
ఇస్లామాబాద్: పాకిస్తాన్ను యూరప్ కంటే పరిశుభ్రమైన దేశంగా మారుస్తానని పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ప్రకటించారు. దేశంలో పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ప్రచారోద్యమం ‘క్లీన్ అండ్ గ్రీన్ పాకిస్తాన్’ను ఇమ్రాన్ శనివారం ప్రారంభించారు. ‘దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా విద్యార్థులు, యువతను కోరుతున్నా. వచ్చే ఐదేళ్లలో కోటి మొక్కలను నాటి దేశాన్ని యూరప్ కంటే పరిశుభ్రంగా తయారు చేస్తా. ఈ కల నిజం కావాలంటే మన ఆలోచనలు మారాలి’ అని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు, భూతాపాన్ని నివారించేందుకు మొక్కలు నాటాలన్నారు. గ్లోబల్ వార్మింగ్లో పాక్ ప్రపంచంలోనే ఏడో స్థానంలో ఉండగా లాహోర్లో కాలుష్య స్థాయిలు అతి ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం కింద నగరాలతోపాటు పల్లెల్లో, మురికినీటి, పారిశుధ్య వ్యవస్థలను మెరుగు పరుస్తామని ప్రధాని ఇమ్రాన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment