Naresh (actor)
-
నటుడు నరేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
పద్మ అవార్డు కోసం నిరాహార దీక్ష చేసినా తప్పులేదు: నరేశ్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పద్మ అవార్డులపై సినీ నటుడు నరేశ్ (VK Naresh) సంచలన వ్యాఖ్యలు చేశాడు. 46 సినిమాలను డైరెక్ట్ చేసిన ఏకైక మహిళా దర్శకురాలు విజయ నిర్మల (Vijaya Nirmala) అని, కానీ ఇంతవరకు తనకు పద్మ పురస్కారం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మకు పద్మ అవార్డు రావాలని ఢిల్లీదాకా వెళ్లి ప్రయత్నించాను. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో పద్మ పురస్కారం కోసం అమ్మ పేరును రికమండ్ చేశారు. నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు.పద్మ పురస్కారం కోసం పోరాడతాబీజేపీ వచ్చిన తరువాత నిజంగా ఆ స్థాయి ఉన్న వ్యక్తులకు పురస్కారాలు ఇస్తున్నారు. అందుకు సంతోషంగా ఉంది. ఎంజీఆర్ గారు బతికున్నప్పుడు పద్మ అవార్డు రాలేదు. సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా రాలేదు. మరణానంతరం ఇచ్చే పురస్కారంగా అయినా అమ్మకు పద్మ అవార్డు ఇవ్వాలి. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది అందుకు అర్హత కలిగిన వాళ్లు ఉన్నారు. మన వాళ్లకు పద్మ అవార్డులు వచ్చేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేసినా తప్పులేదు. మళ్లీ ఇప్పటి నుంచి అమ్మకు పద్మ అవార్డు రావడం కోసం ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: దిల్ రాజు కోసం చరణ్ కీలక నిర్ణయం -
మా అమ్మ సినిమాలు చేసేటప్పుడు నేను పడే బాధ: నటుడు నరేష్
-
నా ఫిట్ నెస్ డైట్ సీక్రెట్ ఇదే
-
మా అమ్మకు నన్ను పట్టించుకునే టైం కూడా ఉండేది కాదు
-
మహేష్ బాబు ఏడ్చినప్పుడు నేను ఏడ్చేశా..!
-
పవిత్రతో నా జీవితం ఎలా ఉందంటే?: నరేశ్
తొమ్మిదో ఏట ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు వీకే నరేశ్. పండంటి కాపురం మూవీతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాలు చేసిన అతడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేశాడు. నటుడిగా ఆయన ప్రయాణం మొదలై 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఇటీవలే అతడు ‘ఐఎస్ సీఏహెచ్ఆర్(ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్)’ నుంచి 'సార్’ అనే బిరుదుతోపాటు డాక్టరేట్ని అందుకున్నాడు. సగం మంది విడాకులే వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటూ నటి పవిత్ర లోకేశ్తో కలిసి జీవిస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా పవిత్రతో కొత్త జీవితం ఎలా ఉందని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగాడు. దీనికి నరేశ్ స్పందిస్తూ ముందుగా ఏవేవో లెక్కలు వేశాడు. 'ప్రపంచంలో దాదాపు సగం మంది విడాకులు తీసుకుంటున్నారు. 70% మంది వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. విడిపోయి ఎవరికి వారు సొంతంగా బతుకుతున్నారు. మంచి, చెడ్డ పక్కన పెడితే ఒకరంటే మరొకరికి ఇష్టం ఉండాలి. ముందు సంతోషంగా లేను అలాగే తోడు లేకుండా ఉండలేమా? అంటే 40-50 ఏళ్ల వయసులో కచ్చితంగా తోడు అవసరం. ఈ సమయంలో సరైన భాగస్వామి అవసరం. నాకు ముందు జరిగిన పెళ్లిళ్ల వల్ల సంతోషంగా లేను. అందుకే విడాకులు తీసుకున్నాను. నేను సెలబ్రిటీ కాబట్టి విమర్శలు, వివాదాలు వస్తాయి. అన్నింటితో పోరాడాం, సమస్యలను పరిష్కరించుకున్నాం. ప్రస్తుతం పవిత్రతో నేను సంతోషంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. చదవండి: థియేటర్లో సినిమా చూసి జక్కన్న.. కీరవాణి నిద్రపోతున్నాడా? -
కెరీర్ కోల్పోయా.. డిప్రెషన్, ఆర్థిక ఇబ్బందులు.. నరేశ్ ఎమోషనల్
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు నటుడు నరేశ్. దివంగత నటి, దిగ్గజ దర్శకురాలు విజయనిర్మల వారసుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన ఇతడు తన టాలెంట్తో అంచెలంచెలుగా ఎదిగాడు. ఈయన సినిమా రంగంలో అడుగుపెట్టి 50 ఏళ్లు కావస్తుండగా తన గోల్డెన్ జూబ్లీ సంవత్సరాన్ని నరేశ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే ఐక్యరాజ్య సమతి అనుబంధ సంస్థ అయిన ఐఎస్ సీఏహెచ్ఆర్ (ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్) నుంచి ఆయన సార్ అనే బిరుదుతో పాటు డాక్టరేట్ను అందుకున్నాడు. నాలో స్ఫూర్తిని నింపింది.. అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదం, సామాజిక సమస్యలు వంటి అంశాలపై ప్రసంగించినందుకుగానూ నరేశ్కు ఈ అరుదైన గౌరవం దక్కింది. అంతేకాదు ఇకపై నరేశ్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్ అనే హోదా చేరుతుంది. ఈ సంతోషం నరేశ్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా అతడు తన గోల్డెన్ జూబ్లీ గురించి ఆసక్తికర పోస్ట్ వేశాడు. అలాగే తాను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎంతగానో ఇన్స్పైర్ చేసిన పాటను షేర్ చేశాడు. ఇష్టమైనవాళ్లు వదిలేసి పోయారు.. 'నా జీవితం క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు ఈ పాట నాలో ఎంతగానో స్ఫూర్తిని నింపింది. ఆ సమయంలో నేను కెరీర్ కోల్పోయాను, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఇష్టమైనవాళ్లు శాశ్వతంగా దూరమయ్యారు. బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఓ జోకర్ నాపై పనికిరాని కేసు వేసినప్పటికీ నా తల్లి, స్నేహితుడు విజయ్ మద్వా మాత్రమే నాకు అండగా నిలబడ్డారు. సుమారు 100 కిలోల దాకా బరువు ఉండే నేను ఇప్పుడిలా మారిపోయాను. ఈ పాట నాలో స్ఫూర్తిని నింపడమే కాదు, నేను శక్తివంతంగా కమ్బ్యాక్ ఇచ్చేలా చేసింది. డిప్రెషన్లో అప్పుడలా.. ఇప్పుడిలా.. నేనిప్పుడు సినీప్రయాణంలో 50వ సంవత్సరంలో ఉన్నాను. ఈ మైలురాయిని అందుకోవడంతో తోడ్పడిన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు' అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు. ప్రియురాలు పవిత్ర లోకేశ్తో కలిసి విహారయాత్రకు వెళ్లిన వీడియోలను సైతం సదరు పోస్ట్లో పొందుపరిచాడు. అలాగే 2003లో డిప్రెషన్లో ఉన్నప్పుడు తాను ఎలా ఉన్నాను? 2023లో గోల్డెన్ జూబ్లీ వచ్చినప్పుడు ఎలా ఉన్నానో తెలియజేస్తూ అప్పటి, ఇప్పటి ఫోటోలను పక్కపక్కన పెట్టాడు నరేశ్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది. This one song, inspired me during the toughest period of my life, losing my career, facing financial strain, and the departure of supposed loved ones. Despite heckling from relatives and being labeled a 'fome case' and a joker, only my Mother and friend Vijay Wadhwa stood by… pic.twitter.com/GXRqneF0CS — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) November 29, 2023 చదవండి: సినిమాలకు హీరోయిన్ ఇలియానా గుడ్బై? -
నటుడు నరేశ్కు దక్కిన అరుదైన గౌరవం.. లెఫ్టినెంట్ కల్నల్గా గుర్తింపు
సీనియర్ నటుడు నరేశ్కు అరుదైన గౌరవం దక్కింది. సుమారు 300 చిత్రాలలో నటించిన నరేశ్ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఆయనలో మంచి వక్త కూడా ఉన్నారు. ప్రపంచ సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు, తదితర అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై ఆయన ఇప్పటికే ప్రసంగించారు. అందుకు గుర్తింపుగా 'సార్' అనే బిరుదుతోపాటు 'డాక్టరేట్'ని అందుకున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ నుంచి ఆయనకు ఈ గుర్తింపు దక్కింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాల్లో నటుడు నరేశ్కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ సంస్థతోపాటు ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్) కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించాయి. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా, తదితర దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేశ్కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్ గుడ్విల్ అంబాసిడర్తో పాటు లెఫ్టినెంట్ కల్నల్గా నరేశ్ను నియమించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. దీంతో ఇక నుంచి నరేశ్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. అంతర్జాతీయ ఉగ్రవాదం అంశంపై ఆయన ప్రసంగాలకు తగిన గుర్తింపు లభించింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ (ఎన్ఏఎస్డీపీ), ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్) ఓ కార్యక్రమంలో నరేశ్కు 'సర్' బిరుదును ప్రదానం చేశాయి. ఫిలిప్పీన్స్ లోని మనీలా నగరంలో జరిగిన 5వ వరల్డ్ కాంగ్రెస్ సమావేశంలో ఈ బిరుదును అందించారు. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా, తదితర దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా. ఇక నుంచి నరేశ్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. దేశంలో ఇలాంటి గౌరవాలు అందుకున్న తొలి నటుడిగా నరేశ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఉగ్రవాదంపై ఆయన చేసిన ప్రసంగాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయని ఈ కార్యక్రమంలో ప్రముఖులు తెలిపారు. ఉగ్రవాదాన్ని అరికట్టడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశాల ఉద్దేశాన్ని ఓ దౌత్యవేత్తగా, కళాకారుడిగా ప్రజల్లోకి తీసుకెళతానని నరేశ్ ఈ సందర్భంగా తెలిపారు. తన ఉపన్యాసాలకు గుర్తింపుగా 'సర్' బిరుదును ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
నెల రోజుల్లోపే ఓటీటీకి సంపూర్ణేశ్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఈ మూవీ నెల రోజులు కాకముందే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన మార్టిన్ లూథర్ కింగ్ త్వరలోనే ఓటీటీలో అలరించనుంది. నవంబర్ 17న లేదా 24న ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఓటీటీ రిలీజ్ డేట్పై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ఈ మూవీ సోనీ లివ్లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. కాగా.. తమిళంలో విజయవంతమైన మండేలా మూవీకి రీమేక్గా మార్టిన్ లూథర్ కింగ్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో డైరెక్టర్ వెంకటేష్ మహా కీలక పాత్ర పోషించారు. అసలు కథేంటంటే.. 'మార్టిన్ లూథర్ కింగ్' ఒక స్థానిక చెప్పులు కుట్టే వ్యక్తి యొక్క కథ. అతను నివసించే గ్రామంలో ఎన్నికలు వస్తాయి. ఇద్దరు ప్రత్యర్థులు ఎలాగైనా గెలవాలని పోటీ పడతారు. అయితే ఆ ఎన్నికలలో అతని ఓటు, గెలుపుని నిర్ణయించే ఓటు కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం మలుపు తిరుగుతుంది. -
నా కుమారుడు అంతర్జాతీయ అవార్డు గెలిచాడు: నరేశ్
సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయకృష్ణ మొదట్లో నటుడిగా సినిమాల్లో కనిపించాడు. కానీ తర్వాత ఉన్నట్లుండి వెండితెరపై మాయమయ్యాడు. చాలాకాలం తర్వాత అతడు మళ్లీ సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులు వేశాడు. అయితే ఈసారి నటుడిగా కాకుండా దర్శకుడిగా తెర వెనకనుంచి పని చేశాడు. సత్య అనే షార్ట్ ఫిలిం తెరకెక్కించాడు. ఈ లఘు చిత్రంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా నటించారు. ఇటీవల ఈ షార్ట్ ఫిలిం నుంచి సోల్ ఆఫ్ సత్య పేరిట సాంగ్ రిలీజైంది. సుమారు ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ పాట సూపర్ హిట్గా నిలిచింది. అయితే ఈ షార్ట్ ఫిలిం తాజాగా అరుదైన ఘనత అందుకుంది. న్యూయార్క్లో అంతర్జాతీయ ఒనిరోస్ ఫిలిం అవార్డ్స్ వేదికపై ఈ లఘుచిత్రాన్ని ప్రదర్శించగా రెండు అవార్డులను సాధించింది. ఉత్తమ తొలి పరిచయ దర్శకుడిగా నవీన్ విజయకృష్ణ అవార్డు గెలుచుకున్నాడు. అలాగే సత్య షార్ట్ ఫిలింకు హానరబుల్ మెన్షన్ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించింది. మీ ఆశీర్వాదాలు కావాలి 'సాయిధరమ్ తేజ్ తదితరులు నటించిన సోల్ ఆఫ్ సత్య సినిమా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒనిరోస్ అవార్డు వేదికలో సత్తా చాటింది. ఈ షార్ట్ ఫిలింకు గానూ నా తనయుడు నవీన్ బెస్ట్ ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అవార్డు గెలిచాడు. మా కుటుంబంలో నాలుగోతరం నుంచి వచ్చి తన అభిరుచిని కొనసాగించాలనుకుంటున్న ఈ యువ దర్శకుడికి మీ ఆశీర్వాదాలు కావాలి. ఈ షార్ట్ ఫిలింను హిందీలో కూడా అందిస్తున్నాం. సమయం దొరికినప్పుడు చూసేయండి. థాంక్యూ సో మచ్' అని నవీన్ తండ్రి నరేశ్ ట్వీట్ చేశాడు. అప్పుడు హీరోగా, ఇప్పుడు దర్శకుడిగా.. కాగా 2016లో ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాతో నవీన్ విజయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరవాత ‘ఊరంతా అనుకుంటున్నారు’, ‘రెండు జెళ్ల సీత’ అనే సినిమాలు చేశాడు. కానీ, పెద్దగా వర్కవుట్ కాలేదు. హీరోగా రాణించలేకపోయిన నవీన్ చాలాకాలం సినిమాలకు దూరమయ్యాడు. బరువు కూడా భారీగా పెరిగాడు. చాలాకాలం తర్వాత ‘సత్య’ సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. Shubodayam! 🙏🏻 I’m delighted to share that my son, Nawin, has won the award for Best First-Time Director for his film “SOUL OF SATHYA,” featuring Sai Dharam Tej and others, at the prestigious international “ONIROS AWARDS.” We humbly request your best wishes and blessings for… pic.twitter.com/Sf9EgHVBe4 — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) November 8, 2023 Our little baby #Satya starts its journey with a bang! 💥 We are proud to announce that our super cool Director @NawinVK has won the Best 1st Time Director award at the @OnirosFilmAward - New York 😍 & Also happy to receive the Honorable Mention award for #Satya 🇮🇳 pic.twitter.com/ONqgSUC82K — Dil Raju Productions (@DilRajuProdctns) November 7, 2023 చదవండి: తల్లిని చూసి చంటిపిల్లాడిలా ఏడ్చేసిన గౌతమ్.. అమ్మ ప్రేమ గుర్తొచ్చి ప్రిన్స్ కంటతడి.. -
నరేష్ గారితో నటించాలంటే ఏదోలా ఉంది: వెంకటేష్ మహా
-
ఓటు విలువ చెప్పే సినిమా..అందరూ తప్పక చూడండి
-
విజయనిర్మల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నవీన్
చిత్రసీమలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించారు విజయనిర్మల. ఒక మహిళ దర్శకురాలిగా 44 సినిమాలు తీసి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకున్నారు. అలా ఆమె ఎనలేని ఘనతలతో పాటు కొన్ని వేల కోట్లకు అధిపతి కూడా అయ్యారు. 2019 జూన్లో విజయనిర్మల కన్నుమూయగా భర్త సూపర్ స్టార్ కృష్ణ కూడా 2022లో మరణించారు. వారు సంపాదించిన ఆస్తి ఎవరి సొంతం అనే ప్రశ్నలు చాలామందిలో మెదిలాయి. తాజాగ ఇదే విషయంపై విజయనిర్మల మనుమడు అయిన నటుడు నవీన్ స్పందించాడు. నరేష్ మొదటి భార్య కుమారుడే ఈ నవీన్ అనే సంగతి తెలిసిందే. 'విజయనిర్మలకు సంబంధించిన ఆస్తులలో సగ భాగం నాకు రాయాలని నాన్నను (నరేష్) కోరింది. అందుకు సరిపడా వీలునామను కూడా రాపించాలని నానమ్మ కోరింది. ఆస్తిలో మిగిలన సగభాగం నాన్నకు అని చెప్పేవారు. అప్పుడు ఆస్తి గురించి నేను పెద్దగా పట్టించుకునే వాడిని కాను. కొద్దిరోజుల తర్వాత ఆస్తి విషయంలో నేను, నాన్న ఇద్దరం ఒక అవగాహనకు వచ్చాం. ప్రస్తుతం ఈ ఆస్తికి నాన్నే బాస్.. ఆయన యాక్టివ్గా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఎటూ ఈ ఆస్తికి వారసుడివే నువ్వే కదా అని నాన్న అన్నారు. ప్రస్తుత సమయంలో అస్తి వివరాలపై అంతగా నాకు అవగాహన లేదు. నాన్న పర్యవేక్షణలో ఉండటమే మంచిదని నేను కూడా అనుకున్నాను. అస్తి విషయంలో మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు.. ఉండదు కూడా ఇందులో ఏ ఒక్కరూపాయి నేను సంపాధించలేదు. నానమ్మ ఆస్తికి మేము గార్డియన్స్ మాత్రమే. నాన్న తర్వాత నాకు ఆస్తిని అప్పజెప్పుతే అది ఎటూ పోకుండా కాపాడటం నా డ్యూటీ. నా తమ్ముళ్లు, తేజ, రణ్వీర్ ఇద్దరూ నాకు ఇష్టమే. కానీ తేజ అంటే నాకు ప్రాణం. వాడంటే నాకు ఎనలేని ఇష్టం.. నేనన్నా కూడా వాడికి అంతే. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది.' అని నవీన్ తెలిపాడు. తేజ నరేశ్ రెండో భార్య కుమారుడు కాగా రణ్వీర్ మాత్రం మూడో భార్య రమ్య రఘుపతి కుమారుడు అని తెలిసిందే. టాలీవుడ్లో నందిని నర్సింగ్ హోమ్ సినిమాతో నవీన్ పాపులర్ అయ్యాడు. తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తనకు వచ్చే సంపాదనతో అతను ఇన్నిరోజులు ఒక ప్లాట్ను అద్దెకు తీసుకుని ఉన్నాడు. కానీ కుటుంబసభ్యులందరితో మంచి రిలిషన్షిప్ కొనసాగించేవాడు. విజయనిర్మల మరణించిన తర్వాత ప్రస్తుతం ఆ ఇంట్లోకి నవీన్ షిఫ్ట్ అయ్యాడు. కానీ ఇది తాత్కాలికమేనని నవీన్ తెలిపాడు. తనకు చెందిన ప్లాట్లో ఉండటమే ఇష్టమంటూ త్వరలో అక్కడికే షిఫ్ట్ అవుతానని ఆయన పేర్కొన్నాడు. తన తండ్రి నరేశ్ అంటే ఎంతో గౌరవం అని నవీన్ తెలిపాడు. (ఇదీ చదవండి; డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్కుమార్కు నోటీసులు) -
నరేశ్-పవిత్ర ప్రేమాయణం.. ఫస్ట్ నుంచీ ఇదే జరుగుతుంది!
సీనియర్ నటుడు నరేశ్ కొంతకాలంగా తన వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. మూడో భార్య రమ్య రఘుపతితో విబేధాలు, పవిత్ర లోకేశ్తో ప్రేమాయణం.. ఆపై కోర్టు కేసులు ఇలా వీటితోనే సెన్సేషనల్ అవుతూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే అతడి మొదటి భార్య తనయుడు నవీన్ మొదట్లో నటుడిగా కనిపించి సత్య అనే షార్ట్ ఫిలింతో దర్శకుడిగా మారాడు. తాజాగా అతడు తన తండ్రి గురించి మాట్లాడుతూ.. 'మా ఫ్యామిలీలో ఎవరికి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తారు. ఎవరి మీదా ఆధారపడరు. మొదటి నుంచీ అదే జరుగుతుంది. ఈ క్రమంలో కొన్ని తప్పులు జరిగాయి. కానీ ఎవరి గురించి నేను చెడుగా ఫీలవలేదు. జనాలు మా కుటుంబం గురించి ఏది పడితే అది వాగినా నేను పట్టించుకోలేదు. జనాలకు నచ్చినట్లు బతకలేం కదా.. నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తాను. అతడు సంతోషంగా ఉన్నాడా? లేదా? అనేదే మాకు కావాల్సింది! బయట ఎవరేమనుకున్నా ఆయన పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతాడు. ఇది ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయం. పవిత్ర లోకేశ్ నాకు ఎప్పటినుంచో తెలుసు. చాలా మంచావిడ. నేను ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నానంటే ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తనతో మాట్లాడుతూ ఉంటాను. తనను పవిత్రగారు అని పిలుస్తుంటాను' అని నవీన్ చెప్పుకొచ్చాడు. చదవండి: మిస్టర్ ప్రెగ్నెంట్.. డెలివరీ అదిరిపోయింది.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే? -
మా అమ్మ, నానమ్మ ఎన్నో కష్టాలు పడ్డారు: నరేశ్ తనయుడు
మెగా హీరో సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి జంటగా నటించిన లఘు చిత్రం సత్య. ఈ చిత్రానికి సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయకృష్ణ దర్శకత్వం వహించాడు. మంగళవారం ఈ సినిమా నుంచి సోల్ ఆఫ్ సత్య అనే పాట విడుదల చేశారు. ఈ సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో నవీన్ విజయకృష్ణ మాట్లాడుతూ.. 'మూడు సంవత్సరాల క్రితం.. ఈ స్టేజీ ఎక్కుతానో, లేదో అని డౌట్లో ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆ సంవత్సరం జీవితంలో చాలా కోల్పోయాను. అక్కడి నుంచి మళ్లీ ఇక్కడివరకు వచ్చాను. నేను మీ అందరి కామెంట్లు చదివాను. ఇంత లావయ్యి మీ ముందుకు తిరిగి వచ్చాను. జీవితంలో ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. నానమ్మ విజయనిర్మల, అమ్మ నేత్ర.. వీళ్లిద్దరూ నేనెప్పుడూ మంచి స్థాయిలో చూడాలనుకున్నాను. కానీ వాళ్లు బతికుండగా అది నెరవేర్చలేకపోయాను. అందుకే వెనక్కు వెళ్లకుండా మళ్లీ తిరిగి వచ్చాను. సత్య సినిమాతో కమ్బ్యాక్ ఇస్తున్నాను. నాకు మా నానమ్మే ఇన్స్పిరేషన్. తను యాక్టింగ్, డైరెక్షన్, స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ చూసుకునేది. తను సినిమాలు చేసేటప్పుడు నేను సెట్స్లో ఉండేవాడిని. అవన్నీ చూసి నాకు డైరెక్టర్ అవ్వాలనిపించేది. కానీ తనకు మాత్రం నేను నటుడినవ్వాలని కోరుకుంది. అందుకే తనకోసం నటుడిగా ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు డైరెక్టర్గా మారాను. సత్య సినిమా విషయానికి వస్తే జీవితంలో అందరికీ కష్టాలుంటాయి. మా అమ్మ, నానమ్మ కూడా ఎన్నో కష్టాలు పడ్డవారే! వాళ్లు ఫైటర్స్! వీరిద్దరూ నాకెప్పటికీ ఆదర్శం' అని చెప్పుకొచ్చాడు నవీన్ విజయకృష్ణ. చదవండి: సర్జరీ.. చిరంజీవి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే? -
పరీక్షా ఫలితాలు విడుదల.. పవిత్రా లోకేష్ రిజల్ట్ ఏంటంటే
నరేశ్-పవిత్రా లోకేష్ల జంట మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్గా మారింది. వీరిద్దరు కలిసి గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి రిలేషన్షిప్ గురించి పక్కన పెడితే. తాజాగా పవిత్రా లోకేష్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. రీసెంట్గా కన్నడ యూనివర్సిటీ పీహెచ్డీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. అందులో పవిత్రా లోకేష్ సహా 259 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. (ఇదీ చదవండి; క్లీంకార గురించి చిరంజీవి చెప్పిందే నిజం అయిందా.. కలిసొచ్చిన వేల కోట్లు) కన్నడ విశ్వవిద్యాలయంలో సైన్స్ ఇన్స్టిట్యూట్తో పాటు, భాషా ఇన్స్టిట్యూట్, సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూట్, లలిత ఆర్ట్ ఇన్స్టిట్యూట్లు వివిధ విభాగాల కింద పరిశోధన అందించబడుతుంది. ఇందులోని మూడు సంస్థలలో పీహెచ్డీ చేసేందుకు 981 మంది ఎంట్రన్స్ పరీక్ష రాశారు. కానీ 259 మంది అభ్యర్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారని కన్నడ యూనివర్సిటీ ఛాన్సలర్ సుబ్బన్న రాయ్ తెలిపారు. (ఇదీ చదవండి: బాధలో ఉన్నాం.. దయచేసి ఇలాంటి పని చేయకండి: నటి) కన్నడ విశ్వవిద్యాలయంలోని అధ్యయన విభాగంలో అందుబాటులో ఉన్న సీట్లను మెరిట్ ఆధారంగా ఫిల్ చేస్తామని ఆయన తెలిపారు. పవిత్రకు తన మాతృభాష అయిన కన్నడలో పీహెచ్డీ చేయాలని కోరిక ఉండేదని గతంలో చెప్పేది. అందులో భాగంగా భాషా నికాయ ఆధ్వర్యంలో బెల్గాం ఎక్స్టెన్షన్ సెంటర్లో పరిశోధన చేసేందుకు పవిత్రా లోకేష్ పరీక్ష రాశారు. మే 30న ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆ సమయంలో తన వెంట నరేష్ కూడా వెళ్లారు. తాజాగ విడుదలైన ఫలితాలతో ఆమె సంతోషంగా ఉన్నా అక్కడి యూనివర్సిటీలో సీట్ వచ్చే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. -
ఎలాంటి నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: నరేష్
'మళ్లీ పెళ్లి' సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లిన నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. మెరిట్ లేని కారణంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ బెంగళూరు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మళ్ళీ పెళ్లి(తెలుగు), మట్టే మదువే (కన్నడ) చిత్రాన్ని థియేటర్లు, ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ప్రసారం చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. అంతేకాకుండా నరేష్ ఇంట్లోకి రమ్య రఘుపతికి అనుమతి లేదని కూడా కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ మీడియా సంస్ధతో ఆయన ఇలా మాట్లాడారు. (ఇదీ చదవండి: ఓటీటీలో 'బేబి' ప్రయోగం.. ఆ సీన్లను కలిపేందుకు ప్లాన్) 'ఆమెకు (రమ్య రఘుపతి) చాలా అప్పులు ఉన్నాయి, అప్పులు వసూలు చేసేవారు మా ఇంటికి వస్తున్నారు. ఇది మా కుటుంబంలోని సభ్యులకు (తల్లి వైపు) కూడా ఇబ్బందిగా ఉంది. అందువల్ల మేము కోర్టు రక్షణను కోరాము. ఇప్పుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించకూడదని బెంగళూరు కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.' అని నరేష్ తెలిపారు. అంతే కాకుండా నరేష్, రమ్య ఇద్దరూ విడిగా ఉన్నారనే విషయాన్ని కూడా ఆర్డర్ కాపీలో కోర్టు పేర్కొందని ఆయన తెలిపారు. గత 6 సంవత్సరాలుగా తామిద్దరం కలిసి జీవించడం లేదని కోర్టు కూడా నిర్ధారించిందని పేర్కొన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పు తమ విడాకులకు మార్గం సుగమం అయిందన్నారు. అందుకు సంబంధించి తాను ఇప్పటికే కూకట్పల్లి కోర్టులో విడాకుల కోసం పిటీషన్ దాఖలు చేసినట్లు తెలిపిన నరేష్ ఈ తీర్పు ఎంతగానో సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఇది రాకేశ్ మాస్టర్ విగ్రహమా? పుల్లయ్యలా ఉందంటూ విమర్శలు) ఈ ఏడాది ప్రారంభంలో రమ్య నుంచి విడాకుల కోరుతూ కూకట్పల్లి కోర్టులో తమ వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి తన చుట్టు ఎన్నో వివాదాలు వచ్చాయని నరేష్ ఇలా తెలిపారు. 'నేను, పవిత్ర లోకేష్తో కలిసి వుండటాన్ని కొంతమంది పలు రకాలుగా మాట్లాడుకున్నారు. నా వ్యక్తిగత జీవితం గురించి చాలామంది ఊహాగానాలు చేస్తుంటే, నేను ఎలాంటి నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఇకనుంచి అయినా నేను ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను కాబట్టి ఈ కేసు వల్ల విడాకుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను.' అని నరేష్ అన్నారు. -
ఇకపై నరేశ్ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. కోర్టు తీర్పు
మళ్లీ పెళ్లి సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లిన నటుడు నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతికి షాక్ తగిలింది. మెరిట్ లేని కారణంగా బుధవారం నాడు కేసు కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మళ్ళీ పెళ్లి(తెలుగు), మట్టే మదువే (కన్నడ) చిత్రాన్ని థియేటర్లు, ఓటీటీ ప్లాట్ఫామ్లలో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ రమ్య రఘుపతి బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టులో ఇంజక్షన్ దావా వేశింది. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం.. రమ్య రఘుపతి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మెరిట్లు లేని కారణంగా కొట్టివేసింది. సినిమాను అడ్డుకునే ప్రసక్తే లేదు సినిమాల విడుదలకు వ్యతిరేకంగా రమ్యరఘుపతి కేసు దాఖలు చేసిన కారణాలను న్యాయస్థానం సమర్థించలేనిదని, న్యాయపరంగా నిలకడగా లేదని కోర్టు పేర్కొంది. బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా.. సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని న్యాయస్థానం నిర్ధారించింది. సెన్సార్ బోర్డ్ సినిమా కల్పితమని సర్టిఫై చేసిన తర్వాత సినిమా విడుదలను ప్రైవేట్ వ్యక్తి అడ్డుకునే ప్రసక్తే లేదని తెలిపింది. ఈ తీర్పు ప్రకారం సినిమాను ఎక్కడైనా నిర్మాతలు స్వేచ్ఛగా ప్రసారం చేయవచ్చు. నరేశ్ ఇంట్లో ప్రవేశానికి రమ్యపై నిషేధం మరో కేసులో నరేష్ కుటుంబ సభ్యులు.. రమ్య రఘుపతిని నరేష్ నానక్రామ్గూడ ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ వేసిన ఇంజక్షన్ దావాను కోర్టు స్వీకరించింది. నరేష్, అతని కుటుంబం అందించిన సాక్ష్యాల ప్రకారం రమ్య రఘుపతి అక్కడి ప్రాపర్టీని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందని గుర్తించింది. ఆమె కోసం వస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల వల్ల అక్కడ నివసించే సీనియర్ సిటిజన్స్, నరేష్ అసౌకర్యంతో పాటు అందోళనకు గురవుతున్నారని కూడా పేర్కొంది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు రమ్య రఘుపతిని నరేష్ ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 6 సంవత్సరాలుగా విడివిడిగా జీవనం ఇకపోతే నరేష్, రమ్య రఘుపతి 6 సంవత్సరాలుగా కలిసి జీవించడం లేదని కోర్టు నిర్ధారించింది. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం భార్యాభర్తలు 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండకపోతే వివాహం రద్దవుతుంది. కోర్టు ఇచ్చిన తీర్పు.. నరేష్, రమ్యల విడాకులకు మార్గం సుగమం చేసింది. కాగా రమ్య రఘుపతి.. నరేష్పై గృహ హింస కేసు, నరేష్, పవిత్ర లోకేష్ పై ఇతర కేసు వేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత నరేష్, ఆయన కుటుంబ సభ్యులు .. రమ్య రఘుపతిపై గృహ నిషేధం కేసు పెట్టారు. రమ్య రఘుపతిపై సైబర్ మాల్వేర్, సైబర్ ఎటాక్కు సంబంధించి సైబర్ క్రైమ్ కేసు పెండింగ్లో ఉంది. చదవండి: రామ్చరణ్ కూతురికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ -
తుపాకీ లైసెన్స్ కావాలంటున్న నటుడు నరేశ్
సాక్షి, శ్రీ సత్యసాయి: సీనియర్ నటుడు నరేశ్ తుపాకీ లైసెన్స్ కావాలంటున్నాడు. ఈ మేరకు గురువారం నాడు పుట్టపర్తి ఎస్పీ మాధవరెడ్డిని కలిసి తనకు తుపాకీ లైసెన్స్ ఇవ్వాలని కోరాడు. స్వీయరక్షణ కోసమే అతడు తుపాకీ లైసెన్స్ కోసం అభ్యర్థించినట్లు తెలుస్తోంది. కాగా నరేశ్ హీరోగా నటించిన మళ్లీ పెళ్లి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. పవిత్రా లోకేశ్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఎంఎస్ రాజు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా జూన్ 24న ఆహా, అమెజాన్ ప్రైమ్లో రిలీజైంది. కాగా ఈ సినిమాపై నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే! తనను టార్గెట్ చేస్తూ పరువు తీసేందుకే మేకర్స్ సినిమాను నిర్మించారని మండిపడింది. సృజనాత్మక భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో వాస్తవాన్ని పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆ మధ్య కోర్టుకు వెళ్లింది. ఈ సినిమా వల్ల తన గౌరవం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: 2016 నుంచి పిల్లల కోసం ట్రై చేస్తూనే ఉన్నాం: నటి -
ఆడియన్స్ కి నన్ను చూసి బోర్ కొడితే?
-
నరేష్ తో యాక్టింగ్ అనగానే నా గుండె ఆగిపోయింది
-
జగన్ పాలనపై పోసాని
-
ఆ ఓటీటీలోకే రానున్న 'మళ్లీ పెళ్లి'
సీనియర్ నటుడు నరేశ్ హీరోగా నటించి నిర్మించిన చిత్రం మళ్లీ పెళ్లి. నరేశ్ ప్రేయసి, నటి పవిత్రా లోకేశ్ హీరోయిన్గా నటించింది. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించాడు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై వీరలెవల్లో ప్రమోషన్స్ చేసినప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్ అంతంతమాత్రంగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చాలామంది ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? ఏ ఓటీటీలోకి రాబోతోందని ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం మళ్లీ పెళ్లి సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు వచ్చే ఆదరణ బట్టి ఎప్పుడు ఓటీటీలోకి తీసుకురావాలన్నది మేకర్స్ డిసైడ్ చేయనున్నారు. ఎంతకాదన్నా నెల రోజుల్లో మళ్లీ పెళ్లి ఓటీటీలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య పెద్ద సినిమాలు కూడా వెంటనే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా వీలైనంత తొందరగానే ఓటీటీలో ప్రత్యక్షమయ్యే ఛాన్స్ ఉంది. మళ్లీ పెళ్లి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మళ్లీ పెళ్లి ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన నరేశ్ మూడో భార్య
సీనియర్ నటుడు నరేశ్, అతడి ప్రేయసి, నటి పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ సినిమా నుంచి లిప్ లాక్ వీడియో రిలీజ్ చేసినప్పటి నుంచి ఇదొక సెన్సేషన్గా మారింది. కారణం.. నరేశ్ నిజ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ సినిమాలో ఉండటమే! ఇందులో అతడి మూడు పెళ్లిళ్లు, పవిత్రతో ప్రేమాయణం.. హోటల్లో పట్టుబడ్డ సీన్.. ఇలా అన్నీ ఉన్నాయి. పైగా ప్రమోషన్స్లోనూ పవిత్రతో రొమాన్స్ చేయడం, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడం విశేషం. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నరేశ్ నిర్మిస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా శుక్రవారం (మే 26న) విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి. మళ్లీ పెళ్లి సినిమా తన ప్రతిష్టను కించపరిచేలా ఉందని, ఈ సినిమా విడుదల ఆపాలంటూ పిటిషన్ వేసింది. దీంతో మళ్లీ పెళ్లి సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది. చదవండి: తెలుగు ఇండస్ట్రీని చులకన చేస్తే ఊరుకోను: డైరెక్టర్ మాస్ వార్నింగ్ -
ఆస్తి కోసమే పవిత్రా లోకేష్ నరేష్తో ప్రేమాయణం నడుపుతుందా? ఆమె చెప్పిందిదే..
టాలీవుడ్లో నరేష్, పవిత్రా లోకేష్ ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈ జంట గురించి పలు ట్రోల్స్, మీమ్స్ వచ్చినా సరే డోంట్ కేర్ అంటూ ఇద్దరూ కలిసే ఉంటున్నారు,త్వరలోనే తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకుంటామని ప్రకటించారు. అయితే ఇప్పటికే మూడు పెళ్లిళ్లు పెటాకులు చేసుకున్న నరేష్తో పవిత్రా లోకేశ్ కేవలం డబ్బు కోసమే కలిసుంటుందని, అందుకే ప్రేమాయణం సాగిస్తుందంటూ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా నరేష్ తన ఆస్తుల గురించి క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అవును, నేను బిలినియర్ని. నాకు వెయ్యికోట్ల కంటే ఎక్కువగానే ఆస్తి ఉంది. అందులో వారసత్వంగా వచ్చింది కొంత ఉంటే, నేను కష్టపడి సంపాదించుకుంది కూడా ఉంది. భూముల ధరలు బాగా పెరగడంతో నా ఆస్తుల విలువ రూ. 1000కోట్లు కాదు అంతకు మించి కూడా ఉండొచ్చు. నేనెప్పుడూ ఆ లెక్క చూసుకోలేదు. అందులో బ్లాక్ మనీ లేదు. మొత్తం వైట్ మనీనే. ఎక్కడైనా, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. చాలా గౌరవప్రదంగా నేను నా రాజ్యాన్ని స్థాపించుకున్నాను. నేను నమ్మేది ఒక్కటే.. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం సంతోషంగా ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్లని సంతోషంగా చూసుకోవాలి. ఇక నా డబ్బు చూసి పవిత్ర నాతో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి నాతో డబ్బు లేదని వెళ్లిపోయినవాళ్లు ఉన్నారు. ఆస్తి కోసమే నా జీవితంలో వచ్చినవాళ్లూ ఉన్నారు.. కానీ మాది పవిత్రబంధం' అంటూ చెప్పుకొచ్చారు. ఇక నరేష్తో రిలేషన్పై పవిత్ర కూడా.. 'అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి చాలారోజుల వరకు నాకు తెలియదు. ఇప్పటికే మాకు పెళ్లి అయిపోయిందనే ఫీలింగ్ ఉంది. ఆయన నన్ను కాకుండా ఇంకెవరినీ చూడరు. చివరి వరకు మా బంధం ఇలాగే నిలుస్తుంది' అంటూ పేర్కొన్నారు. -
మా బంధానికి మహేశ్ ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు : నరేష్
సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. కొన్నాళ్లుగా వీరి వ్యవహారం టాలీవుడ్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ హాట్టాపిక్గా మారింది. ఇప్పటికే నరేష్కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. దీనికి తోడు పవిత్రతో సుమారు 20 ఏళ్ల తేడా ఉంటుంది. మొన్నటిదాకా మేం స్నేహితులమే అని చెప్పిన నరేష్-పవిత్రా లోకేశ్ ఇప్పుడు మాత్రం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. పైకి మాత్రం అది మా స్టోరీ కాదంటూనే వారి నిజజీవితంలో జరిగిన సంఘటను ఆధారంగా చేసుకొని 'మళ్లీ పెళ్లి' అనే సినిమాను రూపొందించారు. ట్రైలర్తో సినిమాపై అంచనాలను పెంచేసిన నరేష్-పవిత్ర ప్రమోషన్స్ కోసంరెచ్చిపోయారు. ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేశారు. ఈనెల 26న సినిమా రిలీజ్ కానుండటంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాకు కావాల్సినంత కంటెంట్,పుటేజీ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఓ యాంకర్.. మీ ప్రేమని మహేశ్ బాబు కుటుంబం ఒప్పుకుందా అని నరేష్ని అడగ్గా.. తమ బంధం గురించి మహేశ్బాబుతో పాటు కృష్ణగారికి ముందే తెలుసని పేర్కొన్నారు. 'కృష్ణ గారు, విజయ నిర్మల గారు, మహేశ్ కుటుంబం మేమంతా ఒక్కటే. మేం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరం కలిసే తీసుకుంటాం. మా రిలేషన్ గురించి వాళ్లకు ఎప్పట్నుంచో తెలుసు. ఫ్యామిలీ నుంచి మాకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. మా ప్రేమని ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. మహేశ్కు పవిత్ర అంటే కూడా గౌరవం. ఆమె వంటను కూడా ఎంతో ఇష్టపడతారు' అంటూ నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. -
త్వరలోనే పవిత్రా లోకేశ్ను పెళ్లి చేసుకుంటా: నరేష్
సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే.కొన్నాళ్లుగా ఈ జంట పేర్లు సోషల్మీడియలో తెగ ట్రెండింగ్లో ఉన్నాయి. గతంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్కు షాక్ ఇచ్చిన ఈ జంట అదంతా సినిమా కోసమంటూ ట్విస్ట్ ఇచ్చారు. వీరిద్దరు జంటగా నటిస్తున్న సినిమా మళ్లీ పెళ్లి. పైకి మాత్రం అది మా స్టోరీ కాదంటూనే నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు నరేశ్. ట్రైలర్తో సినిమాపై అంచనాలను పెంచేసిన నరేష్-పవిత్ర ప్రమోషన్స్ కోసం మళ్లీ రెచ్చిపోయారు. ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం అంటూ ఇటీవలె ముద్దులతో స్టేజ్పై రెచ్చిపోయిన నరేష్ తాజాగా కర్ణాటకలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి అభిప్రాయాలు, మనసు కలవడంతో కలిసి ఉంటున్నామని, అందరి ఆశీస్సులతో త్వరలోనే పవిత్రను పెళ్లి చేసుకుంటా అంటూ నరేష్ తెలిపాడు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'నిజానికి పెళ్లి అన్నది కశ్చితంగా అవసరం కాదు. చాలామంది ఇష్టం లేకపోయినా, సోసైటీ కోసం పెళ్లి బంధంలో ఉంటున్నారు. అలాంటి వాళ్లందరికోసమే మళ్లీ పెళ్లి సినిమా. ఇది మా బయోపిక్ కాదు. పవిత్రకు నాకు ఇంకా పెళ్లి కాలేదు..కానీ త్వరలోనే చేసుకుంటా' అంటూ నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. -
కృష్ణ,విజయనిర్మల నటించిన సినిమానే మళ్ళీ పెళ్లి..నరేష్ షాకింగ్ కామెంట్స్
-
ఇండియాలోనే నరేష్ బెస్ట్ యాక్టర్
-
డర్టీ హరి చూసి ఆయనకు ఫ్యాన్ అయిపోయా: నరేశ్
సీనియర్ నటుడు నరేశ్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ను గురువారం విడుదల చేశారు. నరేశ్ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'అమ్మకు గుడి కట్టడంతో నా పని అయిపోలేదు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే విజయకృష్ణ మూవీస్ను రీ లాంఛ్ చేశాను. ఎంఎస్ రాజు డైరెక్ట్ చేసిన డర్టీ హరి చూసి ఫ్యాన్ అయిపోయాను. మూడేళ్ల నుంచి రాజుగారితో ప్రయాణిస్తున్నాను. టీజర్, ట్రైలర్లో కంటే సినిమాలో ఇంకా మంచి కంటెంట్ ఉంది. అమ్మానాన్న కృష్ణ, విజయ నిర్మల కాంబినేషన్లో వచ్చిన మళ్లీ పెళ్లి సినిమా టైటిల్నే మా సినిమాకు వాడుకున్నాం' అన్నాడు నరేశ్. నటి పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ.. 'నటీనటులను పాంపర్ చేసే దర్శకుడు ఎంఎస్ రాజు. ఆయన ఒక అన్నగా నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. సినిమాలో నా పాత్రకు వంద శాతం న్యాయం చేశాననుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కినన్న ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో జయసుధ, శరత్బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, ప్రవీణ్ యండమూరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. చదవండి: ఊహా లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైన సినిమాలు -
మళ్లీ పెళ్లి ట్రైలర్.. రియల్ లైఫ్ స్టోరీని దింపేశాడుగా!
సీనియర్ నటుడు నరేష్-పవిత్రా లోకేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేసింది చిత్ర బృందం. 'తెలుగు ఇండస్ట్రీ కన్నడ వైపు చూపు తిప్పిందేంటి?..' అన్న డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. పార్వతి.. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా? అని నరేశ్ అడగ్గా.. చాలా బాగా చూసుకుంటాడని బదులిచ్చింది పవిత్ర అలియాస్ పార్వతి. అయినా పెళ్లైన ఆవిడతో మీకు లవ్వేంటి? సర్ అని మధ్యలో ఓ డైలాగ్ నరేశ్ మనసులోని మాటను బయటపెట్టింది. 'అసలైన సూపర్స్టార్ పెద్ద భార్య కొడుకే నరేంద్ర.. ఆయనకు మూడు పెళ్లిళ్లయ్యాయి..', 'నీతో రిలేషన్ ఉందని ఒప్పుకుంటే వాళ్లడిగే మొదటి ప్రశ్న.. ఉంచుకున్నారా? అని!' అంటూ వచ్చే డైలాగులు నరేశ్ రియల్ స్టోరీని గుర్తు చేసేలా ఉన్నాయి.. అలాగే నరేశ్ తన మూడో భార్యను తన్నడం.. చివర్లో నరేశ్, పవిత్ర ఒక హోటల్ గదిలో ఉంటే అతడి మూడో భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు రెడీ అయిన సన్నివేశం చూపించారు. మొత్తానికి ఈ ట్రైలర్ ద్వారా నరేశ్ తన రియల్ లైఫ్ స్టోరీని సినిమాగా తీస్తున్నాడని ఇట్టే అర్థమైపోతుంది. చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం -
నరేష్, పవిత్రా లోకేశ్ల 'మళ్లీ పెళ్లి' రొమాంటిక్ సాంగ్ రిలీజ్
సీనియర్ నటుడు నరేష్-పవిత్రా లోకేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నరేష్, పవిత్రా లోకేశ్ల ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. తమ నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మే26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ చిత్రం నుంచి ‘రా రా హుజూర్ నాతో’.. అనే రొమాంటిక్ సాంగ్ను రిలీజ్ చేశారు. అనన్య నాగళ్ల, శరత్బాబు, వనితా శరత్కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
ప్రజల్లోకి పవిత్ర, నరేష్ (ఫోటోలు)
-
నరేశ్- పవిత్ర పెళ్లి.. ఎట్టకేలకు వచ్చేసిన క్లారిటీ!
నటుడు నరేశ్, పవిత్రలు పెళ్లి చేసుకున్నారంటూ ఓ వీడియో తెగ వైరలయిన సంగతి తెలిసిందే! ఇద్దరూ లిప్ కిస్ ఇచ్చుకున్న ఫోటో కూడా తెగ చక్కర్లు కొట్టింది. వీళ్లిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నామని గతంలోనే ప్రకటించడంతో నిజంగానే వీరి పెళ్లి అయిపోయిందనుకున్నారంతా! కానీ కొందరు మాత్రం ఇది రియల్ పెళ్లిలా లేదే? రీల్ పెళ్లిలా ఉందే! అని అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా వారి అనుమానమే నిజమైంది. నరేశ్- పవిత్రల పెళ్లి సినిమా ప్రమోషన్స్లో భాగమేనని రుజువైంది. పవిత్రతో కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేసినట్లు వెల్లడించాడు నరేశ్. ఈ చిత్రం వేసవి కానుకగా థియేటర్లలో విడుదల కానున్నట్లు పోస్టర్, వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశాడు. తెలుగులోనే కాకుండా కన్నడలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు చావు దెబ్బ కొట్టావ్.. నీ పని బాగుంది అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. A beautiful project to celebrate the glorious 50th anniversary of #VijayakrishnaMovies🤩 Here’s the 1st Look of my next #MattheMaduve ❤️ Kannada - https://t.co/6jOBbGUKSP Directed by @MSRajuOfficial Co-starring #PavitraLokesh😍 Summer 2023 Release!@VKMovies_ pic.twitter.com/pbxIgzQQZc — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 24, 2023 #MalliPelli #MattheMaduve ❤️ pic.twitter.com/eqxa2TVELb — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 24, 2023 -
Sakshi 15th Anniversary: సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
‘సాక్షి’ ప్రారంభమై పదిహేనేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. ప్రారంభ వేడుకకి మొన్న మొన్నే వెళ్లినట్లుగా అనిపిస్తోంది. ఆ వేడుక ఇంకా గుర్తుంది. ‘సాక్షి’కి నా ప్రత్యేక అభినందనలు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘సాక్షి’ దినపత్రిక ఆరంభమై నేటితో 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా బ్రహ్మండంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిడ్డి. ‘‘సాక్షి’ ఇలాంటి విజయవంతమైన వసంతాలను ఎన్నో చూడాలి’’ అన్నారు కన్నడ హీరో శివరాజ్కుమార్. ‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుని, పదహారో ఏడాదిలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు’’ అన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘‘తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన వాస్తవాలను అందించాలని, స్ఫూర్తినిచ్చే వార్తలు ఇవ్వాలనే ప్రజాసంకల్పాన్ని ధ్యేయంగా చేసుకుని అందులో విజయం సాధిస్తూ, ప్రతి ఏడాది ప్రజలకు మరింత చేరువవుతున్నందుకు అభినందనలు’’ అన్నారు నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఇంకా హీరోలు ‘అల్లరి’ నరేశ్, అది సాయికుమార్, కార్తికేయ, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం, నటులు తనికెళ్ల భరణి, సుమన్, సాయికుమార్, ‘సీనియర్’ నరేశ్, అలీ, దర్శకులు కృష్ణవంశీ, బి.గోపాల్, నందినీ రెడ్డి, నిర్మాతలు సి.కల్యాణ్, ‘దిల్’ రాజు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, రచయిత, నిర్మాత కోన వెంకట్ తదితరులు ‘సాక్షి’కి శుభాకాంక్షలు తెలిపి, మరిన్ని విజయవంతమైన వసంతాలను చూడాలని ఆకాంక్షించారు. -
పెళ్లి తర్వాత దుబాయ్కు చెక్కేసిన నరేష్- పవిత్రా లోకేశ్
సినీ నటుడు నరేష్-పవిత్రా లోకేశ్లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం మైసూర్లో జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పెళ్లి వీడియోను నరేష్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లోనే ఆ వీడియో వైరల్గా మారింది. ‘ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు, మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు, మీ #PavitraNaresh’అంటూ నరేష్ ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న నరేష్-పవిత్రా లోకేశ్లు తాజాగా మరోసారి పెళ్లి వీడియోతో టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. నరేష్కు ఇది నాలుగో పెళ్లికాగా పవిత్రా లోకేశ్కు ఇది మూడో పెళ్లి. ఇక ప్రస్తుతం ఈ కొత్తజంట హనీమూన్ కోసం దుబాయ్కు వెళ్లినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ కలిసి దుబాయ్ వీధుల్లో సందడి చేస్తున్నారు. Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗 ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్ళు ఏడు అడుగులు 🙏 మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు - మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023 -
నరేష్-పవిత్రా లోకేశ్ల పెళ్లిలో ఊహించని ట్విస్ట్! కనిపెట్టేసిన నెటిజన్లు
సినీ నటులు నరేష్- పవిత్రా లోకేశ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం మూడుముళ్లు, ఏడడుగులు వేసి తమ బంధాన్ని పదిలం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి వీడియోను స్వయంగా నరేష్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముడ్లు, ఏడు అడుగులు అంటూ నరేష్ రాసుకొచ్చారు. అయితే వీరి పెళ్లి ఎక్కడ జరిగిందనేది స్పష్టత లేదు. నరేష్కు ఇదివరకే మూడుసార్లు పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో ఇది నాలుగోది. అటు పవిత్రా లోకేశ్కు సైతం ఇది మూడో పెళ్లి. ప్రస్తుతం వీరి పెళ్లి వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఇది నిజంగా జరిగిన పెళ్లేనా? లేదా ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం రూపొందించిన వీడియో అన్నదానిపై క్లారిటీ లేదు. గతంలోనూ నరేష్ న్యూఇయర్ సందర్భంగా పవిత్రా లోకేశ్కు లిప్లాక్ ఇస్తూ..కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం.. మీ ఆశిస్సులు కావాలి అంటూ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే అది సినిమా కోసం చేసిన వీడియో. ఇప్పుడు కూడా నరేష్-పవిత్రా లోకేశ్లు రిలీజ్ చేసిన వీడియోలో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం అంటూ వీడియోను రిలీజ్ చేశారు కానీ బ్యాక్గ్రౌండ్లో వారి కుటుంబసభ్యులు ఎవరూ కనిపించడం లేదు. వాళ్లెవరో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నారు. మరోవైపు.. సూపర్స్టార్ కృష్ణ మరణించి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. హిందూ సాంప్రదాయం ప్రకారం తండ్రి మరణించి కనీసం ఆరు నెలలు కూడా గడవకుండా ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు కూడా జరిపించరు. వీటన్నింటిని బేరీజు వేసుకుంటే నరేష్-పవిత్రాలది కేవలం రీల్ పెళ్లిగా పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗 ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్ళు ఏడు అడుగులు 🙏 మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు - మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023 New Year ✨ New Beginnings 💖 Need all your blessings 🙏 From us to all of you #HappyNewYear ❤️ - Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022 -
పెళ్లి చేసుకున్న నరేశ్-పవిత్ర?
సీనియర్ నటుడు నరేశ్, పవిత్రలు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. నటి పవిత్రతో ఏడడుగులు వేశానంటూ తాజాగా నరేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా తన ట్విటర్లో పెళ్లి వీడియోను షేర్ చేశాడు. ‘ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముడ్లు, ఏడు అడుగులు’ అంటూ ట్వీట్కు రాసుకొచ్చాడు. అలాగే మీ ఆశీస్సులు కావాలని కోరాడు. కాగా కొంతకాలంగా నరేశ్-పవిత్రలు సీక్రెట్ రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: ఆర్ఆర్ఆర్పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన నరేశ్-పవిత్రలు శుక్రవారం(మార్చి 10న) మూడు మూళ్ల బంధంతో ఒక్కటైనట్లు తెలుస్తోంది. కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగినట్లు సమాచారం. కాగా నరేశ్కు ఇది నాలుగవ పెళ్లి కాగా, పవిత్రకు ఇది మూడవ పెళ్లి. ఇదిలా ఉంటే ఈ పెళ్లి ప్రకటన ఓ మూవీ ప్రమోషన్లో భాగంగా చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో తమ మూవీ ప్రమోషన్స్ కోసం పవిత్రతో రిలేషన్పై ప్రకటన చేసి షాకిచ్చిన నరేశ్.. ఇప్పుడు కూడా అదే స్టంట్ చేసుంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ పెళ్లి ప్రకటనలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗 ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్ళు ఏడు అడుగులు 🙏 మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు - మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023 -
నటుడు నరేష్ ఇంటిపై దాడి.. మూడో భార్య చేయించిందని ఆరోపణ
సినీ నటుడు నరేష్ ఇంటిపై దుండగులు దాడి చేశారు. గచ్చిబౌలిలోని ఆయన ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడి కారును ధ్వంసం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన నరేష్.. తన మూడో భార్య రమ్య రఘుపతి దాడి చేయించిందని ఆరోపించాడు. నరేష్ ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. కాగా గత కొన్నిరోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న నరేష్ ఇటీవలె తన మూడో భార్య రమ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఆస్తి కోసం తనను చంపేందుకు రమ్య ప్రయత్నించిందని, ఇంటివద్ద రెక్కీ కూడా నిర్వహించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటిపై దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. -
బెడ్రూమ్లో దాక్కొని చూసినట్లు మాట్లాడుతున్నారు: నరేశ్
సినీనటుడు నరేశ్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోమంటూ గతంలోనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం పోలీసులకు సమర్పించారు. ఈ కేసులో విచారణ ఎంతవరకు వచ్చిందనేది తెలుసుకోవడానికి తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. 'ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. సెలబ్రిటీలుగా మా గురించి మాట్లాడే హక్కు ఉంటుందేమో కానీ మమ్మల్ని కించపరిచే హక్కు మీకు లేదు. ఒక వ్యక్తి బెడ్రూమ్లో, బాత్రూమ్లో దాక్కుని చూసినట్లుగా వారి పర్సనల్ విషయాలు మాట్లాడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మధ్య డిస్టబింగ్ కాల్స్ కూడా వస్తున్నాయి. దీనిపై గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ఎంతవరకు వచ్చిందో కనుక్కునేందుకు సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరకు వచ్చాను. ఆ కేసులో పోలీసులకు గట్టి సాక్ష్యాలు దొరికాయి. వీటి రిజల్ట్ కూడా త్వరలోనే మీడియాకు చెప్తాను' అని చెప్పుకొచ్చాడు నరేశ్. చదవండి: రెండు ఓటీటీల్లోకి లక్కీ లక్ష్మణ్ -
నరేశ్- రమ్య వ్యవహారంలో ట్విస్ట్.. రూ.10 కోట్ల సెటిల్మెంట్
సీనియర్ నటుడు నరేశ్- రమ్య రఘుపతి వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టుకెక్కాడు నరేశ్. తన మూడో భార్య రమ్య సుపారీ ఇచ్చి హత్య చేయించాలని ప్రయత్నిస్తోందన్నాడు. తనను చంపేందుకు రాకేశ్ శెట్టితో ఇంటి దగ్గర రెక్కీ చేయించిందని కోర్టులో పిటిషన్ వేశాడు. తన ఫోన్ హ్యాక్ చేసి బ్లాక్మెయిల్ చేస్తోందన్నాడు. రమ్య వేధింపులను తట్టుకోలేకపోతున్నానని, ఆమె నుంచి విడాకులు కావాలని కోరుతున్నాడు. పెళ్లైన నెల నుంచే తనను వేధించేదని, కనీసం తనకు తినడానికి తిండి కూడా పెట్టేది కాదన్నాడు. ఏదైనా ఫంక్షన్ జరిగితే తాగి రచ్చ చేసేదని చెప్తున్నాడు. తనపై కంటే తన ఆస్తి, డబ్బుపైనే రమ్యకు ప్రేమ ఎక్కువంటున్నాడు. మరోవైపు రూ.10 కోట్ల రూపాయలతో సెటిల్మెంట్ చేసుకునేందుకు రెడీ అంటూ రమ్య మాట్లాడిన ఆడియో లీక్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. చదవండి: ఎన్టీఆర్ను జమున కాలితో తన్నడంతో వివాదం -
నరేశ్కు పవిత్ర దగ్గరవ్వడానికి కారణం అదే: రమ్య
సినీ నటుడు నరేశ్ కొంతకాలంగా తన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా నటి పవిత్రా లోకేశ్కు దగ్గరైన ఆయన ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేసిన జంట మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. రమ్య మాట్లాడుతూ..' నరేశ్ డివోర్స్ కావాలని పిటిషన్ వేశారు. అదే నాకు పెద్ద ఆధారం. నేను కూడా అలిగేషన్స్ వేశా. నేను ఏం అలిగేషన్స్ వేశానో ఆధారాలు ఉన్నాయి. ఆరు నెలలైనా ఇంతవరకు నాపై చేసినా ఆరోపణలు నిరూపించలేకపోయారు. డివోర్స్ కేసు కోర్టులో ఉండగా మాట్లాడటం సరికాదు. చైల్డ్ గార్డియన్ షిప్, నా మీద ఇంజక్షన్ ఆర్డర్ ఫైల్ చేశారు. నాపై రకరకాలుగా కేసులు వేశారు. నేను వీటన్నింటినీ ఎదుర్కొంటున్నా. నేను వేసిన ఒకే ఒక కేసు డొమెస్టిక్ వయోలెన్స్. నాకు, నా కుమారుడికి మెయింటనెన్స్ కావాలని వేశా. నా మీద ఆరోపణలు చాలా వచ్చాయి. ఆస్తి కోసం ఆమె ఇలా చేస్తోంది అని అన్నారు. నాకు నా పిల్లాడి జీవితం ముఖ్యం. అందుకే పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నా. ఫైనల్గా నాకు విడాకులు వద్దనేదే నా నిర్ణయం.' అని అన్నారు. ఇటీవల వీడియోపై ఆమె మాట్లాడుతూ..' ఒక భార్యగా ఆయన నన్ను టీజ్ చేస్తున్నారు. ఆ వీడియోను రెండుసార్లు మాత్రమే చూశా. నా బాబుకు సెక్యూరిటీ ఇవ్వడమే నా లక్ష్యం. నేను ఎక్కడా తప్పు చేయలేదు. అలాంటప్పుడు నాపై నిందలు వేస్తే సహించను. నరేశ్ దగ్గరికి పవిత్ర రావడానికి కేవలం ఆర్థిక పరమైన కారణాలే. నరేశ్ను ఎవరితోనైనా ఉన్నప్పుడు నేను పట్టుకుంటే రెండు నెలలు నాతో బాగా ఉంటారు. ఆ సమయంలో ఇంట్లో అడిగేవారు ఎవరూ లేకపోవడంతో పవిత్ర దగ్గరైంది. గతంలో కూడా ఆయనకు ఎఫైర్స్ ఉండేవి. మా అత్త నాకు సర్ది చెప్పేవారు. నరేశ్ ఎప్పటికైనా మారుతారని చెప్పేది. ఆయన ఎలాంటి వారనేది మా ఫ్యామిలీకి చెప్పలేదు. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. ఇది పూర్తిగా నా సమస్య. నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. నేను ఆర్యసమాజ్లో పెళ్లి చేసుకున్నా. న్యాయస్థానంలోనే తేల్చుకుంటా.' అని రమ్య రఘుపతి అన్నారు. -
నరేశ్ నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు: రమ్య
సినీ నటుడు నరేశ్ కొంతకాలంగా తన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో నటి పవిత్రా లోకేశ్కు దగ్గరైన అతడు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది రమ్య. 'మా ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయని వార్తలు వస్తున్నాయి. అది పూర్తిగా అవాస్తవం. కోర్టులో కేసు ఇంకా నడుస్తోంది. తను విడాకులు తీసుకుని ఇంకొకరితో సెటిలైపోదామనుకుంటున్నాడు. కానీ మా బాబు మేమిద్దరం కలిసే ఉండాలని కోరుకుంటున్నాడు. వాడి కోసమైనా నేను విడాకులివ్వను. అతడికి పవిత్రతో పెళ్లి జరగనివ్వను. నరేశ్ ఎన్నోసార్లు అమ్మాయిలతో అడ్డంగా దొరికిపోతే వచ్చి కాళ్లు పట్టుకుని సారీ చెప్పేవాడు, ఏడ్చేవాడు. నేను తల్లిలా క్షమించేదాన్ని. మొన్నటికి మొన్న నరేశ్- పవిత్ర లిప్లాక్ చూసి మీ నాన్న పెళ్లంటగా అని బాబును వాడి ఫ్రెండ్స్ ఆటపట్టిస్తున్నారట. పిల్లాడి మనసు గాయపడుతోంది. అతడి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నేను రాఖీ కట్టిన వ్యక్తితో, డ్రైవర్తో.. ఇలా చాలామందితో నాకు అక్రమ సంబంధం అంటగట్టాడు. నన్ను బద్నాం చేస్తున్నాడు. ఇన్ని నిందలు పడుతున్నా కూడా నేను బతికున్నానంటే అది నా కొడుకు కోసమే! సమ్మోహనం సినిమా సమయంలో పవిత్ర ఓ సారి ఇంటికి వచ్చింది. పిచ్చిదానిలా నేను ఆమెకు వడ్డించి సరదాగా కలిసిపోయాను. 'మా' ఎలక్షన్స్ సమయంలో నాకు తనమీద కొంత అనుమానం మొదలైంది. అతడి బర్త్డే రోజు ఇష్టమైన కేక్ తీసుకొస్తే కట్ చేయకుండా వెళ్లిపోయాడు. తర్వాత పవిత్ర దగ్గరకు వెళ్లి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. నా కంట్లో నీళ్లు వస్తే ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వనని నరేశ్ను హెచ్చరించింది అతడి తల్లి. కానీ ఎప్పుడైతే ఆమె మరణించిందో అతడికి హద్దు లేకుండా పోయింది' అని చెప్పుకొచ్చింది రమ్య. చదవండి: నరేశ్పై సంచలన ఆరోపణలు చేసిన రమ్య -
Actor Naresh: నరేశ్పై సంచలన ఆరోపణలు చేసిన మూడో భార్య
సినీనటుడు నరేశ్, ఆయన మూడో భార్య రమ్య రఘుపతి మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే! కొంతకాలంగా రమ్యకు దూరంగా ఉంటున్న నరేశ్ నటి పవిత్రతో సన్నిహితంగా ఉంటున్నాడు. దీంతో రమ్య.. భార్యను నేనుండగా వేరొకరితో ఎందుకు తిరుగుతున్నావంటూ రచ్చచేసింది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. తాజాగా రమ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నరేశ్ ఎలాంటివాడో చెప్పుకొచ్చింది. 'నరేశ్.. నాకు డ్రైవర్తో లింకు పెట్టాడు. ఎవరెవరితోనూ లింకులు కలిపాడు. అంత క్రియేటివిటీ ఆయనకే దక్కుతుంది. నా మీద అతడు నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నకొద్దీ బాబు చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. నిద్ర లేని రాత్రుళ్లు గడుపుతున్నాడు. ఎంతో హర్ట్ అవుతున్నాడు. అతడి గురించి ఒక్కసారి కూడా ఆలోచించడం లేదు. అంతేకాదు, నరేశ్ పోర్న్ వీడియోలు చూస్తాడు. నాన్న డర్టీ వీడియోలు చూస్తున్నాడని నా కొడుకు రణ్వీర్ వచ్చి చెప్పడంతో ఆ విషయం నాకు తెలిసింది. తండ్రిగా ఎంత బాధ్యతగా ఉండాలి? కానీ అతడు ఎంతో చండాలంగా ప్రవర్తిస్తున్నాడు' ఆగ్రహం వ్యక్తం చేసింది రమ్య. కాగా నరేశ్ ప్రస్తుతం నటి పవిత్ర లోకేశ్తో ప్రేమలో ఉన్నాడు. త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇందులో నరేశ్, పవిత్ర లిప్లాక్తో తమ ప్రేమను ప్రకటించారు. చదవండి: షారుక్ కొడుకే కాదు కూతురు కూడా లవ్లో పడింది -
నరేష్కు కలిసిరాని మూడు పెళ్లిళ్లు.. త్వరలోనే నాలుగో పెళ్లి
నటుడు నరేష్ త్వరలోనే నాలుగో పెళ్లి చేసుకోనున్నాడు. ఇప్పటికే మూడుసార్లు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకున్న నరేష్ పవిత్ర లోకేష్ని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ వీడియోను షేర్ చేయగా పవిత్రా-నరేష్ల వ్యవహారం మరోసారి హాట్టాపిక్గా మారింది. ఈ క్రమంలో గతంలో నరేష్ చేసుకున్న మూడు పెళ్లిళ్లు ఇప్పుడు మరోసారి తెరమీదకి వచ్చాయి. మొదటగా సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను నరేష్ పెళ్లిచేసుకున్నాడు.వీరి కొడుకే హీరో నవీన్ విజయ్కృష్ణ. ఆమెతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కూడా ఓ కొడుకు పుట్టాడు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసి ముచ్చటగా మూడోసారి రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె అయిన రమ్య రఘపతిని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం సజావుగానే సాగిన వీరి కాపురం వీరిబంధం కూడా ఎక్కువకాలం నిలబడలేదు. దీంతో ఆమెకు దూరంగా ఉన్న నరేష్ కొన్నాళ్లుగా పవిత్రాలోకేశ్తో సహజీవనం చేస్తున్నారు. ఇటీవలె ఓ హోటల్ రూమ్లో నరేష్-పవిత్రా లోకేశ్లను నరేష్ మూడోభార్య రమ్య రఘుపతి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది కూడా. సీన్కట్ చేస్తే.. ఇప్పుడు 62ఏళ్ల వయసులో నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నాడు నరేష్. -
పవిత్ర లోకేష్, నరేష్ వ్యవహారంలో కీలక మలుపు
-
నరేశ్- పవిత్రా లోకేశ్ల వ్యవహారంలో కీలక మలుపు
నరేశ్- పవిత్రా లోకేశ్ల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. తమ వ్యక్తిగత జీవితంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని నరేష్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. యూట్యూబ్ చానళ్లు, కిందరు వ్యక్తులపై పరువు నష్టం దావా వేశారు. దీంతో నరేశ్ ఫిర్యాదులో పేర్కొన్న 12 మందిపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమపై ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ నటులు నరేశ్, పవిత్ర గతంలో సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.అసత్య ప్రచారం చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నరేష్ ఫిర్యాదులో పేర్కొన్న ఇమండి టాక్స్ రామారావ్, రెడ్ టీవీ, లేటెస్ట్ తెలుగు డాట్ కామ్, లైఫ్ ఇన్స్పిరేషన్, రమ్య రఘుపతి, మూవీ న్యూస్, ది న్యూస్ క్యూబ్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్ , దాసరి విజ్ఞాన్ , కృష్ణ కుమారి , మిర్రర్ టీవీ చానళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. -
నరేష్, పవిత్ర ఫిర్యాదు.. యూట్యూబ్ జర్నలిస్టుకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సినీనటులు నరేశ్, పవిత్రా లోకేశ్ల వ్యక్తిగత జీవితంపై పలు వార్తలను టెలికాస్ట్ చేసిన ‘ఇమండి రామారావు’ చానల్ జర్నలిస్టు రామారావుకు సైబర్క్రైం పోలీసులు నోటీసులు జారీచేశారు. తమపై ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ నటులు నరేశ్, పవిత్ర ఇటీవల సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు రామారావుకు నోటీసులిచ్చారు. మరిన్ని చానళ్లు కూడా ఈ వార్తలను ప్రసారం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారికి కూడా నోటీసులిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వార్తల వెనుక రమ్య రఘుపతి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆమెకు కూడా నోటీసులిచ్చేందుకు వెనుకాడబోమని సైబర్క్రైం పోలీసులు తెలిపారు. చదవండి: అలాంటి పాత్రలే చేయాలనుకుంటున్నాను: ఐశ్వర్యా లక్ష్మీ -
నరేష్ మూడో భార్యపై ఫిర్యాదు చేసిన పవిత్రా లోకేశ్
సినీ నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై నటి పవిత్రా లోకేశ్ ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ను అడ్డుపెట్టుకొని తనను కించపరుస్తుందని ఆమె ఆరోపించింది. రమ్య, నరేష్ల మధ్య కుటుంబ వివాదాలున్నాయి. రమ్యపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో జోక్యం చేసుకుంది. నా వ్యక్తిగత జీవితంపై రమ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నా పరువుకు భంగం కలిగేలా రమ్య వ్యవహరిస్తుంది. యూట్యూబ్ ఛానళ్ల ప్రచారం వెనుక రమ్య హస్తం ఉంది.పలు యూట్యూబ్ ఛానళ్లను రమ్యే వెనుక ఉండి నడిపిస్తుంది.అంతేకాకుండా గతంలో కూడా నాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది అంటూ పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా నరేష్ తనకు సంబంధించి యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పవిత్రా లోకేశ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా గతంలో నరేష్, పవిత్ర లోకేశ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అనంతరం ఓ హోటల్ రూమ్లో నరేష్, పవిత్ర ఉండగా నరేష్ భార్య వచ్చి గొడవ చేశారు. దీంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. -
పవిత్రా లోకేశ్ ఫిర్యాదు.. ఆ వెబ్సైట్లకు నోటీసులు జారీ
సినీనటి పవిత్రా లోకేశ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటివరకు 8 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్స్కు నోటీసులు జారీ చేసిన పోలీసులు మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ మధ్యకాలంలో సినిమాల కంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా పాపులర్ అయిన పవిత్రా లోకేశ్ ఇటీవలె సైబర్ క్రైమ్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నటుడు నరేశ్, తన పట్ల కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆమె ఆరోపించింది. ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు వైరల్ చేస్తున్నారని పేర్కొంది. అసత్య ప్రచారం చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సోషల్ మీడియాలో పవిత్ర-నరేష్లపై ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబ్ చానల్స్కు నోటీసులు జారీ చేసింది. -
మార్ఫింగ్ ఫొటోలు వైరల్.. పోలీసులకు పవిత్ర ఫిర్యాదు
సినీ నటి పవిత్రా లోకేశ్ పోలీసులను ఆశ్రయించింది. సీనియర్ నటుడు నరేశ్, తన పట్ల కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని శనివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఫొటోలు మార్ఫింగ్ చేసి, అభ్యంతరకర కామెంట్లతో వాటిని వైరల్ చేస్తున్నారని పేర్కొంది. తమ ఇద్దరినీ ట్రోల్ చేస్తూ వస్తున్న వార్తలపైనా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. పవిత్ర ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: కాంతారావుకు అమ్మాయిల పిచ్చి? స్పందించిన నటుడి కూతురు -
ఇంటింటి రామాయణం టీజర్ చూశారా?
తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న చిత్రం ‘ఇంటింటి రామాయణం’. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆహాలో డిసెంబర్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ‘‘ఈ కథ మీ హృదయానికి హత్తుకోవటమే కాదు.. మీరు ప్రేమించిన వ్యక్తులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుకు తెస్తుంది. నేటి రోజుల్లో మన వ్యక్తిగత జీవితాల్లోని భావోద్వేగాలను ఎమోజీల రూపంలో వ్యక్తం చేస్తున్నాం. కానీ ఆహాలో రాబోతున్న ఈ ఇంటింటి రామాయణం సినిమాను వీక్షించినప్పుడు మీ ఇంటి సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడతారు. ఒకవేళ వారు ఇతర ప్రాంతాల్లో ఉంటే వెంటనే టికెట్ బుక్ చేసుకుని వెళ్లి వారిని కలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. అంత సరళంగా అందరికీ అర్థమయ్యేలా ఉండటమే ఈ సినిమా ప్రధాన బలం’’ అన్నారు. గ్రామీణ మధ్య తరగతి జీవిత కథలను ప్రతిబింబించే సినిమాయే ఇంటింటి రామాయణం అని అర్థమవుతోంది. కథ విషయానికి వస్తే.. కరీంనగర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అక్కడ గ్రామంలో ఉండే రాములు (నరేష్).. అతని పక్కనుండే కుటుంబం ఓ సమస్యను ఎదుర్కొంటుంది. దీంతో వారిలో ఒకరినొకరు అనుమానపడతారు. అలాంటి సమయంలో వారిలో భావోద్వేగాలు ఎలా ఉంటాయి. అవి వారి కుటుంబ సభ్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనేదే ప్రధాన కథాంశం. చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న మాచర్ల నియోజకవర్గం కాంతారావుకు అమ్మాయిల పిచ్చి? అసలు నిజమేంటంటే? -
ఆహా ఒరిజినల్ 'ఇంటింటి రామాయణం', అప్పుడే స్ట్రీమింగ్!
షోలు, వెబ్ సిరీస్లు, సినిమాలతో తెలుగువారిని ఆకట్టుకుంటోంది ఆహా. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంటింటి రామాయణం అనే చిత్రం రాబోతోంది. నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటించారు. సురేష్ నారెడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డీజే టిల్లు, భీమ్లా నాయక్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా ద్వారా ఓటీటీలోకి ప్రవేశించనున్నారు. ఈ సినిమా టీజర్ నవంబర్ 25న విడుదల చేయనున్నారు. మధ్య తరగతి కుటుంబాల్లో సహజంగా జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కరీంనగర్ ప్రాంతంలో నివసించే రాములు (నరేష్) కుటుంబం ఓ సమస్యలో చిక్కుకుంటుంది. దీంతో కుటుంబ సభ్యుల్లోనే ఒకరిపై మరొకరికి అనుమానాలు పుట్టుకొస్తాయి. దీంతో వారిలో దాగి ఉన్న అసలు రూపాలన్నీ బయటకు వస్తాయి. ఈ కుటుంబ కథా చిత్రం డిసెంబర్ 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ఎంట్రీపై సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో ఎంతో మంది మంచి నటులున్నారు. ఎంతో గొప్ప టీం పని చేసింది. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా బాగా రావాలని కష్టపడ్డారు. ఆహాలో రాబోతోన్న ఇంటింటి రామాయణం అందరికీ ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా ఉంటుంది. మానవ బంధాలు, సంబంధాలు, జీవిత గుణపాఠాలు ఇలా అన్నింటిని ఈ చిత్రంలో చూపించాం. అంతా మనకు తెలిసిన ప్రపంచంలానే ఉంటుంది. కానీ కొత్తగా ఉంటుంది” అన్నారు. Iga mucchata shuru!😉 Ee gammatthu katha chudaniki ready kaandi thondarlo... Teaser out on November 25th. An @ahavideoIN Original.#IntintiRamayanamOnAHA @DirectorMaruthi @vamsi84 @eyrahul #NavyaSwamy @SitharaEnts @Sureshflms @Venkatupputuri @innamuri8888 @GangavvaMilkuri pic.twitter.com/9zoRyStvwZ — Sithara Entertainments (@SitharaEnts) November 21, 2022 చదవండి: ఆస్పత్రిలో ప్రేమదేశం హీరో అబ్బాస్ నీ నుంచి కంటెంటే రాదు, ఇంకా కోపం కూడానా.. యాంకర్ వెకిలి చేష్టలు -
‘కృష్ణగారి ఆరోగ్యం నిలకడగా ఉంది.. ఆందోళన అవసరం లేదు’
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై సీనియర్ నటుడు నరేశ్ సోమవారం ఉదయం స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రోటిన్ చెకప్లో భాగంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్లు నరేశ్ పేర్కొన్నారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక కాగా కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే మరో రెండు రోజుల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. -
అందరూ బాగుండాలి.. అందులో మేముండాలి: నరేశ్ కామెంట్స్ వైరల్
కమెడియన్ అలీ, సీనియర్ నటుడు నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘వికృతి’కి తెలుగు రీమేక్గా రూపొందించారు. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అలీ సమర్పణలో నిర్మించిన ఈ సినిమాకు శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అక్టోబర్ 28న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ కావడం పట్ల నటులు నరేశ్, పవిత్రా లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మీడియా వేదికగా వెల్లడించారు. (చదవండి: ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ మూవీ రివ్యూ) ఈ సినిమాకు ఇంతలా పాజిటివ్ రివ్యూలు రావడం ఇటీవల కాలంలో తానెప్పుడు చూడలేదని నటుడు నరేశ్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా బాగుందని చాలామంది నాకు మెసేజ్లు పంపుతున్నారని తెలిపారు. కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని ఇవాళ మరోసారి రుజువైందని అన్నారు. 'అందరూ బాగుండాలి.. అందులో మేము ఉండాలి' అంటూ నరేష్ కామెంట్స్ చేశారు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. పవిత్ర లోకేశ్ మాట్లాడుతూ..'ఈ సినిమాని అందరూ చూడండి. నిర్మాత అలీని, నరేశ్ను ఎంకరేజ్ చేయండి' అని అన్నారు. కథేంటంటే..: శ్రీనివాసరావు(నరేశ్), పవిత్ర లోకేశ్(సునీత) మధ్యతరగతి కుటుంబానికి చెందిన జంట. జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కొడుకు, కూతురులను ప్రేమగా చూసుకుంటూ జీవితం కొనసాగిస్తుంటారు. మరోవైపు సమీర్(అలీ) ఆర్థిక సమస్యల కారణంగా దుబాయ్కి వెళ్లి చాలా రోజుల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. తన ఫ్యామిలీని చక్కగా చూసుకునే సమీర్కి సెల్ఫీలు, సోషల్ మీడియా పిచ్చి ఎక్కువ. ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. అలీకి ఉన్న సోషల్ మీడియా పిచ్చి.. శ్రీనివాసరావు జీవితాన్నే మార్చేస్తుంది. నెట్టింట సమీర్ పెట్టిన ఓ పోస్ట్ కారణంగా శ్రీనివాసరావు జీవితంలోకి అనేక సమస్యలు వచ్చిపడతాయి. సమాజం అంతా అతన్ని తప్పుగా అపార్థం చేసుకుంటుంది. ఇంతకీ సమీర్ సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ ఏంటి? దాని వల్ల శ్రీనివాస్ రావు ఫ్యామిలి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనేదే మిగతా కథ. -
పవిత్ర- నరేశ్ బ్రేకప్.. వారి మధ్య అసలేం జరిగింది ?
కొద్ది రోజుల క్రితం వార్తల్లో నిలిచిన జంట పవిత్ర-నరేశ్. వీరిద్దరి మధ్య సహజీవనం చేస్తున్నట్లు మొదట రూమర్లు పెద్దఎత్తున వైరలయ్యాయి. వాటిని నిజం చేస్తూ ఈ జంట ఓ హోటల్లో ఉండగా నరేశ్ మూడో భార్య వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో పవిత్ర-నరేశ్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టాక్ నడిచింది. వీరిద్దరు ఓ ఆలయంలో కనిపించడంతో అంతా నిజమే అనుకున్నారు. కాగా.. నరేశ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: సైబర్ పోలీసులను ఆశ్రయించిన పవిత్ర లోకేశ్) తాజాగా మరో వార్త గుప్పుమంటోంది. నరేశ్- పవిత్రను కూడా దూరం పెట్టినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ జంట ఎక్కడా బయట కనిపించడం లేదు. కొందరు సన్నిహితుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. అంతే కాదండోయ్ నరేశ్ మరో సీనియర్ నటితో సన్నిహితంగా మెలుగుతున్నట్లు టాక్. అందువల్లే పవిత్రకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అయితే టాలీవుడ్లో మరోసారి వీరిద్దరు తెరపైకి రావడం హాట్ టాపిక్గా మారుతుంది. -
రెమ్యునరేషన్ పెంచేసిన పవిత్రా లోకేష్.. కాంట్రవర్సీ తర్వాత మరింత క్రేజ్
నటి పవిత్రా లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పటిదాకా క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె నరేష్తో పెళ్లి వార్తలతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. దీంతో అటు మీడియాలోనే కాకుండా ఇండస్ట్రీలోనూ వీరిద్దరి వ్యవహారం హాట్టాపిక్గా మారింది. ఒక రకంగా ఈ వివాదం ఆమెకు బాగానే క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. దీంతో ఆమె తన రెమ్యునరేషన్ను భారీగా పెంచేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. తెలుగులో అమ్మ, వదిన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ నటి నరేష్ వ్యవహారంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన సంగతి తెలిసిందే. దీంతో మొన్నటివరకు రోజుకు 50 నుంచి 75 వేలు తీసుకుంటున్న పవిత్రా లోకేష్ ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తుందట. అంతేకాకుండా ఆమెకు ఆఫర్స్ రావడంలో నరేష్ కూడా తన వంతు సాయం చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. -
వివాదంలో నరేశ్ పెళ్లి.. తెరపైకి మూడో భార్య.. సంచలన విషయాలు..
సీనియర్ నటుడు నరేశ్ పెళ్లి వార్త మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన నటి పవిత్రా లోకేశ్ను నాలుగో వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు పవిత్రతో వివాహంపై నరేశ్ స్పందించలేదు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను నిరాశలో కుంగిపోయి ఉన్నప్పుడు పవిత్ర తనకు అండగా నిలిచారని చెప్పారు. మరోవైపు ఆయన మూడో భార్య రమ్య.. నరేశ్ 4వ పెళ్లి వార్తలపై ఫైర్ అయ్యారు. తనకు, నరేశ్కు ఇంకా విడాకులు కాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రా లోకేశ్ను నరేశ్ పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఆమె ఆరోపించారు. ‘నరేశ్ నన్ను మోసం చేశాడు. కొంతకాలం మేం కలిసి లేము. అలాగని విడాకులు తీసుకోలేదు. మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ నరేశ్ ఎలా పెళ్లి చేసుకుంటాడు?’ అని ప్రశ్నించారు. అలాగే నరేశ్ జనవరిలో తనపై ఫిర్యాదు చేసిన విషయంపై కూడా ఆమె స్పందించారు. జూన్లో నాకు నోటీసులు అందాయని, వీటిపై తాను లీగల్ కోర్టులోనే ఫైట్ చేస్తానని ఆమె పేర్కొన్నారు. రమ్య చెప్పేదంత అబద్ధం: నరేశ్ నరేశ్ తన మూడో భార్య రమ్య ఆరోపణలను ఖండించారు. రమ్య చెప్పేదంత అబద్ధమని, ఆమె తన కుటుంబాన్ని నాశనం చేసిందన్నారు. ‘రమ్య చెప్పిన దాంట్లో నిజం లేదు. గతంలో తను నా దగ్గర నుంచి రూ. 50 లక్షల వరకు డిమాండ్ చేసింది. కృష్ణగారు చెబితే రూ. 10 లక్షలు ఇచ్చాను. బ్లాక్ మెయిల్ చేసి నా దగ్గర నుంచి ఎలాగైనా డబ్బు తీసుకోవాలని ఆమె ప్రయత్నిస్తోంది. 200లకు పైగా సినిమాలు చేశాను. 100 మందికి పైగా హీరోయిన్స్తో వర్క్ చేశాను. కానీ ఎప్పుడు నాపై ఇలాంటి ఆరోపణలు రాలేదు. నేను ఏలాంటి వాడినో అందరికి తెలుసు. అయినా ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. నేను పవిత్రను పెళ్లి చేసుకోలేదు. ఆమె నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. నాకు పవిత్ర ఎమోషనల్ సపోర్టు మాత్రమే. పవిత్ర వచ్చింది నాలుగు సంవత్సరాల క్రితమే. కానీ రమ్య నేను విడిపోయి 8 సంవత్సరాలు అవుతుంది’ అంటూ వివరణ ఇచ్చారు. పవిత్ర కాపురాలు కూల్చే వ్యక్తి: సుచేంద్ర ఈ పెళ్లి వార్తలపై పవిత్ర లోకేశ్ భర్త డైరెక్టర్ సుచేంద్ర మాట్లాడుతూ.. పవిత్ర కాపురాలు కూల్చే వ్యక్తి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెది పైలా పచ్చిస్ జీవితమని, అందుకు తనని వదిలి వెళ్లిపోయిందన్నారు. సుచేంద్ర నా భర్త కాదు.. సుచేంద్ర తన మొదటి భర్త అంటూ వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు పవిత్రా లోకేశ్. ‘సుచేంద్ర నా భర్త కాదు. నేను ఆయనతో రిలేషన్ షిప్లో మాత్రమే ఉన్నా. ఇక ఆరేళ్లుగా సుచేంద్రకు దూరంగా ఉంటున్నా’ అన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్స్ తో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ పవిత్రా లోకేశ్ ఇప్పటికే కర్ణాటక సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా..దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. అలాగే నరేశ్తో తన రిలేషన్పై నోరు విప్పిందామె. ఫార్మ్ హౌజ్లో నరేశ్తో కలిసి ఉంటున్నానని, నరేశ్ ఫ్యామిలీ మెంబర్గా తనని అంగీకరించారని చెప్పారు. -
200 సినిమాలు చేశా.. నేను చేసిన బెస్ట్ తండ్రి పాత్ర ఇదే!
‘‘నేనిప్పటి వరకు రెండొందలకు పైగా సినిమాలు చేశాను. కానీ, ‘అంటే.. సుందరానికీ’ చిత్రంలో నేను చేసిన బ్రాహ్మణ పాత్రకు తగ్గట్టుగా డబ్బింగ్ చెప్పడానికి తొమ్మిది రోజులు పట్టింది. ఇన్ని రోజులు డబ్బింగ్ చెప్పుడం ఎప్పుడూ జరగలేదు.. ఇదంతా వివేక్ ఆత్రేయ డ్రాఫ్టింగ్ వల్లే జరిగింది’’ అని నటుడు వీకే నరేశ్ అన్నారు. నాని, నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’. నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ చిత్రంలో నాని తండ్రిగా నటించిన వీకే నరేశ్ మాట్లాడుతూ.. ‘‘గతంలో జంధ్యాలగారి సినిమాల్లో బ్రాహ్మణుడి పాత్రల్లో నటించాను. చదవండి: బిగ్బాస్ విన్నర్ సన్నీపై దాడి, పోలీసులకు ఫిర్యాదు ఇప్పుడు ‘అంటే.. సుందరానికీ’లో చేశాను. ఈ చిత్రంలో నేను చేసిన తండ్రి పాత్ర ది బెస్ట్. దానికి కారణాలు వివేక్ రూపుదిద్దిన విధానం, నాని, నాకు మధ్య కామెడీ టైమింగ్. ఎమోషన్స్ను క్యారీ చేస్తూ ఆడియన్స్ను నవ్వించే కీలకమైన పాత్ర నాది. రెండు భిన్నమైన మనస్తత్వాలు గల కుటుంబాల మధ్య ఏం జరిగింది? అనేది ఈ సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా పదహారు కూరల తెలుగు కంచం. నా కెరీర్ను తర్వాతి స్థాయికి తీసుకెళ్లే మూవీ అవుతుంది. మైత్రీ మూవీస్ మంచి కుటుంబ కథా చిత్రాలకు ఆణిముత్యం లాంటి సంస్థ. ప్రస్తుతం నేను లీడ్ రోల్లో రెండు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. చదవండి: తమ రిలేషన్ను అధికారికంగా ప్రకటించిన లవ్బర్డ్స్ -
బర్త్డే రోజునే సూపర్ స్టార్ కృష్ణకు అరుదైన గౌరవం
తొలి తెలుగు జేమ్స్బాండ్, కౌబాయ్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే నేడు. మంగళవారంతో(మే 31న) ఆయన 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు తనయుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు, కోడలు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. అలాగే సీని ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నేడు ఆయన బర్త్డే నేపథ్యంలో కృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ‘సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ వరించింది. చదవండి: తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు మామయ్య.. నమ్రతా ఎమోషనల్ పోస్ట్ ఈ విషయాన్ని నరేశ్ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ కృష్ణ. 80 ఏళ్ల పాటు సినిమాకు, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టిన రోజునే ‘సెలబ్రెటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్’ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయన కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశిస్తున్నా’ అని ట్వీట్లో పేర్కొన్నారు. చదవండి: ఎన్టీఆర్ చిత్రంలో సోనాలి బింద్రే.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ Happy birthday SUPER STAR . Glorious 80 years of service to cinema and people . Received CELEBRITY BOOK OF WORld RECORDS on this occasion. Long live the superstar💕🌹 pic.twitter.com/WBuZko8EH3 — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) May 31, 2022 -
యాక్సిడెంట్ అయి సింగపూర్కి వెళ్తే అలా అన్నారు: మంచు విష్ణు
'మా' అసోసియేషన్ సభ్యుల కోసం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంచు విష్ణు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో 'మా' సభ్యుల కోసం ఉచిత హెల్త్ చెకప్ నిర్వహించారు. దీని ప్రకారం మా సభ్యులకు డాక్టర్ కన్సల్టేషన్తో పాటు పది రకాల హెల్త్ చెకప్లు ఉచితంగా చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ.. 'మా సభ్యులకు ఏఐజీ వారు ఉచితంగా చెకప్స్ చేశారు. సెవెన్ స్టార్ ఫెసిలిటీస్తో మాకు సేవలందించారు. డా.నాగేశ్వర రెడ్డికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది.గతంలో మలేసియాలో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మాస్టర్ చెకప్కి సింగపూర్కి వెళ్తే ఇండియాలో ఏఐజీ పెట్టుకొని ఇక్కడిదాకా ఎందుకు వచ్చారు అని అడిగారు. అలాంటి హాస్పిటల్లో ఇకపై మా సభ్యలకు ఉచితంగా హెల్త్ చెకప్ అందిస్తుండం సంతోషం. ఈ క్యాంప్ వల్ల మా సభ్యులందరూ బెనిఫిట్ పొందుతున్నారు' అని పేర్కొన్నారు. ఇక మంచు విష్ణు అధ్యక్షుడు అయ్యాక ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందని నటుడు నరేష్ అన్నారు. కరోనా సమయంలో ఆర్టిస్టులు కష్టాలు చూసి విష్ణు ఇప్పుడు మెడికల్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈరోజు జరిగిన క్యాంప్లో సుమారు 300కి పైగా మా సభ్యులు చెకప్లు చేసుకున్నారని తెలిపారు. ఏఐజీ ఇంటర్నేషనల్ లెవల్లో ఉందన్నారు. ఇక ఈ సందర్బంగా ఏఐజీ డైరక్టర్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో చాలా మంది ఆర్టిస్టులు వ్యాక్సిన్లు వేసుకొని షూటింగ్ చేయొచ్చా అని అడిగేవారు. వాళ్లు చాలా కష్టపడుతున్నారు. అయితే ఆర్టిస్టులలో లైఫ్స్టైల్ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. లంగ్స్ వ్యాధి, గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అని పేర్కొన్నారు. -
కొత్త సినిమా ప్రకటించిన ఎమ్ఎస్ రాజు, ఫస్ట్లుక్ రిలీజ్
‘డర్టీ హరి’ తర్వాత ప్రముఖ నిర్మాత ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహించిన ‘7 డేస్ 6 నైట్స్’ చిత్రం రిలీజ్కు సిద్ధంగా ఉంది. మంగళవారం (మే 10)న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఎమ్ఎస్ రాజు దర్శకత్వంలో రానున్న ‘సతి’ ఫస్ట్ లుక్ రిలీజైంది. సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ జంటగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు నరేశ్ కీలక పాత్రలో నటించనున్నాడు. రఘురామ్, టి. సారంగ సురేష్కుమార్, డా. రవి దాట్ల, సుమంత్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘‘కొత్త దంపతుల మధ్య జరిగే అనుకోని సంఘటనల చుట్టూ అల్లిన కథ ఇది. ఉద్వేగభరిత సన్నివేశాలతో రూపొందిస్తున్న ‘సతి’ నా కెరీర్లో గర్వించదగ్గ చిత్రంగా నిలుస్తుంది’’ అన్నారు ఎమ్ఎస్ రాజు. ఈ సినిమాకు సహనిర్మాత: జె.వాస రాజు. Presenting you the First Look of our next #Sathi 💥 A @SumanthArtPro proud presentation 😇 Produced By @WildHoneyPro & @RamantraCreate @MSumanthAshwin #MeherChahal @DrRaviPRaju @EditorJunaid @PulagamOfficial pic.twitter.com/zQJMQz8HWO — MS Raju (@MSRajuOfficial) May 10, 2022 -
నటి పవిత్ర లోకేష్ డైరెక్షన్లో నరేష్ కొత్త సినిమా
ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం మహా కాళేశ్వర ఆలయం విశిష్టత నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. వీకే నరేష్, పవిత్రా లోకేశ్, దేవాలయ ధర్మకర్త పట్టపాగులవెంకట్రావు, ఎం.సి. వాసు నటిస్తున్నారు. నటి పవిత్ర లోకేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వీకే నరేష్ సమర్పణలో విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్పై ఈ సినిమా రూపొందుతోంది. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి చేతులమీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ–‘‘ఉత్తర భారతంలో ఉజ్జయిని దేవాలయాన్ని అనుసరిస్తూ దక్షిణ భారతంలో రాజమండ్రి గోదావరి తీరాన పట్టపాగుల వెంకట్రావుగారి ఆధ్వర్యంలో మహా కాళేశ్వర ఆలయం నిర్మించారు’’ అన్నారు. -
మూడో భార్య రమ్య మోసాలు.. వీడియో రిలీజ్ చేసిన నటుడు నరేష్
సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై చీటింగ్ కేసు నమోదైంది. నరేష్ పేరుతో పలువురు దగ్గర డబ్బులు వసూలు చేస్తోందంటూ ఆమెపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఇప్పటికే నరేశ్ ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో నేడు(బుధవారం) ఉదయం దీనిపై వివరణ ఇస్తూ ఉదయం ఓ వీడియో వదిలారు. ఈ సందర్భంగా రమ్య జరిపే వ్యాపార, ఆర్థిక వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ మరోసారి స్పష్టం చేశాడు. ‘రమ్య రఘుపతి గారి ఇష్యూ(ఫైనాన్షియల్ ఇష్యూ) బయట పడినప్పటి నుంచి నాకు మీడియా, బంధుమిత్రుల నుంచి విపరితమైన ఫోన్కాల్స్ వస్తున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం మాకు పెళ్లైయింది. చదవండి: స్పిరిట్ కంటే ముందు ‘రాజా డీలక్స్’ను సెట్స్పై తీసుకొచ్చే ప్లాన్లో ప్రభాస్? మనస్పర్థల కారణంగా రెండూ, మూడేళ్లకే విడిపోయాం. ఇలాంటివి జరుగుతాయనే భయంతోనే ఆమెతో విడిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అనంతపురం, హిందూపురం ఇష్యూ తర్వాత ఇలాంటివి భవిష్యత్తులో వస్తాయానే ఉద్దేశంతోనే 2, 3 నెలల క్రితమే ఓ ప్రకటన ఇచ్చాను. తనతో నాకు గాని, నా కుటుంబానికి గాని ఎలాంటి సంబంధం లేదని, ఆర్థికంగా కూడా. ఈ సమస్య ఎంత దూరం వెళుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇంట్లో అందరూ భయంతో ఉన్నారు. డబ్బు తీసుకోవడం, మోసం చేయడం వంటివి ఇంతవరకు మా కుటుంబాల్లో ఎక్కడ లేదు. నేను చెప్పేదే ఒక్కటే రమ్య రఘపతి కేసులో నాకు, నా కుటుంబ సభ్యుల ప్రమేయం ఏం లేదు’ అంటూ వివరణ ఇచ్చారు. చదవండి: 11వ బిడ్డకు జన్మనివ్వబోతోన్న ప్రముఖ సింగర్ నటుడు నరేష్కు రమ్య రఘుపతి మూడో భార్య. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె ఈమె. ఎనిమిదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. అయితే కొన్నాళ్ల క్రితం మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే నరేష్ సహా ఆయన కుటుంబంతో దిగిన ఫోటోలను అడ్డు పెట్టుకొని కొందరు మహిళల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నరేష్కు చెందిన ఆస్తులను తన ఆస్తులుగా చెప్పి అధిక వడ్డీ పేరుతో, రిజిస్ట్రేషన్ల పేరుతో కోట్లల్లో మోసానికి పాల్పడింది. దీనిపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. -
నటుడు నరేష్ మాజీ భార్యపై కేసు నమోదు.. కోట్లలో మోసం!
నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై కేసు నమోదైంది. నరేష్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తోందంటూ ఆమెపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. నటుడు నరేష్కు రమ్య రఘుపతి మూడో భార్య. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె ఈమె. ఎనిమిదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. అయితే కొన్నాళ్ల క్రితం మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే నరేష్ సహా ఆయన కుటుంబంతో దిగిన ఫోటోలను అడ్డు పెట్టుకొని కొందరు మహిళల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నరేష్కు చెందిన ఆస్తులను తన ఆస్తులుగా చెప్పి అధిక వడ్డీ పేరుతో, రిజిస్ట్రేషన్ల పేరుతో కోట్లల్లో మోసానికి పాల్పడింది. దీనిపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. తాజాగా ఈ వివాదంపై స్పందించిన నటుడు నరేష్.. రమ్య వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పాడు. కాగా ప్రస్తుతం నరేష్తో రమ్య దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్నాయి. -
నటుడు నరేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో..
‘‘విజయ నిర్మల జయంతి సందర్భంగా ‘మిస్టర్ కింగ్’ పోస్టర్ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. హీరో శరణ్, దర్శక– నిర్మాతలకు, చిత్ర యూనిట్కు మంచి పేరు రావాలి’’ అని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. విజయ నిర్మల అన్నయ్య మనవడు, సీనియర్ నరేశ్ అల్లుడు (నరేశ్ కజిన్ రాజ్కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ కింగ్’. శశిధర్ చావలి దర్శకత్వం వహించారు. ]హన్విక క్రియేషన్స్ పతాకంపై బి.ఎన్.రావు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సందర్భంగా ‘మిస్టర్ కింగ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ను విజయ నిర్మల జయంతి సందర్భంగా(ఆదివారం) కృష్ణ విడుదల చేశారు. ‘‘మా ఫ్యామిలీ నుంచి వస్తున్న 8వ హీరో శరణ్’’ అన్నారు నరేశ్. ‘‘మా అమ్మగారు కూడా విజయ నిర్మలగారి అభిమాని’’ అన్నారు బి.ఎన్.రావు. ‘‘చక్కటి కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు శశిధర్ చావలి. ‘‘మా సినిమా యువతకు బాగా నచ్చుతుంది’’ అన్నారు శరణ్. నిష్కల, ఊర్వీ సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సమర్పణ: బేబీ హన్విక, సంగీతం: మణిశర్మ, కెమెరా: తన్వీర్ అంజుమ్, సహ నిర్మాత: రవికిరణ్ చావలి. -
లగ్జరీ కారు కొనుగోలు చేసిన నరేశ్
1972లో వచ్చిన 'పండంటి కాపురం' సినిమాతో నటుడిగా ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు నరేశ్ విజయకృష్ణ. అప్పట్లో హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడీయన. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితులైన ఈయన ఈ మధ్యే సకల సదుపాయాలు ఉండేలా ఓ కారవ్యాన్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా నరేశ్ ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారును సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 'నా కల నెరవేరిందోచ్, ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను' అని పేర్కొంటూ తన కారును చూపించాడు. పర్పుల్ కలర్లో ఉన్న ఈ కారును డ్రైవ్ చేస్తూ నగర రోడ్లపై చక్కర్లు కొట్టి మురిసిపోయాడు నరేశ్. వెంటనే తన ప్రొఫైల్ పిక్ కూడా మార్చేశాడు. కారు పక్కన నిల్చున్న ఫొటోను ప్రొఫైల్ పిక్గా పెట్టుకున్నాడు. ఇంత ఖరీదైన కారును కొన్న నటుడికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Hi sharing my new dream come true with my twitter family💕 pic.twitter.com/rnxev9r2Ts — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) February 2, 2022 #NewProfilePic pic.twitter.com/J0c2BDDxhf — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) February 2, 2022 -
చిరంజీవిపై నరేశ్ సంచలన వ్యాఖ్యలు, ఘాటుగా స్పందించిన నాగబాబు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ముగిశాయి. ప్రకాశ్ రాజ్పై మంచు విష్ణు విజయం సాధించారు. అయిన ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. రాజీనామాలు, ఆరోపణలతో మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో మీడియా సమావేశంలో పాల్గొన్న సీనియర్ నటుడు నరేశ్ మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో రాజీనామా అనంతరం తొలిసారి మీడియాతో ముచ్చటించిన మెగా బ్రదర్ నాగబాబు, నరేశ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు. సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని తన అన్నయ్య(చిరంజీవి) ఎప్పుడు అనుకోలేదన్నాడు. పరిశ్రమకు చెందిన నటీనటులు, అభిమానులు ఎవరైనా కష్టమంటు ఇంటికి వస్తే ఆయన వారికి చేతనైనంత సాయం చేశారని పేర్కొన్నాడు. చదవండి: తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు అంతే తప్ప పెదరాయుడిలా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని ఎప్పుడు ఆయన అనలేదని, అన్నయ్యకు అంత అహంకారం లేదని నాగబాబు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అనంతరం తన రాజీనామాపై మాట్లాడుతూ.. ‘‘మా’ అసోసియేషన్లో సభ్యుడిగా ఉన్నందుకు ఎంతో గర్వపడ్డాను. తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉండదని, విశాల హృదయంతో వ్యవహరిస్తారనుకున్న. కానీ ఫలితాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటి సంకుచితమైన అసోసియేషన్లో ఉండాలనిపించలేదు. మనస్థాపంతో బయటకు వచ్చేశాను. సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇకపై ఈ అసోసియేషన్తో నాకు సంబంధం ఉండదు’ అని ఆయన స్పష్టం చేశారు. -
ప్రకాశ్రాజ్ ప్యానల్పై ఫైర్ అయిన నరేష్
MAA Elections 2021 Resignation: కలిసి పని చేస్తాం అన్నవాళ్లు ఎందుకు రాజీనామా చేశారని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) మాజీ అధ్యక్షుడు నరేష్ ప్రశ్నించారు. ప్రకాశ్రాజ్ ప్యానల్ మూకుమ్మడిగా రాజీనామా ప్రకటించిన అనంతరం నేడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ప్రకాశ్రాజ్ ప్యానల్ సభ్యులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదవండి: Maa Elections 2021: పెన్షన్ ఫైల్పై తొలి సంతకం చేసిన మంచు విష్ణు 'కలిసి పనిచేస్తాం అన్నవాళ్లు..రాజీనామా ఎందుకు చేశారు? ఓడినా, గెలిచినా కలసి పనిచేస్తాం అన్నారు. మరి ఇప్పుడేమైంది? బయటి నుంచి ప్రశ్నించడం ఏంటి? నరేంద్ర మోదీ గెలిచాడని కాంగ్రెస్ వాళ్లు దేశం వదిలి వెళ్లలేదు కదా. 'మా' అనేది కుటుంబం. గెస్ట్గా వచ్చిన వాళ్లే ఇది కుటుంబం కాదు అంటారు. ఫ్యాక్షనిజం మానేద్దాం. కలసి పనిచేద్దాం. రిజైన్ చేసిన ఈసీ మెంబర్స్ గురించి కొత్త ప్యానల్ చూసుకుంటుంది. విష్ణుని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే బాగోదు. ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి. ఎమోషన్స్.. ప్రస్టేషన్ వద్దు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. కానీ గెలిచాక కూడా ఆరోపణలు చేయడం ఏంటి' అంటూ ప్రకాశ్రాజ్ ప్యానల్ సభ్యులపై నరేష్ అసహనం వ్యక్తం చేశారు. చదవండి: రోజుకో ట్విస్ట్.. మంచు విష్ణు యాక్షన్ ప్లాన్ ఏంటి? -
నా భార్య చనిపోతే నరేష్ ఒక్క ఫోన్ కూడా చేయలేదు: ఉత్తేజ్
MAA Elections 2021: Actor Uttej About Naresh: భిన్నాభిప్రాయాలకు అవకాశం లేకుండా తాము తప్పుకుంటున్నామని నటుడు ఉత్తేజ్ అన్నారు. పోలింగ్ రోజున నరేష్ యుద్ధవాతావరణం సృష్టించారని, తనని తన కుటుంబ సభ్యులను బండబూతులు తిట్టారని పేర్కొన్నారు. 'నా భార్య పద్మ చనిపోతే చిరంజీవి, జీవితా రాజశేఖర్, ప్రకాశ్రాజ్ సహా పలువురు హస్పిటల్ వద్దనే ఉండి తన ఓదార్చారు. కానీ నరేష్ నుంచి మాత్రం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. నా 25 ఏళ్ల కెరీర్లో బెనర్జీ అన్న ఏడవటం చూడలేదు. నరేష్ వల్లే "మా" శ్రేయస్సు కుంటుపడుతూ వచ్చింది. విష్ణు బాగా పనిచేయాలని ఆశిస్తున్నాం' అని ఉత్తేజ్ పేర్కొన్నారు. చదవండి: మోహన్ బాబు కించపరిచే బూతులు తిట్టారు: తనీష్ -
‘మా’ ఎన్నికల్లో ఉద్రిక్తత, ప్రకాశ్ రాజ్, నరేశ్ మధ్య వాగ్వాదం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల పోలింగ్ ముందు ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశ్ రాజ్, ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేశ్ మధ్య వివాదం చోటుచేసుకుంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇరువరు వాగ్వాదానికి దిగారు. అలాగే ప్రకాశ్ రాజ్ ప్యానల్పై మంచు విష్ణు ప్యానల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేయడంపై విష్ణు ప్యానల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి పోలింగ్లో రిగ్గింగ్ పాల్పిడినట్లు విష్ణు ప్యానల్ ఆరోపించారు. సభ్యుడు కానీ వ్యక్తులు కూడా పోలింగ్ బూత్కు వచ్చినట్లు పేరొన్నాడు. అంతేగాక పోలింగ్ కేంద్రం ముందు ఇరు ప్యానల్ సభ్యుల మధ్య గొడవలు తలెత్తడంతో కేంద్రం బయటక ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో విష్ణు ప్యానల్ సభ్యుడు, నటుడు శివ బాలజీ చేతిని గుర్తు తెలియని వ్యక్తి కొరికినట్లు నరేశ్ ఆరోపణలు చేశాడు. -
‘మా’ ఎన్నికలు: నాగబాబు కామెంట్స్పై స్పందించిన మంచు విష్ణు
మెగా బ్రదర్ నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు తప్పకుండా బదులిస్తానంటూ మంచు విష్ణు మండిపడ్డారు. తాజాగా మంచు విష్ణు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షులు నరేశ్ సాక్షితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో తామే తప్పకుండా గెలుస్తామని థీమా వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారి తన బంధువా? కాదా? అనే దానిపై విష్ణు స్పందిస్తూ.. దీనిని ఆయననే రుజువు చేయమని, తన ఫ్యామిలీ గురించి తనకంటే ఎక్కువగా ఆయన తెలుసు అనుకుంటా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అలాగే ప్రతి పక్షంలో ఉన్న వ్యక్తి తనని, తనని ఫ్యామిలీపై కూడా విమర్శలు చేస్తున్నారని, ఆయనకు తానేంటో త్వరలోనే చూపిస్తా అంటూ సవాలు విసిరారు. తాను చేసేది తప్పు అయితే తనని, ఎన్నికల అధికారిన సస్పెన్స్ చెయొచ్చని విష్ణు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆశుక్రవారం నిర్వహించిన మేనిఫెస్టో డిన్నర్ పార్టీకి 250 నుంచి 300మంది వస్తారనుకున్నామని, కానీ 560మంది వచ్చారన్నారు. అందరూ ‘మా’ సభ్యులే అని వారంతా తనకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తన కుటుంబ సభ్యులను పిలిచి తనకెందుకు ఓటు వేయాలో చెప్పానని, వాళ్లకు నచ్చితే వేస్తారన్నారు. ఈసారి ఇతర ప్రాంతాల్లో ఉన్న ‘మా’ సభ్యులు విమానంలో వచ్చి మరీ ఓటు వేస్తున్నారని, తన హామిలన్ని అమలు కావాలంటే తన ప్యానల్ మొత్తం గెలవాలంటూ విష్ణు చెప్పుకొచ్చాడు. అలాగే నరేశ్ కూడా మాట్లాడుతూ.. ‘రెండు రోజుల నుంచి ఎన్నికల ఏర్పాట్లను చూస్తున్నామన్నారుఉఉ. ఇరు ప్యానెల్ వర్గాలు కూడా వచ్చాయని, ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారన్నారు. రేపు ఉదయం 8గంటలకు పోలింగ్ మొదలవుతుందని, మధ్యాహ్నం 2గంటలకు ముగుస్తుందని చెప్పారు. సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని, నాలుగైదు గంటల పాటు ఓట్లను లెక్కిస్తారని తెలిపారు. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టాలని మొదట అనుకున్నామని, కానీ వర్షాల కారణంగా అందరి ఆమోదంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని చెప్పారు. ఎవరి ప్రచారాన్ని వాళ్లు ముగించుకుని నేడు ఏర్పాట్లలోనే ఉన్నామన్నారు. -
నరేశ్పై శివాజీ రాజా సంచలన ఆరోపణలు, ‘మా’ వివాదాలకు అతడే కారణం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఒకవైపు దగ్గర పడుతుంటే, మరోవైపు అభ్యర్థులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా ఈసారి ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలిపస్తున్నాయి. ఇక లోకల్-నాన్ లోకల్ అనే అంశంగా కూడా ఈ ఎన్నికల్లో వినిపిస్తోంది. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం ఎన్నికల వివాదం మరింత ముదురుతోంది. ఈ క్రమంలో ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా నటుడు నరేశ్పై సంచలన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ‘మా’ ఎన్నికల్లో జరుగుతున్న వివాదాలకు నరేశ్ కారణమంటూ ఆరోపించాడు. ఆదివారం(అక్టోబర్ 10) ‘మా’ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఓ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సారి జరిగే ‘మా’ ఎన్నికలపై తాను స్పందించాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. అనంతరం నరేశ్ గురించి మాట్లాడుతూ.. ఇక గతేడాది నాగబాబు మద్దతు లేకపోయి ఉంటే నరేశ్ విజయం సాధించేవాడు కాదన్నాడు. అప్పుడు నాగాబాబు, నరేశ్కు ఎందుకు మద్దతు ఇచ్చాడో ఇప్పటికి తనకు అర్థం కావడం లేదన్నాడు. చదవండి: విష్ణు ప్యానల్కే ఓటు వేయాలంటూ మోహన్ బాబు లేఖ ఇక నరేశ్ ఆడే పాచికలాటలో ప్రాణ మిత్రులు కూడా విడిపోవాల్సి వచ్చిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ మేరకు శివాజీ రాజా ‘‘మా’ నరేశ్ చిన్నపిల్లాడు. ఎప్పుడు అబద్దాలే చెబుతాడు. అతడి నోటివెంట నిజాలు వచ్చిన రోజున నేను ఆశ్చపోతాను. గతంలో నాపై నరేశ్ ఎన్ని అసత్య ప్రచారం చేశాడు. నరేశ్ రాకతోనే ఆసోసియేషన్లో రాజకీయాలు మొదలయ్యాయి. నేను ‘మా’ అధ్యక్షుడిగా ఉన్పుడు అమెరికాలో ఫండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహించాము. అప్పుడు చిరంజీవితో పాటు పలువురు హీరోహీరోయిన్లతో కలిసి ఈ కార్యక్రమానికి హజరయ్యాము. కానీ అదే సమయంలో ‘మా’కు జనరల్ సెక్రటరీగా ఉన్న నరేశ్ మాత్రం రాలేదు. అమెరికా రాకుండా ఇక్కడ సమావేశాలు పెట్టి నా గరించి తప్పుడు ప్రచారం చేశాడు’ అని ఆయన ఆరోపించారు. అలాగే ఈ అమెరికా పర్యటనకు విమాన టికెట్ట వ్యవహరంలో నేను, శ్రీకాంత్ డబ్బులు వాడుకున్నామని ఆరోపణలు చేశాడు. అయితే దీనిపై చిరంజీవి.. సినీ పెద్దలతో ఓ కమిటీ వేసి విచారణ జరిపి.. ఇందులో నిజం లేదని, నరేశ్ ఆరోపణలు అవాస్తవాలే అని తేల్చారన్నారు. శ్రీకాంత్, నేను డబ్బులు వాడుకోలేదని కూడా ఆ కమిటీ వెల్లడించిందని ఆయన చెప్పాడు. అయినా కూడా నరేశ్ ఇప్పటివరకూ మాకు క్షేమాపణలు చెప్పలేదన్నాడు. ఇక తన హాయాంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ల ద్వారా వచ్చిన ఫండ్ని ఇప్పుడు ‘మా’ సంక్షేమం కోసం నరేశ్ వినియోగిస్తున్నాడని, అతని రాకతోనే అసోసియేషన్లో రాజకీయాలు ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పుడు ‘మా’ ఎన్నికలు రచ్చకెక్కడానికి కూడా అతడే కారణమని, చిన్న విషయాలకు కూడా అబద్ధాలు ఆడతాడని పేర్కొన్నాడు. శ్రీకాంత్కు తనకు నరేశ్ క్షమాపణలు చెప్పేవరకు తనని ఇలాగే తిడుతూ ఉంటానని, అతడి వల్లే మా స్నేహ్నాలు కూడా చెడిపోయాయని ఆయన తెలిపారు. చదవండి: ‘మా’ ఎన్నికలపై ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు ‘‘మా’ సభ్యుల కోసం ఓ వృద్ధాశ్రమం నిర్మించాలని నేను అనుకున్నాను. దానికి ఫండ్ రైజ్ చేయడం కోసం యూఎస్లో మరోసారి ప్రోగ్రామ్ పెట్టాలనుకున్నాను. దీనిపై పలువురు స్టార్ హీరోలతో చర్చించాను వారు కూడా ఒకే అన్నారు. అలాగే హీరో ప్రభాస్ను కూడా సంప్రదించాను. ప్రభాస్ షూటింగ్లో భాగంగా ఈ ప్రోగ్రామ్కు రాలేనని, దీనిపై మీరంతగా శ్రమించకండన్నారు. తన వాటాగా ‘మా’ కోసం 2 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పాడు. ఆ మాట నాకెంతో తృప్తినిచ్చింది. ఇలా స్టార్హీరోహీరోయిన్స్ ప్రోగ్రామ్కి ఓకే అన్నాక.. నరేశ్ ప్రెస్మీట్ పెట్టి నాపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత వెంటనే ‘మా’ ఎన్నికలు జరిగాయి. మా ప్యానల్ ఓడిపోయింది. దాంతో ఆ ప్రోగ్రామ్ ఆగిపోయింది. నా కల అలాగే నిలిచిపోయింది’’ అంటూ ఆయన చెప్పకొచ్చాడు. -
అన్ని ప్రశ్నలకు సమాధానం మా ఎన్నికలే: నరేష్
-
ఎవరు పడితే వారు సీటులో కూర్చుంటే ‘మా’కు మరక: నరేశ్
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈ సారి ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలు తలపిస్తున్నాయి. మంగళవారం నామినేషన్ల పర్వం కూడా ముగియడంతో బరిలో దిగుతున్న మంచు విష్ణు ప్యానల్, ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఎన్నికలు కూడా దగ్గర పడుతుండడంతో రెండు ప్యానల్ల సభ్యులు ప్రచారంలో బిజీగా అయిపోయారు. చదవండి: 'మా'లో మార్పు తీసుకొస్తా: మంచు విష్ణు ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో బుధవారం ప్రెస్మీట్ నిర్వహించారు. కాగా ఇప్పటికే ఆయన మంచు విష్ణు ప్యానల్కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మీడియా సమావేశంలో నరేశ్, మంచు విష్ణుతో పాటు విష్ణు ప్యానల్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. ‘ఎవడు పడితే వారు సీటులో కూర్చుంటే ‘మా’ మసక బారుతుంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా’లో కొంతమంది శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చదవండి: MAA Elections 2021: మంచు విష్ణుకు నరేష్ మద్దతు ‘విష్ణు ప్యానల్లో ఎంతో మంది సీనియర్ నటీనటులు ఉన్నారు. ‘మా’కు మంచి వారసుడు కావాలి. ‘మా’ లో పదవి వ్యామోహలు ఉండకూడదు. ఒక గ్రూపు స్పాన్సర్డ్ టెర్రరిజం జరిగింది. అన్ని ప్రశ్నలకు ‘మా’ ఎన్నికలే సమాధానం. ‘మా’కు ఇప్పటి వరకు ఒక మచ్చ కూడా లేదు. నేను వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్గా ఉన్నప్పుడు 6 నెలల పాటు సర్వే చేసి వెల్ఫేర్ కమిటీని విజయవంతం చేశాం. పెద్దలు మంచి మైక్లో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి అన్న మాటలకు నేను నా నోటికి తాళం వేసి కూర్చునున్నాను. విష్ణు ప్యానల్ బాగుంది. అందుకే మంచు విష్ణు ప్యానల్కు నా మద్దతు ఇస్తున్నాను’ అంటూ నరేశ్ చెప్పుకొచ్చారు. -
సాయి ధరమ్ తేజ్ సమస్యపై నరేష్ & శ్రీకాంత్ మధ్య మాటల యుద్ధం
-
శ్రీకాంత్ కామెంట్స్కు రీకౌంటర్ ఇస్తూ వీడియో వదిలిన నరేశ్
మెగా హీరో సాయిధరమ్ తేజ్కు జరిగిన రోడ్డు ప్రమాదంపై పలువురు సినీ నటులు స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి. సినీయర్ నటుడు నరేశ్ ప్రమాదానికి ముందు సాయి తన ఇంటి నుంచే వెళ్లాడని, బైక్ రేసుల్లో తరచూ తన అబ్బాయి నవీన్, సాయి పాల్గొంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. ఆయన చేసిన కామెంట్స్పై పలువురు సినీ ప్రముఖుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బండ్ల గణేశ్, శ్రీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియోలు వదిలారు. దీనిపై బండ్లకు, నరేశ్కు చిన్నపాటి వార్ కాగా తాజాగా నరేశ్, శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలకు రీకౌంటర్ ఇచ్చాడు. ఈ మేరకు నరేష్ తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో షేర్ చేశాడు. చదవండి: నరేశ్ కామెంట్స్ నాకు ఇబ్బందిగా అనిపించాయి: శ్రీకాంత్ ఈ మేరకు నరేష్ మాట్లాడుతూ.. ‘‘శ్రీకాంత్.. నా బైట్ మీద ఇచ్చిన నీ బైట్ చూశాను. అలా ఇచ్చావేంటమ్మా… ఖచ్చితంగా సాయి ధరమ్ తేజ్.. స్పీడ్లో లేడు. బురదలో జారీ పడ్డాడు. నేను చెప్పిన మాటలు.. మీడియాలో కాస్త వేరుగా వచ్చాయి. దీంతో పెద్దలు నాకు ఫోన్ చేశారు. వాటికి నేను వివరణ కూడా ఇచ్చాను. బైట్ ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎమోషన్స్ చాలా ముఖ్యం. చనిపోయినవారి గురించి నేను చెప్పలేదు. జనరల్గా ఇండస్ట్రీలో జరిగనవి చెప్పాను. బైకులను మనం చాక్లెట్స్ మాదిరిగా పిల్లలకు ఇవ్వం. యాక్సిడెంట్స్ నాకు జరిగాయి. చాలా మందికి జరిగాయి. కానీ నువ్వు మాట్లాడిన విధానం బాధకలిగింది’’ అన్నాడు. చదవండి: సాయి తేజ్ ఐసీయూ వీడియో బయటకు రావడంపై హీరో నిఖిల్ ఫైర్ ‘‘నా కళ్ల ముందు నువ్వు హీరోగా రావడం చూశాను. మంచి సినిమాలు చేశావు. హీరోగా ఎదిగావు. మా ఎలక్షన్స్లో పోటీ చేశావు. ఓడిపోయావు. దయచేసి ఇలా ఇంకోసారి బైట్స్ ఇవ్వద్దు. నా బైట్స్కు ప్రజలు వేరే విధంగా రియాక్ట్ అవుతున్నారు. గత 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎప్పుడు బైట్స్ ఇవ్వడంలో కాంట్రావర్సి, పొలిటికల్గా చెడ్డ పేరు లేదు. కానీ నువ్వు బైట్స్ ఇచ్చే ముందు ఆలోచించి, పెద్దవారితో మాట్లాడి ఇవ్వు’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా నరేశ్ కామెంట్స్పై శ్రీకాంత్ స్పందిస్తూ... సాయికి జరిగిన యాక్సిండెంట్పై నరేశ్ చేసిన కామెంట్స్ తనకు ఇబ్బందిగా అనిపించాయని, ఈ టైంలో ఆయన చనిపోయిన వారి ప్రస్తావన తీయకుండ ఉండాల్సిందన్నాడు. అంతేగాక ఇంకెవ్వరు కూడా ఇలాంటి బైట్లు పెట్టొదని, ఈ సమయంలో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉంటారంటూ శ్రీకాంత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
‘సాయి అలాంటి వాడు కాదు, వదంతులు పుట్టించకండి’
Manchu Lakshmi Tweet About Sai Dharam Tej: యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్కు జరిగిన రోడ్డు ప్రమాదంపై సినీ ప్రముఖులు వరుసగా స్పందిస్తున్నారు. అంతేకాదు యాక్సిడెంట్ విషయం తెలిసి నేరుగా ఆస్పత్రికి వెళ్లి సాయి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మీ కూడా మధ్యాహ్నం అపోలో ఆసుపత్రికి వెళ్లి సాయి తేజ్ను చూసి వచ్చిన సంగతి తెలిసిందే. అతడి ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడి తెలుసుకుంది. ఆనంతరం తిరిగి వెళ్లిన మంచు లక్ష్మీసాయికి జరిగిన ప్రమాదం గురించి సోషల్మీడియాలో వస్తోన్న వార్తలపై స్పందించింది. చదవండి: Sai Dharam Tej Accident: ‘ఈ సమయంలో రాజకీయాలు చేయకండి’ ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘తేజ్ బాధ్యత కలిగిన వ్యక్తి. నాకు తెలిసినంతవరకూ తేజ్ ఎంతో బాధ్యతాయుతమైన పౌరుడు. అతను ఏక్షణంలోనూ రూల్స్కు వ్యతిరేకంగా వ్యవహరించడు. రోడ్డుపై ఉన్న మట్టి వల్లే అతనికి ఈ ప్రమాదం జరిగిందని అక్కడ క్లియర్గా తెలుస్తోంది. కాబట్టి దయచేసి ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయకండి. ఇప్పుడు అతను క్షేమంగానే ఉన్నాడు. సాయి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిద్దాం’ అంటూ రాసుకొచ్చింది. Tej is one of the most responsible citizens that I know. It is very clear that he wasn’t speeding at any given moment. There was mud on the road that led to the accident. I request all of you to stop spreading rumours. — Lakshmi Manchu (@LakshmiManchu) September 11, 2021 అలాగే ఆమె తమ్ముడు, హీరో మంచు మనోజ్ కూడా మీడియాతో మాట్లాడాడు. సాయి ధరమ్ తేజ్ వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నా అని ఆయన లాంటి మంచి వ్యక్తి దొరకరు సచ్ స్వీట్ హాట్ అని పేర్కొన్నాడు. అంతేగాక ఆయనపై దయచేసి ఎవరూ చెడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. ఇక సాయి ధరమ్కు జరిగిన ప్రమాదం స్పాట్కు వెళ్లి చూశానని, తరచూ మేము వెళ్లే స్పాట్ అన్నాడు. సాయి ప్రమాదం జరగానే వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించిన వారికి మనోజ్ కృతజ్ఞతలు తెలిపాడు. చదవండి: నరేశ్ కామెంట్స్ నాకు ఇబ్బందిగా అనిపించాయి: శ్రీకాంత్ ఇదిలా ఉండగా సాయి ప్రమాదంపై సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాత నటుడు బండ్ల గణేష్ ఈ సమయంలో రాజకీయాలు చేయడం సరైనది కాదంటూ సోషల్ మీడియాలో వీడియో వదలగా.. హీరో శ్రీకాంత్ నరేశ్ వ్యాఖ్యలు తనకు ఇబ్బందిగా అనిపించాయంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా నరేశ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రమాదానికి ముందు సాయి తమ ఇంటి నుంచే బయలు దేరారని, సాయి ధరమ్ తేజ్ ఆయన అబ్బాయి నవీన్ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పారు. అంతేగాక వారు క్రమంగా బైక్ రేసుల్లో పాల్గొంటున్నారంటూ నరేశ్ వ్యాఖ్యానించారు. అలాగే వేగం విషయంలో యువత కంట్రోల్లో ఉండాలని, కోటా శ్రీనివాస రావు, బాబు మోహన్, కోమటి రెడ్డిల కుమారులు ఇలాటే ప్రమాదాల్లో మరణించి వారి కటుంబాలను శోక సంద్రంలో ముంచారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: కన్స్ట్రక్షన్ కంపెనీ, మున్సిపాలిటీపై కూడా కేసు పెట్టాలి: ఆర్పీ -
నరేశ్ కామెంట్స్ నాకు ఇబ్బందిగా అనిపించాయి: శ్రీకాంత్
Srikanth Comments On Sai Dharam Tej Accident: మెగా హీరో సాయిధరమ్ తేజ్కు జరిగిన రోడ్డు ప్రమాదంపై పలువురు సినీనటీనటులు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు నరేశ్ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ తన కొడుకు నవీన్ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరగడానికి ముందు సాయి, నవీన్ తమ ఇంటి నుంచే ఇద్దరూ కలిసి బయలుదేరారని, బైక్పై వద్దని చెబుదామనుకున్నా కానీ ఆలోపే వెళ్లిపోయారన్నాడు. అంతేగాక తన కుమారుడు, సాయి తరచూ బైక్ రేసులో పాల్గొంటారని చెప్పాడు. దీంతో నరేశ్ వ్యాఖ్యలను తప్పు బడుతూ పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. విషయం పూర్తిగా తెలుసుకోకుండానే ఎందుకు మాట్లాడతారని అంటున్నారు. ఇప్పటికే నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఈ సమయంలో రాజకీయాలు చేయొద్దంటూ సోషల్ మీడియాలో వీడియో వదలగా.. తాజా హీరో శ్రీకాంత్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశాడు. చదవండి: నరేశ్ వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ అభ్యంతరం నరేశ్ వ్యాఖ్యలపై శ్రీకాంత్ స్పందిస్తూ.. ‘సాయి ధరమ్ తేజ్కు జరిగిన యాక్సిడెంట్ చాలా చిన్నది. రోడ్డుపై ఇసుక ఉండటం వల్లే అతడి బైక్ స్కిడ్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ రాష్గా వెళ్లే వ్యక్తి కాదు. నరేశ్ పెట్టిన వీడియో బైట్ నాకెందుకో ఇబ్బందిగా అనిపించింది. కుటుంబ సభ్యులంతా టెన్షన్ పడుతుంటారు. ఈ సమయంలో ఆయన చనిపోయిన వాళ్ల గురించి ప్రస్తావించకుండా ఉంటే బాగుండేది. దయ చేసి ఎవరూ ఇలాంటి బైట్స్ పెట్టొద్దని కోరుకుంటున్నా’అని అన్నాడు. కాగా నరేశ్ వేగం విషయంలో యువత కంట్రోల్లో ఉండాలని, కోటా శ్రీనివాస రావు, బాబు మోహన్, కోమటి రెడ్డిల కుమారులు ఇలాగే ప్రమాదాల్లో మరణించి వారి కటుంబాలను శోక సంద్రంలో ముంచారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చదవండి: Sai Dharam Tej's Accident : సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందించిన నరేశ్