ్డుకోవడంతో ఆ ఉగ్రవాది అక్కడిక్కడే తనను పేల్చుకున్నాడు. ఈ దాడిలో ఒక ఎస్సై మరణించగా, ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ఇప్పటికే పాకిస్థాన్ లో క్రికెట్ ఆడేందుకు అన్నిదేశాలు నిరాకరించిన నేపథ్యంలో పూర్తిస్థాయి భద్రత హామీపై జింబాబ్వే జట్టు పాక్లో పర్యటిస్తోంది. స్టేడియం సమీపంలో ఉగ్రదాడి విషయం బయటికి వస్తే పరువు మరింత దిగజారుతుందని భావించిన పాక్ ప్రభుత్వం సంబంధిత వార్తలను ప్రసారం చెయ్యొద్దని బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ను ఆదేశించడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
పాక్ చర్చిల్లో పేలుళ్లు.. 10 మంది మృతి
యొహానాబాద్ ప్రాంతంలో క్రైస్తవ ప్రార్థనాలయాల్లో ఆదివారం ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో 10 మంది మృతిచెందగా, 40 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎమర్జెన్సీ బృందాలు క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించాయి. క్రైస్తవులు అధికంగా నివసించే ప్రాంతంలోని రెండు వేరు వేరు చర్చిలపై ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారని స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో గుమ్మిగూడారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. -
ఆత్మాహుతి దాడి : ఐదుగురు మృతి
-
ఆత్మాహుతి దాడి : ఐదుగురు మృతి
పాకిస్థాన్: లాహోర్ నగరంలోని పోలీసు కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదురుగు అక్కడికక్కడే మరణించగా... మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను నగరంలోని మెయో, గంగారామ్ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. హోటల్ సమీపంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఘటన ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. మృతులు, క్షతగాత్రులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు. -
వాఘా సరిహద్దులో నెత్తుటేర్లు
లాహోర్లో ఆత్మాహుతి దాడి.. 55 మంది పాకిస్థానీల దుర్మరణం 200 మందికి గాయాలు సైనిక విన్యాసాలు పూర్తయిన అనంతరం పేలుడు లాహోర్: పాకిస్థాన్ మళ్లీ నెత్తురోడింది. లాహోర్లోని వాఘా సరిహద్దు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన శక్తివంతమైన ఆత్మాహుతి దాడిలో 55 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో చిన్నారులతో పాటు 11 మంది మహిళలు, ముగ్గురు భద్రతా సిబ్బంది ఉన్నారు. 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పది మందికిపైగా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భారత-పాకిస్థాన్ సరిహద్దు వద్ద ఆదివారం సాయంత్రం పతాక అవనతం పూర్తయిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించింది. దీంతో ఆ ప్రదేశమంతా మరుభూమిని తలపించింది. మృతదేహాలు.. గాయపడిన వారి ఆర్తనాదాలతో భయానకంగా కనిపించింది. పేలుడు దాటికి సమీపంలోని భవనాలు, షాపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే పాక్ సైనికులు ఘటనా స్థలాన్ని అధీనంలోకి తీసుకున్నారు. సహాయక సిబ్బంది క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పేలుడు తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తొలుత దీనిని సిలిండర్ పేలుడుగా భావించినా.. ఆ తర్వాత ఆత్మాహుతి దాడి అని నిర్ధారించారు. కాగా అల్ కాయిదా అనుబంధ సంస్థ జుందల్లా, మరో ఉగ్రవాద సంస్థ జమాత్ అహ్రార్ దాడికి బాధ్యత ప్రకటించుకున్నాయి. కాగా.. వజీరిస్థాన్లో మిలిటరీ ఆపరేషన్లకు ప్రతిగా ఈ దాడికి పాల్పడ్డామని పాక్ తాలిబన్లు పేర్కొన్నారు. పాక్లోని లాహోర్ - మనదేశంలోని అమృత్సర్కు మధ్య సరిహద్దు దాటడానికి ఉన్న ఏకైక రోడ్డు మార్గం వాఘా సరిహద్దే. అయితే ప్రతిరోజు సాయంత్రం పతాక అవనత కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఇరు దేశాల సైనిక విన్యాసాలతో సరిహద్దును మూసేస్తారు. ఈ విన్యాసాలను తిలకించేందుకు ప్రతి రోజు వేలాది మంది సందర్శకులు తరలి వస్తుంటారు. అయితే పరేడ్ ఏరియా నుంచి సందర్శకులు తిరిగి వెళుతుండగా.. ఎగ్జిట్ గేటు వద్దకు వచ్చిన 20 ఏళ్ల ఆత్మాహుతిదళ సభ్యుడు తనను తాను పేల్చుకున్నాడని పంజాబ్ పోలీస్ ఐజీ ముస్తాక్ సుఖేరా చెప్పారు. తమ బృందాలు ఆత్మాహుతి దాడి జరిగినట్టు ధ్రువీకరించాయన్నారు. సూసైడ్ బాంబర్ను గేటు వద్దే భద్రతా సిబ్బంది గుర్తించారని, అయితే అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో జనం ఉండటంతో పేల్చుకున్నాడని చెప్పారు. 25 కేజీల పేలుడు పదార్థాలను వినియోగించినట్టు భావిస్తున్నామన్నారు. మొహర్రం నేపథ్యంలో షియాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముండడంతో అన్ని భద్రతా చర్యలూ తీసుకున్నామన్నారు. దాడిపై పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. హైఅలర్ట్ ప్రకటించిన బీఎస్ఎఫ్.. న్యూఢిల్లీ: వాఘా వద్ద ఆత్మాహుతి దాడి నేపథ్యంలో అప్రమత్తమైన బీఎస్ఎఫ్.. పంజాబ్లోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి హైఅలర్ట్ ప్రకటించింది. సోమవారం నుంచి మూడు రోజులు సరిహద్దుల వద్ద సైనిక విన్యాసాలను రద్దు చేసినట్టు బీఎస్ఎఫ్ చీఫ్ డీకే పాఠక్ చెప్పారు. ఫిరోజ్పూర్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని కొద్దిరోజుల క్రితమే నిఘా వర్గాలు హెచ్చరించాయని, ఈ నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసినట్టు చెప్పారు. -
హైఅలర్ట్ ప్రకటించిన బీఎస్ఎఫ్
న్యూఢిల్లీ: పాక్లో వాఘా సరిహద్దు వద్ద ఆత్మాహుతి దాడి నేపథ్యంలో అప్రమత్తమైన బీఎస్ఎఫ్.. పంజాబ్లోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి హైఅలర్ట్ ప్రకటించింది. తాజా పరిస్థితుల దృ ష్ట్యా సోమవారం నుంచి మూడు రోజుల పాటు సరిహద్దుల వద్ద సైనిక విన్యాసాలను రద్దు చేసినట్టు బీఎస్ఎఫ్ చీఫ్ డీకే పాఠక్ చెప్పారు. ఫిరోజ్పూర్ ప్రాంతంలో దాడులకు పాల్పడే అవకాశం ఉందని కొద్దిరోజుల క్రితమే నిఘా వర్గాలు హెచ్చరించాయని, ఈ నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసినట్టు చెప్పారు. పాకిస్థాన్ లో ఆదివారం జరిగిన మానవ బాంబు దాడిలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలోమరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్ లోని వాఘా సరిహద్దు వద్ద ఆత్మాహుతి దాడి జరగడంతో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. -
పాక్ లో బాంబు దాడి: 52 మంది మృతి
లాహోర్: పాకిస్థాన్ లో ఆదివారం జరిగిన మానవ బాంబు దాడిలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలోమరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్ లోని వాఘా సరిహద్దు వద్ద బాంబు పేలుడు సంభవించిందని స్థానిక మీడియా వెల్లడించింది. పరేడ్ గ్రౌండ్ లో పతకావిష్కరణ కార్యక్రమం ముగిసిన తర్వాత పార్కింగ్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. మొదట సిలిండర్ పేలుడుగా భావించారు. పతాకావిష్కరణకు వచ్చిన జనాన్ని లక్ష్యంగా చేసుకుని మానవ బాంబు దాడి జరిగిందని తర్వాత వెల్లడైంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఇద్దరు సైనికాధికారులు, పిల్లలు ఉన్నారు. బాంబు దాడిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పాక్లో పేలుడు : 48 మంది మృతి
-
పాక్లో బాంబు పేలుడు : 37 మంది మృతి
-
చెన్నైని సెమీస్కు చేర్చిన పెర్త్
కీలక మ్యాచ్లో ఓడిన లాహోర్ బెంగళూరు: చాంపియన్స్ లీగ్లో పెర్త్, లాహోర్ల మధ్య గ్రూప్ ‘ఎ’ ఆఖరి లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్లో లాహోర్ కనీసం 46 పరుగుల తేడాతో పెర్త్ను ఓడిస్తే సెమీస్కు చేరుతుంది. ఒకవేళ పెర్త్ గెలిచినా లేక లాహోర్ 46 కంటే తక్కువ పరుగుల తేడాతో నెగ్గినా... చెన్నై సెమీస్కు వెళుతుంది. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం నాటకీయంగా మ్యాచ్ సాగింది. తొలుత లాహోర్ కేవలం 124 పరుగులే చేసింది. లక్ష్య ఛేదనలో పెర్త్ తడబడి 40 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 78 పరుగులకు పెర్త్ను నియంత్రిస్తే లాహోర్ సెమీస్కు చేరుతుంది. ఈ స్థితిలో పెర్త్ కెప్టెన్ మిషెల్ మార్ష్ (38 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్తో పెర్త్ను మూడు వికెట్ల తేడాతో గెలిపించాడు. ఫలితంగా చెన్నై ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా సెమీస్కు చేరింది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో పెర్త్ ఫీల్డింగ్ ఎంచుకోగా... లాహోర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. సాద్ నసీమ్ (55 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించాడు. 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లాహోర్ను నసీమ్, ఉమర్ అక్మల్ (19 బంతుల్లో 26; 4 ఫోర్లు) కలిసి ఆదుకున్నారు. పెర్త్ బౌలర్లలో పారిస్ 3, మిషెల్ మార్ష్ 2 వికెట్లు తీసుకున్నారు. పెర్త్ జట్టు 19 ఓవర్లలో ఏడు వికెట్లకు 130 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మార్ష్తో పాటు బ్రాడ్ హాగ్ (19 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా ఆడాడు. హఫీజ్, ఇక్బాల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంతో చెన్నై సెమీస్కు చేరింది. -
పేలిన విమానం, కాలిన బస్సులు
పాకిస్తాన్ లోని లాహోర్ లోని బల్దియా ప్రాంతంలో ఒక పాక్ ఎయిర్ ఫోర్స్ విమానం పేలిపోయింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు పైలట్లు చనిపోయారు. పేలిన విమానం తాలూకు మండుతున్న శకలాలు కింద పడటంతో చాలా మందికి గాయాలయ్యాయి. బల్దియాలో రద్దీగా ఉండే బస్ టర్మినల్ దగ్గర ఈ ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్న మూడు బస్సులు కూడా నిప్పంటుకున్నాయి. అగ్నిమాపక దళాలు, సహాయ బృందాలు వచ్చే లోపునే ప్రాంతమంతా అగ్నిదగ్ధమైపోయింది. ఈ విమానాన్ని పాక్ వైమానిక దళం ట్రెయినింగ్ కోసం ఉపయోగిస్తోంది. -
భారత్తో ఆరు సిరీస్లు: పాక్
లాహోర్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ల మధ్య ఆరు పూర్థిస్థాయి క్రికెట్ సిరీస్లు జరుగుతాయని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ)లో భాగంగా 2015 నుంచి 2023 మధ్య కాలంలో ఈ సిరీస్లు జరగనున్నాయి. ఇందులో నాలుగు సిరీస్లకు పాక్ ఆతిథ్యమివ్వనుందని పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబాన్ అహ్మద్ తెలిపారు. 2008లో ముంబైలో పాక్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్లు జరగడం లేదు. అయితే బీసీసీఐ అనుకూల ఐసీసీ పునర్వ్యవస్థీకరణకు పీసీబీ మద్దతు ఇవ్వడంతో మళ్లీ ముఖాముఖీ సిరీస్లకు మార్గం సుగమమైంది. -
భగత్సింగ్ నిర్దోషే?
లాహోర్: బ్రిటిష్ అధికారి హత్య కేసులో భారత స్వాతం త్య్ర సమరయోధుడు భగత్సింగ్ నిర్దోషిత్వాన్ని నిరూపించే ఓ ఆధారం బయటకొచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో భగత్సింగ్ పేరు లేదని వెల్లడైంది. 1928లో బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ పి సాండర్స్ హత్యకు గురికాగా, ఈ కేసులో భగత్సింగ్ను 1931లో లాహోర్లోని షాద్మాన్ చౌక్లో ఉరితీశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ కాపీని భగత్సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్ఖురేషీ కోర్టు ద్వారా సంపాదించారు. సాండర్స్ హత్యపై లాహోర్లోని అనార్కలి పోలీస్ స్టేషన్లో 1928 డిసెంబర్ 17న గుర్తు తెలియని ఇద్దరు సాయుధులపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తేలింది. ఈ కేసును తిరిగి తెరవాలని కోరుతూ ఖురేషీ ఇప్పటికే లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
పాలుతాగే పసివాడిపై హత్య కేసు కొట్టేసిన పాక్ కోర్టు
తొమ్మది నెలల పాలుతాగే పసిబాలుడిపై హత్య చేసినట్టు కేసు మోపిన పోలీసులకు పాకిస్తానీ కోర్టు మొట్టికాయలు వేసింది. మూసాఖాన్ అనే ఈ తొమ్మిది నెలల పసిగుడ్డు పాలసీసా నోట్లో పెట్టుకుని తాతయ్య ఒళ్లో కూర్చుని కోర్టుకు హాజరయ్యారు. లాహోర్ లో ఒక కుటుంబం పోలీసును చితకబాదింది. ఆ పోలీసు మొత్తం కుటుంబంపై హత్యా యత్నం కేసు నమోదు చేశాడు. దీంతో ఆ కుటుంబంలోని పసిపాప మూసాఖాన్ పైనా హత్యా యత్నం కేసు నమోదైంది. ఈ పసిబాలుడికి కొద్ది రోజుల క్రితమే బెయిల్ కూడా లభించింది. అంతకుముందు పోలీసులు ఆ పసిగుడ్డు వేలిముద్రలు సేకరించేందుకు ప్రతయ్నం చేస్తే ఆ పిల్లవాడు పేచీ పెట్టేశాడు. చివరికి శనివారం ఈ కేసు మళ్లీ విచారణకు వచ్చింది. న్యాయమూర్తి బాలుడిపై హత్యాయత్నం కేసును కొట్టేశారు. మిగతా కుటుంబసభ్యులపై కేసును మాత్రం అలాగే ఉంచారు. -
బేబీ కిల్లర్..
పాల బాటిల్తో పాలు తాగుతున్న ఈ 9 నెలల బుడ్డోడు.. పోలీసు అధికారుల హత్యకు పథకం పన్నాడు! ఓయ్.. అంటూ వారిని బెదిరించాడు.. అంతేకాదు.. సమాజశాంతికి భంగం కలిగించాడు!! ఇదంతా నిజమే.. అందుకే మహమ్మద్ మోసా ఖాన్ అనే ఈ పిల్లాడిని గురువారం కోర్టులో హాజరుపరిచారు. చిన్నారికి బెయిల్ మంజూరు చేసిన జడ్జి కేసును ఈ నెల 12కు వాయిదా వేశారు. ఈ విచిత్ర ఘటన పాకిస్థాన్లోని లాహోర్లో జరిగింది. ఇంతకీ విషయమేమిటంటే.. గ్యాస్ దొంగలను పట్టుకోవడానికి పోలీసులు మహమ్మద్ యాసీన్ అనే వ్యక్తి నివసిస్తున్న ఇంటిపై దాడి చేశారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు పోలీసు అధికారులను హత్య చేసే ఉద్దేశంతో రాళ్లు విసిరారని.. బెదిరించారని పోలీసులు వారందరిపై కేసు పెట్టారు. వీడికా సీన్ ఉందా లేదా అన్న విషయాన్ని చూడకుండా.. ఆ కుటుంబంలో భాగమైన మోసా ఖాన్పైనా కేసు నమోదు చేశారు. చివరికిది మీడియాలో రావడంతో ఉన్నతాధికారులు స్పందించి.. సదరు ఘటనపై విచారణకు ఆదేశించారు. కేసు నమోదు చేసిన ఎస్సైను సస్పెండ్ చేశారు. 12న కేసు విచారణకు వచ్చినప్పుడు మోసా ఖాన్ పేరును అభియోగ పత్రం నుంచి తొలగించే అవకాశముంది. -
9 నెలల బుజ్జోడిపై హత్యా నేరం
పాకిస్తాన్ లోని లాహోర్ లో ఒక హత్య, దొమ్మీ కేసు విచారణ జరుగుతోంది. ఒక్కో నిందితుడినీ కోర్టు ముందు ప్రవేశపెడుతున్నారు. కోర్టులో డఫేదారు మూసాఖాన్ అలియాస్ మహ్మద్ ఉమర్ పేరును గట్టిగా మూడు సార్లు పిలిచాడు. అందరూ ఆ హత్యానేరారోపణ ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి కోసం ఆసక్తిగా చూస్తున్నారు. అంతలో ఒక నడివయస్సు వ్యక్తి నెమ్మదిగా వచ్చాడు. ఆయన చేతిలో ఒక తొమ్మిది నెలల బిడ్డ. నేరస్తుడెవరా అని అందరూ ఆశ్చర్యపోయారు. పెద్దాయన ఒళ్లో ఉన్న బుడ్డోడే హత్యానేరారోపితుడని డఫేదారు ప్రకటించాడు. లాహోర్ లో ఇరు వర్గాల మధ్య జరుగుతున్న హోరాహోరీని ఆపేందుకు వెళ్లిన పోలీసులపై ఒక వర్గం దాడి చేసింది. ఈ సంఘటనలో ఒక పోలీసు చనిపోయాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వారందరిపై కేసులు నమోదయ్యాయి. అందులో ఈ బుడ్డోడు కూడా ఉన్నాడు. పిల్లవాడి తండ్రి కోరిక మేరకు మూసాఖాన్ కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బుడ్డోడిని చూసేందుకు ఇప్పుడు జనం క్యూలు కడుతున్నారు. తొమ్మిది నెలల పిల్లోడు అసలు ఎలా హత్య చేయగలడు వంటి ప్రశ్నలు ఎవరూ వేయకపోవడం, అసలు బుజ్జోడిని చూడగానే కేసు కొట్టేయాలని అనిపించకపోవడం ఆశ్చర్యమే కదూ! ఇప్పుడీ వార్త వెలువడగానే పోలీసు ఉన్నతాధికారులు, పంజాబ్ ముఖ్యమంత్రి , తదితరులు అసలేం జరిగిందంటూ విచారణలు మొదలుబెట్టాడు. మన బుజ్జి మూసాఖాన్ కి ఇదంతా ఏమీ అర్ధం కావడం లేదు. ఖాన్ బాబు పాలపీకను నోట్లో పెట్టుకుని ఉంగా ఉంగా అంటున్నాడు. అప్పుడప్పుడూ పక్కలు తడిపేస్తున్నాడు. -
పాకిస్తాన్ లోని భగత్ సింగ్ ఇంటికి భారీ నిధులు
లాహోర్: భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ఇంటికి పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు పాకిస్తాన్ శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్ లో ఉన్న భగత్ సింగ్ పూర్వీకుల ఇంటి నిర్మాణ పనులకు సంబంధించి భారీ నిధులను విడుదల చేసింది. దీంతో పాటుగా ఆయన పేరు మీద ఉన్న స్కూల్ పనులను కూడా చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు 80 మిలియన్లు(రూ.8 కోట్లు)ను విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బంగే గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు, డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో ఆ నిధుల్లోని కొంత మొత్తాన్ని వాటికి కేటాయించనున్నారు. ప్రస్తుతం ఫైసలాబాద్ మ్యూజియంలో ఉన్న భగత్ సింగ్ కు చెందిన వస్తువులను నిర్మాణ పనులు పూర్తి చేసుకోబోతున్నఇంటికి చేర్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. లాహోర్ కు 150 కి.మీ దూరంలో ఉన్న బంగే గ్రామంలో భగత్ సింగ్ 1907, సెప్టెంబర్ 28వ తేదీన జన్మించారు. -
త్వరలో భారత్- పాక్ క్రికెట్ సిరీస్
ఎన్నాళ్లుగానో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండో-పాక్ క్రికెట్ సిరీస్ త్వరలో సాకారం కాబోతోంది. సాధారణంగా ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులు వెల్లువెత్తుతారు. చాలా కాలంగా మ్యాచ్ ఏదీ జరగకపోవడంతో పాక్, భారత్ క్రికెట్ బోర్డులు తటస్థ వేదికపై సిరీస్ నిర్వహించాలని తలపెట్టాయి. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు జకా అష్రఫ్ తెలిపారు. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కూడా ఇందుకు అంగీకరించారని ఆయన అన్నారు. శ్రీనివాసన్తో అష్రఫ్ ఇటీవల భేటీ అయ్యారు. భారత్, పాకిస్థాన్ జట్టుల మధ్య క్రికెట్ సిరిస్ ఏర్పాటుకు బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ సుముఖత వ్యక్తం చేశారని సోమవారం లాహోర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అష్రఫ్ వెల్లడించారు. అయితే ఇరు దేశాల క్రికెట్ జట్లు మరో తటస్థ వేదికపై క్రికెట్ అడనున్నాయని తెలిపారు. అందుకు ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్ను ఎంచుకునే అవకాశం ఉందని అష్రఫ్ తెలిపారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ టెస్ట్ అంటే ఇరుదేశాలలోని క్రికెట్ అభిమానులకు టెన్షనే టెన్షన్. ఇరుదేశాల పోటీలలో ఏ దేశం విజయపతాకం ఎగురవేస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే 2008లో ముంబై దాడుల తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య క్రికెట్ టెస్ట్ సిరీస్లకు మంగళం పాడారు. దాంతో ఇరుగు పొరుగు దేశాల క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. అయితే ఆ విషయాన్ని గ్రహించిన ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. -
ఉమర్ అక్మల్ అరెస్ట్
లాహోర్: సిగ్నల్ పడినపుడు ఆగకపోవడమే కాకుండా ఇదేమిటని అడిగినందుకు ట్రాఫిక్ వార్డెన్పై పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ వీరంగం చేశాడు. దుర్భాషలాడడమే కాకుండా అతడి యూనిఫామ్ను చించేశాడు. దీంతో అక్మల్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ‘ఉమర్ సిగ ్నల్ను అతిక్రమించినందుకు పోలీస్ వార్డెన్ చలాన్ రాశాడు. దీంతో వాగ్వాదం ప్రారంభమైంది. అతడు వార్డెన్ మెడ పట్టుకోవడంతో పాటు చొక్కాను చించేశాడు. విధుల్లో ఉన్న అధికారిపై దాడి చేయడమే కాకుండా అతడి చొక్కాను చించేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఉమర్పై కేసు నమోదు చేశాం’ అని గుల్బర్గ్ స్టేషన్ ఎస్ఎస్పీ తారీఖ్ అజీజ్ తెలిపారు. మరోవైపు ట్రాఫిక్ వార్డెనే తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, చెంపపై కొట్టాడని అక్మల్ ఫిర్యాదు చేశాడు. దీనికి సాక్ష్యంగా అక్కడ సీసీటీవీ ఫుటేజిలున్నాయని, వాటిని పరిశీలిస్తే ఎవరిది తప్పో తెలుస్తుందని వాదించాడు. అయితే ఇరువురు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారని, ఇతర వార్డెన్ వచ్చి విడదీశాడని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. -
ఇంజినీరింగ్ విద్యార్థిని గ్యాంగ్రేప్
లాహోర్: పాకిస్థాన్లోని లాహోర్ లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. సహ విద్యార్థి, అతడి ముగ్గురు స్నేహితులు ఈ అకృత్యానికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా ఈ ఘోరాన్ని సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. బాధితురాలు లాహోర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థిని. కొన్ని నెలల కిత్రం తనను ఒంటరిగా తీసుకెళ్లి సహ విద్యార్థి అత్యాచారానికి ఒడిగట్టాడని బాధితురాలు తెలిపింది. సెల్ఫోన్లో వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి అతడి ముగ్గురు స్నేహితులు తర్వాత తనపై అత్యాచారం చేశారని వెల్లడించింది. ఈ దురాగతానికి పాల్పడిన నలుగురిపై పోలీసులు అరెకేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నాలుగో నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పాకిస్థాన్లో 56 మంది మహిళల హతం
లాహోర్: పాకిస్థాన్లో మహిళలపై దారుణాలు నానాటికి అధికమవుతున్నాయి. చాంధస పురుషాహంకారుల దురాగతాలకు మహిళలు బలైపోతున్నారు. ఆడ పిల్లలకు జన్మనిచ్చారనే కారణంతో ఈ ఏడాది పాకిస్థాన్లో 56 మంది మహిళలను చంపేసినట్టు హక్కుల సంఘం వెల్లడించింది. ఈ దారుణాలపై మానవ హక్కుల సంఘం ఆఫీస్ బేరర్ ఐఏ రెహమాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులను చంపే సమాజంగా నైతిక పతనమైనట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. 2012 జనవరి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మహిళలపై 90 యాసిడ్ దాడులు జరిగాయని గణాంకాలు వెల్లడించాయి. 72 మంది అగ్నికీలకు బలైయ్యారు. 491 గృహహింస కేసులు, 344 గ్యాంగ్ రేప్, 835 వేధింపులు కేసులు నమోదయ్యాయి. మగపిల్లలకు జన్మనివ్వలేదని 56 మంది మహిళలను హతమార్చినట్టు గణాంకాలు బయటపెట్టాయి. -
లాహోర్లో 113 రేప్ కేసులు నమోదు
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు లాహోర్ మహానగరంలో 113 అత్యాచార కేసులు నమోదు అయ్యాయని స్థానిక పత్రిక డ్వాన్ ఆదివారం వెల్లడించింది. అయా కేసులకు సంబంధించిన గణాంకాలను సోదాహారణగా ఆ పత్రిక వివరించింది. ఆ కేసుల్లో దాదాపు 86 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపింది. గత ఎనిమిది నెలల్లో 32 సామూహిక అత్యాచార సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పింది. ఆ కేసులతో ప్రమేయం ఉన్న 22 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. అయితే అత్యాచారానికి గురైన మహిళలంతా యుక్తవయస్సువారేనని డ్వాన్ పత్రిక ఆదివారం ప్రచురించిన కథనంలో వెల్లడించింది. -
మళ్లీ పెళ్లాడిన వసీమ్ అక్రమ్
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ మరో పెళ్లి చేసుకున్నాడు. వారం క్రితం ఆస్ట్రేలియాకు చెందిన ప్రియురాలు షనీరా థాంప్సన్ను వివాహం చేసుకున్నానని అతను వెల్లడించాడు. ‘లాహోర్లో నిరాడంబరంగా మా వివాహం జరిగింది. నా పిల్లలతో కలిసి ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించింది. ఉర్దూ భాషను కూడా నేర్చుకుంటోంది. అంతకుమించి మా అబ్బాయిలిద్దరితో బాగా కలిసిపోయింది’ అని 47 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ తెలిపాడు. గత నెలలో 30 ఏళ్ల థాంప్సన్తో పెళ్లి ప్రతిపాదన తేగా ఆమె సమ్మతించినట్లు అక్రమ్ చెప్పాడు. అక్రమ్ మొదటి భార్య హుమా అనారోగ్యంతో 2009లో మృతి చెందింది. -
మళ్లీ పెళ్లాడిన వసీమ్ అక్రమ్
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ మరో పెళ్లి చేసుకున్నాడు. వారం క్రితం ఆస్ట్రేలియాకు చెందిన ప్రియురాలు షనీరా థాంప్సన్ను వివాహం చేసుకున్నానని అతను వెల్లడించాడు. ‘లాహోర్లో నిరాడంబరంగా మా వివాహం జరిగింది. నా పిల్లలతో కలిసి ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించింది. ఉర్దూ భాషను కూడా నేర్చుకుంటోంది. అంతకుమించి మా అబ్బాయిలిద్దరితో బాగా కలిసిపోయింది’ అని 47 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్ తెలిపాడు. గత నెలలో 30 ఏళ్ల థాంప్సన్తో పెళ్లి ప్రతిపాదన తేగా ఆమె సమ్మతించినట్లు అక్రమ్ చెప్పాడు. అక్రమ్ మొదటి భార్య హుమా అనారోగ్యంతో 2009లో మృతి చెందింది.