ఆఖరి ఓటు వేసిన అల్లరి నరేష్ | Allari Naresh Cast Their Vote for MAA Elections 2019 | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్

Mar 10 2019 2:54 PM | Updated on Mar 10 2019 2:55 PM

Allari Naresh Cast Their Vote for MAA Elections 2019  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌ ఎన్నికలు (మా) పోలింగ్‌ ముగిసింది. ‘మా’ లో మొత్తం 745 మంది సభ్యులు ఉండగా, కేవలం 472 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ రోజు (ఆదివారం) ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా... హీరో అల్లరి నరేష్‌ ఆఖరిగా ఓటు వేయడంతో పోలింగ్‌ ముగిసింది. రాత్రి 8గంటలకల్లా ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి ‘మా’  ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో సీనియర్‌ నటులు శివాజీరాజా, నరేశ్‌ ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సవాళ్లు.. ప్రతిసవాళ్లు, ఆరోపణలు.. ప్రత్యారోపణలతో పోటాపోటీగా మేనిఫెస్టోలు విడుదల చేశారు.  చదవండి...(‘మా’ హీరో ఎవరు?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement